-
‘ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ గల్లంతే!’
కృష్ణా, సాక్షి: ఏపీ రాజకీయాల్లో గతంలో ఏనాడూ ఇలాంటి పరిస్థితులు లేవని.. ఓటమి భయంతోనే చంద్రబాబు నాయుడు దాడులు చేయిస్తున్నాడని ఏపీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఈ కుట్రలో భాగంగానే.. ఒక ప్రణాళికాబద్ధంగా వైఎస్సార్సీపీ నేతలపై దాడులు జరగుతున్నాయని అన్నారాయన. శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘‘గతంలో ఇటువంటి పరిస్థితులు లేవు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చంద్రబాబు మారుస్తున్నారు. ఓడిపోతాడు అనే భయంతో బాబు దాడులు చేయిస్తున్నారు. ఎన్నికలై నాలుగు రోజులైనా వైఎస్సార్సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయి. అల్లర్లకు ఆధ్యుడు చంద్రబాబే.... అమాయక ప్రజలను చంద్రబాబు పొట్టన పెట్టుకుంటున్నారు. ఫలితాల తర్వాత చంద్రబాబు పారిపోతారు. టీడీపీ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుంది. కులాలు,మతాల మధ్య చంద్రబాబు చిచ్చు పెడుతున్నారు. ప్రజలే బాబుకి బుద్ధి చెబుతారు అని జోగి రమేష్ అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు సమన్వయం పాటించండి. టీడీపీ దాడులపై ఈసీ, డీజీపీ, గవర్నర్ కు ఫిర్యాదు చేశాం అని జోగి రమేష్ పార్టీ శ్రేణులకు సూచించారు. -
విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
విజయవాడ: ఓ మహిళా డాక్టర్ మానవత్వం చాటుకున్నారు. విజయవాడలో ఓ బాలుడు విద్యుత్ షాక్కు గురై గుండె ఆగిన క్రమంలో సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు మహిళా డాక్టర్వివరాల్లోకి వెళితే.. నగరంలోని అయ్యప్పనగర్లో సాయి అనే ఆరేళ్ల బాలుడు రోడ్డుపై ఆడుకుంటూ విద్యుత్ షాక్కు గురయ్యాడు. దాంతో ఆ బాలుడి గుండె ఆగి అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న డాక్టర్ రవళి ఆ ఘటనను చూశారు. ఆ బాలుడి పరిస్థితిని గమనించిన ఆమె.. ఉన్నపళంగా సీపీఆర్ చేశారు. కొన్ని నిమిషాల పాటు సీపీఆర్ చేసిన అనంతరం ఆ బాలుడు స్పృహలోకి వచ్చాడు. దాంతో ఆ బాలుడు తల్లి దండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అక్కడున్న వారంతా డాక్టర్ చేసిన పెద్ద సాయానికి, ఆమె పెద్ద మనసుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ షాక్తో ఆగిన ఆరేళ్ల బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించిన డాక్డర్విజయవాడ - అయ్యప్పనగర్లో సాయి(6) అనే బాలుడు రోడ్డు మీద విద్యుత్ షాక్ తగిలి గుండె ఆగిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు.అటుగా వెళ్తున్న డాక్టర్ రవళి చూసి బాలుడికి సీపీఆర్ చేసి బాలుడి ప్రాణాలు… pic.twitter.com/qeLQ2tJRbv— Telugu Scribe (@TeluguScribe) May 17, 2024 -
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయాలి
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): ఓట్ల లెక్కింపునకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు ఆదేశించారు. జూన్ నాలుగో తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై కలెక్టరేట్ ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్లో అధికారులతో ఆయన గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమష్టి కృషితో జిల్లాలో పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించామని, ఇదే స్ఫూర్తిని లెక్కింపు ప్రక్రియలోను కొనసాగించి విజయవంతం చేయాలని సూచించారు. ఇబ్రహీంపట్నం జూపూడిలోని నోవా, నిమ్రా ఇంజినీరింగ్ కళాశాలల్లో స్ట్రాంగ్ రూముల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో పటిష్టమైన మూడు అంచెల భద్రత ఉందన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లు, సీల్ వేసిన డోర్లు, సెక్యూరిటీ, కారిడార్లను కవర్ చేసేలా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలన్నారు. కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసిన సీసీ కెమెరాలు, భద్రత పర్యవేక్షణపై నియమించిన గెజిటెడ్ అధికారులు, పోలీసు అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గుర్తింపు కార్డులు లేని వ్యక్తులు, అనధికార వ్యక్తులు, ఇతరుల వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దని స్పష్టంచేశారు. స్ట్రాంగ్ రూముల వద్ద ఓట్ల లెక్కింపు కేంద్రాలకు పోలింగ్ యంత్రాలు తరలించే మార్గాలు, అభ్యర్థులు, ఏజెంట్లు వెళ్లడానికి వేరు వేరు మార్గాలు ఏర్పాటు చేయాలని సూచించారు. బారికేడ్లు ఏర్పాటు చేయాలని, ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళికతో అధికారులు పనిచేయాలని సూచనలు చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వద్దని హెచ్చరించారు. లెక్కింపు కేంద్రంలో అసెంబ్లీకి, పార్లమెంటుకు ఒక్కొక్క దానికి 14 టేబుల్స్ చొప్పున 28 టేబుళ్లు ఏర్పాటు చేయాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ చేపట్టాకే ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభించాలన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకరాలను పాటిస్తూ కచ్చితమైన ఫలితాలను త్వరితగతిన ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో వి.శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏఓ నాగ లక్ష్మి, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ ఎం.దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు -
శరవేగంగా ఐకాన్ బ్రిడ్జి నిర్మాణం
వెస్ట్ బైపాస్ నిర్మాణంతో విజయవాడ నగరంలో ట్రాఫిక్ కష్టాలు తొలగుతాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో పాటు, ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందించడంతో విజయవాడ వెస్ట్ బైపాసు సంబంధించి ఆరు వరుసల రహదారి చిన్న అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు దాదాపు పూర్తయింది. ప్యాకేజీ – 4 కింద విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి నుంచి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని గ్రామం వరకు రూ.1,546.31 కోట్ల అంచనాలతో 17.88 కిలోమీటర్ల పొడవున రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఈ పనులకు 2021 జూలైలో కాంట్రాక్టు సంస్థ అగ్రిమెంటు చేసు కొంది. ఈ ప్యాకేజీలో భాగంగానే కృష్ణా నదిపై ఐకానిక్ వంతెన నిర్మిస్తున్నారు. 3.12 కిలోమీటర్ల పొడవున ఆరు వరుసలతో వంతెన పనులు జరుగుతున్నాయి. ఈ పనులు ఇప్పటికే 70.58 శాతం మేర పూర్తయ్యాయి. కృష్ణా నదిపై వంతెనతోపాటు మూడు మేజర్ బ్రిడ్జిలు, ఐదు ఫ్లై ఓవర్లు, ఒక రైల్ ఓవర్ బ్రిడ్జి, ఒక వెహికల్ అండర్ పాస్, ఒక లైట్ వెహికల్ అండర్ పాస్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం వేసవి కావడంతో ఈ పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి. -
