-
వీరబ్రహ్మేందస్వామి ఆరాధనోత్సవాలు
ఏలూరు (టూటౌన్): వీరబ్రహ్మేంద్రస్వామి (బ్రహ్మంగారు) రాసిన తాళపత్ర గ్రంథాలను డిజిటలైజ్ చేయాలని ఏపీ విశ్వబ్రాహ్మణ ధర్మ పీఠం ప్రధాన సంచాలకుడు అప్పలభక్తుల శివకేశవరావు కోరారు. ఏలూరులో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పవరుపేట సంఘ కార్యాలయంలో, పడ మట వీధి బ్రహ్మంగారి ఆలయం, మాదేపల్లి బ్రహ్మంగారి ఆలయంలో శుక్రవారం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ బ్రహ్మంగారి సాహిత్య సమాజంలోని పలు రుగ్మతలకు పరిష్కారం చూపిస్తుందన్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంతో పాటు సంఘ సంస్కరణకు, ఆధ్యాత్మిక సత్యాన్ని వివరించేందుకు రచించిన రచనలపై అధ్యయనం చేసి విస్తృతంగా వ్యాప్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. బ్రహ్మంగారి రాసిన కొన్ని తాళపత్ర గ్రంథాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయని వీటన్నింటినీ సేకరించి డిజిటలైజేషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నా డని నిరూపించిన వ్యక్తి బ్రహ్మంగారు అన్నారు. ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ లక్కోజు రాజగోపాలాచారి, విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సింహాద్రి భృంగాచార్యులుల, కార్యదర్శి మానేపల్లి నాగేశ్వరరావు, గౌరవ అధ్యక్షుడు వేముల దుర్గాప్రసాద్, వడ్రం పనివార్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు పొట్నూరి శివరావు పాల్గొన్నారు. -
రోడ్డు పనుల్లో నాణ్యత ముఖ్యం
ఏలూరు(మెట్రో): ఏలూరులో రహదారులు, భవనాల శాఖ ద్వారా చేపట్టి పూర్తిచేసిన ప్యాచ్వర్క్ పనులను ఆర్అండ్బీ ఎస్ఈ జి.జాన్ మోషేతో కలిసి కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ శుక్రవారం పరిశీలించారు. నగరంలో ఆర్అండ్ బీ (ఎండీఆర్) రూ.కోటి నిధులతో మంజూరైన నాలుగు రోడ్లకు సంబంధించి లింకు రోడ్డు ఏలూరు–కై కలూరు, చాటపర్రు, ఈకే రోడ్డు వయా క్లాక్ టవర్ నుంచి ఏలూరు టౌన్ వరకు, పాత బస్టాండ్ నుంచి గజ్జెలవారి చెరువు వరకు, గూడ్స్షెడ్ రోడ్డు నుంచి రైల్వేస్టేషన్ వీవీ రోడ్డు వరకు ప్యాచ్ వర్క్లు పూర్తిచేశారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆర్అండ్బీ అధికారులతో కలిసి ఏలూరు–కై కలూరు రోడ్డు, పాత బస్టాండ్ నుంచి గజ్జెలవారి చెరువు వరకు వేసిన ప్యాచ్వర్క్లను పరిశీలించి, స్థానికులను పనులపై ఆరా తీశారు. ఆర్అండ్బీ డీఈ గోవింద మో హన్, ఈఈ వైవీ కిషోర్ బాపూజీ, ఏఈ శేషుకుమార్ కలెక్టర్ వెంట ఉన్నారు. -
డోలీ కట్టి.. గర్భిణిని ఆస్పత్రికి తరలించి..
కుక్కునూరు: పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీని ఐదు కిలోమీటర్లు డోలీలో మోసుకొచ్చి 108 వాహనంలో ఆస్పత్రికి తరలించి సురక్షితంగా ప్రసవం చేయించిన సంఘటన మండలంలోని లచ్చిపేటలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. లచ్చిపేట గుత్తి కోయ గ్రామానికి చెందిన దూది కోసి అనే గర్భిణికి శుక్రవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఏఎన్ఎంకు సమాచారం అందించారు. అయితే ఈ గ్రా మం అటవీ ప్రాంతంలో ఉండటంతో వాహనాలు వెళ్లే వీలులేదు. దీంతో గ్రామస్తులు ఏఎన్ఎంతో కలిసి డోలీలో ఆమెను ఐదు కిలోమీటర్లు మోసుకొచ్చి 108 వద్దకు చేర్చారు. అక్కడి నుంచి కు క్కునూరు ఆస్పత్రిగా తరలించగా వైద్యులు సుఖ ప్రసవం చేయించారు. ఆడబిడ్డ పుట్టిందని, తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. -
పాఠ్య పుస్తకాల పంపిణీ
తాడేపల్లిగూడెం (టీఓసీ): పూర్వ పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వ పాఠ్య పుస్తకాల సేల్స్ డిపో నుంచి అన్నిరకాల పుస్తకాల పంపిణీని శుక్రవారం ప్రారంభించా రు. నాలుగు మండలాలకు పుస్తకాలను ఆర్టీసీ డిపో నుంచి బస్సుల్లో పంపిణీ చేస్తున్నారు. బుక్స్ డిపో మేనేజర్ టి.భాస్కరరావు, ఆర్టీసీ సూపర్వైజర్ డి.విజయకుమార్, కార్గో మేనేజర్ జి.మాధవరావు పాల్గొన్నారు. ప్రజలంతా జగన్ వెంటే.. భీమడోలు: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీకి ప్ర జలు బ్రహ్మరథం పలకడం వల్లే పోలింగ్ శా తం పెరిగిందని వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ముళ్లగిరి జాన్సన్ అన్నారు. భీమడోలులో శుక్రవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాయని, దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అధిక శాతం మహిళలు క్యూలైన్లలో నిలిచి వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఓట్లు వేసి ఆశీర్వదించారన్నారు. జగన్ రెండో సారి సీఎం కావడం ఖాయమన్నారు. ప్రజా స్వామ్యంలో అల్లర్లు సృష్టించి గెలవాలనుకోవడం జరగదన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓటర్లు వాసుబాబుకు మద్దతుగా ఓట్లు వేశారన్నారు. కూటమి నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు చేసి ఓటింగ్ శా తం తగ్గించాలని చూశారని ఆరోపించారు. ఉంగుటూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. చింతమనేని దుశ్చర్యలు నశించాలి పెదవేగి: దెందులూరు నియోజకవర్గంలో దళితులపై చింతమనేని చేస్తున్న దాడులు ఖండిస్తున్నట్టు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకురాలు శీలు మేరీపాల్ పద్మావతిదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్ర వారం ఆమె పెదవేగిలో మాట్లాడుతూ నియోజకవర్గంలోని పెదవేగిలో వైఎస్సార్సీపీ కార్యకర్తపై జరిగిన హింసాత్మక సంఘటనలో సీఐ, ఎస్సై సమక్షంలో ఉన్న నిందితుడిని పోలీస్స్టేషన్ నుంచి చింతమనేని దౌర్జన్యంగా బయట కు తీసుకువెళ్లడం ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటన్నారు. నిందితుడిని, చింతమనేనిని చట్టప్రకా రం శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. నేటి నుంచి ఉగాది నాటిక, నృత్యోత్సవాలు తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని బీవీఆర్ కళాకేంద్రంలో శనివారం నుంచి జాతీయ స్థా యి నాటిక పోటీలు, నృత్యోత్సవాలను నిర్వ హించనున్నట్టు బీవీఆర్ కళాకేంద్రం వ్యవస్థాపక అధ్యక్షుడు బుద్దాల వెంకట రామారావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మా ట్లాడుతూ సాంసృతిక శాఖ (న్యూఢిల్లీ) సహకారంతో నిర్వహించనున్నామన్నారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద పటిష్ట భద్రత
ఏలూరు(మెట్రో): సార్వత్రిక ఎన్నికల అనంతరం ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్రూమ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రతతోపాటు నిరంతర పర్యవేక్షణ ఏర్పాట్లు చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వె.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. శుక్రవారం ఏలూరు సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్లను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. స్ట్రాంగ్రూమ్ల వద్ద భద్రతా చర్యలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్రూమ్ భద్రతా చర్యలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే ఖాజావలి, పోలీస్ అధికారులతో సమీక్షిస్తూ పలు సూచనలు చేశారు. సీఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీ ఎంలు భద్రపరచిన ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం, మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల స్ట్రాంగ్రూమ్లను పరిశీలించారు. ముందుగా స్ట్రాంగ్రూమ్లలో సీసీ కెమెరాలను పరిశీలించారు. స్ట్రాంగ్రూమ్ వద్దకు ఐడీ కార్డులు ఉన్న సిబ్బందిని మాత్రమే అనుమతించాలని స్పష్టం చేశారు. అనంతరం స్ట్రాంగ్రూమ్లో పోస్టల్ బ్యాలెట్లు భద్రపరచిన తీరును సమీక్షించారు. స్ట్రాంగ్రూమ్ల ఆవరణలో పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్.వెంకటకృష్ణను కలెక్టర్ ఆదేశించారు. మూడంచెల భధ్రత : జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను కౌంటింగ్ కేంద్రంలో ఉంచి మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మొదటి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు, రెండో అంచెలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు, మూడో అంచెలో స్థానిక పోలీసులు 24 గంటల పాటు రక్షణగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల అధికారితో సమీక్ష రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా శుక్రవారం కౌంటింగ్ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించ గా ఏలూరు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి పాల్గొన్నారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ -
కొత్తపేట మురుగుకాలువ శుభ్రం
ఏలూరు టౌన్ : ఏలూరు టూటౌన్ ప్రాంతంలోని 43వ డివిజన్ కొత్తపేట ప్రాంతం మురుగుకాలువలో భారీగా చెత్త, వ్యర్థాలు పేరుకుపోయి స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ.. ‘సాక్షి’లో డ్రెయిన్లలో పేరుకుపోయిన చెత్త శీర్షికన ప్రచురించిన వార్తకు ఏలూరు నగరపాలక సంస్థ అధికారులు స్పందించారు. నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఆదేశాలతో శానిటేషన్ సిబ్బంది వెంటనే కాలువలో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను, చెత్తను తొలగించడంతో మురుగునీరు సాఫీగా సాగడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. ఎఫెక్ట్ -
ఈవీఎం బాక్సుల భద్రతపై అప్రమత్తం
ఏలూరు టౌన్: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ వర కూ ఈవీఎం బాక్సులకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని ఏలూరు జిల్లా ఎస్పీ డీ.మేరీ ప్రశాంతి తెలిపారు. ఏలూరు సీఆర్ఆర్ కళాశాలలోని స్ట్రాంగ్రూమ్ను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో ఎంపీ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎం బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్ను పరిశీలించారు. భద్రతా ఏ ర్పాట్లను, ఉద్యోగుల విధులకు సంబంధించి ఆరా తీశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దనీ, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సీసీ కె మెరాల పనితీరును నిత్యం పరిశీలించాలన్నారు. ఏఆర్ అదనపు ఎస్పీ ఎన్ఎస్ఎస్ శేఖర్, ఏఆర్ డీఎస్పీ హరిరావు, ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, ఏలూరు త్రీటౌన్ ఇన్చార్జి సీఐ శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు ఆమె వెంట ఉన్నారు. అసాంఘిక శక్తులపై గట్టి నిఘా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే సహించేది లేదనీ, అసాంఘిక శక్తులపై నిఘా మరింత పెంచా లనీ, అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డి.మేరీ ప్రశాంతి హెచ్చరించారు. ఏలూరు టూ టౌన్ పోలీస్స్టేషన్ను శుక్రవారం ఆమె తనిఖీ చేసి అధికారులతో సమీక్షించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తు చర్యల్లో భాగంగా పోలీస్ పికెట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. గతంలో అల్లర్లకు పాల్పడినవారు, క్రిమినల్ కేసుల్లో నిందితులు, రౌడీషీటర్లను గుర్తించి ముందస్తుగా బైండోవర్ చేయించాలని ఆదేశించారు. ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించబోమన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో మరింత నిఘా, పోలీస్ గస్తీని పెంచాలని చెప్పారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు సృష్టించినా, ప్రజా జీవనానికి అడ్డంకులు కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు భయపడాల్సిన పనిలేదనీ, నగరంలో పటిష్ట పోలీస్ బందో బస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. సమీక్షలో ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, ఏలూరు టూటౌన్ ఎస్సైలు మదీనాబాషా, సాధిక్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఘనంగా అతిరాత్ర మహాయాగం భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణంలోని డీఎన్నార్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న అతిరాత్ర మహాయాగంలో భాగంగా మూడోరోజు 96 మంది రుత్వికుల వేదగోష్టితో ప్రాంగణమంతా మా ర్మోగింది. యాగాన్ని తిలకించేందుకు వేలాది మంది తరలివచ్చారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, అశ్వ పరిణయనం ప్రదక్షిణం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. -
ఈఏపీసెట్కు 906 మంది..
