శాంతి కల్యాణం.. కడు రమణీయం | Sakshi
Sakshi News home page

శాంతి కల్యాణం.. కడు రమణీయం

Published Mon, May 6 2024 10:45 AM

శాంతి కల్యాణం.. కడు రమణీయం

సఖినేటిపల్లి: అంతర్వేదిలోని లక్ష్మీనరసింహుని దేవస్థానంలో ఆదివారం ఆర్జిత సేవగా స్వామివారి శాంతి కల్యాణం కడు రమణీయంగా జరిగింది. బహుళ ద్వాదశి తిథి కావడంతో అర్చకులు ఈ వేడుకను నిర్వహించారు. తొలుత ఆలయంలోని కల్యాణ మండపంలో ప్రత్యేక వేదికపై స్వామివారి ఉత్సవ మూర్తులను ఆశీనులు గావించారు. అనంతరం స్వామివారి శాంతి కల్యాణం ప్రారంభించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాసకిరణ్‌ ఆధ్వర్యాన స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, అర్చకులు ఈ వేడుక నిర్వహించారు. అసిస్టెంట్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ ఆధ్వర్యాన సిబ్బంది కల్యాణంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి మూలవిరాట్‌ దర్శనం, అన్నదాన పథకంలో భోజన సౌకర్యం కల్పించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement