మోదీ నాయకత్వాన్ని బలపరచండి | Sakshi
Sakshi News home page

మోదీ నాయకత్వాన్ని బలపరచండి

Published Sun, May 5 2024 3:25 AM

మోదీ నాయకత్వాన్ని బలపరచండి

నర్సాపూర్‌(జి): ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరిచి ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్‌ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని బీజేఎల్పీ నేత, నిర్మల్‌ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. నర్సాపూర్‌ (జీ), రాంపూర్‌ గ్రామాల్లో శనివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. అబద్ధపు వాగ్దానాలిచ్చి రా ష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ మళ్లీ మాయమాటలు చెప్పే ప్రయత్నం చేస్తోందని విమర్శించా రు. మోదీని మూడోసారి ప్రధానిని చేయడమే ల క్ష్యంగా ముందుకెళ్లాలని కోరారు. బీజేపీ ఎంపీ అ భ్యర్థి నగేశ్‌ మాట్లాడుతూ.. మోదీ నాయకత్వాన్ని దేశానికి మరోసారి అందించడమే లక్ష్యంగా తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్‌రెడ్డి, నాయకులు సత్యనారాయణగౌడ్‌, నరేందర్‌, రాజేందర్‌, దత్తురాం, సుధాకర్‌, లక్ష్మణ్‌, విజయ్‌, గంగారాం, సవీన్‌, రాజు పాల్గొన్నారు.

Advertisement
Advertisement