-
సత్యంతోనే అవినీతికి చరమగీతం
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : ప్రతిమనిషి సత్యాన్ని గ్రహిస్తే అవినీతికి చరమగీతం తప్పదని ప్రముఖ పారిశ్రామికవేత్త బి.రత్నారెడ్డి ఉద్ఘాటించారు. స్థానిక కార్యాలయంలో ఆదివారం ప్రము ఖ సాహితీవేత్త మర్రిపూడి దేవేంద్రరావు రచించిన ‘సత్యాగ్రాహి’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాస్తవ సంఘటనలతో భావోధ్వేగానికిగురైన మనసు లోతుల్లోంచి పెల్లుబికిన సత్యశోధనగా సత్యాగ్రాహి పుస్తకం కీర్తిని అందుకుంటుందన్నారు. భారతీయ తెలుగు రచయితల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు సి.నారాయణస్వామి మాట్లాడుతూ గాంధీజీ సత్యాన్ని శోధించి దేశ ప్రజలకు ఎన్నో సందేశాలు ఇచ్చారని, మానవీయతను తట్టిలేపే అక్షరాయుధంగా దేవేంద్రకవి సాహిత్యం మిగిలిపోతుందన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఎంవీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సత్యాగ్రాహి కవితా సంపుటిలోని కవితలన్నీ సామాజిక స్పృహతో సాగుతూ సమాజాన్ని మేలుకొలుపుతాయన్నారు. ఈ సందర్భంగా ఇరవైమంది సాహితీవేత్తలను, సంఘసేవకులను దేవేంద్రరావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు నందిపాటి చక్రపాణి, కొఠారి వెంకటరత్నం, సి.సుబ్రమణ్యం, బి.కోటీశ్వరమొదలియార్, కె.ఆనందనాయుడు, కేసీ లావణ్య, ఎంజే భాస్కర్ రెడ్డి, తోట గోవిందన్, జి.శాంతకుమారి, సోము ఉమాపతి ఎం.పురుషోత్తం ఆచారి, గొడు గుచింత గోవిందయ్య, పాలకూరు కన్నయ్య, పాడి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అందుబాటులో విత్తనాలు, ఎరువులు చిత్తూరు కలెక్టరేట్ : ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా విత్తనాలు, ఎరువులు విక్రయించాలని, అనుమతి లేని విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు హెచ్చరించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా షాపుల ముందు నిల్వ, ధరలను సూచించే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వ్యవసాయ అధికారుల నుంచి స్టాకు రిజిస్టర్లు, బిల్లు పుస్తకాలు ధ్రువీకరించుకోవాలని తెలిపారు. విత్తనాకు సంబంధించి సర్టిఫికెట్ ఆఫ్ సోర్స్, ఇతర వివరాలు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. ఎంఆర్పీకి మించి విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. ఫారం–డీని ప్రతి నెల వ్యవసాయ కార్యాలయాల్లో సమర్పించాలని జేసీ సూచించారు. చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్ చిల్లకూరు : పాత ఇనుప సామాను చోరీ చేసిన కేసులో ఇద్దరు నిందితులను ఆదివారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు.. మండలంలోని అంకుపాటూరు గ్రామంలో మూత బడిన ఎస్బీక్యూ స్టీల్ పరిశ్రమలో పాత సామాను నెల్లూరు హౌసింగ్ బోర్డుకు చెందిన తిరుమల వడివేలు, అరవ శేఖర్ అపహరించి ఆటోలో తరలిస్తుండగా కంపెనీ భద్రతా సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్ఐ సిరాజ్ వెంటనే స్పందించి నిందితులను వెంటాడి ఆటోలోని సామానుతో పాటుగా వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టు హాజరుపరిచి కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. -
కౌంటింగ్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : ఓట్ల లె క్కింపు కేంద్రంలో నిబంధనలు తప్పని సరిగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ ఆదేశించారు. కౌంటింగ్ ఏర్పాట్లపై ఆ యన ఆదివారం క్షేత్రస్థాయి సిబ్బందితో ఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ ఓట్ల లెక్కింపు కేంద్రంలో నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈవీఎం ఓట్ల లెక్కింపునకు ప్రతి టేబు ల్ వద్ద ఒక సూపర్వైజర్, సహాయకుడు, మై క్రో అబ్జర్వర్ ఉంటారన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు వద్ద ప్రతి టేబుల్ వద్ద ఒక సహాయ రిటర్నింగ్ అధికారి, సూపర్వైజర్, సహాయకులు, మైక్రో అబ్జర్వర్లు ఉంటారని తెలిపారు. కౌంటింగ్ అధికారులను, సిబ్బందిని ఎన్నికల సంఘం నిబంధనల మేరకు సాంకేతిక విధానంలో ర్యాండమైజేషన్ చేస్తామన్నారు. ఏజెంట్లకు గుర్తింపు కార్డులు జారీచేస్తామని తెలిపారు. జూన్ 6వ తేదీ వరకు జిల్లాలో మోడల్ కోడ్ అమలులో ఉంటుందన్నారు. విజయోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు, టపాసులు కాల్చడం వంటివి నిషేధమని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. 30న కాణిపాకం హుండీ లెక్కింపు కాణిపాకం: కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో ఈనెల 30న హుండీ కానుకలను లెక్కించనున్నట్లు ఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఆలయంలో ఆరోజు ఉదయం 7 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. అధికారులు, ఉభయదారులు పాల్గొనాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా కార్డెన్ సెర్చ్ చిత్తూరు అర్బన్: ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఆదివారం పోలీసుశాఖ కార్డెన్ సెర్చ్ నిర్వహించింది. ఎస్పీ ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బందితో కలిసి ముమ్మరంగా సబ్ డివిజన్ పరిధిలో కార్డెన్ సెర్చ్ చేపట్టారు. అక్రమంగా దాచి ఉంచిన ఆయు ధాలు, పేలుడు పదార్థాలు, బాణసంచా, పెట్రోల్, డీజల్, మాదక ద్రవ్యాలు, పరారీలో ఉన్న నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు, అనుమానిత వాహనాలను సీజ్ చేసే లక్ష్యంతో ఉదయం 5 నుంచి 7 గంటల వరకు తనిఖీలు చేశారు. గుడిపాల మండలం రాసనపల్లెలో 4 ద్విచక్రవాహనాలు, 600 లీట ర్ల సారా తయారు చేసే పదార్థాలు, ఐరాలలో 12 ద్విచక్రవాహనాలు, సదుంలో రెండు ద్విచక్రవాహనాలు, పలమనేరు సర్కిల్ ఆరు ద్విచ్రవాహనాలు, 200 లీటర్ల సారాను ధ్వంసం చేశారు. నగరిలో 15 ద్విచక్రవాహనాలు, రెండు ఆటోలను సీజ్ చేశారు. ఎవరైనా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినా, ఘర్షణలకు ప్రేరేపిస్తున్నా వెంటనే దగ్గర్లలోని పోలీస్ స్టేషన్కు, 100, 112, 9440900005 నంబర్లకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా పోలీసు అధికారులు తెలిపారు. సమాచారం అందించిన వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. పంట పొలాలపై గజరాజుల దాడిపులిచెర్ల(కల్లూ రు): మండలంలోని దేవళంపేట పంచాయతీ కొమ్మిరెడ్డిగారిపల్లె సమీపంలో ని మామిడి తో టల్లో ఆదివారం తెల్లవారు జామున ఏనుగు లు గుంపు ప్రవేశించి బీభత్సం సృష్టించాయి. ఆదివారం ఉదయం తోటల వద్దకు వెళ్లిన రైతులు కొమ్మలు విరిగి, పంట నేలపాలు అయి ఉండడాన్ని గుర్తించారు. రైతులు మాట్లాడుతూ పంట కొచ్చిన సమయంలో భారీగా కొమ్మలను విరిచివేయడంతో కాయలు నేలపాలయ్యాయని తెలిపారు. ఎక్కువ మొత్తంలో పంట నష్టం అయినట్లు పేర్కొన్నారు. వారం రోజులుగా ఈచుట్టు పక్కల గ్రామాల్లోనే ఏనుగులు సంచరిస్తున్నాయని తెలిపారు. అటవీశాఖ అధికారులు స్పందించి పంట పొలాలపై ఏనుగుల దాడులను అరికట్టాలని రైతులు కోరారు. -
ప్రశాంత కౌంటింగ్కు సహకరించాలి
● అల్లర్లను సృష్టిస్తే కఠిన చర్యలు ● ఎస్పీ మణికంఠ హెచ్చరిక ● చిత్తూరులో పోలీసుల కవాతు చిత్తూరు అర్బన్: సార్వత్రిక ఎన్నికల ప్రశాంత కౌంటింగ్కు పోలీసులతో పాటు ప్రజలు, రాజకీయ పార్టీ నాయకులు సహకరించాలని ఎస్పీ మణికంఠ చందోలు అన్నారు. చిత్తూరు నగరంలో ఆదివారం పోలీసులు కవాతు నిర్వహించారు. 150 మంది పోలీసు సిబ్బంది, ఎస్టీఎఫ్, కేంద్ర బలగాలు, వజ్రా వాహనంతో ప్లాగ్ మార్చ్ చేపట్టారు. గాంధీ కూడలి నుంచి కోర్డు కాంప్లెక్స్, తోటపాళ్యం, పొన్నియమ్మన్, ఎంఎస్ఆర్కూడలి, దర్గా కూడలి, లాలూ గార్డెన్, టాప్లైన్, ఎంఎస్ఆర్ కూడలి, చర్చివీధి మీదుగా కవాతును నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అల్లర్లు, హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. అసాంఘిక కార్యకలపాలు, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడకూడదని తెలిపారు. ఏవైనా అవాంఛనీయ సంఘటనలు, అల్లరి మూకలు విధ్వంసానికి పాల్పడితే పోలీసుల స్పందన ఎలా ఉంటుందో మాక్డ్రిల్ నిర్వస్తున్నామన్నారు. -
వేణుగోపాలుని బ్రహ్మోత్సవాలకు వేళాయే..
