సూర్యాపేటటౌన్: వైద్య విద్య ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్ష జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని మొత్తం మూడు సెంటర్లలో 1,028 మంది విద్యార్థులకు గాను 997 మంది విద్యార్థులు హాజరయ్యారు. 31 మంది గైర్హాజరయ్యారు. ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో 528 మంది విద్యార్థులకు 508 మంది హాజరయ్యారు. 20 మంది గైర్హాజరయ్యారు. అంజలి స్కూల్ సెంటర్లో 216 మందికి 211 మంది హా జరు కాగా ఐదుగురు గైర్హాజరయ్యారు. ఎంఎస్సార్ సెంట్రల్ స్కూల్ సెంటర్లో 284 మంది విద్యార్థులకు 278 మంది హాజరు కాగా ఆరుగురు గైర్హాజరైనట్లు సిటీ కో ఆర్డినేటర్ ప్రభాకర్ తెలిపారు.
ఫ 31 మంది విద్యార్థులు గైర్హాజరు
ఫ జిల్లా కేంద్రంలో ప్రశాంతంగా
ముగిసిన వైద్య విద్య ప్రవేశ పరీక్ష