గుర్తు తెలియని మృతదేహం | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని మృతదేహం

Published Mon, May 6 2024 6:55 AM

-

కృష్ణలంక(విజయవాడతూర్పు): ప్రకాశం బ్యారేజీ వద్ద మెయిన్‌ కెనాల్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మెయిన్‌ కెనాల్‌ లాకులు సమీపంలో కెనాల్‌ ఒడ్డున నీటిలో ఒక వ్యక్తి మృతదేహం ఉదని ఆదివారం ఉదయం పది గంటల సమయంలో పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఆ మృతదేహాన్ని కెనాల్‌ నుంచి వెలికితీసి పురుషుడిదిగా గుర్తించారు. మృతుని వద్ద ఊరు, పేరు వంటి ఆధారాలు ఏమీ లభించలేదు. మృతుని వయస్సు 35 నుంచి 40 ఏళ్లు ఉంటుందని, వంటిపై రెడ్‌ కలర్‌ టీషర్టు, బ్లూ షార్ట్‌ ఉన్నాయని తెలిపారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement