నల్లబెల్లి : మండల కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యే కండువాలు కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ గెలుపు కోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, నల్లబెల్లి అధ్యక్షుడు బత్తిని మహేశ్, నాయకులు మర్రి రాజు, మాసంపల్లి అఖిల్, మేకల మోహన్, సిద్ధు, పవన్ పాల్గొన్నారు.
వసంతాపూర్లో..
గీసుకొండ : గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్ వసంతాపురంలో పలువురు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు గుండెకారి రవి ఆధ్వర్యంలో గుండెకారి మల్లేశం, ఆవునూరి కుమారస్వామి, నాంపల్లి రాజు, కడిదెల మధు, కుమారస్వామి, సందీప్తో పాటు పలువురు పార్టీలో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగపురం రాజేశ్, మాటేటి రమేశ్, చెన్నూరి సతీష్ పాల్గొన్నారు.