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 2.09 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు భక్తులు హుండీల ద్వారా రూ.2.09 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడుల రూపంలో సమర్పించారు. కానుకలను గురువారం మహా మండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 16 రోజులకు రూ.2,09,49,116 నగదు, 434 గ్రాముల బంగారం, 4.145 కిలోల వెండి లభించాయని ఈఓ కె.ఎస్.రామరావు తెలిపారు. విదేశీ భక్తులు భారీగా డాలర్లు సమర్పించారు. యూఎస్ఏ డాలర్లు 171, మలేషియా రింగేట్లు 50, ఆస్ట్రేలియా డాలర్లు 115, యూఏఈ దిర్హమ్స్ 110, సౌదీ రియాల్స్ 66, బహ్రెన్, కెనడా, ఇంగ్లాండ్కు చెందిన డాలర్లు సమర్పించారు. ఈ–హుండీ ద్వారా రూ.45,010 విరాళాలు అందాయి. కానుకల లెక్కింపులో ఆలయ సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొనగా, దేవదాయ శాఖ అధికారులు, ఎస్పీఎఫ్, పోలీసు సిబ్బంది పర్యవేక్షించారు. సీనియర్ రెసిడెంట్ పోస్టు భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో పెడోడాంటిక్ విభాగంలో సీనియర్ రెసిడెంట్ పోస్టు భర్తీకి ఈ నెల 28న వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె. నరేంద్రదేవ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆ విభా గంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు అర్హులని, ఎంపికై న వారు ఒక ఏడాది పాటు పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాలకు http://gdchvja.in/ వెబ్ సైట్ను సందర్శించాలని సూచించారు. ఈ నెల 28వ తేదీ ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
ఏపీ ఈఏపీ సెట్ ప్రారంభం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంజినీరింగ్, అగ్రికల్చల్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీ సెట్)– 2024 గురువారం ప్రారంభమైంది. ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత(ఆన్లైన్) విధా నంలో నిర్వహించనున్నారు. తొలి దశలో రెండు రోజులపాటు అగ్రికల్చర్, ఫార్మసీ (బైపీసీ) విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంజినీ రింగ్ స్ట్రీమ్ (ఎంపీసీ) విద్యార్థులకు 18 నుంచి 23వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. తొమ్మిది కేంద్రాల్లో రోజూ ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్ష ప్రారంభ సమయానికి సుమారు గంటన్నర ముందుగానే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి విడత, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో విడత పరీక్షలు జరిగాయి. రెండు విడతలుగా పరీక్షల నిర్వహణ తొలి రోజు అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు పరీక్ష 18 నుంచి ఇంజినీరింగ్ కోర్సులకు పరీక్ష -
హనుమజ్జయంతికి ఆలయం ముస్తాబు
హనుమాన్జంక్షన్ రూరల్: హనుమజ్జయంతి ఉత్సవాలకు స్థానిక ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి ఆలయం ముస్తాబవుతోంది. ఈ నెల 27 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. 22 ఏళ్లుగా జరుగుతున్న హనుమజ్జయంతి ఉత్సవా లకు దీటుగా ఈ ఏడాది కూడా నిర్వహించేందుకు దేవదాయ శాఖ కసరత్తు చేపట్టింది. ఆలయ ప్రాంగ ణంలో ప్రత్యేకంగా చలువ పందిళ్లు నిర్మిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నిత్యం ప్రత్యేక పూజలు, అర్చనలు, భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. నిత్యం సాయంత్రం స్వామికి బంగారు, వెండి పుష్పాలతో విశేష అర్చన జరుగుతుంది. ఉత్సవాల తొలిరోజైన 27వ తేదీ ఉదయం అంజనీపుత్రుడికి 1,008 గులాబీ పూలతో ప్రత్యేక పూజ, సుందరకాండ పారాయణం, కోలాటం ప్రదర్శన, మ్యాజిక్ షో, మ్యూజికల్ నైట్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 28న ఉదయం 1,008 మల్లెలతో ప్రత్యేక పూజ, 108 సార్లు హనుమాన్చాలీసా పారాయణం, భజన, సాయంత్రం కూచిపూడి నృత్యం, వెస్ట్రన్ డ్యాన్స్ ప్రదర్శన జరుగుతాయి. 29న ఉదయం 1,008 చామంతులతో ప్రత్యేక పూజ, భక్తాంజనేయ, అన్నమయ్య సంకీర్తనల ఆలా పన, సాయంత్రం కూడిపూడి నృత్యం, సత్యహరిశ్చంద్ర నాటక ప్రదర్శన నిర్వహిస్తారు. 30న ఉదయం 1,008 లిల్లీపూలతో ప్రత్యేక పూజ, 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం, భజన, సాయంత్రం భక్తి గానసుధ కార్యక్రమాలు జరుగుతాయి. 31న నవకలశ స్నపన, శాంతిహోమం, సిందూరార్చన, సప్తనదీ జలాలతో అభిషేకం, సాయంత్రం ఘంటసాల మధుర గీతాల విభావరి, రామాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణ రాయబారం పౌరాణిక నాటక ప్రదర్శనలు నిర్వహిస్తారు. చివరి రోజైన జూన్ ఒకటో తేదీన హనుమజ్జయంతిని పురస్కరించుకుని వేకువజామున స్వామికి పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనం, సాయంత్రం స్వామివారి లడ్డూ ప్రసాదం వేలం జరుగుతాయి. ఆనవాయితీ ప్రకారం లారీ ఓనర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నసంతర్పణ చేస్తారు. ఉత్సవాల ముగింపును పురస్కరించుకుని సాయంత్రం ప్రత్యేక వాహనంపై అభయాంజనేయ స్వామి వారి ఊరేగింపు మేళాతాళాలు, శక్తి వేషధారణల నడుమ కనులపండువగా సాగుతుంది. 27 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు ఉత్సవాలు నిత్యం ప్రత్యేక పూజలు, అధ్యాత్మిక కార్యక్రమాలు -
నిర్మాణం.. శరవేగం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ వెస్ట్ బై పాస్ పనులు తుదిదశకు చేరాయి. ప్యాకేజీ–3 కింద చినఅవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు అన్ని అడ్డంకులను అధిగ మించి దాదాపు పూర్తయ్యాయి. ప్యాకేజీ–4 కింద గొల్లపూడి నుంచి చినకాకాని వరకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ ప్యాకేజీలో కృష్ణా నదిపై 3.12 కిలో మీటర్ల పొడవున చేపట్టిన ఐకాన్ బ్రిడ్జి నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. ప్యాకేజీ–3 కింద 30 కి.మీ. రోడ్డు ప్యాకేజీ–3 కింద చినఅవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలో మీటర్ల మేర బైపాస్ నిర్మాణ పనులు చేపట్టారు. రూ.1,148 కోట్ల అంచనాలతో ఈ ప్యాకేజీ పనులను మెగా సంస్థ 2021 ఫిబ్రవరిలో చేపట్టింది. ఈ రోడ్డు కోసం 14 గ్రామాల్లో భూమి సేకరించారు. కృష్ణా జిల్లాలో వెదురుపావులూరు, రామచంద్రాపురం, కొండపావులూరు, బీబీగూడెం, గన్నవరం, చిన్నఅవుటపల్లి, ఎన్టీఆర్ జిల్లాలో గొల్ల పల్లి, జక్కంపూడి, అంబాపురం, పి.నైనవరం, పాతపాడు, కె.వి.కండ్రిక, నున్న గ్రామాల పరిధిలో మొత్తం 188.92 హెక్టార్ల భూమిని సేకరించారు. భూ సేకరణకు రూ.416.60 కోట్లు ఖర్చు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించడంతో ఈ పనులు శరవేగంగా జరిగాయి. ఈ బైపాస్ పనులు పూర్తయితే విజయవాడ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి. విజయవాడ – విశాఖపట్నం మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఈ రోడ్డు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. ఉదాహరణకు చిన అవుటపల్లి నుంచి విజయవాడ వారధి వరకు ప్రస్తుతం ప్రయాణం చేయాలంటే గంట నుంచి గంటన్నర సమయం పడుతోంది. వెస్ట్ బైపాస్ అందుబాటులోకి వస్తే 15 నిమిషాల్లోపే చేరుకోవచ్చు. గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే వారు, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లేవారు విజయవాడకు రాకుండానే బైపాస్ మీదుగా ప్రయాణించొచ్చు. రహదారి ప్రారంభోత్సవానికి అడ్డంకులు ప్యాకేజీ–3 కింద చినఅవుటుపల్లి నుంచి గొల్లపూడి వరకు చేపట్టిన వెస్ట్ బైపాస్ పనులు దాదాపు పూర్తయ్యాయి. అయితే కొంత మంది రైతులు రోడ్డు ప్రారంభోత్సవాన్ని అడ్డుకునే కుట్రలకు తెరలేపారు. విద్యుత్ లైను టవర్ల మార్పిడికి సంబంధించి రైతులకు పరిహారం ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించినా ఈ రహదారిని ప్రారంభిస్తే విజయవాడ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే దురద్దేశంతో రైతుల ముసుగులో పచ్చ పార్టీ నాయకులు కోర్టుకు వెళ్లి 1.45 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకొన్నారు. ఇటీవలే ప్రభుత్వానికి అను కూలంగా కోర్టు తీర్పు రావటంతో మిగిలిన 1.45 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేస్తున్నారు. త్వరలోనే ఈ రోడ్డును ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. తుది దశకు చేరిన వెస్ట్ బైపాస్ నిర్మాణ పనులు ప్యాకేజీ–3 కింద చినఅవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు రోడ్డు నిర్మాణం రూ.1,148 కోట్లతో చేపట్టినపనులు 95 శాతం మేర పూర్తి ప్యాకేజీ–4 కింద గొల్లపూడి – చినకాకాని వరకు 17.881 కి.మీ రోడ్డు కృష్ణా నదిపై 3.12 కిలో మీటర్ల పొడవున ఐకాన్ బ్రిడ్జి నిర్మాణం ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారం విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఫిబ్రవరి నాటికే రహదారిని ప్రజ లకు అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొంత మంది రైతుల ముసుగులో కావాలనే కుట్ర చేసి, కోర్టుకు వెళ్లి పనులను అడ్డుకున్నారు. కోర్టు కేసులో వివాదం సైతం పరిష్కారమైంది. దీంతో మిగిలిన పనులను అధికారులు శరవేగంగా చేస్తున్నారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ కష్టాలు తీరుతాయి. – అవుతు శ్రీనివాసులరెడ్డి, పాతపాడు, విజయవాడ రూరల్ మండలం -
ఫ్యాన్ ప్రభంజనం ఖాయం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలుపుపై ధీమాతో ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం విజయవాడలో ఐప్యాక్ ప్రతినిధులతో భేటీ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు పార్టీ అభ్యర్థుల్లో మరింత ఉత్సాహాన్ని నింపాయి. ‘ఏపీలో మరో సారి వైఎస్సార్ సీపీ ప్రభంజనం ఖాయం.. జూన్ నాలుగో తేదీన వచ్చే ఫలితాల్లో ఊహించిన దానికంటే మనకు ఎక్కువ సీట్లు వస్తాయి.’ అన్న సీఎం వైఎస్ జగన్ మాటలు ఎన్నికల బరిలో ఉన్న పార్టీ అభ్యర్థుల్లో నూతనోత్తేజం నింపాయి. పార్టీ కార్యకర్తలు, అభిమానులకు సరికొత్త ఉత్సాహాన్ని అందించాయి. గత ఎన్నికల్లో టీడీపీ గెలుచుకున్న విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయం ఖాయమనే భావనను రాజకీయ విశ్లేషకులు, టీడీపీ నాయకులు సైతం స్పష్టం చేయడం ఇందుకు నిదర్శనం. ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి లబ్ధిపొందిన మహిళలు, వృద్ధులు తమ ఓట్లను గుంపగుత్తగా వైఎస్సార్ సీపీకే వేశారని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. పోలింగ్లో మహిళలదే పైచేయి అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో సైతం పైచేయిగా నిలిచారు. ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడంలో కూడా ముందు వరుసలో ఉన్నారు. మహిళల ఓటు బ్యాంకు వైఎస్సార్ సీపీకే సానుకూలంగా ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ ఓట్లు తమపై ఎక్కడ ప్రభావం చూపుతాయోనని కూటమి నేతలు భయపడుతున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద వారి భయం స్పష్టంగా కనిపించింది. దీనికి తోడు రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం వల్ల అక్క చెల్లెమ్మలకే నేరుగా లబ్ధి చేకూరింది. వృద్ధులకు క్రమం తప్పకుండా ప్రతి నెలా ఒకటో తేదీన వారి ఇంటి వద్దనే పింఛన్ కానుక అందింది. ఈ నేప థ్యంలో వైఎస్సార్ సీపీ ప్రభంజనం సృష్టించడానికి సంక్షేమ పథకాలే శ్రీరామ రక్షగా నిలుస్తాయని విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు. గెలుపు, ఓటములపై లెక్కలు సాధారణ ఎన్నికలు ముగియడంతో గెలుపు, ఓటములపై ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. బూత్ల వారీగా పోలైన ఓట్లపై అభ్యర్థులు సమీక్షించుకుంటున్నారు. మనకు ఏ బూత్లో కలిసొచ్చింది, ఎక్కడ ఇబ్బంది కలిగింది అన్న వివరాలపై స్థానిక నేతల ద్వారా ఆరా తీస్తున్నారు. అన్ని లెక్కలూ వేసుకున్నాక తమ గెలుపు ఖాయమని వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. దాదాపు మూడు నెలలుగా తీరిక లేకుండా ఎన్నికల వ్యవహారాల్లో బిజీగా ఉన్న నేతలంతా ఇప్పుడు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్నారు. మరో వైపు సాధారణ ప్రజల్లో ఎన్నికల ఫలితాలపై జోరుగా చర్చ జరుగుతోంది. కూడళ్లు, టీ బంకులు, నలుగురు గుమికూడిన ప్రాంతాల్లో సైతం గెలుపు, ఓటములపై చర్చలు జరుగుతున్నాయి. అయితే ముఖ్యమంత్రి మాటలతో.. జూన్ నాలుగో తేదీకి ముందే గెలుపు ఎవరిది అన్న ప్రశ్నకు ప్రజలకు సమాధానం లభించింది. మరో వైపు కూటమి నేతలు సైతం పెరిగిన పోలింగ్ శాతం తమకు అనుకూలంగా ఉంటుందేమోనని ఆశతో లెక్కలు వేసుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలతో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల్లో మరింత ధీమా సార్వత్రిక ఎన్నికల్లో పెరిగిన మహిళా ఓటింగ్ సంక్షేమ పథకాలకే అన్ని వర్గాల ప్రజల మద్దతుఐప్యాక్ బృందంతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి -
దుర్గమ్మను దర్శించుకున్న నటుడు రాజేంద్రప్రసాద్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను సినీ నటుడు రాజేంద్రప్రసాద్ గురువారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకోగా, వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం రాజేంద్రప్రసాద్కు ఆలయ ఈఓ కె.ఎస్.రామరావు అమ్మ వారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. అమ్మవారి దర్శనానంతరం మల్లేశ్వర స్వామిని దర్శించుకున్న రాజేంద్రప్రసాద్ స్వామి ఆలయ పునర్నిర్మాణం బాగుందన్నారు. రేపు జెడ్పీ సర్వసభ్య సమావేశంచిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన ఈ నెల 18వ తేదీన జరుగుతుందని జెడ్పీ ఇన్చార్జ్ సీఈఓ ఆనంద్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ సమావేశపు హాలులో ఈ సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున శాఖాపరమైన సమీక్షలు, అత్యవసర అంశాలపై మాత్రమే చర్చ జరుగుతుందని స్పష్టంచేశారు. సభ్యులతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా అధికారులు హాజరుకావాలని కోరారు. స్థాయీ సంఘ సమావేశాలు 18వ తేదీ జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు కూడా జరుగుతాయని సీఈఓ ఆనంద్కుమార్ తెలిపారు. ఉదయం పది నుంచి 11 గంటల వరకు ఏడు స్థాయీ సంఘ సమావేశాలు జరుగుతాయని వివరించారు. ఆయా సంఘాలకు చెందిన సభ్యులు, అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని పేర్కొన్నారు. దోమకాటు వ్యాధులను నిర్మూలిద్దాంలబ్బీపేట(విజయవాడతూర్పు): దోమకాటుతో ప్రబలే మలేరియా, డెంగీ వంటి వ్యాధులను సామాజిక చైతన్యం ద్వారా నిర్మూలించొచ్చని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని అన్నారు. జాతీయ డెంగీ డేను పురస్కరించుకుని పాత ప్రభుత్వాస్పత్రి ఆవరణలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ సుహాసిని మాట్లాడుతూ.. డెంగీ కేసులపై ప్రత్యేకంగా దృష్టి సారించా మని తెలిపారు. జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మోతీబాబు మాట్లాడుతూ.. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో డెంగీ కేసులు నమోదు కాకుండా దోమల లార్వా నిర్మూలనపై దృష్టి సారించామన్నారు. జూన్ నుంచి వర్షాకాలం మొదలవుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండి, ఇంటింటి సర్వే నిర్వహించి, అనుమానితుల వద్ద నుంచి రక్త నమూనాలు సేకరించాలన్నారు. ఆ నమూనాలను ల్యాబ్ టెక్నీషియన్స్కు అందజేసి ఫలితా లను సత్వరమే వెల్లడించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాకాధికారి డాక్టర్ జూపూడి ఉషారాణి, డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఇందుమతి, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ పద్మావతి, జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి సూర్యానాయక్, సబ్ యూనిట్ అధికారులు, సూపర్ వైజర్లు తదితరులు పాల్గొన్నారు. రేపు ఎన్టీఆర్ జిల్లాస్థాయి చెస్ పోటీలువిజయవాడస్పోర్ట్స్: సీనియర్ ఓపెన్, మహిళల ఎన్టీఆర్ జిల్లా స్థాయి చద రంగం పోటీలను ఈ నెల 18వ తేదీన నిర్వ హిస్తామని ది విజయవాడ చెస్ అసోసియేషన్ కార్యదర్శి మందుల రాజీవ్ తెలిపారు. గాయత్రీనగర్లోని నలంద విద్యానికేతన్లో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. విజేతలకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. మరిన్ని వివరాలకు 92461 81858 సెల్ నంబరులో సంప్రదించా లని సూచించారు. ఈ పోటీలకు సంబంధించిన పోస్టర్ను నలంద స్కూల్ ప్రిన్సిపాల్ మాదాల పద్మజతో కలిసి రాజీవ్ గురువారం ఆవిష్కరించారు. -
హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ డిప్లొమా కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
చిలకలపూడి(మచిలీపట్నం): డిప్లొమా ఇన్ హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్ టెక్నాలజీ కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలని చేనేత, జౌళిశాఖ జిల్లా అధికారి కె. అప్పారావు గురువారం ఓ ప్రకటనలో కోరారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీలో 15 నుంచి 23 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థులు ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పదో తరగతి, తత్సమానమైన పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఇంటర్మీడియెట్ ఎంపీసీ గ్రూప్లో పాసైన విద్యార్థులకు, పదో తరగతితో పాటు ఐటీఐ రెండు సంవత్సరాలు పాసైన వారికి సెకండ్ ఇయర్ డిప్లొమా కోర్సునకు ప్రవేశం ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు గరిష్ట వయోపరిమితి 25 సంవత్సరాలు ఉండాలని, కోర్సు మొదటి సంవత్సరంలో నెలకు రూ. 1000, సెకండ్ ఇయర్లో నెలకు రూ. 1100, మూడో సంవత్సరంలో రూ.1200 స్టైఫండ్ ఇస్తారన్నారు. వెంకటగిరిలోని కళాశాలలో 53 సీట్లు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాల కోసం 9399936872, 9866169908లో సంప్రదించాలన్నారు. దరఖాస్తులు జూన్ 1వ తేదీలోగా ఆన్లైన్ చేయాలని ఈ అవకాశాన్ని సంబంధిత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
మధిర స్టేషన్లో తాత్కాలికంగా హాల్టింగ్ ఎత్తివేత
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ–కాజీపేట సెక్షన్లో జరుగుతున్న 3వ లైన్ నిర్మాణ పనుల కారణంగా మధిర రైల్వే స్టేషన్లో పలు రైళ్లకు తాత్కాలికంగా హాల్టింగ్ నిలిపివేసినట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17, 18 తేదీలలో ఎస్ఎంవీడీ కత్రా–చైన్నె సెంట్రల్ (16032), 19, 20 తేదీలలో సికింద్రాబాద్–తిరుపతి (12764), మహబూబ్నగర్–విశాఖపట్నం (12862), ఈ నెల 19న కరీంనగర్–తిరుపతి (12762), బీదర్–మచిలీ పట్నం (12750), సీఎస్టీ ముంబై–భువనేశ్వర్ (11019), సాయినగర్ షిర్డీ–కాకినాడ పోర్టు (17205) రైళ్లు మధిర స్టేషన్లలో ఆగవని పేర్కొన్నారు. ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య నందిగామ: ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నందిగామలో చోటు చేసుకుంది. ఎస్ఐ పండు దొర తెలిపిన సమాచారం ప్రకారం పట్టణంలోని డీవీఆర్ కాలనీకి చెందిన ఎర్రం శెట్టి చందు (22) విజయవాడలో ఉంటాడు. ఈనెల 13న జరిగిన ఎన్నికలకు ఓటు వేసేందుకు నందిగామకు వచ్చాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. మృతుడు కుటుంబానికి అదే ప్రాంతంలో రెండు గృహాలు ఉండడంతో మరో ఇంట్లో నిద్రపోయిన తల్లి గురువారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా చందు ఫ్యాన్కు ఉరివేసుకొని మృతి చెంది కనిపించాడు. ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనుమానాస్పద కేసుగా నమోదు చేసి అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
No Headline
● ఆహార నియమాలు పాటించాలి. ● క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ● బీఎంఐ 25 లోపు ఉంచుకోవాలి. ● ఆహారంలో ఉప్పు తగ్గించుకోవాలి. ● జన్యుపరమైన సమస్యలు ఉన్న వారు వారానికోసారి బీపీ పరీక్షించుకోవాలి. ● తల్లిదండ్రులకు బీపీ ఉంటే అప్రమత్తంగా ఉంటూ స్మోకింగ్, ఆల్కాహాల్కు దూరంగా ఉండాలి. ● ప్రాసెసింగ్ ఫుడ్, నిల్వ ఉండే పచ్చళ్లు తినకుండా ఉండటం మంచిది. ● యోగా, మెడిటేషన్ వంటి వాటితో ఒత్తిళ్ల నుంచి ఉపశమనం పొందాలి. -
టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
సాక్షి, కృష్ణా: ఏపీలో ఎన్నికల సందర్భంగా పచ్చ బ్యాచ్ రెచ్చిపోయింది. ఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయి వైఎస్సార్సీపీ మద్దతుదారులు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీకి ఓటు వేసిన వారిపై భౌతిక దాడులకు దిగారు. కాగా, ఉంగుటూరు మండలం ఆత్కూరులో టీడీపీ నాయకుడు ఏడుకొండలు అరాచకం సృష్టించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసిందన్న కారణంగా వేముల సంధ్యా రాణి అనే ఓటర్ను ట్రాక్టర్తో ఢీకొట్టి చంపే ప్రయత్నం చేశాడు. ఈ ప్రమాదంలో సంధ్యా రాణి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న పిన్నమనేని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఇక, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంధ్యా రాణిని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ పరామర్శించారు. ఆమెను కలిసి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. ఆ ఘటనపై ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఊరట ఇస్తూ.. డీబీటీ(నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ) పథకాలకు నిధుల విడుదల ప్రారంభం అయ్యింది. నిన్న ఒక్కరోజే ఆసరాకు రూ.1,480 కోట్లు, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రింబర్స్ మెంట్కు రూ.502 కోట్లు విడుదల అయ్యాయి. రెండు మూడు రోజుల్లో మిగిలిన పథకలకూ నిధుల్ని విడుదల చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉంటే.. ఎన్నికల వేళ నిధులు విడుదల కాకుండా తెలుగు దేశం పార్టీ కుట్రలు చేసింది. ఈసీకి ఫిర్యాదు చేయడం.. ఆ వెంటనే ఈసీ సైతం డీబీటీ నిధులు విడుదలకు చేయకుండా ఆదేశాలిచ్చింది. దీంతో.. ఎన్నికల సంఘంపై ఏపీ ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. అయితే విచారణ సందర్భంగా ఈసీ తీరుపై కోర్టు ఆగ్రహం వెల్లగక్కింది. ఈలోపే పోలింగ్ తేదీ వచ్చేయడంతో నిధుల విడుదల ఆగిపోయింది. ఇప్పుడు పోలింగ్ ముగియడంతో నిధుల విడుదల తిరిగి ప్రారంభం అయ్యింది.మాట నిలబెట్టుకున్న సీఎం @ysjagan డీబీటీ పథకాల నిధుల విడుదలకి గత వారం ఏపీ హైకోర్టు అనుమతించినా.. కుట్రపూరితంగా అడ్డుకున్న చంద్రబాబు పోలింగ్ తర్వాత అకౌంట్లలో డబ్బులు వేస్తామని లబ్ధిదారులకి హామీ ఇచ్చిన జగనన్న మాట ప్రకారం ఆసరా కింద అక్కచెల్లెమ్మల అకౌంట్లలో రూ.1480 కోట్లు,…— YSR Congress Party (@YSRCParty) May 16, 2024 -
గన్నవరంలో టీడీపీ గలాటా
సాక్షి, మచిలీపట్నం/జగ్గయ్యపేట అర్బన్/ఉంగటూరు: కృష్ణాజిల్లాలో టీడీపీ నాయకులు గన్నవరం, పెనమలూరు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీపై దాడులకు పాల్పడ్డారు. గన్నవరం మండలం ముస్తాబాద్ వద్ద యార్లగడ్డ వెంకట్రావు వర్గీయులు, వైఎస్సార్సీపీ కేడర్ను రెచ్చగొట్టడంతో తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న వల్లభనేని వంశీ అక్కడికి చేరుకోవడంతో ఒకరిపై ఒకరు చెప్పులు, రాళ్లు విసురుకున్నారు. ⇒ ఉంగుటూరు మండలం తేలప్రోలు జెడ్పీహైస్కూల్లో ఉన్న 271, 273, 274, 275 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల నమోదు పరీశీలించేందుకు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెంకట్రావు తన అనుచరులతో ర్యాలీగా చేరుకున్నారు. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చిన ఆయన వైఎస్సార్సీపీ నాయకులను రెచ్చగొట్టేలా వల్లభనేని వంశీని, సీఎం జగన్ను అసభ్యపదజాలంతో దూషించారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాదోపవాదనలు చేరడంతో దాడికి పాల్పడ్డారు.వల్లభనేని వంశీమోహన్ అక్కడకు చేరుకుని కవ్వింపు చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిలో గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి రవికుమార్, ప్రత్తిపాటి జీవన్కుమార్, భీమవరపు యతేంద్ర రామకృష్ణ, తదితరులు తీవ్రంగా గాయపడ్డాడు. వారంతా అవుటుపల్లిలోని పిన్నమనేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.⇒ అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలంకలో వైఎస్సార్సీపీ నాయకుడైన మండల బీసీ సెల్ కన్వీనర్ రాజులపాటి నాగేశ్వరరావు, ఆయన కుమార్తె కేసాని తేజశ్రీలపై జనసేన నాయకులు దాడికి దిగారు. తండ్రిని కొడుతుండగా కుమార్తె తేజశ్రీ అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఆమెపై దాడి చేసి కాలు విరగ్గొట్టారు.కౌన్సిలర్ భర్తపై టీడీపీ గూండాల దాడిఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో సోమవారం పోలింగ్ బూత్లోకి వెళ్లిన 16వ వార్డు కౌన్సిలర్ తన్నీరు నాగమణి భర్త, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి తన్నీరు నాగేంద్రపై స్థానిక టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నాగేంద్ర ముఖం, తలపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక చెరువుబజారులోని బీసీ కమ్యూనిటీ భవన్లో ఏర్పాటుచేసిన 33వ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు ఒక మానసిక దివ్యాంగుడికి సహాయంగా అతని కుటుంబ సభ్యుని అనుమతించాలని తన్నీరు నాగేంద్ర ప్రిసైడింగ్ అధికారి అనుమతి తీసుకునేందుకు బూత్లోకి వెళ్లారు.అదే సమయంలో స్థానిక టీడీపీ వ్యక్తులు నడిగొండ్ల సతీష్, తాళ్లూరి సోమయ్య, అతని కుమారుడు తాళ్లూరి వెంకటేశ్వర్లు, ఉత్తపళ్ల వెంకటేశ్వర్లు ఆయనపై దాడికి పాల్పడ్డారు. కాగా ఈ ఘటనకు అరగంట ముందు మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య సోదరుడు శ్రీరాం చినబాబు అదే బూత్ వద్దకు వచ్చి టీడీపీ నాయకులతో మంతనాలు జరిపాడనీ, ఆయన సూచనతోనే ఈ దాడి జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోదరుడు సామినేని రవిచంద్, ఉదయభాను కుమారుడు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్, ఉదయభాను కుమార్తె పద్మ ప్రియాంక, మున్సిపల్ మాజీ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్(చిన్నా), పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆకుల శ్రీకాంత్(బాజి) ఇరువర్గాలను విడదీసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో ఎమ్మెల్యే ఉదయభాను సోదరి చాముండేశ్వరి(బేబి)ని కూడ దుండగులు తోసేయడంతో ఆమె కింద పడి కాలుకు ఫ్రాక్చర్ అయింది. -
మోపిదేవిలంకలో బాలశౌరి తనయుడి వీరంగం
మోపిదేవి (అవనిగడ్డ): ఓటమి భయంతో టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. కృష్ణాజిల్లా మోపిదేవి మండలం మోపిదేవిలంకలో సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు రె చ్చిపోయారు. మహిళలు అని కూడా చూడకుండా కిందపడేసి పిడిగుద్దులు గుద్దడమేగాక కాళ్లతో తన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి తనయుడు అనుదీప్తో వచ్చిన జనసేన నాయకులు కూడా ఈ దాడులకు పాల్పడ్డారు.మోపిదేవిలంకలో ఏజెంట్లు టీ అడగడంతో స్థానికంగా ఉండే యార్లగడ్డ అంకరాజుతో తెప్పించారు. లోపలికి వెళుతున్న అంకరాజుపై జనసేన ఎంపీ అభ్యర్ధి వల్లభనేని బాలశౌరి తనయుడు అనుదీప్తో వ చ్చిన జనసేన నాయకులు, కొందరు టీడీపీ నేతలు దాడిచేశారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ బీసీ విభాగం మోపిదేవి మండల కన్వినర్ రాజులపాటి నాగేశ్వరరావు మీద జనసేన నేతలు బల్లా సీతారాంప్రసాద్, బల్లా మునికుమారి, బల్లా దినేష్, శ్రీనివాసరావు, పవన్ తదితరులు దాడిచేసి కొట్టారు. నాగేశ్వరరావు కుమార్తె కేశాని తేజశ్రీని కిందపడేసి పిడిగుద్దులు గుద్ది కాళ్లతో తన్నారు. అడ్డువ చ్చిన వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి మోర్ల శ్రీనివాసరావుతో పాటు రాజులపాటి సుజాత, నరసారావు, వినయ్బాబు, శివనాగరాజులను తీవ్రంగా కొట్టారు.బాధిత వైఎస్సార్సీపీ నాయకులు మోపిదేవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, అవనిగడ్డ వైద్యశాలలో చేరారు. వీరికంటే ముందే.. దాడిచేసిన టీడీపీ నాయకులు ఆస్పత్రిలో చేరారు. తరువాత వైఎస్సార్సీపీ నాయకులు హాస్పటల్లో చేరగా అదే వార్డులో ఇరువర్గాలను ఉంచారు. టీడీపీ నాయకురాలు బల్లా మునికుమారిని పరామర్శించేందుకు వ చ్చిన ఆమె సోదరులు అక్కడే చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ నాయకులపై దాడికి యత్నించారు. ఎస్ఐ రమేష్ ఇరువర్గాలకు సర్దిచెప్పారు.అనంతరం ఇరువర్గాలను మచిలీపట్నం ఆస్పత్రికి పంపారు. ఎమ్మెల్యే సింహాద్రి రమే‹Ùబాబు, వైఎస్సార్సీపీ రైతు విభాగం జోనల్ ఇన్చార్జి కడవకొల్లు నరసింహారావు వైద్యశాలకు వెళ్లి వైఎస్సార్సీపీ నాయకులను పరామర్శించారు. ఈ దాడుల్ని ఎమ్మెల్యే సింహాద్రి తీవ్రంగా ఖండించారు. -
టీడీపీ గూండాల అరాచకంపై జోగి రమేష్ ఆగ్రహం
సాక్షి, కృష్ణా జిల్లా: పోరంకిలో టీడీపీ అరాచకం సృష్టించింది. టీడీపీ గూండాలు దాదాగిరికి పాల్పడ్డారు. దొంగ ఓట్లు వేస్తున్నారని వైఎస్సార్సీపీ శ్రేణులు గుర్తించాయి. ప్రశ్నించినందుకు జోగి రమేష్ అనుచరుడు ఆరేపల్లి రాముపై కర్రలతో దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడికి దిగారు. టీడీపీ గూండాల అరాచకంపై జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గూండాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.నెల్లూరు: ఓటమి భయంతో వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు దాడులకు దిగుతున్నారు. గూడూరు నియోజకవర్గంలోని చిల్లకూరులో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన అభ్యర్థి మేరీగా మురళిపై దాడికి యత్నించారు. సంగం మండలం చెన్నవరప్పాడులో వైఎస్సార్సీపీ కార్యకర్తపై టీడీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్త ఢిల్లీ బాబు గాయపడ్డారు. కావలి నియోజకవర్గంలోని అల్లూరు, ముసునూరులో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. -
వైఎస్సార్ సీపీలోకి యాదవ మహాసభ నేత ‘పచ్చిపాల’
జగ్గయ్యపేటఅర్బన్: అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పచ్చిపాల నాగేశ్వరరావు వైఎస్సార్ సీపీలో చేరారు. ఆయన శనివారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సమక్షంలో చేరారు. ఉదయభాను ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పచ్చిపాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విధానాలు నచ్చి తాను పార్టీలో చేరినట్లు తెలిపారు. పెనుగంచిప్రోలు దేవస్థానం చైర్మన్ పదవి, పేట మార్కెట్ యార్డు చైర్మన్ పదవి కూడా యాదవ సామాజిక వర్గానికి ఇవ్వడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఉదయభాను ఇస్తున్న ప్రాధాన్యత స్ఫూర్తిదాయకం అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఈ విధంగా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు కుంభం వెంకటేశ్వర్లు, బీసీ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు కోసూరి ప్రహ్లాద్, మండల బీసీ నాయకుడు మార్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు. వినూత్నంగా ఎన్నికల ప్రచారం విజయవాడస్పోర్ట్స్: ఎన్నికల ప్రచారాన్ని వినూత్నంగా నిర్వహించి విజయవాడ ప్రజల దృష్టిని ఆకర్షించాడీ యువకుడు. కృష్ణలంకకు చెందిన శివకుమార్ తన ద్విచక్ర వాహనాన్ని పూర్తిగా వైఎస్సార్సీపీ స్టిక్కర్లతో చుట్టేశాడు. ఆ పార్టీ ఎన్నికల గుర్తు ఫ్యాన్ను వాహనం ముందు అమర్చి వీధుల్లో చక్కర్లు కొడుతూ ప్రజల దృష్టిని ఆకర్షించాడు. వెల్డింగ్ వర్కర్గా జీవనం సాగిస్తున్న తాను సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితుడనై.. ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకుని పార్టీ తరఫున స్వచ్ఛందంగా ప్రచారం చేసినట్లు శివకుమార్ చెప్పారు. -
కృష్ణాలో పారిశ్రామిక విప్లవం
సాక్షి, మచిలీపట్నం: ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలి. ఇందుకు పరిశ్రమలు, ఎంఎస్ఎంఈలు నెలకొల్పాలి. ప్రధాన జీవనాధారం వ్యవసాయమే అయినా రోజురోజుకు సమాజంలో వస్తున్న మార్పు కారణంగా ఏదైనా కొలువులో స్థిరపడాలనేది నేటి తరం యువత కల. అది ప్రభుత్వ ఉద్యోగమైనా.. ప్రైవేటుది అయినా సరే. అయితే అత్యధికంగా పోటీ ఉండే ప్రభుత్వ ఉద్యోగం కంటే పారిశ్రామిక రంగంలో రాణించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. స్మాల్ స్కేల్, మైక్రో తరహా పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ ఐదేళ్లలో జిల్లాలో పారిశ్రామిక రంగం పరుగులు తీసింది. ప్రభుత్వం అందించే సహాయంతో ముందుకు వచ్చిన ఔత్సాహికులు తమ ఆలోచనా విధానాలకు అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నారు. చిన్న తరహా పరిశ్రమలే అయినా తమతో పాటు మరి కొందరికి ఉపాధి అవకాశాలు కల్పించి ఆసరాగా ఉంటున్నారు. ఫలితంగా జిల్లాలో వేల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. గుడివాడలో అత్యధికంగా... జిల్లాలోని 25 మండలాల్లోనూ చిన్న పరిశ్రమలు కొత్తగా స్థాపించారు. నాలుగున్నరేళ్లలో ఒక్కో మండలంలో కనీసం 40కి పైగా ఎంఎస్ఎంఈలు ఏర్పాటయ్యాయి. ఇందులో అత్యధికంగా గుడివాడ మండలంలో రూ.74.59 కోట్లతో 776 ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేయగా 2,071 మందికి ఉపాధి అవకాశాలు వరించాయి. అయితే మచిలీపట్నంలో రూ.93.36 కోట్లతో ఏర్పాటు చేసిన 681 ఎంఎస్ఎంఈల ద్వారా అత్యధికంగా 3,071 మందికి ఉపాధి లభించడం గమనార్హం. సింగిల్ డెస్క్ విధానంతో వేగంగా ప్రక్రియ పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే అందుకు ఐదారు శాఖల అనుమతులు అవసరం. ముఖ్యంగా పరిశ్రమల శాఖతో పాటు లేబర్, స్థానిక సంస్థలు, విద్యుత్, జీఎస్టీ లాంటి అనుమతులను జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు ఆయా శాఖల అధికారులతో సంప్రదించి అనుమతులు ఇప్పించేందుకు అన్ని విధాలా సహకరిస్తారు. దీంతో ఔత్సాహికుడు అన్ని శాఖలకు తిరగాల్సిన అవసరం ఉండదు. ప్రతి నెలా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించి రాయితీ విడుదలపై చర్చిస్తున్నారు. నాలుగున్నరేళ్లలో మండలాల వారీగా ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈల వివరాలు: మండలం ఏర్పడిన ఉపాధి పెట్టుబడి ఎంఎస్ఎంఈల సంఖ్య పొందిన వారు (రూ. లక్షల్లో)అవనిగడ్డ 95 338 1278 బంటుమిల్లి 110 313 1429.45 బాపులపాడు 199 2968 7682.61 చల్లపల్లి 203 568 2256 గన్నవరం 370 1934 7302.8 ఘంటసాల 44 104 5359 గుడివాడ 776 2071 7459.29 గుడ్లవల్లేరు 437 739 2496.7 గూడూరు 275 894 2906 కంకిపాడు 121 372 1394 కోడూరు 98 323 1771.5 కృత్తివెన్ను 202 268 1028.5 మచిలీపట్నం 681 3071 9336.02 మోపిదేవి 57 165 417.9 మొవ్వ 102 291 826.8 నాగాయలంక 150 310 1435.5 నందివాడ 187 304 1435.3 పామర్రు 145 626 1491.807 పమిడిముక్కల 88 237 892 పెడన 152 382 1227.96 పెదపారుపూడి 88 215 553.813 పెనమలూరు 463 2116 7666.06 తోట్లవల్లూరు 140 351 1372 ఉంగుటూరు 79 143 478.5 ఉయ్యూరు 218 668 1700.49 వైఎస్సార్ తాడిగడప 99 164 1075 మొత్తం 5,579 19,935 722,73 కోట్లు చిన్న తరహా పరిశ్రమలకు ఊతం ఎంఎస్ఎంఈలకు అధిక ప్రాధాన్యం సర్కారు సాయంతో ముందుకు వచ్చిన ఔత్సాహికులు కృష్ణాజిల్లాలో నాలుగున్నరేళ్లలో 5,579 పరిశ్రమల ఏర్పాటు రూ.722.73 కోట్ల పెట్టుబడులు 19,935 మందికి ఉద్యోగ అవకాశాలు నాలుగేళ్లలో రూ.772 కోట్లతో 5,579 ఎంఎస్ఎంఈలు కృష్ణాజిల్లాలో సహజ వనరులు పుష్కలంగా ఉండడంతో చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు వీలు దక్కింది. ప్రభుత్వ సహకారంతో ఔత్సాహికులు తమ ఆలోచన, అభిరుచులకు తగ్గట్లు రూ.772.73కోట్లతో 5,579 ఎంఎస్ఎంఈలు (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్) ఏర్పాటు చేసుకున్నారు. దీని వల్ల 20 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయి. మరోవైపు గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలంలో నాలుగు లార్జ్, అండ్ మీడియం పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.6 కోట్లు పెట్టుబడి పెట్టగా వీటి ద్వారా 2,300 మందికి ఉపాధి అవకాశాలు దక్కాయి. రాయితీలతో చేయూత చిన్న, మైక్రో పరిశ్రమల ఏర్పాటుకు రాయితీలతో ప్రభుత్వం అండగా ఉంటోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఔత్సాహికులకు ఉత్పత్తి పరిశ్రమ అయితే రూ.50 లక్షల వరకు రుణం, సర్వీసింగ్ సెక్టారులో రూ.20లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జగనన్న బడుగు వికాసం కింద ఉత్పత్తి సంస్థలకు రూ.1.20 కోట్ల వరకు సబ్సిడీ కల్పిస్తున్నారు. -
2,400 మద్యం బాటిళ్ల స్వాధీనం
వెల్లంకి(వీరులపాడు): మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఎస్ఈబీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ హెచ్చరించారు. మండలంలోని వెల్లంకి గ్రామ సమీపంలోని ఎర్రగుట్ట వద్ద అక్రమంగా నిల్వ చేసిన మద్యం బాటిళ్లను శనివారం ఎస్ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం అక్రమంగా నిల్వ చేశారనే సమాచారం రావటంతో సిబ్బందితో వెళ్లి దాడి చేశామన్నారు. మొత్తం రూ.3.50 లక్షల విలువ చేసే 50 కేసుల్లో 2,400 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిర్మానుష్య ప్రదేశంలో ఉన్నాయని అక్కడ ఎవరూ లేకపోవటంతో దర్యాప్తు చేస్తున్నామన్నారు. దాడిలో ఎస్ఐ నాగేంద్రకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. పట్టుబడిన మద్యం టీడీపీ నాయకులకు చెందినదిగా పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కావటంతో ఓటర్లకు పంచేందుకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం కురుమద్దాలి(పామర్రు): విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారిపై కురుమద్దాలి గ్రామం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధి బల్లిపర్రు గ్రామానికి చెందిన కలపాల చంద్(24), బి.నాగేశ్వరరావులు తమ బైక్పై కురుమద్దాలి గ్రామానికి జాతీయ రహదారిపై వెళ్తున్నారు. ఈ క్రమంలో కురుమద్దాలి వద్దకు రాగానే బైక్ లారీని ఢీ కొట్టింది. ఈ సంఘటనలో చంద్ రోడ్డుపై పడిపోవడంతో బలమైన గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మరొక వ్యక్తి నాగేశ్వరరావుకు గాయాలు అవ్వడంతో మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పామర్రు ఎస్ఐ ప్రవీణ్కుమార్రెడ్డి తెలిపారు. డివైడర్ను ఢీ కొన్న కారు.. వ్యక్తి మృతి గౌరవరం(జగ్గయ్యపేట): డివైడర్ను కారు ఢీ కొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన గౌరవరం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కు చెందిన రెడ్డి సాయిప్రసాద్(58) తన ముగ్గురు కుటుంబ సభ్యులతో కలిసి ఏలూరు ఫంక్షన్కు వెళ్లారు. తిరిగి వస్తుండగా గ్రామంలోని జాతీయ రహదారి వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా కారు పంచర్ అయ్యింది. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న డివైడర్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న ప్రసాద్ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారు. చిల్లకల్లు ఎస్ఐ సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రబాబు కుట్రలను గమనించాలి
నందివాడ: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలను ప్రజలందరూ గమనించాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) అన్నారు. మండలంలోని జనార్దనపురం(జొన్నపాడు) గ్రామంలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొడాలి నానిపై పార్టీ శ్రేణులు పూల వర్షం కురిపిస్తూ, గజమాలలతో ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులు ఇచ్చారు. గ్రామంలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పార్టీ నాయకులతో కలసి ఎమ్మెల్యే కొడాలి నాని పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ను, గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ ప్రజలందరికీ మంచి చేసిన సీఎం జగన్కు ఈనెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ మద్దతుగా నిలవాలని కోరారు. రాష్ట్రంలో పెత్తందారులకు, పేదలకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. ఇంటింటికీ వెళ్లి పేదలకు పెన్షన్లు అందిస్తున్న వలంటరీ వ్యవస్థను చంద్రబాబు అండ్ కో ఆపేశారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు చంద్రబాబు ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని విశ్వప్రయత్నాలు చేస్తున్నారన్నారు. 2014లో కూటమి మేనిఫెస్టో పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు మోసం చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం మళ్లీ సూపర్ సిక్స్ అంటూ ప్రజలను మోసం చేసేందుకు మరోసారి చంద్రబాబు రెడీ అయ్యారన్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ సీఎం జగన్కు మద్దతుగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ పెయ్యల ఆదాం, జెడ్పీటీసీ కందుల దుర్గాకుమారి, వైస్ ఎంపీపీ కొప్పుల జయరాజు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, పార్టీ నాయకులు కొండపల్లి కుమార్రెడ్డి, మలిరెడ్డి రవిరెడ్డి, కొండపల్లి రంగారెడ్డి, కొల్లారెడ్డి మధురెడ్డి, మలిరెడ్డి నాగిరెడ్డి, కోటే నాగేశ్వరరావు, బట్టిపాటి శ్రీనివాసరెడ్డి, కుందల నాగరాజు, తోట నాగరాజు, మొండ్రు వెంకటేశ్వరరావు, చింతాల నాగూర్, పరిమి అమృతబాబు, పామర్తి మురళీకృష్ణ, బేతపూడి నవరత్నరాజు, రాజులపాటి చంద్రశేఖర్, ఎంపీటీసీలు గోవాడ నిర్మలకుమారి, వెన్న ప్రభావతి, గుజ్జుల చైతన్యజ్యోతి, పిట్టా విశ్రాంతమ్మ, గుత్తా సత్యనారాయణ(చిన్ని), సచివాలయ కన్వీనర్ దేశిరెడ్డి రామ్మోహన్రెడ్డి, సర్పంచ్లు తాత మరియమ్మ, తెన్నేటి భాస్కరరెడ్డి, కలపాల సుధారాణి, సరెళ్ల రత్నకుమారి, తప్పిట ధనలక్ష్మి, జాజుల జ్యోత్స్నదేవి పాల్గొన్నారు. రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలి గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని మండలంలో ముగిసిన ఎన్నికల ప్రచారం -
పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం పరిశీలన
పామర్రు: సాధారణ ఎన్నికల సందర్భంగా 77–పామర్రు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ శనివారం రాత్రి పరిశీలించారు. స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఆర్వో బి.శ్రీదేవి తదితర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 13వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుందన్నారు. ఆదివారం ఉదయం ఆయా అసెంబ్లీ నియోజవర్గాలకు కేటాయించిన పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు వచ్చి పోలింగ్ మెటీరియల్ తీసుకుని వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్తారని చెప్పారు. పామర్రు నియోజకవర్గంలో 238 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో రూట్లు, పోలింగ్ కేంద్రాల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలింగ్ మెటీరియల్ పంపిణీ సకాలంలో జరగాలని, పోలింగ్ సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు, ఆహారం, కనీస వసతులు కల్పించాలని రిటర్నింగ్ అధికారికి కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో పామర్రు ఎన్నికల రిటర్నింగ్ అధికారి బూసి శ్రీదేవి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
‘కూటమిని కూలదోస్తేనే ప్రజా సంక్షేమం’
కంకిపాడు: మాయమాటలు చెప్పే కూటమిని కూల దోస్తేనే ప్రజా సంక్షేమ రాజ్యం అధికారంలోకి వస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి, వైఎస్సార్సీపీ పెనమలూరు అభ్యర్థి జోగి రమేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కంకిపాడు పట్టణంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రోడ్ షో, బస్టాండు కూడలిలో బహిరంగ సభ నిర్వహించారు. సభలో జోగి రమేష్ మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకూ కానీ, అంతకు ముందు కానీ ఏ రోజైనా చంద్రబాబు ప్రజా సంక్షేమం గురించి ఆలోచించాడా? అని ప్రశ్నించారు. దోచుకోవటం, దాచుకోవటం తప్ప ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. అమరావతి పేరుతో భ్రమరావతి చూపాడని ధ్వజమెత్తారు. అభివృద్ధి పేరుకే కాగితాల్లో ఉందన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందుతోందన్నారు. సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదే అన్నారు. అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి రాకుండా చేసేందుకు చంద్రబాబు, పవన్, మోదీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వారి మాయమాటలు నమ్మొద్దని హితవు పలికారు. ఓటు అనే ఆయుధంతో కూటమిని బంగాళాఖాతంలో కలిపేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పెనమలూరు అసెంబ్లీ స్థానానికి తనను, మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి సింహాద్రి చంద్రశేఖర్రావును ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు చైర్పర్సన్ తాతినేని పద్మావతి, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ నేత చలసాని స్మిత గౌతమ్, జెడ్పీటీసీ సభ్యుడు బాకీ బాబు, జేసీఎస్ చైర్మన్ రాచూరి చిరంజీవి, సర్పంచ్ బాకీ రమణ, ఏఎంసీ వైస్ చైర్మన్ మాదు వసంతరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల బందోబస్తుకు సంసిద్ధం
●సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి ●పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ●జిల్లా ఎస్పీ అస్మి కోనేరుసెంటర్: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల బందోబస్తుకు పోలీసు యంత్రాంగం సంసిద్ధంగా ఉన్నట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి తెలిపారు. అలాగే శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఎవరైనా వ్యవహరిస్తే అటువంటి అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికలను పురస్కరించుకుని శనివారం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆయన చాంబర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఎన్నికలను పురస్కరించుకుని జిల్లాలో ఇప్పటికే ప్రత్యేక బలగాలు విధుల్లో ఉన్నాయన్నారు. జిల్లా పోలీసులతో పాటు మిలటరీ బలగాలు, రిటైర్డ్ పోలీసు అధికారులు, ఎక్స్ సర్వీస్మెన్ల సేవలను వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు 2,611 కేసులు నమోదు చేసి, 10,026 మందిని బైండోవర్ చేశామన్నారు. 51 మందిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు చేశామని తెలిపారు. జిల్లాలో 1686 పోలింగ్ కేంద్రాలు ఉండగా సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 చెక్పోస్ట్లను ఏర్పాటు చేసి నగదు, మద్యం, ఇతర సామగ్రి అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. జిల్లాలో 2,172 మంది సిబ్బందిలో 2,064 మంది పోలీసులు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎస్పీ తెలిపారు. 160 లైసెన్స్లు కలిగిన వ్యక్తుల నుంచి 133 ఆయుధాలను డిపాజిట్ చేశామని, మిగిలిన 27 బ్యాంకులు, ఇతర సెక్యూరిటీ ప్రాంతాల్లో ఉంచామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఎన్నికల నియమావళిని ఉల్లంఘనపై 18 కేసులు నమోదు చేయటంతో పాటు రూ.7,23,17,075లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని చెప్పారు. అక్రమంగా తరలిస్తున్న రూ.94,30,467ల విలువైన మద్యాన్ని పట్టుకున్నామన్నారు. 464 కేజీల గంజాయితో పాటు రూ.1,69,93,843ల విలువ కలిగిన ఆభరణాలు, రూ.29,82,135ల ఖరీదు చేసే వివిధ రకాల వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తంగా 1,605 కేసులకు సంబంధించి రూ..10,56,90,810లను సీజ్ చేసినట్లు ఆయన తెలిపారు. ఓటు హక్కును జిల్లా ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో ధైర్యంగా వినియోగించుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
'బేబి' హీరో ఇంతలా మారిపోయాడేంటి? ఏకంగా అలా..
యశ్ దయాల్పై కోహ్లి ఫైర్.. దెబ్బకు ధోని ఖేల్ ఖతం!
భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా?
మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
టీడీపీపై బొత్స సెటైర్లు
Pratibha Ranta: నిన్నెవరు పెళ్లాడతారు? అని నానమ్మ కలవరపడినా.. హీరోయిన్ అయింది(ఫోటోలు)
వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర
ఆ అవార్డు వస్తే సంతోషిస్తా: నటి కంగనా
ఆహా.. సూపర్ పవర్ భూమ్మీదకొచ్చిందా?.. వైరల్ వీడియోలు
తప్పక చదవండి
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement