కోటసత్తెమ్మ సన్నిధికి పోటెత్తిన భక్తులు | Sakshi
Sakshi News home page

కోటసత్తెమ్మ సన్నిధికి పోటెత్తిన భక్తులు

Published Mon, May 6 2024 10:45 AM

-

నిడదవోలు రూరల్‌: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానార్చకుడు అప్పారావుశర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రానికి సమిశ్రగూడేనికి చెందిన ముళ్లపూడి శ్రీనివాస్‌ (గోదావరి స్టీల్స్‌) 150 లీటర్ల పెరుగు అందజేశారు. అమ్మవారి దర్శనాలు, ప్రసాదం, పూజా టికెట్లు, ఫొటోల అమ్మకం ద్వారా దేవస్థానానికి రూ.1,05,069 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్‌ కమిషనర్‌ వి.హరిసూర్యప్రకాష్‌ తెలిపారు.

Advertisement
Advertisement