కార్వేటినగరంలో టీటీడీ అనుబంధ ప్రసిద్ధ శ్రీసంతాన వేణుగోపాలస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈనెల 29 నుంచి పది రోజులపాటు జరిగే ఉత్సవాలకు టీటీడీ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. రోజుకో అవతారంలో స్వామివారు పురవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. ● 28 అంకురార్పణ, 29న ధ్వజారోహణం ● ఆకట్టుకునే ఏకశిలా ధ్వజస్తంభం కార్వేటినగరం : మండల కేంద్రంలోని అతిపురాతన శ్రీరుక్మిణి, సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు టీటీడీ ఆలయ అధికారి సురేష్కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవ వివరాలు వెల్లడించారు. ఈ 28వ తేదీ సాయంత్రం అంకురార్పణ, 29న ఉదయం ధ్వజారోహణం, రాత్రి పెద్ద శేషవాహనం, 30న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనంపై ఊరేగింపు ఉంటుంది. 31న ఉదయం సింహ వాహనం, రాత్రి ము త్యపుపందిరి వాహనం, ఒకటో తేదీ ఉదయం కల్పవృక్ష వాహనం, ఆర్జిత కల్యాణోత్సవం, రాత్రి సర్వభూపాల వాహనం, 2న ఉదయం మోహనీ అవతారం, రాత్రి గరుడ సేవ, 3న ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం గజవాహనం, 4న ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ, 5న రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 6న ఉదయం పల్లకి సేవ, చక్రస్నానం, ఽసాయంత్రం ధ్వజావవరోహ ణం ఉంటుందని వివరించారు. ఆలయం వద్ద చలువుపందిళ్లు ఏర్పాటు, రంగవల్లుల పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆలయ విశిష్టత తిరుమల ఆలయంలో శ్రీవారితో పూజలందుకుంటున్న రుక్మిణి, సత్యభామా సమేత శ్రీవేణుగోపాలస్వామి దేవతా మూర్తులను ఇక్కడికి తెప్పించి వైఖానసులచే ప్రతిష్టించినట్లు పురాణ కథనం. సంతాన ప్రదాతగా శ్రీవేణుగోపాలస్వామి విరాజిల్లుతున్నారు. ఆకాశరాజు తర్వాతి వంశానికి సంతానం కలగక పోవడంతో నారాయణరాజు ఆస్థాన జ్యోతిష్యుల సూచనలతో శ్రీవేణు గోపా లుని పూజించి సంతాన వరం పొందినట్లు పురా ణ కథనం. ఆయన వంశానికి చెందిన వెంకటపెరుమాళ్రాజు 1610–1719 సంవత్సరాల మధ్య కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి. ఆలయంలోని శిల్పకళా సౌందర్యం వర్ణానాతీతం. సంస్థాధీశుల పాలన అనంతరం 1936 నుంచి ఈ ఆలయం నిర్వాహణ దేవదాయశాఖ పరిధిలోకి వచ్చింది. 1989 ఏప్రిల్ పది నుంచి తిరుమల–తిరుపతి దేవస్థానం పరిధిలోకి వచ్చింది. ఆలయంలో మకరతోరణం, గోమాతతో రుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలుడి విగ్రహాలను ఏకశిలతో రూపొందించడం విశేషం. ఆలయ ఆవరణలో శ్రీఆంజనేయస్వామి సన్నిధికి ఎదురుగా సుమారు వంద అడుగులకు పైగా ఏకశిలా ధ్వజస్తంభం భక్తులను ఆకట్టుకుంటుంది. పుత్తూరు నుంచి 12 కిలో మీటర్ల దూరంలో కార్వేటినగరం ఉంది. -
చైన్నె–బెంగళూరు..
పులి పేరిట ఆటలు ‘పులి సంచరిస్తోందని’ తప్పుడు ప్రచారం చేస్తున్న ఆకతాయిల చర్యలను ఆటవీశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది.సోమవారం శ్రీ 27 శ్రీ మే శ్రీ 2024మాపాక్షి వద్ద రెండు ప్రాజెక్టు రోడ్లు కలిసే కూడలి తొలుత నాల్గులేన్లు.. మలి దశలో 8లేన్ల విస్తరణ మొత్తం 150 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మా ణం సాగుతోంది. ఒకవైపు రెండు, మరోవైపు రెండు లేన్లతో రోడ్డు పనులు సాగుతున్నాయి. భవిష్యత్లో ఇటుఇటుగా మరో రెండేసి చొప్పున మొత్తం 8 లేన్లతో నిర్మించేలా ఇప్పటికే భూ సేక రణ పూర్తి చేసి పనులు సాగిస్తున్నారు. హైవే నిర్మాణం అవసరానికి తగిన విధంగా 10 నుంచి 15 అడుగుల ఎత్తులో పనులు సాగిస్తున్నారు. హైవే కింది భాగంలో ఇటుఅటు ప్రయాణ మా ర్గాల కోసం సుమారు 46 అండర్ పాస్లు నిర్మి స్తున్నారు. 7 ఓవర్ ప్యాసేజ్లు, 7 ఫ్లై ఓవర్లు, 55 బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు.సాక్షి, చిత్తూరు: మహానగరాలైన చైన్నె–బెంగళూరురుకు రోడ్డు కనెక్టివిటీ పెంచాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. రూ.4,259 కోట్ల అంచనాలతో బెంగళూరు, చైన్నె మధ్య 262 కిలోమీటర్ల దూరం ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టింది. అక్టోబరు 10, 2022న పనులు ప్రారంభించింది. ఈ రోడ్డు మార్గం కర్ణాటక రాజధాని బెంగళూరు రూరల్, కోలార్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మీదుగా తమిళనాడులోని రాణిపేట, కాంచీపురం జిల్లాల నుంచి చైన్నె వరకు రోడ్డు నిర్మాణం సాగుతోంది. జిల్లాలో 93 కిలోమీటర్ల హైవే ఈ రోడ్డు మార్గం చిత్తూరు జిల్లాలో సుమారు 93 కిలోమీటర్లు నిర్మిస్తున్నారు. వీకోట, బైరెడ్డిపల్లె, పలమనేరు, బంగారుపాళెం, యాదమరి, చిత్తూ రు, గుడిపాల మీదుగా చైన్నె వరకు నిర్మిస్తున్నారు. జిల్లాలో మూడు ఎంట్రీలు, ఎగ్జిట్లు ఎక్స్ప్రెస్ హైవేలోకి వెళ్లేందుకు జిల్లాలో మూడు ఎంట్రీ, ఎగ్జిట్లు మాత్రమే ఉన్నాయి. ఇవి చిత్తూరుకు సమీపంలోని గుడిపాల, బంగారుపాళెం సమీపంలోని మొగిలిఘాట్, పలమనేరు నియోజవర్గంలోని బైరెడ్డిపల్లెలోమాత్రమే ఉన్నాయి. సుమారు 40 కిలో మీటర్ల మధ్య దూరంతో ఎంట్రీ, ఎగ్జిట్లు నిర్మిస్తున్నారు. తమిళనాడులోని వేలూరు, సమీప ప్రాంతం నుంచి బెంగళూరు వె ళ్లే వారు గుడిపాల ఎంట్రీ నుంచి హైవేలోకి రావచ్చు. తిరుపతి మీదుగా వెళ్లే వారికి మొగిలిఘాట్లో ఎంట్రీ, ఎగ్జిట్ అనుకూలంగా ఉంటుంది. పుంగనూరు, పలమనేరు, కుప్పం ప్రాంతాల నుంచి వెళ్లే వాహనదారులకు బైరెడ్డిపల్లె నుంచి ఎంట్రీ, ఎగ్జిట్ సౌకర్యంగా ఉంటుంది. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు నో ఎంట్రీ హైవేలోకి కార్లు, బస్సులు, హైస్పీడ్ ట్రక్కులకు అనుమతి ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ద్విచక్రవాహనాలు, ఆటో, లారీ, ఇతర వాహనాలకు అనుమతి లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. 2.30 గంటల్లోనే బెంగళూరుకు చైన్నె–బెంగళూరు మధ్య 2021లెక్కల ప్రకారం రోజూ 27,952 వాహనాలు రాకపోకలు సాగించాయి. ఈ నగరాల మధ్య 5 నుంచి 7 గంటలు సమయం పట్టేది. ఎక్స్ప్రెస్ హైవే అందుబాటులోకి వస్తే రోజూ 33,274 వాహనాలు రాకపోకలు సాగించే అవకాశం ఉంటుందని అంచనా. ప్రయాణ సమయం కూడా 2.30 గంటల్లోనే గమ్యస్థానం చేరుకునే అవకాశం ఉంటుంది. – 8లో– 8లోచైన్నె– బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మహానగరాలకు వెళ్లాలంటే ప్రయాణిలకు ఆరేడు గంటల సమయం పడుతోంది. ఈ హైవే పూర్తయితే ప్రయాణ సమయం కేవలం 2.30 గంటలే. చైన్నె–బెంగళూరు మధ్య చిత్తూరు జిల్లా నుంచే రోడ్డు నిర్మాణం సాగుతోంది. వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రారంభమయ్యేలా పనులు ఎక్స్ప్రెస్ వేగం పుంజుకున్నాయి. ఈ రెండు మహానగరాలకు జిల్లావాసులు తక్కువ సమయంలోనే హాయిగా ప్రయాణించే అవకాశం త్వరలోనే సాకారం కానుంది.రూ.4259 కోట్లతో 262 కిలోమీటర్ల హైవే ఊపందుకున్న రోడ్డు నిర్మాణ పనులు చిత్తూరుజిల్లాలో 93 కిలోమీటర్ల రహదారి కౌండిన్య అటవీశాఖ అనుమతులతో వేగంగా పనులు ఏపీ, తమిళనాడు నుంచి బెంగళూరుకు తగ్గనున్న ప్రయాణ సమయం త్వరలోనే సాకారమయ్యేలా ప్రణాళిక న్యూస్రీల్అటవీశాఖకు రూ.66 కోట్ల పరిహారం జిల్లాలో నిర్మిస్తున్న హైవే రోడ్డు పనులు కౌండిన్య అభయారణ్యంలో సాగుతున్నాయి. అటవీప్రాంతంలోని 48 కిలోమీటర్ల మార్గంలో ఈ రోడ్డు నిర్మాణం సాగుతోంది. ఇందులో 41.5 కిలోమీటర్ల దూరం ఎకో సెన్సిటివ్ జోన్గా ఇప్పటికే అటవీశాఖ ప్రకటించింది. ఇక్కడ జంతువుల నివాసంగా పరిగణిస్తారు. 7.1 కిలోమీర్లు మాత్రం అన్ని రకాల జంతువులు సంచరించే ప్రాంతంగా ప్రకటించారు. ఈ మార్గంలోని 3.5 కిలోమీటర్లు దూరం మధ్యలోనే జంతువులు అటుఇటుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా హైవే రోడ్డు కింది భాగంలో 5 అండర్ పాస్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. ఇందులో భూ పరిహారం కింద అటవీశాఖకు రూ.49 కోట్లు పరిహారం చెల్లించారు. అటవీశాఖ వన్యప్రాణుల సంక్షరణ చట్టం కింద జంతువులు రక్షణ, నీటి వసతి కల్పన, అటవీ సంక్షరణ సిబ్బంది నియామకం వంటివి ఐదేళ్ల పాటు నిర్వహణ కోసం రూ.17 కోట్లు అటవీశాఖకు చెల్లించారు. అటవీ మార్గాలు, లోయ ప్రాంతాల్లో 4 నుంచి 50 మీటర్ల ఎత్తు, 150 అడుగుల వెడల్పుతో బ్రిడ్జిల నిర్మాణం సాగుతోంది. -
పులి పేరిట ఆటలు..
