కిక్కిరిసిన అయినవిల్లి | Sakshi
Sakshi News home page

కిక్కిరిసిన అయినవిల్లి

Published Mon, May 6 2024 10:45 AM

కిక్కిరిసిన అయినవిల్లి

అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. స్వామివారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు ఆచరించారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ నిర్వహించారు. అనంతరం వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారి పంచామృత అభిషేకాల్లో 24, లక్ష్మీగణపతి హోమంలో 15 మంది పాల్గొని పూజలు చేశారు. 25 మంది నూతన వాహన పూజ, చిన్నారులకు నామకరణలు, అక్షరాభ్యాలు జరిపారు. ఐదుగురు తలనీలాలు సమర్పించారు. స్వామివారి అన్నదాన పథకంలో 1,458 మంది అన్నప్రసాదం స్వీకరించారు. స్వామివారికి వివిధ పూజలు, అన్నదాన విరాళాలుగా రూ.1,38,900 ఆదాయం సమకూరిందని ఆలయ చైర్మన్‌ గుత్తుల నాగబాబు, కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

Advertisement
Advertisement