శిల్ప సంపద అద్భుతం | Sakshi
Sakshi News home page

శిల్ప సంపద అద్భుతం

Published Mon, May 6 2024 5:20 AM

-

గణపురం: కాకతీయుల కట్టడమైన కోటగుళ్లు శిల్పసంపద మహా అద్భుతమని జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.జయరాం, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి రాంచంద్రారావు అన్నారు. గణపురం మండలకేంద్రంలోని కోటగుళ్లను ఆదివారం వారు కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు. మొదట ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ శిల్ప సంపదను పరిశీలించారు. కాకతీయులు వందల సంవత్సరాల క్రితం కట్టిన రాతి కట్టడాలు, శిల్పసంపద ఇప్పటికీ చెక్కు చెదరలేదని అన్నారు. ఈ అద్భుత కట్టడాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ప్రత్యేక నిధులు కేటాయించి ఆలయాల అభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు.

Advertisement
Advertisement