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీ ఈఏపీసెట్–24 పరీక్షలకు శుక్రవారం జిల్లాలో 906 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం షిఫ్టులో ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్ కాలేజ్లో 180 మందికి 173 మంది, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో 140 మందికి 130 మంది, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 160 మందికి 153 మంది హాజరయ్యారు. మొత్తంగా ఉదయం సెషన్లో 480 మందికి 456 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం షిఫ్టులో సిద్ధార్థ క్వెస్ట్ కాలేజీలో 184 మందికి 172 మంది, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో 140 మందికి 128 మంది, ఏలూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 160 మందికి 150 మంది హాజరయ్యారు. మొత్తంగా మధ్యాహ్నం సెషన్లో 484 మందికి 450 మంది హాజరయ్యారు. -
ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం
ఏలూరు(మెట్రో): రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విత్తు నుంచి పంట విక్రయాల వరకు అన్నదాతలకు అండగా నిలుస్తోంది. దళారుల బెడద లేకుండా ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేసి నిర్ణీత సమయంలోపు రైతుల ఖాతాలకు సొమ్ములు జమచేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా జగనన్న సర్కారు రైతుల కళ్లాల వద్దకే వెళ్లి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులకు పూర్తిస్థాయిలో సేవలందిస్తున్నారు. 2.40 లక్షల టన్నుల లక్ష్యం జిల్లాలో రబీ సీజన్కు సంబంధించి 2.40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా అదికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటివరకు 2,16,740 టన్నుల ధాన్యాన్ని ఆన్లైన్లో నమోదు చేసి 1,98,120 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ ధాన్యాన్ని అనుసంధానం చేసిన రైస్ మిల్లులకు ర్యాండమ్ సెలెక్షన్ ద్వారా తరలిస్తున్నారు. సేకరించిన ధాన్యానికి సంబంధించి రైతుల ఖాతాలకు రూ.225.67 కోట్లను జమచేశారు. ప్రభుత్వం మద్దతు ధరలకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. క్వింటాల్ గ్రేడ్ ఏ రకానికి రూ.2,203, కామన్ రకానికి రూ.2,183 చొప్పున అందిస్తోంది. ఇబ్బందులకు చెక్ పెట్టేలా.. గతంలో మిల్లర్లు, దళారుల నుంచి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వీటన్నింటికీ చెక్ పెట్టేలా ప్రభుత్వమే నేరుగా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకుంది. ఈ ప్రక్రియలో ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా ర్యాండమైజేషన్ ద్వారా ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లులకు అధికారులు తరలిస్తున్నారు. తద్వారా రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. వ్యవసాయ శాఖ అప్రమత్తం : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రైతులు మాసూళ్లు చేసిన ధాన్యానికి ఇబ్బందులు కలగకుండా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రైతులను అప్రమత్తం చేసి కళ్లాల్లోని ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంది. ముందుగా ధాన్యం మాసూళ్లు చేసిన రైతులను గుర్తించి వారి వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఎప్పటికప్పుడు సివిల్ సప్లయీస్ అధికారులతో సమన్వయం చేసుకుని రైతుల వద్ద నుంచి కొనుగోళ్లను వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంది. జిల్లాలో 79,954 ఎకరాల్లో వరి సాగు చేయగా 74,280 ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. 93 శాతం కోతలు పూర్తికావడంతో వర్షాలతో రైతులకు ఇబ్బందులు లేవని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక అధికారుల నియామకం జిల్లాలో వర్ష సూచనల కారణంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు మండలాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించినట్టు జా యింట్ కలెక్టర్ బి.లావణ్య వేణి తెలిపారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రైతులు జాగ్రత్తలు తీసుకొని ధాన్యం భద్రపరచుకుని నష్టం కలగకుండా చూసుకోవాలన్నారు. అవసరమైతే సమీపంలోని రైతు భరోసా కేంద్రంలో సిబ్బందిని సంప్రదించాలని ఆమె సూచించారు. వేగంగా నిధుల జమ 1.98 లక్షల టన్నుల ధాన్యం సేకరణ రూ.225 కోట్ల ధాన్యం సొమ్ముల చెల్లింపు మద్దతు ధరలు (క్వింటాల్) గ్రేడ్ ఏ రకం రూ. 2,203 కామన్ రకం రూ. 2,183 రబీ ధాన్యం వివరాలు కొనుగోలు లక్ష్యం 2.40 లక్షల టన్నులు ఇప్పటివరకు నమోదు చేసింది 2,16,740 టన్నులు ప్రభుత్వం సేకరించిన ధాన్యం 1,98,120 టన్నులు రైతుల ఖాతాలకు సొమ్ముల జమ రూ.225. 67 కోట్లు -
జూన్ 14 వరకు వేసవి శిక్షణ శిబిరాలు
ఏలూరు రూరల్ ః ఏలూరు జిల్లాలో జూన్ 14 వరకూ వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నామని జిల్లా క్రీడా అభివృద్ధి అఽధికారి బి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో పుట్బాల్ క్రీడకు కోచ్ ఎండి సిరాజుద్దీన్, ఇండోర్ స్టేడియంలో వెయింట్లిఫ్టింగ్ శిక్షణకు ఎం.రమేష్, హ్యాండ్బాల్ ఆర్.మోహన్ రవికుమార్, సీఆర్ఆర్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో టేబుల్ టెన్నిస్కు జి.వెంకట్ శేఖర్, బీజీటీఓ స్కూల్ ఆవరణలో వెయిట్ లిఫ్టింగ్ టి.సీతాభవాని, భిశ్వనాఽథ్ భర్తియా స్విమ్మింగ్ పూల్లో బి.గణేష్, ఇండోర్ స్టేడియంలో స్కేటింగ్ షేక్ ఖాసిం, అల్లూరి సీతారామరాజు స్టేడియంలో వెయిట్ లిఫ్టింగ్కు బి.శ్రీను శిక్షణ అందిస్తారని వెల్లడించారు. పోలసానిపల్లి సోషల్ వెల్ఫేర్ స్కూల్లో శిక్షణ శిబిరం నిర్వహిస్తారని, ఆసక్తి గల బాలబాలికలు శిబిరంలో పాల్గొనాలని సూచించారు. మరింత సమాచారం కోసం 9866317326 నెంబర్కు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు. శశి ఇంజినీరింగ్ కళాశాలకు అదనపు సీట్లు తాడేపల్లిగూడెం : పట్టణంలోని శశి ఇంజనీరింగ్ కళాశాలకు అదనపు సీట్లు మంజూరు చేస్తూ ఏఐసీటీఇ నుంచి అనుమతి వచ్చినట్టు సంస్థ చైర్మన్ బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ శుక్రవారం తెలిపారు. 2024–25 సంవత్సరానికి కంప్యూటర్ సైన్సు విభాగంలో ప్రస్తుతమున్న 180 సీట్లకు అదనంగా 60 సీట్లు, కంప్యూటర్ సైన్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, మిషన్ లెర్నింగ్ విభాగంలో ప్రస్తుతమున్న 120 సీట్లకు అదనంగా 60 సీట్లు మంజూరయ్యాయన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆటా వేడుకలకు కేవీఎస్ బృందం ఏలూరు (ఆర్ఆర్పేట): అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా) వేడుకలకు తమ బృందానికి ఆహ్వానం అందిందని నగరానికి చెందిన ప్రముఖ నాట్యాచార్యుడు, సినీ నృత్య దర్శకుడు కేవీ సత్యనారారణ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 7, 8, 9 తేదీల్లో అట్లాంటాలో జరిగే వేడుకల్లో నృత్య కళాకారులతో గోదా కళ్యాణం కూచిపూడి నృత్యరూపకాన్ని ప్రదర్శిస్తామన్నారు. అమెరికాలో వేసవి కూచిపూడి శిక్షణ తరగతులు ప్రారంభించి 35 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కొన్ని సంస్థలు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయన్నారు. నేడు ప్రవీణ్ ప్రకాశ్ పర్యటన ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ శనివారం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లాలోని భీమడోలు, ఉంగుటూరు మండలాల్లో, పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, తణుకులో వివిధ పాఠశాలలను సందర్శించనున్నారు. పాఠ్యపుస్తకాల వివరాలను స్టాక్పాయింట్లో పరిశీలిస్తారు. గత విద్యా సంవత్సరంలో విద్యార్థులకు పంపిణీ చేయగా మిగిలిన పాఠ్యపుస్తకాల వివరాలు, జగనన్న విద్యాకానుకలో మిగిలిన వస్తువుల వివరాలు తెలుసుకుంటారు. పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మన బడి – నాడు నేడు పనుల ప్రగతి, ఐఎఫ్పీ ప్యానల్స్ పనితీరు, జగనన్న విద్యాకానుకకు కొత్త స్టాక్ వివరాలు, శానిటరీ న్యాప్కిన్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ బిళ్ళల పంపిణీ తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. -
చింతమనేని ప్రభాకర్పై కేసు నమోదు
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై కేసు నమోదైంది. అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, స్టేషన్లో దౌర్జన్యం చేయడంపై 224,225,353,143 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చింతమనేని గూండాగిరిహత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తను పెదవేగి పోలీస్స్టేషన్ నుంచి మాజీ ఎమ్మెల్యే, దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ బలవంతంగా తీసుకెళ్లడం వివాదాస్పదమైంది. వివరాలిలా ఉన్నాయి.. ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొప్పులవారిగూడెంలో ఈనెల 13న పోలింగ్ కేంద్రంలో గ్రామ ప్రెసిడెంట్ సంజీవరావు కుమారుడు చలపాటి రవిపై నిందితుడు తాళ్లూరి రాజశేఖర్ దాడి చేయగా.. పోలీసులు బుధవారం రాజశేఖర్ను పోలీస్స్టేషన్కు రమ్మని ఆదేశించారు.ఈ క్రమంలో గురువారం నిందితుడు తాళ్లూరి రాజశేఖర్ అతడి తండ్రి డేవిడ్ గురువారం ఉదయం 8:30 సమయంలో పెదవేగి పోలీస్స్టేషన్కు వచ్చారు. పోలీసులు అతడిపై 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని రాజశేఖర్ టీడీపీ కార్యకర్తల ద్వారా చింతమనేనికి తెలియజేశాడు. దీంతో చింతమనేని తన అనుచరులతో కలిసి స్టేషన్కు వచ్చి సీఐ, ఎస్ఐలపై తిరగబడి దౌర్జన్యంగా రాజశేఖర్ను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. -
చదువులు సాఫీగా..
