అప్పుడు వాళ్లు.. ఇప్పుడు వీళ్లు | Sakshi
Sakshi News home page

అప్పుడు వాళ్లు.. ఇప్పుడు వీళ్లు

Published Sun, May 5 2024 5:00 AM

అప్పు

నిర్మల్‌: రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి... 2015, 2018లో రాహుల్‌గాంధీ నిర్మల్‌ జిల్లాకు వచ్చినప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్‌ డీసీసీ అధ్యక్షుడి హోదాలో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఉన్నారు. ఈ రెండు కార్యక్రమాలను ఆయన దగ్గరుండి విజయవంతం చేశారు. 2018లో భైంసా సభ విజయవంతానికి అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి రామారావుపటేల్‌ తీవ్రంగా శ్రమించారు. మహేశ్వర్‌రెడ్డి, రామారావుపటేల్‌ వీరిద్దరూ పార్టీ మారి బీజేపీలో చేరి ఎమ్మెల్యేలయ్యారు. ప్రస్తుతం అదే కాంగ్రెస్‌పై తమ ప్రచారంలో నిప్పులు కురిపిస్తున్నారు. గతంలో బీఆర్‌ఎస్‌లో ఉండి కాంగ్రెస్‌తో పోటీపడిన కూచాడి శ్రీహరిరావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, వేణుగోపాలచారి ప్రస్తుతం అదే హస్తం పార్టీ, రాహుల్‌ సభ విజయవంతానికి శ్రమిస్తుండటం గమనార్హం.

అప్పుడు వాళ్లు.. ఇప్పుడు వీళ్లు
1/1

అప్పుడు వాళ్లు.. ఇప్పుడు వీళ్లు

Advertisement
 
Advertisement