కొనసాగిన హోం ఓటింగ్‌ | Sakshi
Sakshi News home page

కొనసాగిన హోం ఓటింగ్‌

Published Sun, May 5 2024 5:05 AM

-

ఫ ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకున్న 1300 మంది

నల్లగొండ : లోక్‌సభ ఎన్నికల హోం ఓటింగ్‌ శనివారం కొనసాగింది. హోంఓటింగ్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు ఎన్నికల అధికారులు వెళ్లి ఓటు వేయిస్తున్నారు. జిల్లాలో మొత్తం 2,133 మంది ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకుంటామని ఎన్నికల అధికారులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 883 మంది సీనియర్‌ సిటిజన్లు, 1250 మంది దివ్యాంగులు ఉన్నారు. శుక్ర, శనివారం కలిపి మొత్తం 1300 మంది హోం ఓటింగ్‌ను వినియోగించుకున్నారు. వారిలో 508 మంది వృద్ధులు, 792 మంది దివ్యాంగులు ఉన్నారు. హోం ఓటింగ్‌కు వెళ్లే సిబ్బంది బ్యాలెట్‌ బాక్సు, బ్యాలెట్‌ పేపర్‌, పోలింగ్‌ కంపార్ట్‌మెంట్‌తో వెళ్లి ఇంటి వద్దే ఓటు వేయిస్తున్నారు. శనివారం పలుచోట్ల హోం ఓటింగ్‌ కార్యక్రమాన్ని నల్లగొండ ఆర్డీఓ రవి పరిశీలించారు.

Advertisement
Advertisement