జగనన్న వసతి దీవెన, విద్యా దీవెనల పథకాలు మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా కాలేజీ ఫీజులు చెల్లించేందుకు ఇబ్బందులు ఉండటం లేదు. దీంతో చదువులు సాఫీగా సాగుతున్నాయి. మాలాంటి మధ్యతరగతి విద్యార్థుల చదువులు తల్లిదండ్రులకు భారం కావడం లేదు. ప్రభుత్వ సాయం మరువలేం. – సీహెచ్ రసజ్ఞ, ఇంజనీరింగ్ విద్యార్థిని, ఏలూరు ప్రభుత్వ సహకారంతో.. ప్రభుత్వ సహకారంతో ఇంజినీరింగ్ సాఫీగా సాగుతోంది. పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం అందిస్తుండటంతో మా కుటుంబానికి ఎలాంటి సమస్య తలెత్తడం లేదు. ఇదంతా జగనన్న ప్రవేశపెట్టిన విద్యా, వసతి దీవెనలతోనే సాధ్యమైంది. సీఎం జగన్కు రుణపడి ఉంటాం. – తామరపల్లి మోహన చంద్రిక, ఇంజనీరింగ్ విద్యార్థిని, ఏలూరు చాలా మేలు జగనన్న వసతి దీవెన, విద్యా దీవెనల పథకాలు మాకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా కాలేజీ ఫీజులు చెల్లించేందుకు ఇబ్బందులు లేవు. దీంతో మా చదువులు సాఫీగా సాగుతున్నాయి. మాలాంటి పేద విద్యార్ధుల చదువులు తల్లిదండ్రులకు భారం కాకుండా ఉంది. సీఎం జగనన్నకు కృతజ్ఞతలు. – కె.అరవింద్, ఇంజనీరింగ్ విద్యార్థి, ఏలూరు నా కల సాకారం ఇంజనీర్ కావాలనే నా కల నెరవేరింది. ఇంజనీరింగ్ చదువుకు పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం అందిస్తుండటంతో మా కుటుంబానికి చాలా మేలు జరుగుతుంది. నా చదువు సైతం సాఫీగా సాగిపోతుంది. ఇదంతా జగనన్న ప్రవేశపెట్టిన విద్యా, వసతి దీవెన పథకాలతోనే సాధ్యమైంది. – ఎన్.మాధవ్, ఇంజనీరింగ్ విద్యార్థి, ఏలూరు ● -
పోలింగ్ నిర్వహణపై అభినందనలు
ఏలూరు(మెట్రో): జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా, సక్రమంగా విజయవంతం చేసినందుకు రిటర్నింగ్ అ ధికారులందరినీ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అభినందించారు. జిల్లాలో పోస్టల్ బ్యాలెట్తో కలిపి 84.82 శాతం పోలింగ్ నమోదైందన్నారు. ఇది 2019 ఎన్నికల కంటే ఎక్కువని, ఈరోల్ రివిజన్, స్వీప్ కార్యకలాపాలను చేపట్టిన అధికారులను అభినందించారు. తనకు సహాయ రిటర్నింగ్ అధికారిగా సమర్థంగా జిల్లా రెవెన్యూ అధికారి డి.పుష్పమణి సేవలందించారన్నారు. అలాగే కలెక్టరేట్ పరిపాలన అధికారి కె.కాశీ విశ్వేశ్వరరావు, ఎన్నికల సెల్ డిప్యూటీ తహసీల్దార్లు, సిబ్బందిని కూడా కలెక్టర్ అభినందించారు. మీడియా సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. కౌంటింగ్కు సిద్ధం కండి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు జిల్లాలోని రిటర్నింగ్ అధికారులంతా సన్నద్ధం కావాలని కలెక్టర్ ఆదేశించారు. పూర్తి భద్రత నడుమ లెక్కింపు ప్రక్రియ జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ -
24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
డీఆర్వో పుష్పమణి ఏలూరు(మెట్రో): జిల్లాలో ఇంటర్మీడియెట్, పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను పక్కా గా నిర్వహించాలని డీఆ ర్వో డి.పుష్పమణి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై ఆమె సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24 నుంచి వచ్చేనెల 1 వరకు జరుగుతాయని, ఫస్టియర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సెకండియర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారన్నారు. జిల్లాలో 27 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, మొత్తం 12,797 మంది విద్యార్థులు హాజరుకానున్నారని చెప్పారు. ఫస్టియర్ విద్యార్థులు 8,664 మంది, సెకండియర్ విద్యార్థులు 4,133 మంది హాజరుకానున్నట్లు తెలిపారు. జూన్ 6న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, 7న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలను 124 కేంద్రాల్లో నిర్వహిస్తామన్నారు. టెన్త్లో 11,533 మంది.. పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24 నుంచి వచ్చేనెల 3 వరకు నిర్వహిస్తారని డీఆర్వో తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, 11,533 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. వీరిలో బాలురు 6,970 మంది, బాలికలు 4,563 మంది ఉన్నారని, జిల్లాలో 50 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయాలని, విద్యార్థులు గంట ముందుగా కేంద్రాలకు చేరు కోవాలని అన్నారు. కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లుపరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేయాలని డీఆర్వో పుష్పమణి అధికారులను ఆదేశించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. సంబంధిత మండల విద్యాశాఖ అధికారులను సమన్వయం చేసి ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా సమయాలకు అనుగుణంగా కేంద్రాల వద్దకు బస్సులు నడపాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను వెంటనే ఏర్పాటుచేయాలని ఆదేశించారు. కేంద్రాలకు సమీపంలోని కంప్యూటర్ సెంటర్లు, జెరాక్స్ షాపులను మూసివేయించాల న్నారు. డీవీఈఓ, కన్వీనర్ డీఈసీ బి.ప్రభాకరరా వు, డీఈఓ అబ్రహం, ఎంహెచ్ఓ మాలతి, పోలీసు, విద్యుత్, మెడికల్ అధికారులు, ఆర్టీసీ, పోస్టల్, హెల్త్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఉన్నత చదువులకు దీవెనలు
నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం భీమవరం: ద్వారకాతిరుమల శ్రీవారి నిత్యాన్న దాన ట్రస్టుకు పురిఘళ్ల రఘురామ్, అరుణ దంపతులు (పాలకోడేరు మండలం విస్సాకోడేరు) రూ.లక్ష విరాళంగా అందజేశారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి సూరప్పగూడెంలో జాతీయ రహదారిపై బైక్ను మరో బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. 8లో uశురకవారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2024ఏలూరు (టూటౌన్): పేద విద్యార్థుల ఉన్నత చదువులకు జగన్ సర్కారు భరోసా కల్పిస్తోంది. వైఎ స్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యా, వసతి దీవెనలు అక్కరకు వస్తున్నాయి. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, డిప్లమో వంటి కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, అగ్రవర్ణ పేద విద్యార్థుల చదువులకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ను జగనన్న విద్యా దీవెన పథకం కింద అందిస్తోంది. దీనికి తోడు జగనన్న వసతి దీవెన పేరుతో రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ఆర్థిక సాయం అందిస్తోంది. ఇలా ఐదేళ్లుగా లక్షలా ది మంది విద్యార్థులకు ప్రభుత్వ ప్రయోజనం చేకూరింది. ఏలూరు జిల్లాలో జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా 1,75,118 మందికి రూ.450.77 కోట్లు, వసతి దీవెన పథకం ద్వారా 1,73,246 మందికి రూ.171.38 కోట్ల మేరకు లబ్ధి చేకూరింది. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో జగనన్న విద్యాదీవెన సొమ్ములు లబ్ధిదారుల ఖాతాలకు జమ కాకుండా ఆగిపోయాయి. తాజాగా ఈనెల 13న ఎన్నికల పోలింగ్ ముగియడంతో ప్రభుత్వం ఈనెల 15న జగనన్న విద్యాదీవెన నిధులను విడుదల చేసింది. మొత్తంగా రూ.622.15 కోట్లు ఏలూరు జిల్లాలో జగనన్న విద్యాదీవెన పథకం కింద ఐదేళ్లలో 1,75,118 మందికి రూ.450.77 కోట్ల ప్రయోజనం చేకూరింది. ఎన్నికలకు ముందు నిధులు విడుదల చేసినా కోడ్ అమలులోకి రావడంతో విద్యార్థుల ఖాతాలకు జమ కాలేదు. ఆ నిధులను ఈనెల 15న ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో విద్యార్థుల తల్లుల ఖాతాలకు నేరుగా సొమ్ము జమవుతున్నాయి. అలాగే జిల్లాలో జగనన్న వసతి దీవెన పథకం కింద 1,73,246 మందికి రూ.171.38 కోట్ల మేరకు ప్రయోజనం చేకూరింది. 2023–24 విద్యా సంవత్సరంలో 30,250 మందికి రూ.28.42 కోట్ల ప్రయోజనం చేకూరింది. ఈ రెండు పథకాల ద్వారా పేద పిల్లల విద్యకు రూ.622.15 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. న్యూస్రీల్పేద విద్యార్థులకు భరోసా జగనన్న వసతి, విద్యా దీవెనలతో అండ ఐదేళ్లలో విద్యా దీవెన కింద రూ.450.77 కోట్ల లబ్ధి వసతి దీవెన కింద రూ.171.38 కోట్ల ప్రయోజనం పోలింగ్ ముగియడంతో పెండింగ్ బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వం సంవత్సరం జగనన్న విద్యాదీవెన జగనన్న వసతి దీవెన విద్యార్థులు లబ్ధి రూ.కోట్లలో విద్యార్థులు లబ్ధి రూ.కోట్లలో 2019–20 36,527 95.78 36,580 36.86 2020–21 37,148 77.97 37,750 35.76 2021–22 38,677 105.67 36,350 34.76 2022–23 33,655 81.53 32,316 30.96 2023–24 29,111 67,.35 30,250 28.42 1,75,118 450.77 1,73,246 171.38 -
బ్రహ్మోత్సవ వైభవం చూతము రారండి
ఉత్సవాలు ఇలా.. గరుడాళ్వార్ విగ్రహం ప్రత్యేక అలంకారాలు 18న శ్రీ భూసమేత మహావిష్ణువు 19న కాళీయమర్దనం 20న యోగ శ్రీనివాసుడు 21న రామ లక్ష్మణ సమేత హనుమాన్ 22న మోహిని 23న రాజమన్నార్ 24న మురళీకృష్ణ 25న శయన మహావిష్ణువు ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల వేంకటేశ్వర స్వామి (చిన వెంకన్న) క్షేత్రం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఈనెల 18 నుంచి 25 వరకు ద్వారకాతిరుమల దేవస్థానంలో శ్రీవారి వైశాఖ మాస తిరుకల్యాణోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఏటా క్షేత్రంలో రెండు సార్లు వైఖానస ఆగమోక్తంగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వైశాఖ మాస బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఉత్సవాలు జరిగే రోజుల్లో స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి ఉదయం, సాయంత్రం వేళల్లో పలు వాహనాలపై తిరువీధుల్లో విహరిస్తారు. అలాగే ఆలయ ముఖ మండపంలో శ్రీవారు రోజుకో విశేష అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణ వేదికపై ఉదయం నుంచి రాత్రి వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. శరవేగంగా ఏర్పాట్లు.. బ్రహ్మోత్సవాలకు సమయం దగ్గర పడటంతో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. స్వామివారి వాహనాలను ముస్తాబు చేయడం, ఆలయ పరిసరాల్లో తాటాకు పందిళ్లను నిర్మించడం, విద్యుద్దీప అలంకారాలు చేసే పనులు ఊపందుకున్నాయి. భారీగా తరలిరండి శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాల నిర్వహణకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఉత్సవాల్లో సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తాం. ఎనిమిది రోజులపాటు జరిగే ఉత్సవాలను వీక్షించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలి. 22న స్వామివారి కల్యాణం, 23న రథోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహిస్తాం. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 18 నుంచి 25 వరకు ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేశాం. భక్తులు గమనించాలి. – వేండ్ర త్రినాథరావు, శ్రీవారి దేవస్థానం ఈఓ ● ఈనెల 18న ఉదయం శ్రీవారిని పెండ్లి కుమారునిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా ముస్తాబు చేయడంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి గజవాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు. ● 19న రాత్రి 7 గంటల నుంచి అంకురార్పణ, రుత్విగ్వరణ అనంతరం బ్రహ్మోత్సవాల వీక్షణ కు సర్వాది దేవతలను ఆహ్వానించే క్రమంలో ధ్వజారోహణను నిర్వహిస్తారు. రాత్రి 9 గంటల నుంచి హంస వాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు. ● 20న ఉదయం 7 గంటల నుంచి సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7 గంటల నుంచి చంద్రప్రభ వాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు. ● 21న ఉదయం 7 గంటల నుంచి హనుమద్వాహనంపై గ్రామోత్సవం, రాత్రి 7 గంటల నుంచి బ్రహ్మోత్సవాల్లో ముఖ్య ఘట్టమైన ఎదుర్కో లు ఉత్సవం జరుగుతుంది. రాత్రి 8.30 గంటల నుంచి వెండి శేషవాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహిస్తారు. ● 22న రాత్రి 8 గంటల నుంచి శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుంది. అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం, ఉదయం 7 గంటల నుంచి సింహ వాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు. ● 23న రాత్రి 7.30 గంటల నుంచి క్షేత్ర పురవీధుల్లో రథోత్సవం నిర్వహిస్తారు. ● 24 న ఉదయం 10.30 గంటల నుంచి చక్రవారి అపభృధోత్సవం, మద్యాహ్నం 3 గంటల నుంచి వేద సభ, రాత్రి 7 గంటల నుంచి పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజావరోహణ, రాత్రి 8 గంటల నుంచి అశ్వవాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు. ● 25న ఉదయం 9 గంటల నుంచి చూర్ణోత్సవం, వసంతోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. రాత్రి 7 గంటల నుంచి ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్పయాగం, పవళింపుసేవ కార్యక్రమాలతో ఉత్సవాలు పరిసమాప్తం అవుతాయి. చినవెంకన్న క్షేత్రం ముస్తాబు రేపటి నుంచి చినవెంకన్న తిరుకల్యాణోత్సవాలు 22న రాత్రి తిరు కల్యాణం 23న రాత్రి రథోత్సవం -
ప్రశాంతంగా ఈఏపీసెట్