ఒక పల్లెటూరులో తండ్రిని ఓ పిల్లవాడు నాన్న పులి వచ్చిందంటూ రెండుసార్లు ఆటపట్టిస్తాడు. పావుగంట అయ్యాక మళ్లీ పులి అంటూ పిల్లవాడు కేకలు వేయడంతో ఎవరు పట్టించుకోరు. తీరా నిజంగానే పులి వచ్చి గొర్రెలను తీసుకెళుతుంది. ఈ కథలో నీతి ఏమిటంటే అబద్దాలు ఆడితే పరిహారం తప్పదని.. సరిగ్గా ఇదే విధంగా ప్రస్తుతం జిల్లాలో పలువురు ‘పులి సంచరిస్తోందని’ తప్పుడు ప్రచారం చేస్తూ జనాన్ని భయపెడతున్నారు. ఇవన్నీ ఫేక్గా అటవీశాఖ అధికారులు గుర్తించి ఆకతాయిలను హెచ్చరిస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. చిత్తూరు కార్పొరేషన్: అదిగో ఇక్కడ పులి వచ్చింది.. అంటూ వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాలలో కొందరు ఫొటోలు పెడుతున్నారు. దీంతో సంబంధిత ప్రాంత వాసులు భయాందోళనకు లోనవుతున్నారు. దీన్ని అటవీశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో నిజాలు తెలుసుకునేందుకు అటవీశాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి అటువంటిదేమీ లేదని సృష్టత ఇస్తున్నప్పటికీ ఆగడాలు ఆగడం లేదు. గడిచిన 9 నెలల్లో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. అందరిని భయాందోళనకు గురిచేయాలనే శాడిజం మనస్వత్తంతో ఉన్నవారు ఇలా ప్రవర్తిస్తున్నారని నిపుణులు అంటున్నారు. జిల్లాలో ఇలా.. ● చిత్తూరు రూరల్ మండలం బీఎన్ఆర్పేట సమీపంలో రోడ్డు పనుల వద్ద బెంగాల్ టైగర్ కనిపించిందని వీడియోను వైరల్ చేశారు. తీరా క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలిస్తే అది అస్సాంలో జరిగిన వీడియోగా, సామాజిక మాధ్యమాల నుంచి డౌన్లోడ్ చేసినట్లు అధికారులు తేల్చారు. ● గుడిపాల మండలం పసుమంద పంచాయతీలో బెంగాల్ టైగర్ను చూశామని ఫోటోలు పెట్టారు. దీంతో మండల వాసులు భయాందోళనకు లోనయ్యారు. అక్కడికెళ్లి అటవీశాఖ సిబ్బంది తనిఖీలు చేస్తే ఇక్కడి వీడియో కాదని తేలింది. ఈ వీడియోను ఉత్తరప్రదేశ్లో తీసినట్లుగా గుర్తించారు. ● గుడిపాలలోని గొల్లమడుగు అటవీ ప్రాంతంలో పులి కూనలను వదిలి వెళ్లిందని వీడియో పెట్టారు. తల్లి కోసం పిల్లలు ఎదురుచూస్తున్నట్లు ఆ వీడియో సారాంశం. డీఎఫ్ఓ చైతన్యకుమార్రెడ్డి నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. ఎఫ్ఆర్వో థామస్ సిబ్బందితో కలిసి కొండలు, గుట్టలను రెండు రోజులు పాటు జల్లెడ పెట్టి కూనలు లేవని నిగ్గుతేల్చారు. మధ్యప్రదేశ్లో జరిగిన సంఘటన వీడియో పెట్టారని అధికారులు తెలుసుకున్నారు. చిత్తూరు ఈస్ట్ రేంజ్లో వైరల్ చేసిన ఫోటోలు, వీడియోలు ఎక్కువగా బయట రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు పెట్టినట్లుగా గుర్తించారు. వాటిని స్థానికులు వైరల్ చేసినట్లు తెలుస్తోంది. ● పాకాల మండలం నేండ్రగుంట వద్ద పులి రోడ్డుపై వచ్చినట్లు ప్రయాణికులు భయాందోళనకు గురైనట్లు వీడియో పెట్టారు. ఆ వీడియో ఉత్తరప్రదేశ్ వీడియో అని అధికారులు తేల్చారు. ● వడమాలపేట మండలం బంగారెడ్డి కండ్రిగ సమీపం ప్రాంతంలో పులి వచ్చిందని వాట్సాప్ గ్రూప్లో పోస్టులు పెట్టడంతో ప్రాంతవాసులు బిత్తరపోయారు. తీరా అధికారులు రంగంలో దిగి విచారించడంతో గత సంవత్సరం నవంబరులో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ సురేష్ బెంగళూరులో తీసిన ఫోటోగా తేల్చారు. ఇన్స్టాలో పెట్టిన వీడియోలో నుంచి తీసిన ఫోటోగా నిర్దారించారు. ఇలాంటి విషయాల్లో వాస్తవాలు తెలుసుకోకుండా పలువురు వాట్సాప్ స్టేటస్ట్లు పెడుతున్నారు. చదువుకున్న వారు సైతం ఇలా చేయడం సరికాదని అధికారులు సూచిస్తున్నారు. మీతిమిరుతున్న ఆకతాయిల ఆగడాలు భయాందోళనలో జనం క్షేత్రస్థాయిలో పరిశీలించి ఫేక్గా నిర్ధారిస్తున్న అటవీశాఖ అధికారులు ఘటనలపై అటవీశాఖ సీరియస్ చర్యలు తప్పవు ఇప్పటి వరకు అవాస్తవ వీడియోలపై ఆకతాయిలను హెచ్చరించి వదిలేశాం. వీటిని అటవీశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇకపై ఎలాంటి అవాస్తవ వీడియోలు వచ్చినా అటవీచట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. యువత సమాజశ్రేయస్సు కోసం బాటలు వేయాలి. – థామస్, ఎఫ్ఆర్వో, చిత్తూరు ఈస్ట్ -
గురుకుల అడ్మిషన్లకు నేరుగా హాజరుకావాలి
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 2024–25 విద్యాసంవత్సరంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 5 వ తరగతి ప్రవేశాలకు పరీక్ష రాసిన విద్యార్థులు అడ్మిషన్లకు నేరుగా హాజరుకావాలని ఏపీఎస్డబ్ల్యూఆర్ జిల్లా కో ఆర్డినేటర్ జయభారతి తెలిపారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రవేశ పరీక్ష రాసిన ఎస్సీ బాలురు ఈనెల 28న ఉదయం 9 గంటలకు పూతలపట్టు గురుకుల పాఠశాలకు హాజరుకావాలని తెలిపారు. 5వ తరగతికి ప్రవేశ పరీక్ష రాసిన, రాయని ఎస్సీ,ఎస్టీ బాలికలు ఈ నెల 29న ఉదయం 10 గంటలకు గంగాధరనెల్లూరు గురుకుల పాఠశాలకు విచ్చేయాలని వెల్లడించారు. ప్రవేశ పరీక్ష రాసిన వారికి మొదటి ప్రాధాన్యతనిచ్చి, మిగిలిన సీట్లకు ప్రవేశ పరీక్ష రాయని వారికి అడ్మిషన్లు ఇస్తామని తెలిపారు. హాజరయ్యే విద్యార్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా తీసుకురావాలని డీసీఓ వెల్లడించారు. ఎర్రచందనం పట్టివేత తిరుపతి మంగళం: రాపూరు సమీపంలోని మళ్లమ్మకోన బాట వద్ద ఆరు ఎర్రచందనం దుంగలతోపాటు ఒక కారును టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాలు మేరకు డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో ఆర్ఎస్ఐ విష్ణువర్ధన్ కుమార్ అటవీశాఖ అధికారులు వై. మస్తాన్, ఎం. ప్రవీణ్ కుమార్ ఆదివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ కారులో ఎర్రదుంగలను లోడ్ చేయడం గమనించిన టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని చుట్టుముట్టేందుకు యత్నించగా స్మగ్లర్లు అక్కడ నుంచి పరారయ్యారు. దీంతో కారు, ఎర్రదుంగలను స్వాధీనం చేసుకుని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. సీఐ జి. శ్రీనివాసులు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చిల్లకూరు : మండలంలోని కడివేడు వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు.. సైదాపురం మండలం గిద్దలూరుకు చెందిన వేణుగోపాల్(55) చిల్లర దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో కోట పట్టణంలోని తన బంధువుల ఇంటికి బైక్పై వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఉండగా కడివేడు వద్ద నేదురుమల్లి రాజ్యలక్ష్మి గిరిజన కాలనీ దాటిన తర్వాత రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా ఢీకొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం గుర్తించిన స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న 108 వాహనంలో క్షతగాత్రుడిని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వేణుగోపాల్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ‘కోడ్’ ఉల్లంఘించిన ఉద్యోగి చంద్రగిరి : ఎన్నికల కోడ్ను టీటీడీ టైం స్కేల్ ఉద్యోగి ఉల్లంఘించడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. చంద్రగిరి పాతపేట రెడ్డివీధికి చెందిన నాగరాజు టీటీడీ టైం స్కేల్ వాహన బేరర్గా గోవిందరాజ స్వామివారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని నివాసానికి వెళ్లి పరామర్శించారు. ధార్మిక సంస్థలో పనిచేస్తూ రాజకీయనేతను పరామర్శించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై టీటీడీ అధికారులు విచారించి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
చిత్తూరులో పులి హల్చల్.. అసలు కథ ఇదీ!
ఒక పల్లెటూరులో తండ్రిని ఓ పిల్లవాడు నాన్న పులి వచ్చిందంటూ రెండుసార్లు ఆటపట్టిస్తాడు. పావుగంట అయ్యాక మళ్లీ పులి అంటూ పిల్లవాడు కేకలు వేయడంతో ఎవరు పట్టించుకోరు. తీరా నిజంగానే పులి వచ్చి గొర్రెలను తీసుకెళుతుంది. ఈ కథలో నీతి ఏమిటంటే అబద్దాలు ఆడితే పరిహారం తప్పదని.. సరిగ్గా ఇదే విధంగా ప్రస్తుతం జిల్లాలో పలువురు ‘పులి సంచరిస్తోందని’ తప్పుడు ప్రచారం చేస్తూ జనాన్ని భయపెడతున్నారు. ఇవన్నీ ఫేక్గా అటవీశాఖ అధికారులు గుర్తించి ఆకతాయిలను హెచ్చరిస్తున్నా వారిలో మార్పు రావడం లేదు. చిత్తూరు కార్పొరేషన్: అదిగో ఇక్కడ పులి వచ్చింది.. అంటూ వాట్సాప్, ఇన్స్ట్రాగామ్, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాలలో కొందరు ఫొటోలు పెడుతున్నారు. దీంతో సంబంధిత ప్రాంత వాసులు భయాందోళనకు లోనవుతున్నారు. దీన్ని అటవీశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో నిజాలు తెలుసుకునేందుకు అటవీశాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి అటువంటిదేమీ లేదని సృష్టత ఇస్తున్నప్పటికీ ఆగడాలు ఆగడం లేదు. గడిచిన 9 నెలల్లో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. అందరిని భయాందోళనకు గురిచేయాలనే శాడిజం మనస్వత్తంతో ఉన్నవారు ఇలా ప్రవర్తిస్తున్నారని నిపుణులు అంటున్నారు. జిల్లాలో ఇలా.. 👉 చిత్తూరు రూరల్ మండలం బీఎన్ఆర్పేట సమీపంలో రోడ్డు పనుల వద్ద బెంగాల్ టైగర్ కనిపించిందని వీడియోను వైరల్ చేశారు. తీరా క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలిస్తే అది అస్సాంలో జరిగిన వీడియోగా, సామాజిక మాధ్యమాల నుంచి డౌన్లోడ్ చేసినట్లు అధికారులు తేల్చారు. 👉గుడిపాల మండలం పసుమంద పంచాయతీలో బెంగాల్ టైగర్ను చూశామని ఫోటోలు పెట్టారు. దీంతో మండల వాసులు భయాందోళనకు లోనయ్యారు. అక్కడికెళ్లి అటవీశాఖ సిబ్బంది తనిఖీలు చేస్తే ఇక్కడి వీడియో కాదని తేలింది. ఈ వీడియోను ఉత్తరప్రదేశ్లో తీసినట్లుగా గుర్తించారు. 👉గుడిపాలలోని గొల్లమడుగు అటవీ ప్రాంతంలో పులి కూనలను వదిలి వెళ్లిందని వీడియో పెట్టారు. తల్లి కోసం పిల్లలు ఎదురుచూస్తున్నట్లు ఆ వీడియో సారాంశం. డీఎఫ్ఓ చైతన్యకుమార్రెడ్డి నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. ఎఫ్ఆర్వో థామస్ సిబ్బందితో కలిసి కొండలు, గుట్టలను రెండు రోజులు పాటు జల్లెడ పెట్టి కూనలు లేవని నిగ్గుతేల్చారు. మధ్యప్రదేశ్లో జరిగిన సంఘటన వీడియో పెట్టారని అధికారులు తెలుసుకున్నారు. చిత్తూరు ఈస్ట్ రేంజ్లో వైరల్ చేసిన ఫోటోలు, వీడియోలు ఎక్కువగా బయట రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కారి్మకులు పెట్టినట్లుగా గుర్తించారు. వాటిని స్థానికులు వైరల్ చేసినట్లు తెలుస్తోంది. 👉పాకాల మండలం నేండ్రగుంట వద్ద పులి రోడ్డుపై వచ్చినట్లు ప్రయాణికులు భయాందోళనకు గురైనట్లు వీడియో పెట్టారు. ఆ వీడియో ఉత్తరప్రదేశ్ వీడియో అని అధికారులు తేల్చారు. 👉వడమాలపేట మండలం బంగారెడ్డి కండ్రిగ సమీపం ప్రాంతంలో పులి వచ్చిందని వాట్సాప్ గ్రూప్లో పోస్టులు పెట్టడంతో ప్రాంతవాసులు బిత్తరపోయారు. తీరా అధికారులు రంగంలో దిగి విచారించడంతో గత సంవత్సరం నవంబరులో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ సురేష్ బెంగళూరులో తీసిన ఫోటోగా తేల్చారు. ఇన్స్టాలో పెట్టిన వీడియోలో నుంచి తీసిన ఫోటోగా నిర్దారించారు. ఇలాంటి విషయాల్లో వాస్తవాలు తెలుసుకోకుండా పలువురు వాట్సాప్ స్టేటస్ట్లు పెడుతున్నారు. చదువుకున్న వారు సైతం ఇలా చేయడం సరికాదని అధికారులు సూచిస్తున్నారు.చర్యలు తప్పవు ఇప్పటి వరకు అవాస్తవ వీడియోలపై ఆకతాయిలను హెచ్చరించి వదిలేశాం. వీటిని అటవీశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇకపై ఎలాంటి అవాస్తవ వీడియోలు వచ్చినా అటవీచట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. యువత సమాజశ్రేయస్సు కోసం బాటలు వేయాలి. – థామస్, ఎఫ్ఆర్వో, చిత్తూరు ఈస్ట్ -
ఏజెంట్లు, అబ్జర్వర్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్
అబ్జర్వర్ల ప్రత్యేక నిఘా.. ● కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన అబ్జర్వర్లు కౌంటింగ్ ప్రక్రియను, ఫలితాల తయారీ, డిక్లరేషన్ను దగ్గర ఉండి పరిశీలిస్తారు. ● కౌంటింగ్ పూర్తయిన తరువాత గెలుపొందిన అభ్యర్థికి ఫారం 21–ఈని అందజేయాలి.● ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ ఏజెంట్లు, అబ్జర్వర్ల సమక్షంలో స్ట్రాంగ్రూమ్లు తెరుస్తారు. స్ట్రాంగ్రూమ్లో ఒక నోడల్ అధికారి ఉంటారు. ● కౌంటింగ్కు ఈవీఎంలను ఆయన సిద్ధం చేస్తుంటారు. ఈవీఎంలకు సంబంధించిన ట్యాగ్ సరిగ్గా ఉందా ? లేదా ? అనేది పరిశీలిస్తారు. ● పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించేందుకు ఒక ఏఆర్ఓ, కంప్యూటర్ అసిస్టెంట్, కంప్యూటర్ సూపర్వైజర్, సూక్ష్మ పరిశీలకుడు ఉంటారు. -
అల్లర్లు చేస్తే అణచివేస్తా
పుంగనూరు: ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో గానీ, తరువాత గానీ ఎలాంటి అల్లర్లు సృష్టించినా అణచి వేస్తానని అల్లరిమూకలకు ఎస్పీ మణికంఠ చందవోలు గట్టి వార్నింగ్ ఇచ్చారు. శనివారం పట్టణ పురవీధుల్లో సాయుధ దళాలతో మాబ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా పురవీధులలో కవాతు చేపట్టారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. గెలిచినా, ఓడినా గ్రామాల్లో రెచ్చగొట్టే చర్యలు ఎవరూ చేపట్టరాదని హెచ్చరించారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లో పకడ్బందీగా సమాచారం సేకరిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఎన్నికల సందర్భంగా ర్యాలీలు, విజయోత్సవాలను రద్దు చేయడం జరిగిందన్నారు. ముందు జాగ్రత్తగా 144 సెక్షన్ అమలులో కొనసాగిస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఏఆర్ ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీ రఘువీరప్రసాద్, సీఐ రాఘవరెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంది ఎస్పీ మణికంఠ చందవోలు -
క్రమశిక్షణకు నిదర్శనం ఎన్సీసీ కేడెట్స్
చిత్తూరు కలెక్టరేట్ : ఎన్సీసీ కేడెట్లు క్రమశిక్షణకు, ఐక్యతకు నిదర్శనమని ఎస్పీ మణికంఠ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ శిక్షణా సెంటర్ లో నిర్వహిస్తున్న ఎన్సీసీ క్యాంప్ కార్యక్రమంను ఎస్పీ మణికంఠ పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన కేడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఎస్పీ మాట్లాడుతూ ఎన్సీసీలో చేరడం ద్వారా నాయకత్వ లక్షణాలు పెంచుకోవచ్చన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలు, గంగమ్మ జాతరలో ఎన్సీసీ కేడెట్లు నిర్వహించిన విధులు అభినందనీయమని ప్రశంసించారు. క్యాంప్ కమాండెంట్ మేజర్ లోకనాథన్ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుంచి కేడెట్లకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్సీసీ అధికారి ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ ఎన్సీసీతో విద్యార్థులకు దేశభక్తి పెంపొందుతుందన్నారు. అనంతరం పలు పోటీల్లో గెలుపొందిన ఎన్సీసీ కేడెట్లకు సర్టిఫికేట్లు, బహుమతులు అందజేశారు. అతిథులుగా హాజరైన ఎస్పీ, ఆయన సతీమణిని దుశ్శాలువతో సన్మానించారు. కార్యక్రమంలో ఎన్సీసీ అధికారులు రమేష్, గిరిధర్నాయక్, చంద్రశేఖర్, కార్తీక్, వెంకటగోపాల్, చైత్రి, మొగిలినాయుడు తదితరులు పాల్గొన్నారు. ● ఎన్సీసీ క్యాంపులో ఎస్పీ మణికంఠ -
No Headline
ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి జిల్లా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు గడువు దగ్గర పడుతుండడంతో అందుకోసం అధికార యంత్రాంగం ముమ్మర కసరత్తు చేస్తోంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్ ఓట్ల లెక్కింపు అంశానికి సంబంధించి అనునిత్యం అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్ఓలు, ఏఆర్ఓలు, ఎన్నికల డీటీలు, కౌంటింగ్ సిబ్బంది విధులకు సంబంధించి ఎన్నికల సంఘం మార్గదర్శకాలు విడుదల చేసింది. ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. నోడల్ అధికారులు సైతం ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి పర్యవేక్షిస్తున్నారు. అలాగే సిబ్బందికి కూడా ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి ఈ నెల 28న మొదటి విడత శిక్షణ ఇచ్చేందుకు కలెక్టరేట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
కాణిపాకంలో భక్తుల పాట్లు
● వేసవి సెలవుల నేపథ్యంలోకాణిపాకానికి పోటెత్తుతున్న భక్తులు ● వీఐపీ గేటు ఎదుట గందరగోళం ● సిఫార్సులకే ప్రాధాన్యత ఇస్తున్న సిబ్బంది ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు ● హోంగార్డుల తీరుపై ఎస్పీకి భక్తుల ఫిర్యాదుకాణిపాకం: కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయానికి భక్తులు పోటెత్తారు. దర్శనానికి పడరాని పాట్లు పడ్డారు. సిఫార్సులకు ప్రాధాన్యత ఇవ్వడంతో భక్తులు సిబ్బందితో గొడవకు దిగారు. దీంతో శనివారం ఆలయంలో గందరగోళం చోటుచేసుకుంది. సెలవులు కావడంతో వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి భక్తుల తాకిడి అధికమైంది. తిరుమలకు వచ్చే భక్తులతో పాటు తమిళనాడులోని తిరువణ్ణామలై, బంగారుగుడి సందర్శించే భక్తులు సైతం గణనాథున్ని దర్శనానికి వస్తారు. సాధారణ రోజుల్లో భక్తుల సంఖ్య 5 వేల నుంచి 10 వేల లోపే ఉంటుంది. సెలవు రోజుల్లో ఈ సంఖ్య 15 వేల నుంచి 20 వేలు దాటుతోంది. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో భక్తుల సంఖ్య ఏకంగా 30వేలు దాటుతోంది. ఉచిత దర్శనంతో పాటు వీఐపీ దర్శనం వైపు కూడా భక్తులు భారీగా క్యూ కడుతున్నారు. ఈ రద్దీ కట్టడి చేయడంతో సిబ్బంది ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. దీంతో భక్తులు ఆలయ సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే..! శనివారం కూడా వందలాది మంది భక్తులు కౌంటర్ వద్ద రూ.500, రూ.1000 టిక్కెట్లు కొనుగోలు చేశారు. అయితే ఆలయంలోకి ప్రవేశానికి గంటల తరబడి గేటు ఎదుట వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ కారణంగా వీఐపీ గేటు ఎదుట భక్తజనంతో నిండుకుంది. సిబ్బంది గేటుకు తాళం వేసుకుని వెళ్లిపోయారు. కొంతమంది హోంగార్డులు, సిబ్బంది వాళ్లకు అనుకూలమైన వారిని మాత్రమే గేటు తాళం తెరిచి లోపలికి తీసుకెళ్లడంతో భక్తులు మండిపడ్డారు. హోంగార్డులపై ప్రశ్నల వర్షం కురిపించారు. అరుపులు, కేకలతో గేటు ప్రాంగణం దద్దరిల్లింది. దీంతో హోంగార్డులు భక్తులపై చిందులేశారు. ఈ విషయం తెలుసుకున్న ఈఓ వెంకటేశ్వర్లు గేటు ఎదుటకు చేరుకుని, స్పందించి ఒక్కొక్కరిని లోపలి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో భక్తులు శాంతించారు. సిబ్బంది పెత్తనంతో పాట్లు.. కాణిపాకంలో కొందరి సిబ్బందిదే పెత్తనం కొనసాగుతోంది. గేటు వేసి కాసులకు ఎర వేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను టార్గెట్ చేసి ఈ దందాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు గుప్పుమంటున్నాయి. దర్శనానికి రూ.1000 నుంచి రూ.2000 వేల వరకు గుంజుకుంటున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు. దీన్ని కట్టడి చేసేందుకు ఉన్నతాధికారులు సైతం లోకల్ ప్రభావంతో మిన్నకుండిపోతున్నారు. ఇక కొందరు హోంగార్డులు కొన్నేళ్లుగా ఆలయంలో పాతుకుపోయి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. భక్తులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారు. దీనిపై పలువురు భక్తులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.చర్యలు తీసుకుంటాం.. ఆలయ అభివృద్ది చెందాలనే లక్ష్యంతోనే అధికారులంతా సమిష్టిగా పనిచేస్తున్నాం. ఎక్కడా ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. రద్దీ సమయంలో సమస్యలు వస్తే వెంటనే స్పందిస్తున్నాం. భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. భక్తులకు నుంచి ఫిర్యాదులు వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్లు, ఈఓ, కాణిపాకం -
‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో... బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
తిరుపతి అర్బన్: ‘సాక్షి’ మైత్రి మహిళా ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి వచ్చే నెల 25వ తేదీ వరకు మహిళలకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిక్షణ ఉంటుంది. ఈ మేరకు త్రెడ్డింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్, డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్, హెయిర్ఫాల్ ట్రీట్మెంట్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, డైఅప్లికేషన్, మేకప్స్ (బ్రెడల్, పార్టీ, లైట్ మేకప్స్), హెయిర్ మసాజ్, కమ్యునికేషన్ అండ్ గ్రూమింగ్, ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ఆసక్తి గల వారు ఈనెల 27 వరకు బైరాగిపట్టిడలో ఆర్చి రోడ్డు అనంగా బ్యూటీ స్టూడియో ట్రైనింగ్ సెంటర్లో రూ.3 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం 9553454335, 8555974855ను సంప్రదించగలరు. 9 వరకు టపాసుల వినియోగం నిషేధం చిత్తూరు కలెక్టరేట్ : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా టపాసుల వినియోగంపై నిషేధం విధిస్తూ జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ ఉత్తర్వులు జారీచేశారు. అవాంఽఛనీయ సంఘటనల నివారణ, శాంతిభద్రతలను కాపాడేందుకు జూన్ 9వ తేదీ వరకు జిల్లాలో బాణసంచాలు (టపాసులు) వినియోగం, రవాణపై నిషేధం విధించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత గెలుపొందిన అభ్యర్థులు, వారి మద్దతుగా నిర్వహించే విజయోత్సవాలు నిర్వహించే క్రమంలో టపాసులు కాల్చడం వల్ల తలెత్తే పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. టపాసుల విక్రయదారులు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఎవరైనా నిబంధనలను పాటించకుండా ఉల్లంఘిస్తే భారతీయ శిక్షాస్మృతి 1860లోని సెక్షన్ 436 ప్రకారం శిక్షార్హులవుతారని ఆ ఉత్తర్వుల్లో హెచ్చరించారు. ఎన్నికల విధులకు అదనపు ఎస్పీలు చిత్తూరు అర్బన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఇతర ఎన్నికల విధుల కోసం చిత్తూరు, తిరుపతి జిల్లాలకు పలువురు ఎస్పీ (నాన్ క్యాడర్), అదనపు ఎస్పీలను కేటాయిస్తూ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. విజిలెన్స్ ఎస్పీ కె.ఈశ్వరరావు, గుంటూరులో సెబ్ ఏఎస్పీగా ఉన్న ఎం.వెంకటేశ్వరరావును చిత్తూరుకు నియమించారు. తిరుపతి జిల్లాకు సీఐడీ ఎస్పీ ఉన్న కెజివి.సరిత, ఏసీబీ ఏఎస్పీ ఎం.మహేంద్ర, ఏసీబీ డీఎస్పీ ఎస్.శిరీషను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీళ్లు వెంటనే ఆయా జిల్లా ఎస్పీల వద్ద రిపోర్టు చేయాలని, అధికారులను ఎన్నికల విధులతో పాటు సమస్యాత్మక–సున్నితమైన అసెంబ్లీ స్థానాల్లో ఉపయోగించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీవైఈఓ పరీక్షలకు 296 మంది గైర్హాజరు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లావ్యాప్తంగా ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన డీవైఈఓ పోస్టుల పరీక్షలకు 296 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలోని మూడు పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పరీక్షలను సజావుగా నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా డీవైఈఓ పరీక్షలకు 730 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 434 మంది పరీక్షలకు హాజరయ్యారు. 296 మంది పరీక్షలకు గైర్హాజరయ్యారు. 59.45 శాతం హాజరు నమోదైనట్లు కలెక్టరేట్ అధికారులు వెల్లడించారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు ● డ్వామా పీడీ రాజశేఖర్ చిత్తూరు కలెక్టరేట్ : ఉపాధిహామీ పథకంలో గ్రామీణ ప్రాంత కూలీలలకు పనులు కల్పించడంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని డ్వామా పీడీ రాజశేఖర్ హెచ్చరించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధి కల్పనే ధ్యేయంగా క్షేత్రస్థాయి అధికారులు పనిచేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా ఉపాధి కూలీలతో గ్రామసభలు నిర్వహించి ఏఏ ప్రాంతాల్లో ఏ రకం పనులు చేపట్టాలో నిర్ణయించి పనులు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో పనులు అడిగే ప్రతి ఒక్కరికీ ఉపాధి పనులు ఇస్తున్నామన్నారు. నిర్ధేశించిన లక్ష్యం మేరకు పనులను పూర్తి చేసేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని డ్వామా పీడీ వెల్లడించారు. -
● తొమ్మిది రోజుల్లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ● ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ కళాశాలలో కట్టుదిట్టంగా ఏర్పాట్లు ● నిబంధనలు జారీ చేసిన ఎన్నికల సంఘం
చిత్తూరు కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఎస్వీ సెట్ ఇంజినీరింగ్ కళాశాలలో జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ ప్రక్రియకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు ఇక తొమ్మిది రోజులే సమయం ఉండడంతో జిల్లా యంత్రాంగం కసరత్తు వేగవంతం చేసింది. సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు అంశంపై ఆర్ఓలు, ఏఆర్ఓలు, ఎన్నికల డీటీలు, కౌంటింగ్ సిబ్బంది విధులకు సంబంధించి ఎన్నికల సంఘం మార్గదర్శకాలు నిర్దేశించింది. ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్ లేఅవుట్పై ఇన్చార్జ్ అధికారి అవగాహన కలిగి ఉండాలి. నోడల్ అధికారులు వారికి అప్పగించిన పనులు సక్రమంగా నిర్వర్తించాలి. సందేహాలు వచ్చినప్పుడు ఆర్ఓలతో మాట్లాడాలి. పోస్టల్ బ్యాలెట్, స్ట్రాంగ్ రూమ్ నోడల్ అధికారులు, సీలింగ్ అధికారులు, రో–ఇన్చార్జ్లు అనుసరించాల్సిన విధి విధానాలను ప్రత్యేకంగా సూచించింది. పోస్టల్ బ్యాలెట్, ఈటీపీబీఎస్ ఓట్లు ఎలా లెక్కించాలి ? వ్యాలిడ్, ఇన్వ్యాలిడ్ ఓట్లను ఎలా గుర్తించాలి ? అనేదానిపై సిబ్బందికి ఈ నెల 28న మొదటి విడత శిక్షణ ఇచ్చేందుకు కలెక్టరేట్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. చెక్లిస్టును అనుసరిస్తూ.. జూన్ 3వ తేదీ సాయంత్రానికి ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి. రౌండ్ల వారీగా ఫలితాల నమోదు, వాటిని ప్రకటించే క్రమంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అంకెల్లో పొరపాటు జరగకూడదు. రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు నిర్వహించాలి. అలాగే సహాయ ఆర్ఓ ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన స్థానిక తహసీల్దార్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. -
47 పందుల అపహరణ
గంగవరం: గుర్తు తెలియని దుండగులు పందులను అహరించుకెళ్లిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. వివరాల మేరకు.. పలమనేరులోని గంటావూరుకు చెందిన భానుప్రకాష్ మండలంలోని పత్తికొండ గ్రామ సమీపంలో ఉన్న బెస్తగానపల్లికి వెళ్లే దారిలో గత మూడేళ్లుగా కాపురం ఉంటున్నాడు. పందులు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఇంటి సమీపంలోని చావిట్లో వదలిన 47 పందులను ఎవరో గుర్తు తెలియని దుండగులు అపహరించారు. ఉదయం నిద్రలేచి చూసేసరికి పందులు కనిపించకపోవడంతో బాధితుడు భాను ప్రకాష్ స్థానిక పోలీస్స్టేషన్లో రూ.2 లక్షలు విలువ చేసే పందులను ఎవరో అపహరించారని ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెరువు పోరంబోకు భూమి ఆక్రమణ
గంగవరం: చెరువు పోరంబోకు భూమిని ఓ టీడీపీ నాయకుడు యథేచ్ఛగా ఆక్రమించి జేసీబీతో చదును చేయించే ప్రయత్నం చేశాడు. అయితే విషయం తెలిసి శనివారం స్థానికులు స్థానిక తహసీల్దార్కు వినతిపత్రం ఇచ్చారు. గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. గంగవరం ఫ్లైఓవర్ బ్రిడ్జికి సమీపంలో సర్వీస్ రోడ్డుకు ఆనుకుని 333/7 సర్వే నంబర్లో 1.72 ఎకరాల భూమి ఉంది. ఇది చెరువు పోరంబోకుగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. అయితే టీడీపీ నాయకుడు, గంగవరం మాజీ సర్పంచ్ మురళి గతంలో ఓసారి ఈ పోరంబోకు భూమిని ఆక్రమించాలని ప్రయత్నించగా రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికల కడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇదే అదునుగా భావించి జేసీబీతో శనివారం భూమిలో చదును చేయించాడు. ఇంతలో గ్రామస్తులు గుర్తించి తహసీల్దార్ లంకేశ్వర్రావుకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన వీఆర్ఓ ద్వారా భూమి ఆక్రమణను అడ్డుకున్నారు. దీనిపై తహసీల్దార్ను వివరణ కోరగా రెవెన్యూ లెక్కల్లో ఈ భూమి చెరువు పోరంబోకుగా ఉండడం వాస్తవమే అన్నారు. అయితే ఈ భూమిపై కోర్టుకు వెళ్లినట్టు ఆక్రమణదారుడు చెప్పడంతో కోర్టు తీర్పు వచ్చేవరకూ పనులు చేయొద్దని హెచ్చరించినట్టు తెలిపారు. -
ఉన్నతాశయాలతో ముందుకెళ్లాలి
జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి చిత్తూరు కలెక్టరేట్ : ఇంజినీరింగ్ విద్యార్థులు ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్లాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి అన్నారు. నగర సరిహద్దులోని మురకంబట్టు వద్ద ఉన్న సీతమ్స్ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం 3వ అంతర్జాతీయ సదస్సు, క్రీడా దినోత్సవం కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న పెద్దిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకుని ఉన్నత ఉద్యోగాలను సాధించాలన్నారు. మరో అతిథిగా పాల్గొన్న విట్ కళాశాల ప్రొఫెసర్ రజని మాట్లాడుతూ ఇంజినీరింగ్లో ఇమేజ్ ప్రాసెసింగ్ పోరియల్ ట్రాన్సఫర్మేషన్ ఉపయోగించడం వల్ల అనేక ఉపయోగాలుంటాయని తెలిపారు. ప్రస్తుత ప్రపంచంలో అభివృద్ధి చెందాలంటే ప్రతి విద్యార్థి సాంకేతికతను అందిపుచ్చుకోవాలని తెలిపారు. అనంతరం క్రీడాపోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు గెలుపొందిన వారికి సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకటచలపతి, డీన్ శరవణన్, కోకన్వీనర్లు గోపి, ఉమామహేశ్వరి, విద్యార్థులు పాల్గొన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని రెడ్డిగుంట వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. శనివారం ఓ చెట్టు కింద దాదాపు 45–50 ఏళ్ల మధ్య వయసు ఉన్న వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండడాన్ని చూసిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇతన్ని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి వద్ద ఓ సెల్ఫోన్ నంబరు ఉండడంతో, ఇతను తమిళనాడు వాసిగా పోలీసులు అనుమానిస్తున్నారు. టూటౌన్ సీఐ ఉలసయ్య కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిస్తే 9491074517, డయల్ 100కు నంబర్లకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు. -
చంద్రబాబుకు కుప్పంలో ఓటమి భయం!
నారా చంద్రబాబు నాయుడు మూడున్నర దశాబ్దాలుగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈసారి ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోంది. చంద్రబాబు కంచుకోటగా చెబుతున్న కుప్పంలో ఈసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఈసారి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యే అవకాశం లేదా? చంద్రబాబుకు పట్టిన ఈ దుస్థితికి కారణం ఏంటి?చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి 35 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న చంద్రబాబునాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి..ఇప్పుడు మూడోసారి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. దొంగ ఓట్లను చేర్పించి భారీ మెజారిటీతో ఎన్నికవుతూ వస్తున్న చంద్రబాబుకు వైఎస్ఆర్సీపీ ఆవిర్భావంతో చెక్ పడింది. క్రమంగా మెజారిటీ తగ్గుతూ...ఆయన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఈసారి దొంగ ఓట్లు భారీగా తొలగించడంతో గెలుపు మీదే నమ్మకమే పోయింది. తనను ఏడు సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపించిన కుప్పం ప్రజల్ని చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే కుప్పం నియోజకవర్గానికి మహర్దశ పట్టింది. ఐదేళ్ళలో పూర్తిగా అభివృద్ధి చెందింది. అందుకే చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతంలో ఫేడ్ అవుట్ లీడర్ గా మారిపోయారు.కుప్పంలో 1989 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన చంద్రబాబు అక్కడి ప్రజల్ని మోసం చేస్తూ...తాను మాత్రం ఉన్నత పదవులు అనుభవిస్తున్నారు. రాష్ట్రంలో మారుమూల తమిళనాడు బోర్డర్లో ఉన్న కుప్పం ప్రజల ఉపాధి గురించి ఏనాడూ పట్టించుకోలేదు. అందుకే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో కుప్పం ప్రజలు చంద్రబాబుకు బుద్ది చెప్పడానికి నిర్ణయించుకున్నారు. 2019 ఎన్నికల్లో 73 శాతం పోలింగ్ నమోదు అయితే, ఈసారి కుప్పంలో 89.88 శాతం ఓటింగ్ నమోదైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సిఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపునకు మహిళా ఓటర్లు, వృద్దులు పెద్ద ఎత్తున స్పందించారు. కుప్పం నియోజకవర్గానికి హంద్రీ నీవా కాలువల ద్వారా కృష్ణాజలాలు తీసుకువచ్చిన తర్వాతనే మళ్లీ ఓటు అడగటానికి వస్తాను అని చెప్పిన మాటలు కుప్పం ప్రజలు మనసుల్లో పెను మార్పును తీసుకువచ్చాయంటున్నారు. హామీలో భాగంగా ఈ ప్రాంతంను సస్యశ్యామలం చేస్తూ, కుప్పం ప్రజల చిరకాల వాంఛ అయిన తాగు, సాగు నీరు అందించిన సిఎం జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునేందుకు ఓటు రూపంలో తమ కృతజ్జత చూపారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది.ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పట్ల వివక్షత అనేది లేకుండా కుప్పంను మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా రెవెన్యూ సమస్యలతో సతమతం అవుతున్న ఈప్రాంత ప్రజలు కష్టాలు తీరుస్తూ కుప్పం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పార్టీలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా అందించారు. అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేశారు. ఇవన్నీ గమనించిన కుప్పం ప్రజల మనసుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిలిచిపోయారు. అందుకే ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారు. కుప్పం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 89.88 శాతం పోలింగ్ నమోదు కావడమే ఫ్యాన్ గాలి జంఝామారుతంలా వీచిందనడానికి సాక్ష్యం అని విశ్లేషకులు చెబుతున్నారు.కుప్పం ప్రాంతంలో బలంగా ఉన్న వన్నెకుల సామాజికవర్గానికి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. భరత్కు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడంతో పాటుగా చంద్రబాబు మీద పోటీ చేసే ఛాన్స్ కల్పించారు. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో మొన్నటి వరకు లక్ష మెజారిటీ సాధనే లక్ష్యం అన్న కుప్పం టీడీపీ నాయకులు... ఎన్నికలు జరిగిన సాయంత్రం నుంచి సైలెంట్ అయిపోయారు. భారీగా పెరిగిన మహిళా ఓటింగ్ అటు టీడీపీకి, ఇటు చంద్రబాబుకు పెను ప్రమాదంగా మారిందనే భయాందోళనలు టీడీపీని వెంటాడుతున్నాయి. -
పుష్పపల్లకీపై ద్రౌపదీదేవి విహారం
● వైభవంగా అర్జున తపస్సుమాను ● యామిగానిపల్లెలో భక్తజన సందడి గుడుపల్లె: మండలంలోని యామగానిపల్లెలోని శ్రీ ద్రౌపదీ ధర్మారాజస్వామి ఆలయ మహా భారత మహాత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి పుష్పపల్లకి సేవ, మధ్యాహ్నం అర్జున తపస్సుమాను కార్యక్రమాలు అత్యంత వైభవంగా సాగాయి. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అర్జున తపస్సుమాను ఘట్టం ప్రారంభమైంది. అర్జున వేషధారి తపస్సుమాను చుట్టూ ప్రదక్షిణ చేసి పూజలు చేశారు. పరమశివుని వరం పొందేందుకు పద్యాలతో కీర్తిస్తూ తపస్సుమాను అధిరోహించారు. అక్కడి నుంచి నిమ్మపండ్లు, విబూతిపండ్లు భక్తులపై విసిరారు. వాటిని అందుకునేందుకు భక్తులు ఎగబడ్డారు. సంతాన వరం కోరుతూ పలువురు మహిళలు తపస్సుమాను చుట్టూ వరపడ్డారు. తపస్సు మాను ఘట్టం తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం భారీగా విచ్చేశారు. రాత్రి పుష్పపల్లకి ఊరేగింపు నేత్రపర్వంగా జరిగింది. అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి పల్లకిపై కొలువుదీర్చి పూజలు చేశారు. అనంతరం మంగళవాయిద్యాలు, బాణ సంచా పేలుళ్ల సందడి నడుమ ఆలయం చుట్టూ ఊరేగించారు. భక్తులకు అన్నదానం చేశారు. -
‘సాక్షి’ మైత్రి మహిళ ఆధ్వర్యంలో... బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
తిరుపతి అర్బన్ : సాక్షి, మైత్రి మహిళా ఆధ్వర్యంలో ఈనెల 27 నుంచి జూన్ 25వ తేదీ వరకు మహిళలకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు శిక్షణ ఉంటుంది. ఈ మేరకు త్రెడ్డింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్, డాండ్రఫ్ ట్రీట్మెంట్, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, డై అప్లికేషన్, మేకప్స్ (బ్రెడల్, పార్టీ, లైట్ మేకప్స్), హెయిర్ మసాజ్, కమ్యునికేషన్ అండ్ గ్రూమింగ్, ఫేషియల్స్, శారీ డ్రాపింగ్ తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు సర్టిఫికెట్లు అందిస్తారు. ఆసక్తి గలవారు ఈ నెల 27వ తేదీలోపు బైరాగిపట్టెడలో ఆర్చి రోడ్డులోని అనంగా బ్యూటీ స్టూడియో ట్రైనింగ్ సెంటర్లో రూ.3 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు 9553454335, 8555974855 నంబర్లలో సంప్రదించాలి. ప్రశాంతంగా సప్లిమెంటరీ పరీక్షలు చిత్తూరు కలెక్టరేట్ : జిల్లావ్యాప్తంగా శుక్రవారం ఇంటర్మీడియట్, పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పదవ తరగతి పరీక్ష కేంద్రాలను డీఈఓ దేవరాజు, ఇంటర్ పరీక్ష కేంద్రాలను డీవీఈఓ సయ్యద్ మౌలా పర్యవేక్షించారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు నిర్వహించి ఎలాంటి అవాంఽఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పర్యవేక్షించారు. మొదటి రోజు పదవ తరగతి పరీక్షలకు 1,235 మందికి గానూ, 620 మంది హాజరయ్యారని అధికారులు వెల్లడించారు. ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ప్రథమ సంవత్సరంలో 3,154 మందికి 2,933 మంది పరీక్షలకు హాజరుకాగా, మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు 963 మందికి గాను 873 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికా రులు తెలిపారు. గురుకుల అడ్మిషన్లు ప్రారంభం పులిచెర్ల(కల్లూరు): పులిచెర్లలోని మహాత్మా జ్యోతీభాపూలే బీసీ బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదవతరగతిలో ప్రవేశానికి శనివారం నుంచి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపల్ బి.సునీత తెలిపారు. పాఠశాలలో 40 సీట్లు ఉన్నాయన్నారు. ప్రవేశానికి ఇప్పటికే రాత పరీక్షలు నిర్వహించామని, అర్హత సాధించినవారికి సమాచారం కూడా ఇ చ్చామని పేర్కొన్నారు. అడ్మిషన్కు వచ్చే వారు ర్యాంకు కార్డు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకురావాలన్నారు. అడ్మిషన్లకు ఈనెల 30వ తేదీ తుది గడవని తెలిపారు. మిగులు సీట్లకు స్పాట్ కౌన్సెలింగ్ పలమనేరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాలల్లో ఇంటర్ మీడియెట్లో ప్రవేశాలకు వెబ్ కౌన్సెలింగ్ పూర్తయిందని, మిగిలిన సీట్లకు త్వరలో స్పాట్ కౌన్సెలింగ్ ఉంటుందని జిల్లా కోఆర్డినేటర్ ఈ జయభారతిదేవి తెలిపారు. స్థానిక గురుకుల కళాశాలలో శుక్రవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు వెబ్ కౌన్సిలింగ్ జరిగింది. ఈ కౌన్సిలింగ్కు ఉమ్మడి జిల్లాలో ఆయా కళాశాలల్లో ఖాళీలను బట్టి 800పైగా విద్యార్థులు హాజరయ్యారు. వెబ్ కౌన్సెలింగ్లో భర్తీగాని సీట్లకు సంబంధించి త్వరలో స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ త్వరలో ఉంటుందని, తేదీని త్వరలో ప్రకటించనున్నట్టు ఆమె తెలిపారు. ఆరోగ్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు కాణిపాకం: ఆరోగ్య సేవల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధి కారి ప్రభావతిదేవి అన్నారు. చిత్తూరు నగరంలోని తన కార్యాలయంలో ఆమె శుక్రవారం వైద్యాధికారులతో జూమ్ కాన్ఫెరెన్స్ నిర్వహించారు. లెప్రసీ, టీబీ వ్యాధిగ్రస్తులకు అందించాల్సిన సేవల్లో ఎలాంటి లోపాలు తలెత్తకూడ దని సూచించారు. మాతా శిశు సేవలపై నిర్ల క్ష్యం వద్దన్నారు. బీసీజీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని తెలిపారు. బాణసంచా దుకాణాలకు నోటీసులు గంగాధర నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల నిబంధనల మేరకు పెట్రోల్ బంకు యాజమాన్యాలకు, బాణసంచా విక్రయదారులకు అధికారులు శుక్రవారం నోటీసులు అందజేసి సూచన లు అందించారు. కౌంటింగ్ ముగిసే వరకు ఎలాంటి టపాకాయలు, బాటిళ్లు, డ్రమ్ముల్లో పెట్రోలు విక్రయించకూడదని ఆయా దుకాణ యజమానులకు నోటీసులు అందజేశారు. -
డీవైఈఓ పరీక్షలకు సర్వం సిద్ధం
● నేడు జిల్లాలో 3 కేంద్రాల్లో పరీక్షలు ● హాజరుకానున్న 730మంది అభ్యర్థులు ● డీఆర్ఓ పుల్లయ్య వెల్లడి చిత్తూరు కలెక్టరేట్ : ఏపీపీఎస్సీ (డీవైఈఓ) పోస్టుల పరీక్షలకు అభ్యర్థులు నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని డీఆర్ఓ పుల్లయ్య స్పష్టం చేశారు. శనివారం నిర్వహించే ఏపీపీఎస్సీ (డీవైఈఓ) పోస్టుల పరీక్షల నిర్వహణపై శుక్రవారం కలెక్టరేట్లో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. జిల్లాలోని 3 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూడు పరీక్ష కేంద్రాల్లో 730 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు చెప్పారు. చిత్తూరు పరిధిలోని సీతమ్స్ ఇంజినీరింగ్ కళాశాల కేంద్రంలో 150 మంది, పూతలపట్టు మండలం వేము ఇంజినీరింగ్ కళాశాలలో 330 మంది, పలమనేరు మండలం మధర్థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాల కేంద్రంలో 250 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్ష ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు జరుగుతుందన్నా రు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్దకు ఉదయం 7 గంటల నుంచి 8.30 గంటల మధ్యలో చేరుకోవాలన్నారు. పరీక్ష రాసే వారిలో దివ్యాంగులున్నట్లైతే తనకంటే తక్కువ విద్యార్హత ఉన్న వారిని సహయకులుగా వెంట తీసుకురావచ్చన్నారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరని తెలిపారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఽఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. హాల్టికెట్, గుర్తింపుకార్డు, వాటర్బాటిల్ మాత్రమే లోనికి అనుమతిస్తామని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు కేశవమూర్తి, కేశవులు, శిరీష, కులాయప్ప, ఉమామహేశ్వర్రెడ్డి, కలెక్టరేట్ సీ సెక్షన్ సూపరింటెండెంట్ గుణశేఖర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మూల్యాంకనం
ఆన్లైన్లో● ప్రారంభమైన సప్లిమెంటరీ పరీక్షలు ● సాంకేతికతను అందిపుచ్చుకున్న బోర్డు ● జవాబుపత్రాలు ఆన్లైన్లో వ్యాల్యూయేషన్ ● త్వరితగతిన ఫలితాల విడుదలకు అవకాశం చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా 31 పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 7,442 మంది, సెకెండియర్ పరీక్షలకు 2,577 మంది హాజరుకానున్నారు. ఈ పరీక్షలు పూర్తికాగానే త్వరతిగతిన మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేసి ఫలితాలను త్వరితగతిన వెల్లడించేందు కు ఇంటర్మీడియట్ బోర్డు వినూత్న పద్ధతిని ప్రారంభించనుంది. మ్యానువల్గా మూల్యాంకనం చేస్తే ఫలితాల విడుదల ఆలస్యం కావడంతోపాటు అడ్మిషన్లలో విద్యార్థులకు, తరగతుల నిర్వహణలో అధ్యాపకుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు ఆన్లైన్ మూల్యాంకన విధానాన్ని అమలు చేయనుంది. ఈ విధానంలో ఎలాంటి పొరబాట్లకు ఆస్కారం ఉండదని ఇంట ర్మీడియట్ అధికారులు వెల్లడిస్తున్నారు. మ్యానువల్గా మూల్యాంకనం చేసే సమయంలో మా ర్కుల టోటలింగ్లో పొరబాట్లు, కొన్ని ప్రశ్నలకు మార్కులు వేయడం వంటివి మరిచిపోవడం పలు ఘటనలు జరుగుతుంటాయి. గతంలో ఒక విదా ్యర్థికి 70 మార్కులు వస్తే టోటల్ మార్కులు వేసే సమయంలో పొరబాటున సున్నా ఎగిరిపోయి 7 మార్కులు మాత్రమే వేశారు. తర్వాత రీ వెరిఫికేషన్న్లో అసలు విషయం బయటపడింది. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇకపై ఆ పరిస్థితి ఉండదని ఇంటర్ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రశ్న తర్వాత మరో ప్రశ్న ఆన్లైన్లో మూల్యాంకనం చేసేటప్పుడు ఒక ప్రశ్నకు విద్యార్థి రాసిన సమాధానాన్ని ఎగ్జామినర్ పూర్తిగా మూల్యాంకనం చేశాకే మరో ప్రశ్న డిస్ప్లే అవుతుంది. ఇలా ప్రతి సమాధానాన్ని పరిశీలించి ఎగ్జామినర్ మార్కులను నమోదు చేస్తారు. అన్ని ప్రశ్నలు పూర్తి అయ్యాకే ఫైనల్ సబ్మిట్ వస్తుంది. విద్యార్థులు జవాబు రాసినా, రాయకపోయినా అన్ని ప్రశ్నలు పరిశీలించాల్సి ఉంటుంది. ఈ విధా నం వల్ల ఏ ఒక్క ప్రశ్నకు మార్కులు వేయడం మరిచిపోయే అవకాశం ఉండదని ఎగ్జామినర్లు వెల్లడిస్తున్నారు. ఒక ప్రశ్నకు మ్యాగ్జిమం వేయాల్సిన మార్కులకంటే ఎక్కువ వేసినా ఆన్లైన్ తీసుకోదు. తరగతులకు ఆటంకం లేకుండా ఆన్లైన్లో పేప ర్లు దిద్దే ఎగ్జామినర్లు ఎట్టి పరిస్థితుల్లో కళాశాలల్లో విద్యార్థుల తరగతులకు ఆటంకం కలిగించకూడదు. ఉదయం 8 గంటలలోపు, తర్వాత కళాశాల నుంచి వచ్చిన తర్వాత మూల్యాంకనం చేసుకోవచ్చు. కళాశాలలో పిరియడ్లు లేని సమయంలోనూ చేసుకోవచ్చు. ప్రతి ఎగ్జామినర్ ‘టీక్యూఐడీ’ ద్వారా లాగిన్ అయి వెంటనే పాస్వర్డ్ మార్చుకోవాలి. తర్వాత వెబ్కెమెరా ముందు తన ఫొటో క్యాప్చర్ చేసి లాగిన్ కావాలి. ముందుగా ఐదు ప్రాక్టీస్ పేపర్లు మూల్యాంకనం చేసిన తర్వాత రెగ్యులర్ పేపర్లు అందుబాటులోకి వస్తాయి. ఒక్కో ఎగ్జామినగర్కు రోజుకు గరిష్టంగా 50 జవాబుపత్రాలు అందుబాటులో ఉంటాయి. విధులకు కేటాయించే ఎగ్జామినర్లే జవాబు పత్రాలను దిద్దుతారు, మరోకరు లాగిన్ య్యేందుకు ఆస్కారం ఉండదు. అమల్లోకి ఆర్ఆర్ఎస్సీలు మ్యానువల్గా జవాబుపత్రాలను దిద్దేటప్పుడు ప్రతి జిల్లా కేంద్రంలో డీఆర్డీసీ (జిల్లా రీ కలెక్షన్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్) అందుబాటులో ఉండేది. ప్ర స్తుతం జరగబోయే నూతన విధానంలో డీఆర్డీసీకి బదులు ఆర్ఆర్ఎస్సీ (రీజనల్ రెసిప్షన్ స్కానింగ్ సెంటర్ అందుబాటులోకి తీసుకురానున్నారు. గ తంలో డీఆర్డీసీ విధానంలో ప్రతి జిల్లాలో జవాబుపత్రాలను సేకరించి ఎంపిక చేసే జిల్లాలను జంబ్లింగ్ విధానంలో పంపేవారు. ఇప్పుడు ఆర్ఆర్ఎస్సీ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఆరు కేంద్రాలకు జవాబుపత్రాలను పంపుతారు. ఏరోజుకారోజు పరీక్ష పూర్తి అయిన వెంటనే స్పీడ్పోస్టు విధానంలో ఆర్ఆర్ఎస్సీ కేంద్రాలకు పంపుతారు. వెంటనే వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి మూ ల్యాంకనానికి చర్యలు తీసుకుంటారు. మంచి విధానం.. సప్లిమెంటరీ పరీక్షల జవాబుపత్రాలను ఆన్లైన్లో మూల్యాంకనం చేసే ప్రక్రియకు ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాదే ఈ సరికొత్త విధానం అమల్లోకి వస్తోంది. ఇప్పటికే లెక్చరర్లకు అవగాహన కల్పించారు. ఈ విధానం చాలా మంచిది. ప్రక్రి య ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తారు. – సయ్యద్ మౌలా, డీవీఈఓ(ఇంటర్), చిత్తూరు జిల్లా -
భక్తజన పునీతం
చక్రసాన్నం..● శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం ● నేడు ఆలయంలో పుష్పయాగం వీకోట మండలంలోని కీలపట్లలో టీటీడీ అనుబంధ ప్రసిద్ధ శ్రీకోనేటిరాయస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. అశేష భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి పునీతులయ్యారు. పుష్కరిణిలో చక్రతాళ్వార్కు పూజలు గంగవరం: కీలపట్లలోని కోనేటిరాయుని ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా చక్రస్నానం వైభవోపేతంగా జరిగింది. తెల్లవారుజామున సుప్రభాతం అనంతరం తోమాలసేవ, అభిషేక పూజలు అలంకరణల అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీకోనేటిరాయుడు తిరుచ్చిపై ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు వేంచేపు చేశారు. అక్కడ కంకణంబట్టార్ నరసింహాచార్యులు ఆధ్వర్యంలో ఉభయదేవేరులకు, చక్ర తాళ్వారుకు స్నపన తిరుమంజనాన్ని శాస్రోక్తంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందన సుగంధ ద్రవ్యా లతో అభిషేకించారు. అనంతరం మంగళ వా యిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు చక్రతాళ్వారుకు పుష్కరిణిలో అవభృథస్నానం చేయించారు. అదే సమయంలో అశేష భక్తులు గోవింద నామస్మరణలతో పుణ్య స్నానాలు ఆచరించి పునీతులయ్యారు. తమ పాపాలను హరించి పునీతులను చేయి స్వామీ అంటూ భక్తులు వేడుకున్నారు. రాత్రి ధ్వజావరోహణం కార్యక్రమంతో తొమ్మిది రోజుల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. శనివారం సాయంత్రం 4గంటలకు పుష్పయాగం జరుగుతుందని, భక్తులు పాల్గొని శ్రీవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు తెలిపారు. టీటీడీ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపీనాథ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ గజేంద్ర కార్యక్రమాలను, భక్తుల ఏర్పాట్లను పర్యవేక్షించారు. చక్రస్నాన సమయంలో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు -
No Headline
ఇంటర్మీడియట్ బోర్డు సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల జవాబుపత్రాలను ఆన్లైన్లో ఎగ్జామినర్లు దిద్దే ప్రక్రియను ప్రారంభించనుంది. ఈ మేరకు ఇంటర్ విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీచేసి, విధి విధానాలు సూచించారు. శుక్రవారం నుంచి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జూన్ 1వ తేదీ నుంచి ఆన్లైన్ మూల్యాంకనం ప్రారంభానికి చర్యలు ప్రారంభమయ్యాయి. ఆన్లైన్ మూల్యాంకనంపై ప్రత్యేక కథనం.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
అలరించిన ఆస్తికలు నాటిక
ఏపీ మాదిరిగా సబ్సిడీ ఇవ్వాలి
ఈరోజు వండినవే రేపు కూడా..
‘శాయ్’ స్టేడియం హుళక్కేనా!
ఖమ్మంలో ఐపీ పెట్టిన వ్యక్తి ఏపీలో కిడ్నాప్?
లారీ ఢీకొని యువకుడు మృతి
భార్యతో విడాకులు?.. విదేశాల్లో హార్దిక్ పాండ్యా ఒక్కడే!
లైసెన్స్ తప్పనిసరి
కావేరికి కొత్త నీరు
షేర్ల పేరుతో రూ.30 కోట్లు స్వాహా
తప్పక చదవండి
- యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ ఘన విజయం
- హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
- అతనితో రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు!
- పాయింట్ బ్లాంక్లో డీజేపై కాల్పులు
- భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
- ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
- అదిరిపోయే ఫీచర్లతో.. త్వరలో విడుదల కానున్న మరో రెడ్మీ సిరీస్ ఫోన్
- IPL 2024: ఓ పక్క స్టార్క్.. మరోపక్క అయ్యర్..!
- గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
- ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Advertisement