జగనన్నతోనే రాష్ట్రానికి మేలు | Sakshi
Sakshi News home page

జగనన్నతోనే రాష్ట్రానికి మేలు

Published Mon, May 6 2024 7:00 AM

జగనన్నతోనే రాష్ట్రానికి మేలు

పెడన: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని గుర్తించి, ఆయన అమలు చేసే సంక్షేమ ఫలాలు నిరుపేదలకు నేరుగా అందుతున్న తీరుకు మెచ్చి పలువురు స్వచ్ఛం దంగా వైఎస్సార్‌ సీపీలో చేరుతున్నారని పార్టీ పెడన ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పాల రమేష్‌(రాము) అన్నారు. పట్టణంలోని 14వ వార్డు టీడీపీ సీనియర్‌ కౌన్సిలర్‌ ఉమ్మిలేటి సుబ్రహ్మణ్యం, వార్డు నాయ కుడు అంగత సాంబశివరావు కుమారుడు అంగత రామాంజనేయులు, సేనాపతి రాంబాబు, సోమ శేఖర్‌ తదితరులు పార్టీలో చేరారు. కూడూరులోని తన ఇంటి వద్ద వారందరికీ ఉప్పాల రమేష్‌ (రాము) కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని వారిని రాము కోరారు. బళ్ల సాంబశివరావు, ఉమా, రామకృష్ణ, బండారు మల్లి తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీలో టీడీపీ మాజీ కౌన్సిలర్‌ సహా పలువురు చేరిక

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఉప్పాల రమేష్‌ (రాము)

Advertisement
 
Advertisement