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీ ఈఏపీసెట్–24 పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఏలూరు జిల్లాకు సంబంధించి నగరంలోని మూడు కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. తొలిరోజు పరీక్షలకు 888 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల షిఫ్టులో ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్ కాలేజ్లో 180 మందికి గాను 162 మంది, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో 140 మందికి 133 మంది, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 160 మందికి 151 మంది హాజరయ్యారు. మొత్తంగా ఉదయం సెషన్లో 480 మందికి గాను 446 మంది హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల షిఫ్టులో సిద్ధార్థ క్వెస్ట్ కాలేజీలో 180 మందికి 170 మంది, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో 139 మందికి 128 మంది, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 159 మందికి 144 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో మొత్తం 478 మందికి 442 మంది హాజరయ్యారు. 1.97 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు ఏలూరు(మెట్రో): జిల్లాలో రబీ సీజన్ 2023–24కు సంబంధించి 2.40 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యానికి గాను ఇప్పటివరకు 1,97,129.920 టన్నుల ధాన్యాన్ని సేకరించినట్టు జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి గురువారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని రైతులు 2,15,957 టన్నుల ధాన్యాన్ని విక్రయించేందుకు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు నిమిత్తం రూ.423.76 కోట్లను చెల్లించాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.225.67 కోట్లను రైతుల ఖాతాలకు జమచేశామన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యాన్ని సిద్ధం చేసుకుంటే గోనె సంచులు, రవాణా వాహనాలను సమకూర్చి మద్దతు ధర క్వింటాల్ కామన్ రకం రూ.2,183, గ్రేడ్–ఎ రకానికి రూ.2,203కు బయోమెట్రిక్ విధానంలో కొనుగోలు చేస్తామని జేసీ తెలిపారు. బాస్కెట్బాల్ జట్టు ఎంపిక ఏలూరు రూరల్: ఏలూరు కస్తూరిబా బాలికల పాఠశాల ఆవరణలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాలికల యూత్ బాస్కెట్బాల్ జట్టును గురువారం ఎంపిక చేసినట్టు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అసోసియేషన్ కార్యదర్శి గవ్వ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. అసోసియేషన్ కోశాధికారి కె.మురళీకృష్ణ పర్యవేక్షణలో జరిగిన సెలెక్షన్స్లో ఏలూరుకు చెందిన ఆర్.రుత్విక, పి.జయశ్రీ, జి.పూజిత, పి.నందిని, ఎన్.రేణుక, ఎస్.సాయిభవానీ, డి.అమృత, బి.దేవీశ్రీ, జి.సరిత, కె.పూజిత, కొవ్వలికి చెందిన జి.యేసమ్మ, తాడేపల్లిగూడెంకు చెందిన ఎ.రియా జట్టులో స్థానం సంపాదించారు. అలాగే ఏలూరుకు చెందిన పి.లహరి, ఎంవీడీ భార్గవి, టి.పూజితను స్టాండ్ బై ప్లేయర్స్గా ఎంపిక చేశారు. ఈ జట్టు ఈనెల 21 నుంచి 24 వరకు విజయవాడలో జరిగే ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొంటుందని శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి వినతి ఏలూరు (ఆర్ఆర్పేట) జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డీఆర్వో డి.పుష్పమణికి వినతిపత్రం సమర్పించినట్లు పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు పువ్వుల ఆంజనేయులు ప్రకటనలో తెలిపారు. పీఓ, ఏపీఓ, ఓపీఓలుగా ఎన్నికల విధు లు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఈనెల 12,13 తేదీలతో పాటు 14న కూడా రెమ్యూనరేషన్ ఇవ్వాలని వినతిపత్రంలో కోరామన్నారు. వేసవి సెలవుల్లో ఎన్నికల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న తేదీలతో పాటు 12,13,14 తేదీలకు డ్యూటీ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారు. చాలా పోలింగ్ కేంద్రాల్లో 1,000 నుంచి 1,200 ఓట్లు కేటాయించారని, దీనివల్ల పోలింగ్ సి బ్బందిపై విపరీతమైన ఒత్తిడి పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్లో పోలింగ్ స్టేషన్లను పెంచాలని కోరామన్నారు. -
చింతమనేనిపై ఈసీకి ఫిర్యాదు చేస్తా
పెదవేగి : పోలీసుల ఆదుపులో ఉన్న నిందితుడిని దౌర్జన్యంగా బయటకు లాక్కెళ్లడంతో పాటు అడ్డువచ్చిన పోలీసులను దుర్భాషలాడిన టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్పై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్సీపీ సీనియర్ నేత కొఠారు రామచంద్రరావు అన్నారు. గురువారం పెదవేగి పోలీస్స్టేషన్ దగ్గర హత్యాయత్నం కేసులో నిందితుడు తాళ్లూరి రాజశేఖర్ను స్టేషన్ నుంచి తీసుకువెళ్లడంతో పాటు సీఐ కె.శ్రీనివాసకుమార్, ఎస్సై వి.రాజేంద్రప్రసాద్తో దురుసుగా ప్రవర్తించి, మీకు దమ్ముంటే నేను తీసుకెళ్తున్నా అరెస్ట్ చేసుకోండి.. ఏం పిక్కుంటారో.. పీక్కోండి అంటూ చింతమనేని పరారయ్యాడన్నారు. పోలీసుల అనుమతి లేకుండా, ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి పోలీస్స్టేషన్ నుంచి నిందితుడిని తీసుకువెళ్లిన చింతమనేని చాలా పెద్ద తప్పు చేశారని, దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని కొఠారు రామచంద్రరావు అన్నారు. -
ధాన్యం కొనుగోలులో ఉంగుటూరు ఫస్ట్
ఉంగుటూరు : ధాన్యం కొనుగోళ్లలో ఏలూరు జిల్లాలో ఉంగుటూరు మండలం ప్రథమస్థానంలో నిలిచింది. మండలంలోని ఆర్బీకేల ద్వారా ఇప్పటివరకు రైతుల నుంచి 66 వేల టన్నులు ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. గత రెండేళ్లుగా మండలంలో వరి దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. ఈ రబీ సీజన్లో మండలంలో ప్రధానంగా పీఆర్ 126, ఎస్ఎల్ 10, ఎంటీయూ 1121, అమ్మోరు వరి వండాలను రకాలను రైతులు ఎక్కువగా సాగు చేశారు. దీంతో లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో 66 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే క్వింటాల్కు ధర సూపర్ ఫైన్ రకం రూ.2,203, సాధారణ రకం రూ.2,183 చొప్పున ప్రభుత్వం మద్దతు ధర అందజేసిందని ఏఓ బాలిన వెంకటేష్ చెప్పారు. జిల్లాలో ధాన్యం ఎగుమతులు అత్యధికంగా ఉంగుటూరు మండలం నుంచే జరుగుతున్నాయని ఏఓ వివరించారు. రైతుల నుంచి 66 వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు -
కొల్లేరు చుట్టూనే రాజకీయం
కొల్లేరులో ఓట్లు సరళి ఇలా.. కై కలూరు నియోజకవర్గంలో కై కలూరు మండలంలో నత్తగుళ్లపాడు, చటాకాయి, శృంగవరప్పాడు, గుమ్మళ్ళపాడు, పందిరిపల్లిగూడెం, కొట్టాడ, పెంచికలమర్రు, మండవల్లి మండలంలో ఇంగిలిపాకలంక, పెనుమాకలంక, కొవ్వాడలంక, చింతపాడు, పులపర్రు వంటి కొల్లేరు గ్రామాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో రెండు మండలాల్లో కొల్లేరు గ్రామాల ఓట్లు 19,896 ఉండగా 17,995 పోలయ్యాయి. ప్రస్తుత 2024 సార్వత్రిక ఎన్నికల్లో కొల్లేరు గ్రామాల ఓట్లు 20,667 ఉండగా 18,154 ఓట్లు పోలయ్యాయి. దాదాపు 771 మంది ఓటర్లు పెరిగారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొల్లేరు సామాజికవర్గానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణకు ఎమ్మెల్సీ కేటాయించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థుల విజయానికి ఆయన ప్రచారం చేశారు. ఇక కై కలూరు మండలం చటాకాయి గ్రామంలో 2009 ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థి కామినేనికి కేవలం 2 ఓట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో కామినేనికి ఇదే గ్రామం నుంచి 826 ఓట్లు రాగా, వైఎస్సార్సీపీ అభ్యర్థి రాంప్రసాద్కు కేవలం 8 ఓట్లు వచ్చాయి. ఇక 2019 ఎన్నికల్లో ఇదే చటాకాయి గ్రామం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావుకు కేవలం 6 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ విధంగా కొల్లేరు గ్రామాల ఓటింగ్ సరళి ఉంటోంది. కై కలూరు: సార్వత్రిక ఎన్నికల్లో ఏలూరు జిల్లాలో కొల్లేరు గ్రామాల ఓట్లు కీలకంగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక్కడ పోటీల్లో ఉన్న అభ్యర్థుల జయాపజయాలపై లంక గ్రామాల ఓటర్లు ప్రభావం చూపనున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కొల్లేరు గ్రామాల్లో అందరికీ సంక్షేమ పథకాలు దక్కాయి. గ్రామాల్లో సచివాలయం, హెల్త్ క్లినిక్, ఆర్బీకే సెంటర్లను ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ ధరను రూ.1.50కి తగ్గించారు. రెగ్యులేటర్ల నిర్మాణానికి రూ.412 కోట్లను కేటాయించారు. వడ్డీల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. గతంలో ఇక్కడ టీడీపీ మండల ఇన్చార్జిగా ఉన్న జయమంగళ వెంకటరమణ వైఎస్సార్ సీపీలో చేరి ఎమ్మెల్సీ పదవిని చేపట్టగా, ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్)తో కలిసి కొల్లేరు గ్రామాల అభివృద్ధికి కృషి చేశారు. ఇవే కాకుండా ఎన్నికల ప్రచారంలో భాగంగా కై కలూరు ఇటీవల వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొల్లేరు సర్వే పూర్తి చేయడం జరిగిందని చెప్పారు. రికార్డులు వచ్చిన తర్వాత కొల్లేరులో మిగులు భూములను పేదలకు పంపిణీ చేస్తామన్నారు. భూముల పంపినీకి స్వయంగా తానే హాజరవుతానని హమీ ఇవ్వడంతో కొల్లేరు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొల్లేరు గ్రామాల ఓటర్లు ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ వైపు మొగ్గు చూపారని విశ్లేషకులు చెబుతున్నారు. పునర్విభజనలో ఒకే గూటికి కొల్లేరు జిల్లాల పునర్విభజనలో భాగంగా పూర్వ కృష్ణా జిల్లా నుంచి కై కలూరు నియోజకవర్గం చేరడంతో దాదాపు కొల్లేరు మొత్తం ఒకే గూటికి చేరింది. ఇంతవరకు పశ్చిమగోదావరిలో దెందులూరు, ఉండి, ఉంగుటూరు, పెదపాడు, ఏలూరు, నిడమర్రు, భీమడోలు, కృష్ణా జిల్లాలో కై కలూరు, మండవల్లి మండలాలు ఉండేవి. వీటిలో ఒక్క ఉండి మండలం మినహా మిగతావన్నీ ఏలూరు జిల్లాలో కలిపేశారు. దీంతో ఏలూరు పార్లమెంటు పరిధిలో కొల్లేరు గ్రామాల ఓట్లు కీలకంగా మారాయి. 122 గ్రామాల్లో 1.70 లక్షల మంది ఓటర్లు ఏలూరు జిల్లాలో 77,138 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. మొత్తం 122 కొల్లేరు పరివాహక గ్రామాల్లో 82 వేల కుటుంబాలకు చెందిన దాదాపు 3లక్షల 30 వేల మంది నివసిస్తున్నారు. కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో దాదాపు లక్షా 70 వేల మంది ఓటర్లు ఉన్నారు. కుల కట్టుబాట్లు పనిచేసేనా? కొల్లేరు గ్రామాల్లో పెద్దల కట్టుబాట్లు కనిపిస్తాయి. గత ఎన్నికలను పరిశీలిస్తే 2009లో టీడీపీ అభ్యర్థి జయమంగళ వెంకటరమణకు 11,857 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి యెర్నేని రాజారామచందర్కు 1,985 ఓట్లు మాత్రమే వచ్చాయి. తర్వాత 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్కు 10,582 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి వైఎస్సార్ సీపీకి చెందిన ఉప్పాల రాంప్రసాద్కు 4,673 ఓట్లు పడ్డాయి. ఇక 2019 ఎన్నికల్లో తిరిగి కొల్లేరు గ్రామాల సామాజికవర్గానికి చెందిన జయమంగళ వెంకటరమణకు టీడీపీ సీటు కేటాయించింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) 9,357 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ విధంగా కొల్లేరు ఓట్లు అభ్యర్థుల విజయంలో కీలకంగా మారుతున్నాయి. అభ్యర్థుల జయాపజయాల్లో కీలకం కానున్న లంక గ్రామాలు పెద్దల కట్టుబాట్లు పనిచేసేనా లంక గ్రామాల్లో పెరిగిన ఓట్లు ఎమ్మెల్సీ జయమంగళ కొల్లేరు గ్రామాల్లో విస్తృత ప్రచారం కొల్లేరు మిగులు భూములపై హామీ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్ -
యువకుడిపై దాడి.. ముగ్గురి అరెస్టు
ఏలూరు టౌన్: నగరంలోని కొత్తపేట గాడివారి వీధిలో ఓ యువకుడిపై దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఏలూరు టూటౌన్ సీఐ ప్రభాకర్ చెప్పారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తపేట గాడివారి వీధిలో చీపుల్ల గణేష్ అనే యువకుడితో లీలాసాయి, చిన్ని, అనిల్ అలియాస్ మచ్చ అనే ముగ్గురు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో గణేష్కు మెడపై గాయం కావటంతో ఇరువర్గాల వారు హాస్పిటల్ వద్దకు చేరటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధితులు కత్తితో దాడి చేశారంటూ హాస్పిటల్ వద్ద నిరసనకు దిగారు. దీనిపై వెంటనే స్పందించి హాస్పిటల్ వద్ద వన్టౌన్ సీఐ ఎన్.రాజశేఖర్, ఎస్ఐలు సాధిక్, భాషా, పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయటంతోపాటు, ఘటనా స్థలంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఇరు వర్గాల వారు ఎలాంటి గొడవలకు పాల్పడకుండా చర్యలు చేపట్టారు. గణేష్పై కత్తితో దాడి చేయలేదని, ఘర్షణలో అతని మెడపై గాయం అయ్యిందని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని సీఐ స్పష్టం చేశారు. నగరంలో అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
వైఎస్సార్ సీపీ విజయం నల్లేరుపై నడకే
భీమవరం: సార్వత్రిక ఎన్నికల్లో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రంధి శ్రీనివాస్ విజయం నల్లేరుపై నడకేనని, ఓటింగ్ సరళిని చూస్తుంటే శ్రీనివాస్ భారీ మెజార్టీతో విజయం సాఽధించడం ఖాయమని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటిమిల్లి మంగరాజు ధీమా వ్యక్తం చేశారు. బుధవారం భీమవరంలోని మాలమహానాడు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2019 ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పైనే శ్రీనివాస్ సునాయాసంగా విజయం సాధించారని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నో జిమ్మిక్కులు చేసి అబద్ధపు ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మకుండా స్వచ్ఛందంగా పోలింగ్ బూత్లకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారన్నారు. నాయకులు పొన్నమండ బాలకృష్ణ, సీహెచ్ గోపి, బి.సునీల్బాబు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో తాపీ కూలీ మృతి తణుకు: తణుకు పరిధిలోని జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం తీపర్రు గ్రామానికి చెందిన ఈతకోట అన్నవరం (41) తాపీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. పని నిమిత్తం మోటారు సైకిల్పై తణుకు వస్తుండగా జాతీయ రహదారిపై పాత బెల్లంమార్కెట్ సమీపంలో మోటారు సైకిల్ అదుపుతప్పి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అతనిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అన్నవరం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి నారాయణరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై కె.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇరువర్గాలపై కేసుల నమోదు భీమవరం అర్బన్: పాత గొడవల నేపథ్యంలో బుధవారం జరిగిన కొట్లాటపై ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై జి.రాజు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. కరుకువాడ బేతపూడి గ్రామానికి కొల్లి నాగసత్యవతి, భర్త శ్రీనివాస్ ఇద్దరు పిల్లలతో భీమవరంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ నెల 13 ఎన్నికలకు ఓట్లు వేయడానికి తన సొంత గ్రామానికి వచ్చింది. ఈ నెల 14న నాగసత్యవతికి అన్నయ్య రావుల ఆదినారాయణ, మేనత్తకు బంగారం విషయమై మళ్లీ ఇరువర్గాలు కొట్లాడుకున్నాయి. గాయాలపాలైన ఇరు వర్గాలవారు పరస్పరం ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
జాతీయ నైపుణ్య పోటీలకు ఐటీఐ విద్యార్థి
ఏలూరు (ఆర్ఆర్పేట): వట్లూరులోని ప్రభుత్వ ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ విద్యార్థి కాట్రు సిద్ధు త్వరలో జాతీయ స్థాయిలో జరుగనున్న నైపుణ్య పోటీలకు ఎంపికయ్యాడని ప్రిన్సిపాల్ పి.రజిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 7, 8 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన నైపుణ్య పోటీల్లో విజేతగా నిలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు. ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు న్యూఢిల్లీలోని యశోభూమి ఎక్స్పో సెంటర్లో జరిగే జాతీయ నైపుణ్య పోటీల్లో సిద్ధు పాల్గొననున్నట్లు వివరించారు. -
స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడంచెల భద్రత
ఏలూరు టౌన్: ఎన్నికల పోలింగ్ అనంతరం ఈవీఎంలను ఏలూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో భద్రపరిచామనీ, జిల్లాకు సంబంధించి ఏలూరు ఎంపీ, 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఈ వీఎం బాక్సులను భద్రపరిచి మూడంచెల ప టిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతి తెలిపారు. బుధవారం ఈవీఎం స్ట్రాంగ్రూమ్లను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశా రు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఉద్యోగులు తమ విధి నిర్వహణలో ఏ విధంగా ఉన్నారనే దానిని పరిశీలించామన్నా రు. ఉద్యోగులు అలసత్వం లేకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ల వ ద్ద ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల పనితీరుపై అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేశామన్నారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జూన్ 4న నిర్వహిస్తారనీ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సాయుధ బలగాల పహారాలో ఈవీఎం బాక్సులు భద్రంగా ఉంటాయన్నారు. తనిఖీల్లో డీటీసీ డీఎస్పీ కె.ప్రభాకర్రావు, ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, త్రీ టౌన్ ఇన్చార్జి సీఐ కె.శ్రీనివాసరావు, సీసీఎస్ సీఐ సీహెచ్ మురళీకృష్ణ, అధికారులు ఉన్నారు. -
నేటి నుంచి ఏపీఈఏపీ సెట్
16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ, 18 నుంచి 23వ తేదీ వరకూ ఇంజనీరింగ్ టెస్ట్ ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చరల్ కళాశాలల్లో ఆయా కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించే ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఈఏపీ సెట్) గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రన్స్ టెస్ట్, ఈనెల 18 నుంచి 23వ తేదీ వరకూ ఇంజనీరింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఏలూరు జిల్లాలో మూడు కేంద్రాలు ఏర్పాటుచేశారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, తిరిగి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగనున్నాయి. ఏలూరు సీఆర్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం సెషన్లో 160 మంది, మధ్యాహ్నం సెషన్లో 160 మంది, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 140 మంది, మధ్యాహ్నం 140 మంది, ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్లో ఉదయం 180, మధ్యాహ్నం 180 మంది చొప్పున విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం సెషన్కు సంబంధించి ఉదయం 7.30 గంటల నుంచి, మధ్యాహ్నం సెషన్కు సంబంధించి మధ్యాహ్నం 1 గంట నుంచి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోనికి అనుమతించరు. విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన కాపీతో పాటు అడ్మిట్ కార్డు, ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును వెంట తీసుకురావాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు మీద ఒక ఫొటో అంటించి, మరో ఫొటో విడిగా తీసుకురావాలి. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వాచ్లు, కాలిక్యులేటర్లను కేంద్రంలోనికి అనుమతించరు. విద్యార్థులు సాధారణ దుస్తులే ధరించి కేంద్రానికి చేరుకోవాలి, తమ వెంట తాగునీటి కోసం పారదర్శక బాటిళ్లను మాత్రమే తీసుకురావాలి.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement