నర్మెట: ‘బీఆర్ఎస్, బీజేపీలను బొందపెడితేనే దేశప్రగతి సాధ్యమవుతుంది.. పదేండ్ల పాలనలో కేసీ ఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కుటుంబ సభ్యులకు దోచిపెడితే.. అదానీ అంబానీలకు మోదీ లక్షల కోట్లు కట్టబెట్టాడు’ అని కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నర్మెట చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఉపాధిహామీ తదితర సంక్షేమ పథకాలను ప్రారంభించింది కాంగ్రెస్సేనని, పథకాల పేరుతో కోట్లు కొల్లగొట్టింది బీఆర్ఎస్ అని అన్నా రు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్రెడ్డిని గెలిపించి రాహుల్గాంఽధీని ప్రధాన మంత్రిని చేస్తే కేంద్ర, రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండి అభివృద్ధికి లోటుండదని చెప్పా రు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం, మహిళా అధ్యక్షరా లు బొడికె ఇందిర, పీసీసీ మెంబర్ శ్రీనివాస్రెడ్డి, బాలలక్ష్మి, భూక్య జయరాం, డాక్టర్ రాజమౌళి, గంగం నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి