-
ప్రజల విశ్వాసం కోల్పోయిన రేవంత్ సర్కార్
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరకాల: ఆర్నెళ్లలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న రేవంత్రెడ్డి సర్కార్ ఎక్కువ కాలం కొనసాగే పరిస్థితి కనపించడం లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ జోస్యం చెప్పారు. పరకాల శివారులోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యావంతుల సమస్యలపై పోరాడే సత్తాగల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న బ్లాక్మెయిల్ రాజకీయాలతో తెలంగాణ ప్రజలను, యువకులను మోసం చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. తెలంగాణలో ఉద్యోగులకు, నిరుద్యోగులకు, రైతులకు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కేసీఆర్ సర్కార్ కృషి చేసిందన్నారు. తెలంగాణ ఉద్యమకారుడిగా, నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాడే బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, రామగుండం మాజీ ఎమ్మెల్యే చందర్, నాయకులు చింతిరెడ్డి మదుసూధన్రెడ్డి, దురిశెట్టి చంద్రమౌళి, మేడిపల్లి శోభన్బాబు, దుంపేటి నాగరాజు, ఏకు చిరంజీవి, వీరేశ్, సనత్, హమీద్, జలాలొద్దీన్, ఘంట కళావతి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ గింజ కొంటాం.. అధైర్యపడొద్దు
శాయంపేట: ఇటీవల కురిసిన వర్షాలతో ధాన్యం తడిచి తేమ శాతం పెరిగిందని, రైతు పండించిన ప్రతీ గింజను కొంటామని, రైతులు అధైర్య పడొద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మండలంలోని ప్రగతి సింగారం, వసంతాపూర్ గ్రామాల్లో ఓడీసీఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించి అక్కడున్న రైతులతో మాట్లాడారు. 15 రోజులుగా ధాన్యాన్ని కేంద్రానికి తీసుకురాగా.. వర్షాలతో తడిచిపోయిందని తేమ పేరుతో కొనుగోలు చేయడం లేదని రైతు పెంట రజనీకాంత్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కాంటాలు పెట్టిన ధాన్యానికి టార్ఫాలిన్లు అందజేస్తున్నారని కాంటాలు కాని ధాన్యానికి టార్పాలిన్ కవర్లు ఇవ్వడంలేదని రైతులు కలెక్టర్ ఎదుట వాపోయారు. స్పందించిన కలెక్టర్ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయిన సెంటర్లలోని టార్పాలిన్ కవర్లను ఇక్కడి రైతులకు అందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో ప్రభుత్వ స్థలం ఉందని, గోదాం కట్టిస్తే చుట్టు పక్కల రైతులకు అనుకూలంగా ఉంటుందని రైతులు విన్నవించారు. స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ గోడౌన్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. పెండింగ్లో 15శాతం కొనుగోళ్లు హనుమకొండ జిల్లా వ్యాప్తంగా 160 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 70వేల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేశామని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. పరకాల డివిజన్లోనే ఇంకా.. 15 శాతం ధాన్యం కొనుగోళ్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. జూన్ మొదటి వారం వరకు ధాన్యాన్ని కొంటామన్నారు. అనంతరం పత్తిపాకలోని మహిళా స్వశక్తి గ్రూపు మహిళా సభ్యులు కుడుతున్న స్కూల్ యూనిఫామ్లను కలెక్టర్ పరిశీలించారు. ఆమె వెంట డీసీఓ నాగేశ్వర్రావు, సివిల్ సప్లై డీటీ సత్యనారాయణ, నోడల్ ఆఫీసర్ విజయభాస్కర్రెడ్డి, డీఆర్డీఏ ఏపీడీ సుధీర్కుమార్, ఏఓ గంగాజమున, తహసీల్దార్ సుభాషిని, ఎంపీడీఓ ఫణిచంద్ర, ఏపీఎం శ్రీధర్రెడ్డి, ఏఈఓ రజా పాల్గొన్నారు. జిల్లాలో 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కలెక్టర్ సిక్తా పట్నాయక్ -
హామీలను తుంగలో తొక్కిన ప్రభుత్వం
పర్వతగిరి/రాయపర్తి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు. పర్వతగిరి, రాయపర్తి మండల కేంద్రాల్లో శనివారం జరిగిన పట్టభద్రులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఆస్పత్రుల్లో సెల్ఫోన్ లైట్లతో ఆపరేషన్లు చేసే దుస్థితికి తీసుకొచ్చారని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని కోరారు. పర్వతగిరిలో జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎంపీపీ లూనావత్ కమలపంతులు, మాజీ జెడ్పీటీసీ మేడిశెట్టి రాములు, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్రావు, సొసైటీ చైర్మన్ మోటపోతుల మనోజ్కుమార్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ బోయినపల్లి యుగంధర్రావు, నాయకులు ఎడుదొడ్ల జితేందర్రెడ్డి, చిన్నపాక శ్రీనివాస్, రాయపర్తిలో జరిగిన సమావేశంలో మండల ఎన్నికల ఇన్చార్జ్ గుడిపూడి గోపాల్రావు, పార్టీ మండల అధ్యక్షుడు మూనావత్ నర్సింహానాయక్, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్గౌడ్, జిల్లా నాయకుడు బిల్లా సుధీర్రెడ్డి, ఆకుల సురేందర్రావు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు -
చట్ట సభల గౌరవం పెంచే వారినే ఎన్నుకోవాలి
● బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్రెడ్డి హన్మకొండ: చట్టసభల గౌరవం పెంచే వ్యక్తిని శాసన మండలికి ఎన్నుకోవాలని నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాకేశ్రెడ్డి మాట్లాడుతూ.. మాయగాళ్లు, మోసగాళ్లు చట్ట సభలో ఉండకూడదని, బెదిరించే అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిస్తే విద్యా సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలను, వ్యాపారవేత్తలను ఏం చేస్తారో ఆలోచించాలన్నారు. ప్రభుత్వానికి వత్తాసు పలికే వారిని కాకుండా ప్రభుత్వాన్ని నిలదీసే తనను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలన్నారు. తాను రైతు బిడ్డనని, కష్టాలు, సమస్యలు ఎలా ఉంటాయో తనకు తెలుసన్నారు. అధికారం కోసం కాదు ఆశయం కోసం పని చేస్తానన్నారు. జీఓ 46 రద్దుకు మడమ తిప్పని పోరాటం చేస్తానన్నారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ.. ఓటర్ల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. -
12 గుర్తింపు కార్డులతో ఓటు వేయొచ్చు..
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య కాళోజీ సెంటర్ : ఎమ్మెల్సీ ఉపఎన్నికకు పట్టభద్రులు 12 రకాల గుర్తింపు కార్డులతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డులేని వారు ఆధార్కార్డు, ఉపాధిహామీ జాబ్కార్డు, బ్యాంకు, పోస్టాఫీస్ పాస్పుస్తకాలు, కార్మిక మంత్రిత్వశాఖ జారీ చేసిన ఆరోగ్యబీమా స్మార్ట్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు, పెన్షన్ డాక్యుమెంట్, ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసిన గుర్తింపు కార్డులు, ప్రత్యేక వైకల్యం తదితర గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకదానితో ఓటు వేయవచ్చని తెలిపారు. జిల్లాలోని పట్టభద్రుల ఓటర్లు సోమవారం సమయం కేటాయించి ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. 27న ప్రత్యేక క్యాజువల్ లీవ్ పట్టుభద్రుల ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈనెల 27న ప్రత్యేక క్యాజువల్ లీవ్ను ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య ప్రకటించారు. ఓటుహక్కు ఉన్న ప్రైవేట్ సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థల్లో పనిచేసే పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా యాజమాన్యాలు వెసులుబాటు కల్పించాలని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలు ఉన్న విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఈనెల 26, 27న పెయిడ్ హాలిడేగా పరిగణించాలని తెలిపారు. -
భూకబ్జాలపై ఉక్కుపాదం
● అమెరికా నుంచి విడుదల చేసిన వీడియోలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి గీసుకొండ: పరకాల ని యోజకవర్గంలో భూకబ్జాలకు ఎవరు పాల్పడినా ఉక్కుపాదం మోపుతామ ని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. ఎంపీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వా త ఈ నెల 13న సాయంత్రం ఆయన తన కుటుంబ సభ్యులతో గడపడానికి అమెరికా వెళ్లారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఆయన రెండు వీడియోలను అమెరికా నుంచి విడుదల చేశారు. అందులో ఒక దాంట్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. భూకబ్జాల విషయంలో విడుదల చేసిన వీడియో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వ్యాపారులు, కాంట్రాక్టర్లను బెదిరించడం, అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడనని హెచ్చరించారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామని ఆయన పిలుపునిచ్చిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఎమ్మెల్యే ఎవరిని ఉద్దేశించి హెచ్చరించారనే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పాలనలో గీసుకొండ రెవెన్యూ మండల పరిధిలో జోరుగా భూ ఆక్రమణలు జరిగాయని అనేక ఫిర్యాదులు రావడంతో ఆయన ఇలా ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది. -
రశీదులు తప్పనిసరిగా తీసుకోవాలి
సంగెం: విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రైతులు బ్రాండ్ పేరు, లాట్ నంబర్, ధర, డీలరు సంతకంతో కూడిన రశీదులు అడిగి తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉషాదయాళ్ సూచించారు. మండలంలోని లోహిత, రామచంద్రాపురం గ్రామాల్లో శనివారం ఆమె రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు దానికి ఉన్న ట్యాగ్తోపాటుగా లాట్ నంబర్, గడువు తేదీ లను సరిచూసుకోవాలని, మొలక శాతం పరీక్షించుకున్న తర్వాత విత్తుకోవాలని సూచించారు. పంట పూర్తి అయ్యేవరకు బిల్లు, సంచిని భద్రపరుచుకోవాలన్నారు. నకిలీ, కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. జాతీయ ఆహార భద్రతా మిషన్ ఉమ్మడి జిల్లా కన్సల్టెంట్, టెక్నికల్ ఏఓ కృష్ణారెడ్డి, ఏఓ యాకయ్య, ఏఈఓలు అఖిల్, సాగర్, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, రైతులు పాల్గొన్నారు. -
ట్రాన్స్ఫార్మర్లో కాపర్ తీగ చోరీ
నల్లబెల్లి: ముచ్చింపుల శివారులోని 25 కేవీ డీటీఆర్ ట్రాన్ఫార్మర్లోని కాపర్ తీగను దొంగలు చోరీ చేశారు. ఎస్సై రామారావు కథనం ప్రకారం.. ముచ్చింపుల శివారులోని మంచినీటి బావికి 25 కేవీ డీటీఆర్ ట్రాన్స్ఫార్మర్ను అధికారులు ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ సరఫరా నిలిపివేసి 38 కిలోల కాపర్ తీగను చోరీచేసి, 63 లీటర్ల ఆయిల్ను పారబోశారు. సుమారు రూ.43 వేల నష్టం జరిగినట్లు ఆయన తెలిపారు. టీజీ ఎన్పీడీసీఎల్ ఏఈ రవళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానంకాశిబుగ్గ: కేంద్రం ప్రభుత్వం ప్రదానం చేసే పద్మ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీవైఎస్ఓ సత్యవాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కళలు, ఆటలు, సంఘసేవ, విద్య, వైద్య, విజ్ఞానశాస్త్రం, సాంకేతిక, పరిశ్రమలు, వ్యాపారం తదితర రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారు padmaawards. gov.in వెబ్సైట్లో ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తుతోపాటు సేవలకు సంబంధించిన పేపర్ కటింగ్స్, ఫొటోలతో కూడిన మూడు సెట్లను జూన్ 15లోపు ఓ సిటీలోని జిల్లా యువజన క్రీడల కార్యాలయంలో అందజేయాలని ఆమె కోరారు. జూన్ 15 తర్వాత వచ్చిన దరఖాస్తులు తిరస్కరిస్తారని డీవైఎస్ఓ తెలిపారు. వరంగల్ ఫోర్ట్ ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్ సస్పెన్షన్కాజీపేట అర్బన్: వరంగల్ ఫోర్ట్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వర్తిస్తున్న రాజేశ్పై సస్పెన్షన్ వేటు వేస్తూ శనివారం రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ డీఐజీ సుభాషిణి ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నాన్ లేఅవుట్ ప్లాట్లను అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడ్డారనే ఆరోపణల్ని విచారించి సెస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్తీక్ సెలవుల్లో ఉండడంతో డీఐజీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న రాజేశ్ను ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్గా అధికారులు నియమించారు. లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు● డీఎంహెచ్ఓ వెంకటరమణ గీసుకొండ: లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్ఓ డాక్టర్ కె.వెంకటరమణ హెచ్చరించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం జరిగిన పీసీపీఎన్డీ టీ జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కానింగ్ సెంటర్లు, ఆస్పత్రుల యాజమాన్యాలు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, తల్లి, కడుపులోని బిడ్డ క్షేమంగా ఉందా లేదా అనే విషయాలు తెలుసుకోవడానికి గర్భస్థ పరీక్షలు చేయాలని పేర్కొన్నారు. అభ్యుదయ సేవా సమితి అధ్యక్షుడు మండల పరశురాములు మాట్లాడుతూ సమాజంలో సీ్త్ర, పురులు సమానంగా ఉన్నప్పుడే అసమానతలు ఉండవన్నారు. పలు శాఖల సమన్వయంతో ఆడ శిశువులను రక్షించాలని కోరారు. ప్రోగ్రాం అధికారి డాక్టర్ పద్మశ్రీ, డాక్టర్ ఆచార్య, డిప్యూటీ డీఎంహెచ్ఓ ప్రకాశ్, డిప్యూటీ డెమో అనిల్కుమార్, ఎస్ఓ విజయలక్ష్మి, నాగరాజు పాల్గొన్నారు. కాంగ్రెస్పై వ్యతిరేక పోస్టులు పెట్టిన ఒకరిపై కేసు చెన్నారావుపేట: వాట్సాప్ గ్రూపుల్లో కాంగ్రెస్పై వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకు ఒకరిపై కేసు నమోదు చేసినట్లు చెన్నారావుపేట ఎస్సై గూడ అరుణ్కుమార్ శనివారం తెలిపా రు. చెన్నారావుపేట గ్రామ శివారు ఈర్యతండాకు చెందిన ధరంసోతు సుమన్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు చేశాడని ఆ పార్టీ మండల అధ్యక్షుడు భూక్యా గోపాల్నాయక్ ఫిర్యాదు చేశారు. ఈమేరకు సుమన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. వాట్సా ప్ గ్రూపుల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, పార్టీ లకు వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెట్టినా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. -
పోలింగ్ రోజున 144 సెక్షన్
వరంగల్ క్రైం: ఈనెల 27న జరిగే వరంగల్–నల్ల గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల సందర్భంగా కమిషనరేట్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈనెల 27న ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఈసందర్భంగా కమిషనరేట్ పరిధిలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధమని, ఎన్నిక వేళ పోలింగ్ కేంద్రాల చుట్టూ గుమిగూడరాదని, పోలింగ్ కేంద్రం నుంచి 200 మీటర్ల హద్దును దాటి ఓటర్లు తప్ప ఎవరూ లోపలికి రావొద్దని సూచించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి పోలీస్ అధికారులు, సిబ్బందికి సహకరించాలని కోరారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. -
ఆర్నెళ్ల కాంగ్రెస్ పాలనలో భారీ అవినీతి
పరకాల: ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో భారీ అవినీతి చోటుచేసుకుందని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా వసూలు చేసిన రూ.4,500 కోట్లు రాహుల్గాంధీకి పంపించారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. పరకాలలోని మహాదేవ్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల బీజేపీ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఈటల మాట్లాడుతూ.. నల్లగొండలో ఓ వ్యక్తి నడుమంత్రపు సిరితో బీజేపీ ఎక్కడుంది అని అంటున్నారని, రాబోయే ఎన్నికల ఫలితాలే సమాధానం కాబోతాయన్నారు. చీమలు పుట్టలు పెడితే పాములు దూరినట్లు తెలంగాణ ప్రజలంతా కొట్లాడితే వచ్చిన తెలంగాణలో రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని విమర్శించారు. ప్రశ్నించే గొంతులమంటూ కొందరు అధికార పార్టీలో చేరి ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధిష్టానం చేతిలో పిల్లిలా తయారయ్యారన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలం పుంజుకుంటుందనడానికి జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాలే నిదర్శనంగా నిలుస్తాయన్నారు. కేసీఆర్ పార్టీ త్వరలోనే కనుమరుగవడం ఖాయమని, ఆయన చేసిన పాపాలు ఆయనకే తగులుతున్నాయన్నారు. 40 ఏళ్లుగా ప్రజల కష్టాల్లో పాలుపంచుకున్న గుజ్జుల ప్రేమేందర్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, నాయకులు డాక్టర్ విజయచందర్రెడ్డి, డాక్టర్ సిరంగి సంతోశ్కుమార్, డాక్టర్ కాళీప్రసాద్రావు, కాచం గురుప్రసాద్, మురళీధర్రావు, ఆర్పీ జయంత్లాల్ మోహన్రెడ్డి, మార్త భిక్షపతి తదితరులున్నారు. రూ.4,500 కోట్లు అక్రమంగా వసూలు చేసి.. రాహుల్గాంధీకి అందజేత బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ -
నిట్లో కృష్ణా రివర్ బేసిన్ స్టడీ సెంటర్
కాజీపేట అర్బన్ : వరంగల్ నిట్లో కృష్ణా రివర్ బేసిన్ స్టడీ సెంటర్ను శుక్రవారం ప్రారంభించారు. ఐఐటీ కాన్పూర్లోని సీ గంగా అండ్ ఎమిరిటస్ ప్రొఫెసర్ వినోద్ థారే, నిట్ వరంగల్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుధీ సంయుక్తంగా ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జలవనరుల, నది అభివృద్ధి, గంగా పునరుజ్జీవన శాఖ సౌజన్యంతో సెంటర్ను ప్రారంభించినట్లు తెలిపారు. కృష్ణానది సమగ్ర పరిస్థితిని అంచనా వేయడంతోపాటు పునరుద్ధరణ, నిర్వహణకు ప్రణాళికలను సిద్ధం తదితర అంశాల అధ్యయనానికి సెంటర్ తోడ్పడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఐఐటీ కాన్పూర్, నిట్ వరంగల్, సూరత్కల్ కన్సార్జీయంలు పరస్పరం ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలిపారు. కార్యక్రమంలో నేషనల్ రివర్ కన్జర్వేషన్ డైరెక్టరేట్ జాయింట్ సెక్రటరీ ప్రదీప్కుమార్ అగర్వాల్, ఎన్సీడీ డైరెక్టర్ అశోక్బాబు, సైంటిస్ట్ శ్రీవాత్సవ, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు
ఖిలా వరంగల్: ప్రభుత్వం సబ్సిడీపై జీలుగ విత్తనాలను అందిస్తోంది. జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో అందుబాటులో ఉంచింది. సేంద్రియ పద్ధతిని ప్రోత్సహిస్తూ వరి పంట అధిక దిగుబడి వచ్చేందుకు వ్యవసాయశాఖ పంపిణీ చేస్తోంది. ఏకవార్షిక మొక్కల్లో ప్రథమ స్థానం జీలుగదే. విత్తనాలు విత్తిన 30 నుంచి 35 రోజుల్లో మొక్కలు ఏపుగా పెరుగుతాయి. దుక్కిలో 30 కిలోల యూరియా వేసిన తర్వాత ఎకరానికి 12 కిలోల జీలుగ విత్తనాలు చల్లుకోవాలి. 30 రోజుల్లో ఏపుగా పెరిగి పూత దశకు చేరుకుంటుంది. ఆ సమయంలో మొక్కలను మొదళ్ల వద్ద కత్తిరించాలి. లేనిపక్షంలో రోటోవేటర్ సాయంతో పొలం అంతా కలియదున్నాలి. దున్నిన అనంతరం 100 కిలోల సింగిల్ సూపర్ పాస్ఫేట్ ఎరువును దుక్కిలో వేస్తే మొక్కల అవశేషాలు బాగా కుళ్లి పచ్చిరొట్ట ఎరువు తయారవుతుంది. పొలంలో జీలుగ కుళ్లే దశలో నీటిని సక్రమంగా అందించాలి. 60 శాతం రాయితీపై పంపిణీ.. జిల్లాకు 1,246 క్వింటాళ్ల విత్తనాలు సరఫరా అయ్యాయి. ప్రభుత్వ 60 శాతం రాయితీపై ఇస్తోంది. జీలుగ క్వింటాలు ధర రూ.9,300 కాగా.. రూ.5,580 రాయితీ తీసివేస్తే రైతు రూ.3,720 చెల్లించాల్సి ఉంటుంది. జీలుగ 30 కిలోల బస్తాకు 60 శాతం రాయితీ తీసివేస్తే రైతు రూ.116 చెల్లించాలి. 30 కిలోలు రెండున్నర ఎకరాల విస్తీర్ణానికి సరిపోతుంది. సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం 60 శాతం రాయితీపై పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను అందిస్తోంది. 1,246 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు మండల కేంద్రాల్లోని పీఏసీఎస్లలో అందుబాటులో ఉన్నాయి. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. డి.ఉషాదయాళ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జిల్లాకు 1,246 క్వింటాళ్ల జీలుగ సీడ్స్ -
వెబ్సైట్లో పోలింగ్ కేంద్రం వివరాలు
కాళోజీ సెంటర్ : వరంగల్–నల్లగొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కోసం ఓటు హక్కు నమోదు చేసుకున్న వారు ఈసీ వెబ్సైట్లో పరిశీలించుకోవచ్చని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో నమోదు చేసుకున్న పట్టభద్రులకు ఓటరు స్లిప్పులు అందించామని పేర్కొన్నారు. ఓటరు స్లిప్పులు అందని పట్టభద్రులు http://ceotelangana.nic.inలో చూసుకోవచ్చని తెలిపారు. ఈ వెబ్సైట్లో ఓటు హక్కుతోపాటు పోలింగ్ కేంద్రం తదితర వివరాలు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. ముగిసిన పోస్టల్ బ్యాలెట్ గడువు ఎమ్మెల్సీ ఉపఎన్నిక విధులు నిర్వర్తించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే గడువు శుక్రవారం ముగిసిందని కలెక్టర్ పి.ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్లోని ఎల్బీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్లో శుక్రవారం 143 మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. నేటితో ప్రచారానికి తెర.. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారానికి శనివారం సాయంత్రం 4 గంటలకు తెర పడనుందని కలెక్టర్ పి.ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. నేటి సాయంత్రం 4 నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు (సైలెన్స్ పీరియడ్) పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎలాంటి బల్క్ ఎస్ఎంఎస్లు పంపించకూడదని, ఒకవేళ ఎవరైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే ఈసీ నిబంధనల మేరకు చట్టరీత్యా చర్యలు ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సైలెన్స్ పీరియడ్లో ఎలాంటి బల్క్ ఎస్ఎంఎస్లు పంపకూడదని కలెక్టర్ సూచించారు. -
గెజిటెడ్ హెడ్మాస్టర్ కరణ్ సస్పెన్షన్
● పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ ఉత్తర్వులు విద్యారణ్యపురి: భీమదేవరపల్లి మండలం వంగరలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెచ్ఎం ఎల్.కరణ్ను ఈనెల 23న సస్పెన్షన్ చేస్తూ.. వరంగల్ పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కరణ్ ఫోర్జరీ చేసి, తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ప్రయోజనాలు పొందారని ఆరోపిస్తూ డీటీఎఫ్ రాష్ట్ర శాఖ బాధ్యులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు.. ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా సస్పెన్షన్ చేసినట్లు ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి శుక్రవారం తెలిపారు. ఫేక్ డాక్యుమెంట్ల తయారీ.. హెడ్మాస్టర్ కరణ్ తనకు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ స్కేల్ 18 ఏళ్ల సర్వీస్ ఇంక్రిమెంట్ పొందేందుకు ఎలిజిబిలిటీ లేకున్నప్పటికీ హనుమకొండ డీఈఓ కార్యాలయం నుంచి ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లుగా ఫోర్జరీ చేసి తనకు తానే స్వయంగా ప్రొసీడింగ్స్ పత్రాలు సృష్టించుకుని ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కేల్ 18 ఏళ్ల సర్వీస్కు సంబంధించిన ఇంక్రిమెంట్ ప్రయోజనం పొందారనేది ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు ఆర్జేడీ తెలిపారు. హెచ్ఎం కరణ్పై వచ్చిన ఆరోపణల ఫిర్యాదును హనుమకొండ డీఈఓ అబ్దుల్హైకి పంపగా.. తాను ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ కింద 18 ఏళ్లకు సంబంధించిన ఇంక్రిమెంట్ ప్రొసీడింగ్స్ను డీఈఓ కార్యాలయం నుంచి ఇవ్వలేదని ఫోర్జరీ చేశారని, తప్పుడు పత్రాలు సృష్టించార డీఈఓ ప్రాథమిక నివేదిక సమర్పించినట్లు ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి తెలిపారు. అనంతరం కొద్దిరోజుల క్రితం కరణ్కు షాకాజ్ నోటీస్ జారీ చేశామని అతడు ఇచ్చిన వివరణను కూడా డీఈఓకు పంపామని ఆర్జేడీ తెలిపారు. అతడి వివరణ సరికాదని, తప్పడు పత్రాలు సృష్టించి డీఈఓ కార్యాలయం నుంచి ప్రొసీడింగ్స్ ఇచ్చినట్లుగా ఫోర్జరీ చేశారని వెల్లడవడం, కరణ్ తన సర్వీస్ బుక్ను ఇష్టానుసారంగా మార్పులు చేసుకున్నారని వెల్లడైనందున కరణ్పై సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి వివరించారు. సమగ్ర విచారణ జరిపించాలి: డీటీఎఫ్ కరణ్ చేసిన తప్పిదాలపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి భారతి శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కరణ్ గతంలో పని చేసిన పాఠశాలల్లోనూ ఆరోపణలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
నర్సంపేట: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోళ్లను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ కాంటాల్లో ఆలస్యం జరగొద్దని, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఇప్పటి వరకు 50 శాతం ధాన్యం సేకరించి మిల్లులకు పంపినట్లు తెలిపారు. వర్షంతో తడిసిన ధాన్యాన్ని వంద శాతం కొనుగోలు చేస్తామన్నారు. కార్యక్రమంలో ట్రెయినీ ఐఎఫ్ఎస్ రేవంత్చంద్ర, డీఆర్డీఓ కౌసల్యాదేవి, డీసీఎస్ఓ శివప్రసాద్రెడ్డి, డీఎం సంధ్యారాణి, జిల్లా కోఆపరేటివ్ అధికారి సంజీవరెడ్డి పాల్గొన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం.. ఖానాపురం: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. మండల కేంద్రంలోని సబ్మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. తేమ శాతం, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా 1010 రకాన్ని కామన్ కింద తీసుకోవడంతో క్వింటాలుకు రూ.20 నష్టపోతున్నామని రైతులు కలెక్టర్కు తెలిపారు. ఖరీఫ్లో ఏ రకం పంట వేయాలో ముందే చెప్పాలని, ప్రస్తుతం దొడ్డు రకాలు సాగు చేసి రూ.500 బోనస్ను నష్టపోయామని కలెక్టర్కు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు 52వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు తరలించినట్లు తెలిపారు. మిగిలిన 50 శాతం ధాన్యాన్ని కూడా త్వరితగతిన కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ధాన్యంలో కోతలు విధించినా, రైతులను ఇబ్బందులు పెట్టినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ 10 లోపు పూర్తిస్థాయిలో దుస్తులు అందిస్తామని పేర్కొన్నారు. ఆమె వెంట ట్రెయినీ ఐఎఫ్ఎస్ అధికారి రేవంత్చంద్ర, డీఆర్డీఓ కౌసల్యాదేవి,డీసీఎస్ఓ శివప్రసాద్రెడ్డి, సివిల్ సప్లయీస్ డీఎం సంధ్యారాణి, డీసీఓ సంజీవరెడ్డి, తహసీల్దార్ కిరణ్కుమార్, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు పాల్గొన్నారు. కుట్టు మిషన్ కేంద్రం పరిశీలన నర్సంపేట రూరల్ : మహేశ్వరంలోని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళాశక్తి కుట్టు మిషన్ కేంద్రాన్ని కలెక్టర్ ప్రావీ ణ్య పరిశీలించారు. ఈసెంటర్ పరిధిలోని గ్రామాల పాఠశాలల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది యూనిఫాం కుట్టించుకున్నారు, రోజు కు ఎన్ని డ్రెస్సులు కుడుతున్నారని ఆరా తీశారు. రోజుకు ఐదు చొప్పున డ్రెస్సులు కుడుతున్నామని మహిళలు తెలిపారు. 95 మంది బాలికలు, 106 మంది బాలురు ఉన్నారన్నారు. అనంతరం హేమ్లతండా, రంగంపల్లి విద్యార్థులకు యూనిఫాం పంపిణీ చేశారు. ట్రెయినీ ఐఎఫ్ఎస్ రేవంత్చంద్ర, డీఆర్డీఓ కౌసల్యాదేవి, అదనపు డీఆర్డీఓ రేణుకాదేవి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ రత్నమాల, డీపీఎం దయాకర్ ఉన్నారు. కలెక్టర్ ప్రావీణ్య -
అధిక ధరలను అరికట్టాలి
కాళోజీ సెంటర్ : అధిక ధరలకు విత్తనాలు అమ్ముతున్న షాపుల యజమానులపై వెంటనే చర్య తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ సోమిడి శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సంఘం నాయకులతో కలిసి డీఆర్ఓ శ్రీనివాస్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు విత్తనాల దుకాణాల వద్ద బారులు తీరుతున్నారని, దీంతో యజమానులు అధిక ధరలకు విత్తనాలు విక్రయిస్తున్నారని వివరించారు. వ్యవసాయ శాఖ అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా విత్తన వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారిందని తెలిపారు. మరికొంతమంది నకిలీ విత్తనాలు తయారు చేస్తూ రైతులకు విక్రయిస్తున్నారని, ఈ విత్తనాలతో వేసిన పంట సుమారు నాలుగు నుంచి 6 నెలల వరకు ఎలాంటి పూతకాత లేకుండా ఉంటుందని పేర్కొన్నారు. అప్పటికే రైతులు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిక ధరలు, నకిలీ విత్తనాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల రాజయ్య, నాయకులు ఊరటి హంసల్రెడ్డి, నల్ల విజేందర్రెడ్డి, సిరుల రవీందర్, మొకిడే పేరయ్య పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
ఖానాపురం: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని డీఆర్డీఓ కౌసల్యాదేవి అన్నారు. ఈ మేరకు మండల కేంద్రం, ధర్మరావుపేట గ్రామాల్లో విద్యార్థులకు శుక్రవారం యూనిఫాం పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలో పేతం చేసుకోవడానికి ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీలు కీలకంగా పనిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన తీరును వివరించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీపీఎం దయాకర్, ఏపీఎం కందిక సుధాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనుమతి లేని స్కూళ్లపై చర్య తీసుకోవాలి కాళోజీ సెంటర్ : నగరంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్య తీసుకోవాలని ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ (ఏఐఎస్బీ) నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు డీఈఓ వాసంతిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్బీ ఉమ్మడి జిల్లా నాయకుడు మోహన్ మాట్లాడుతూ శివనగర్లోని ఏకశిల ఈటెక్నో స్కూల్ అనుమతి లేకుండా సీబీఎస్ఈ బోర్డు తగిలించుకుని లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తోందని ఆరోపించారు. తక్షణమే ఇలాంటి పాఠశాలలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సీబీఎస్ఈ దృష్టికి తీసుకెళ్తానని డీఈఓ హామీ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ప్రవీణ్, వినయ్, సతీశ్ పాల్గొన్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి గీసుకొండ: మండలంలోని మనుగొండకు చెందిన నమిండ్ల భాస్కర్ (50) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. భాస్కర్ ఈ నెల 23న మధ్యాహ్నం పశువులను మేపడానికి వెళ్లి రాత్రి వరకు తిరిగిరాలేదు. శుక్రవారం ఉదయం వరకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతడి కోసం గాలించారు. మనుగొండ శివారులోని ఎంబాడి పరమేశ్వర్ వ్యవసాయ భూమిలోని టేకు చెట్టు కింద చనిపోయి ఉన్నాడు. చీమలు కరవడంతో లేదంటే వడదెబ్బ, ఇతర అనారోగ్య సమస్యలతో మృతి చెంది ఉంటాడని మృతుడి కుమారుడు శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు గీసుకొండ ఎస్సై షేక్ జానీపాషా తెలిపారు. బండరాయి మీదపడి రైతు దుర్మరణం రాయపర్తి: బావిలో విద్యుత్ మోటారును మరమ్మతు చేస్తుండగా బండరాయి మీదపడి రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని కిష్టాపురం గ్రామంలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మూన్యానాయక్ (59) తన వ్యవసాయ బావిలోని మోటారును వల్లపు ఐలయ్య, రాపాక నరేశ్తో కలిసి మరమ్మతు చేస్తున్నాడు. ఈ క్రమంలో మోటారు ఫుట్వాల్కు ఉన్నతాడు పైన ఉన్న రాయికి తగిలి మూన్యానాయక్పై పడింది. ఈ క్రమంలో మూన్యానాయక్ వెంటనే బావిలో పడి అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఎస్సై వడ్డే సందీప్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేటకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పిటిషన్ రాగానే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుదాఘాతంతో పాడిగేదె మృతి గీసుకొండ : మండల కేంద్రంలో పాకనాటి చిన్న సమ్మయ్య పాడిగేదె విద్యుదాఘాతంతో మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. గురువారం రాత్రి ఈదురుగాలులు, వర్షానికి చెట్టుకూలి కరెంట్ తీగలపై పడింది. శుక్రవారం గేదె మేసుకుంటూ వెళ్తూ కింద పడిన తీగలు తగిలి షాక్తో అక్కడే మృతి చెందింది. సుమారు రూ.80 వేల విలువైన పాడిగేదె మృతిచెందిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరాడు. -
ప్రధాని మోదీతోనే ఆర్థికాభివృద్ధి
నర్సంపేట: ప్రధాని నరేంద్రమోదీ పాలనలో భారత్ ఆర్థికాభివృద్ధి సాధించిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. పట్టణంలోని పద్మశాలి గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కరోనా సమయంలో భారతదేశ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించడమే కాకుండా ప్రపంచ దేశాలకు అందించి మానవత్వం చాటుకున్నారని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దుతో నేడు కశ్మీర్ పర్యాటకంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. సైన్యానికి భరోసాగా నిలిచిన గొప్ప ప్రధాని మోదీ అని కొనియాడారు. ఒకప్పుడు భారత్.. పాకిస్థాన్ లాంటి చిన్న దేశాలకు భయపడాల్సి వచ్చిందని, నేడు ప్రపంచంలో అతిపెద్ద ఆయుధ సంపత్తి కలిగిన దేశంగా ఎదుగుతోందని తెలిపారు. పాకిస్థాన్ సైన్యం అభినందన్ను అరెస్ట్ చేస్తే 24 గంటల్లోనే దేశానికి తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఎయిర్పోర్టులో అబ్దుల్కలాం, మోదీని అమెరికా అవమానించిందని, అలాంటి అమెరికా.. మోదీ ప్రధాని అయ్యాక సెనేట్లో మాట్లాడుతుంటే అనేకమార్లు చప్పట్లతో స్వాగతించిందన్నారు. కేసీఆర్ పార్టీ త్వరలోనే కనుమరుగు కావడం ఖాయమని, ఆయన చేసిన పాపాలు ఆయనకే తగులుతున్నాయని జోస్యం చెప్పారు. ఎమ్మెల్సీగా ప్రేమేందర్రెడ్డిని గెలిపిస్తే చట్టసభల్లో ప్రశ్నించే గొంతుక అవుతారని తెలిపారు. సమ్మేళనంలో ఎంపీ అభ్యర్థి సీతారాంనాయక్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్రావు, ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, అధికార ప్రతినిధి రాణిరుద్రమ, జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, నియోజకవర్గ కన్వీనర్ వడ్డేపల్లి నర్సింహరాములు, నాయకులు రాణాప్రతాప్రెడ్డి, కంభంపాటి పుల్లారావు, ఎర్రబెల్లి ప్రదీప్రావు, డాక్టర్ కాళీప్రసాదరావు, మోహన్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల -
27న 144 సెక్షన్ : సీపీ
వరంగల్ క్రైం: వరంగల్–నల్లగొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఈనెల 27న 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నిక సందర్భంగా కమిషనరేట్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘట నలు జరగకుండా ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఈసందర్భంగా కమిషనరేట్ పరిధిలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధమని, ఎన్నికల వేళ పోలింగ్ కేంద్రాల చుట్టూ గుమిగూడరాదని, పోలింగ్ కేంద్రం నుంచి 200 మీటర్ల హద్దును దాటి ఓటర్లు తప్ప ఎవరూ లోపలికి రావొద్దని సూచించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి పోలీస్ అధికారులు, సిబ్బందికి సహకరించాలని కోరారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. -
పాఠశాలల్లో పనులు త్వరగా పూర్తి చేయండి
అదనపు కలెక్టర్ రాధికా గుప్తా దామెర: ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రాధికాగుప్తా అన్నారు. మండలంలోని కోగిల్వాయి, వెంకటాపూర్, ల్యాదెళ్ల, పులుకుర్తి, పసరగొండ, దమ్మన్నపేట ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న పనులను ఆమె గురువారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో.. పనులు వెంటనే పూర్తి చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపించకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆమె వెంట మండల ప్రత్యేకాధికారి మాధవీలత, ఎంపీడీఓ కల్పన, ఏపీఎం ఝాన్సీ, కార్యదర్శులు ఉన్నారు. నెలాఖరులోగా పూర్తి చేయండి..నడికూడ: మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను ఈనెలాఖరు వరకు పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రాధిక గుప్తా అన్నారు. గురువారం మండలంలోని కంఠాత్మకూరు, ధర్మారం, కౌకొండ గ్రామాల్లోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో జరుగుతున్న మరమ్మతులు, తాగునీటి సౌకర్యాలు, తరగతి గదులు విద్యుద్ధీకరణ, పాఠశాల ప్రాంగణంలో పారిశుద్ధ్యం నిర్వహణ, తదితర పనుల్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ నెల చివరి వరకు పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా తాగు నీరు, టాయిలెట్స్ వంటి మౌలిక వసతులపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో డీఈ లింగారెడ్డి, ఎంపీడీఓ చిర్రబోయిన శ్రీనివాస్, ఎంపీఓ సయ్యద్ అఫ్జల్, ఎంఈఓ రమాదేవి, తదితరులు పాల్గొన్నారు. -
వాన.. రైతుల యాతన
నల్లబెల్లి: యాసంగి పంటలు చేతికి వస్తున్న సమయంలో కురుస్తున్న వర్షాలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లాలో 1,03,962 ఎకరాల్లో వరి, 1,00,526 ఎకరాల్లో మొక్కజొన్న, 4,800 ఎకరాల్లో రైతులు వేరుశనగ సాగుచేశారు. కాగా, ఇటీవల జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశా యి. దీనికి తోడు వడగళ్ల వానతో వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి, కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం, మక్కలు, వేరుశనగ తడిసి ముద్దయ్యా యి. బుధవారం వర్షం లేదని ఊపిరిపీల్చుకున్న రైతులు కల్లాల్లో పంటను ఆరబెట్టారు. అయితే, సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రాత్రి సమయంలో కుటుంబ సభ్యులతో రైతులు కల్లాల వద్దే కాపలా ఉన్నారు. నిద్రలోకి జారుకున్న సమయంలో వర్షం కురిసింది. తేరుకున్న రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని కుప్పలు చేసి పాలిథిన్ కవర్లు కప్పారు. ఇప్పటికే రెండుసార్లు ధాన్యం తడిసిందని, తేమ ఉందనే సాకుతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుకోలు చేయడంలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ వర్షాలు కురిస్తే ధాన్యం నాని మొలకలు వస్తుందని వారు పేర్కొంటున్నారు. తేమ పేరుతో కొర్రీలు.. తరచుగా కురుస్తున్న వర్షాలతో ధాన్యం నాని తేమ సమస్య తలెత్తుతోంది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడం రైతులకు పెద్ద సమస్యగా మారింది. తేమ ఉందని ధాన్యాన్ని కొనేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో నిరాకరిస్తుండడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో వ్యాపారులు అందినకాడికి దండుకుంటూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. మరో రెండుమూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పుతుండడంతో రైతుల్లో ఆందోళన పెరుగుతోంది. ధాన్యాన్ని ఎలా కాపాడుకోవాలన్నది రైతులకు సమస్యగా మారింది. ఽతడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. ఎండలో ఆరబెట్టాలి వర్షానికి తడిసిన ధాన్యాన్ని అలానే వదిలేస్తే దెబ్బ తింటుంది. బస్తాల్లో నిల్వ చేసిన ధాన్యం, ధాన్యపు రాశులు వర్షానికి తడిస్తే టార్పాలిన్లో పోసి ఎండలో ఆరబెట్టాలి. తేమ 17 శాతం లోపు ఉండేలా చూడాలి. రంగుమారిన, మొలకెత్తిన, పురుగుతిన్న ధాన్యం 5 శాతం, ముడుచుకుపోయిన ధాన్యం 3 శాతం ఉన్నా రైతుల నుంచి కొనుగోలు చేస్తారు. కొనుగోలు సమయంలో రైతులను నిర్వాహకులు ఇబ్బందులకు గురిచేస్తే తగు చర్యలు తీసుకుంటాం. – పరమేశ్వర్, ఏఓ, నల్లబెల్లిఈ ఫొటోలో కనిపిస్తున్నది మండలంలోని రుద్రగూడెం గ్రామానికి చెందిన రైతు మంతెపురం రవీందర్. తనకున్న రెండు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాడు. చేతికందిన పంటను కల్లంలో ఆరబెట్టాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పంట తడవడంతో శనిగరం శివారులోని జాతీయ రహదారిపై ఆరబెట్టాడు. కుమార్తెను ఇంటి వద్ద ఉంచి భార్య రమ, 8 ఏళ్ల కుమారుడితో కలిసి ఆరబెట్టిన వేరుశనగ పంట వద్ద బుధవారం రాత్రి కాపలా ఉన్నాడు. ఒక్కసారి వర్షం కురవడంతో ఆరబెట్టిన పంటను కుప్పచేసి పాలిథిన్ కవర్లు కప్పాడు. మరోసారి తడవడంతో చేసేది ఏమిలేక గురువారం ఉదయం పంటను ఆరబెట్టాడు. కల్లాల్లో తడిసిన ధాన్యం, మక్కలు, పల్లికాయ ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతుల విజ్ఞప్తి -
కళాశాలను సీజ్ చేయాలి
కాళోజీ సెంటర్: వరంగల్ పోచమ్మమైదాన్లోని వేణురావు కాలనీలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఏకశిల జూనియర్ కళాశాలను వెంటనే సీజ్ చేయాలని ఏఐఎస్బీ ఉమ్మడి జిల్లా నాయకులు మోహన్, ప్రవీణ్ కోరారు. ఈ మేరకు గురువారం వారు ఇంటర్మీడియట్ విద్యా జిల్లా అధికారి కాక మాధవరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుర్తింపు లేకుండానే విద్యార్థులకు అడ్మిషన్లు ఇస్తున్న కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వేసవి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలిదుగ్గొండి: వేసవి శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడా అధికారి సత్యవాణి సూచించారు. మండల కేంద్రంలోని ఆదర్శ వాణి విద్యాలయంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిసున్న రెజ్లింగ్ శిబిరాన్ని గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో మాట్లాడారు. రెజ్లింగ్ ప్రాచీన మల్లయుద్ధమని తెలిపారు. క్రీడలు దేహదారుఢ్యాన్ని పెంచడంతోపాటు క్రమశిక్షణ అలవాటు చేస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాగరబోయిన రవి, సుధాకర్, రవి, రమేష్, ఇటికాల దేవేందర్ పాల్గొన్నారు. ఖోఖోలో రాణించాలిగీసుకొండ: ఖోఖోలో వేసవి శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులు నైపుణ్యాలను పెంపొందించుకుని జాతీయ స్థాయిలో రాణించాలని డీవైఎస్ఓ అధికారి టీవీఎల్.సత్యవాణి సూచించారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహిస్తున్న ఖోఖో శిక్షణ శిబిరాన్ని గురువారం ఆమె సందర్శించి మాట్లాడారు. క్రీడాకారులు ఉన్నతంగా ఎదిగి తల్లిదండ్రులు, గ్రామానికి మంచి పేరు తేవాలని కోరారు. శిక్షణ ఇన్చార్జ్ కోట రాంబాబు పాల్గొన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టాలికాళోజీ సెంటర్: కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో అధిక ధరలకు పత్తి వితనాలు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు కూలీ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు వారు గురువారం కలెక్టర్ ప్రావీణ్యను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఈర్ల పైడి మాట్లాడుతూ నర్సంపేటలోని పరమేశ్వర సీడ్స్ యజమాని కృత్రిమ కొరత సృష్టించి బీటీ–2 యూఏస్ 7067 పత్తి గింజల ప్యాకెట్ రూ.864 ఉండగా రూ.1300, నాథ్ కంపెనీ సాకేత్ రకం విత్తనాల ధర రూ.2,500 ఉండగా రూ.3,200 వరకు బ్లాక్లో అధిక ధరలకు అమ్ముతూ రైతులను దోపిడీ చేస్తున్నారని వివరించారు. జిల్లాలో ప్రతి సంవత్సరం నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నారని, సీజన్ ప్రారంభంలోనే వ్యవసాయ శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేసి, నకిలీ విత్తనాలను అరికట్టాలని కోరారు. అలాగే, ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కలెక్టర్కు వివరించినట్లు పైడి తెలిపారు. కార్యక్రమంలో రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు బొర్రా ఆనందర్, నాయకులు భూమా అశోక్, ఎలకంటి కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు. గాయాలతో వలస కార్మికుడి మృతి గీసుకొండ: గాయాలతో వలస కార్మికుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన కార్మికుడు జితేంద్ర రుషి షిండే(35) గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారంలోని సిమెంట్ ఇటుకల తయారీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిసై ఈ నెల 20న ఉదయం బహిర్భూమికి వెళ్లి అక్కడే కింద పడిపోయాడు. తోటి కార్మికులు చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. ఈక్రమంలో చికిత్స పొందుతూ ఈ నెల 22న రాత్రి మృతి చెందాడు. ఆయన బావ విటల్ గోవిందా పగడే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గీసుకొండ ఇన్స్పెక్టర్ పవన్కుమార్ తెలిపారు. -
ఎమ్మెల్సీ ప్రచార హోరు!
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్–నల్లగొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోరు క్లైమాక్స్కు చేరుకుంది. మరో మూడు రోజుల్లోనే ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. శనివారం సా యంత్రం ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఓరుగల్లులో రెండు రోజులుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకి చెందిన ప్రజాప్రతినిధులు, అగ్రనేతలు, ముఖ్యనేతలు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జాతీయ, రాష్ట్ర, జిల్లాస్థాయి నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా కేడర్ను కలిసి ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపునకు మద్దతు కూడగడుతున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52 మంది బరిలో ఉండగా.. ఈనెల 27న పోలింగ్ జరగనుంది. హీటెక్కిన ఎమ్మెల్సీ సమరం పోటాపోటీ ప్రచారంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హీటెక్కింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్, ఈసారి ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉండగా.. బలమైన ఓట్లు సాధించాలని బీజేపీ భావిస్తోంది. ప్రచారానికి ఇంకా రెండు రోజులే గడువు ఉండడంతో అభ్యర్థుల తరఫున కీలక నేతలు రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పోటీ చేస్తున్నారు. అన్ని పార్టీల నాయకులు ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గస్థాయిల్లో పట్టభద్రుల సమావేశాలు నిర్వహించారు. మార్నింగ్ వాక్లు, సోషల్ మీడియా, టీవీ చానళ్లతో పాటు, వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా ప్రచారాన్ని ఉధృతంగా సాగిస్తున్నారు. అభ్యర్థులతో పాటు వారి తరఫున కీలక నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మరోవైపు తెరవెనుక బలం, బలగాన్ని ఉపయోగించి పట్టభద్రుల ఓట్లు సాధించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అందరి లక్ష్యం గెలుపే.. పట్టభద్రుల నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి వరుసగా గెలుస్తున్న బీఆర్ఎస్.. ఈసారి కూడా ఆ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి గెలుపు కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్రావు రంగంలోకి దిగారు. ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గా ల వారీగా కీలక నేతలను ఇన్చార్జ్లుగా పార్టీ అధి ష్టానం నియమించింది. పల్లా రాజేశ్వర్రెడ్డి ఈ స్థానం నుంచి రెండు పర్యాయాలు పోటీచేయడంతో ఆయనకున్న విస్తృత సంబంధాల రీత్యా పార్టీ అధిక భారం పెట్టింది. ఈ సీటును దక్కించుకోవ డం ద్వారా ప్రశ్నించే ప్రతిపక్షంగా తాము పనిచేస్తామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఎర్రబెల్లి దయాకర్రావు, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉమ్మడి వరంగల్లో ప్రచారం హోరెత్తిస్తున్నారు. కాగా 2021 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న స్వల్ప మెజార్టీతో ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఈ స్థానంలో ఎలాగైనా కాంగ్రెస్ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో తీన్మార్ మల్లన్ననే పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ బరిలోకి దించింది. ఆయన గెలుపు కోసం ఉమ్మడి జిల్లాల మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, సీతక్కతోపాటు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, కేఆర్.నాగరాజు, రేవూరి ప్రకాశ్రెడ్డి,గండ్ర సత్యనారాయణరా వు, కీలక నేతలు ప్రచారం సాగిస్తున్నారు. మేధావి వర్గం, విద్యావంతులు, ఉద్యోగ, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు మల్లన్నను గెలిపించాలని కోరుతున్నారు. అలాగే బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపించాలని ఆ పార్టీ నాయకత్వం గట్టిగా కృషి చేస్తున్నది. కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఈటల రాజేందర్, ఇతర ముఖ్యనేతలు ప్రేమేందర్రెడ్డి గెలుపునకు శ్రమిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడిందని, పార్లమెంట్ ఎన్నికల్లో తమదే పైచేయిగా చెబుతున్న బీజేపీ నేతలు.. తమ అభ్యర్థిని ఆదరించి గెలిపించాలని పట్టభద్రులను కోరుతున్నారు. ఓరుగల్లుకు పోటెత్తుతున్న అగ్రనేతలు, ముఖ్యనేతలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల కోసం సుడిగాలి పర్యటనలు ఎన్నికల ప్రచారానికి రేపటితో తెర.. పోలింగ్కు మరో మూడు రోజులే జోరందుకున్న పంపకాలు, ప్రలోభాలు.. -
కాంగ్రెస్ మార్క్ మార్పు ఇదేనా!: కేటీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘రాష్ట్రంలో ఓ వైపు కరెంట్ కోతలు, మరోవైపు కాలుతున్న ట్రాన్స్ఫార్మర్లు..మోటార్లు, ఆస్పత్రుల్లో గంటల తరబడి కరెంటు కోతలు, ఎండుతున్న చెరువులు.. ఇదేనా కాంగ్రెస్ మార్కు మార్పు? ఒక్కసారి ఆలోచించి వారికి ఇప్పటికైనా తగిన బుద్ధి చెప్పాలి..’అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘6 నెలల క్రితం అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. కేసీఆర్తో సహా అందరం ప్రతి నియోజకవర్గంలో పర్యటించాం. మోసపోతే గోసపడుతామని చెప్పాం. కానీ కాంగ్రెస్ వాగ్దానాలు నమ్మి ఆ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపితే నమ్మి ఓటేసి ఇప్పుడు బాధపడుతున్నారు. డిసెంబర్ 9 నాడే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానన్నారు. కేసీఆర్ లక్ష మాఫీ చేసిన వారికీ రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పి.. మొదటి రోజే మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఏం శిక్ష వేస్తారో వేయాలి..’అని అన్నారు. ‘సీఎం రేవంత్రెడ్డి ఓ మెజీషియన్.. పచ్చి అబద్ధాలకోరు. తెలంగాణ ప్రజలను ఇంకా నమ్మించాలని చూస్తున్నాడు..’అని ధ్వజమెత్తారు. వరంగల్–నల్లగొండ–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నర్సంపేట, వరంగల్, హనుమకొండలలో నిర్వహించిన సమావేశాల్లో కేటీఆర్ ప్రసంగించారు. రెండోసారి కూడా మోసపోతే మోసపోయిన వాళ్లదే తప్పు ‘అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈస్ట్మన్ కలర్ సినిమా చూపించారు. కానీ రాష్ట్రంలో కరెంట్ కోతలు ఎలా ఉన్నాయో చెప్పడానికి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో మంగళవారం నాటి ఘటనే ఉదాహరణ. ఎంజీఎం లాంటి పెద్ద ఆస్పత్రిలో 5 గంటలు కరెంట్ పోవడం దారుణం కాదా? ఆరు నెలల క్రితం వ్యవసాయం ఎలా ఉండే? ఇప్పుడు ఎలా ఉంది? రుణమాఫీ జరిగిందా? కౌలు రైతులకు, రైతు కూలీలకు సాయం అందిందా? వంద రోజుల్లోనే చేసేస్తామన్న హామీలు ఏమయ్యాయి? రూ.2500 వచ్చినయా? ఏడాదిలో రూ.2 లక్షల ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఏదీ చేయలేదు. నాట్లు వేసే నాడు వేయాల్సిన రైతుబంధు..ఓట్లు వేసే నాడు రేవంత్రెడ్డికి గుర్తొస్తుంది. ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలు చేశానని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నాడు. తెలంగాణలో అన్ని హామీలు ఆమలు చేస్తున్నట్లు రాహుల్గాం«దీ, ప్రియాంక గాం«దీలు కూడా ఇతర రాష్ట్రాల్లో అబద్ధాలు చెబుతున్నారు..’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. పదేళ్ల ప్రగతి చెప్పుకోవడంలో విఫలమయ్యాం ‘గత పదేళ్లలో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించిందని చెప్పుకోవటానికి చాలా ఉన్నాయి. అన్ని రంగాలు అభివృద్ధి చెందాయి. కానీ మనం చేసిన మంచి పనులను చెప్పుకోవటంలో విఫలమయ్యాం. యూట్యూబ్లలో మనపై తప్పుడు ప్రచారాలు చేశారు. దీని కారణంగానే 1.8 లక్షల ఓట్ల స్వల్ప తేడాతో మనం ఓడిపోయే పరిస్థితి వచ్చింది. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వాడిది తప్పు. కానీ రెండోసారి కూడా మోసపోతే మోసపోయిన వాళ్లదే తప్పు అవుతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డిని గెలిపించి కాంగ్రెస్కు తగ్గిన బుద్ధి చెప్పాలి..’అని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆయా సమావేశాల్లో రాకేశ్రెడ్డితో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, ఎమ్మెల్సీలు డా.బండా ప్రకా‹Ù, బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనచారి, ఎమ్మెల్యేలు డా.సంజయ్, పాడి కౌశిక్రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మానవత్వాన్ని చాటిన కేటీఆర్ గీసుకొండ: రోడ్డు పక్కన పడిపోయిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి, మాజీ మంత్రి కేటీఆర్ మానవత్వాన్ని చాటారు. బుధవారం హైదరాబాద్ నుంచి నర్సంపేట వెళుతుండగా గ్రేటర్ వరంగల్ పరిధిలోని ధర్మారం రైల్వే గేటు సమీపంలో అంజయ్య అనే వ్యక్తి మోపెడ్పై వెళుతూ ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనపడి అపస్మారకస్థితిలో ఉన్నాడు. విషయం గమనించిన కేటీఆర్ కారు ఆపి అతన్ని పరిశీలించారు. వెంటనే గన్మెన్ల సాయంతో తన కాన్వాయ్లోని ఓ వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నర్సంపేటకు వెళ్లారు. ఆరు నెలల్లోనే ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు – పదేళ్ల తరువాత మళ్లీ అన్నదాతల ఆత్మహత్యలు – కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు, అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు – ‘ఎక్స్’లో కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు ఆవిష్కృతం అయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. పదేళ్లు కనిపించని కరెంట్ కోతలు, విద్యుత్ సబ్ స్టేషన్ల ముట్టళ్లు ఇప్పుడు చూస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఆయన ఈ మేరకు పోస్టు చేశారు. ‘కాలిన మోటార్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లతో పాటు మళ్లీ ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు, జనరేటర్ల మోతలు చూస్తున్నాం. సాగునీరు లేక ఎండిన పంట పొలాలు, ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు చూస్తున్నాం. బోసిపోయిన చెరువులు, పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు, రైతుబంధు కోసం నెలలపాటు పడిగాపులు చూస్తున్నాం. తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కులేదు. పదేళ్ల తరువాత మళ్లీ అన్నదాతల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. జోగిపేటలో విత్తనాల కోసం రైతులు పాసుబుక్కులతో క్యూలు కడుతున్నారు. అయినా కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు, అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో..’అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. -
అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు కావాలి
నర్సంపేటలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కేటీఆర్నర్సంపేట/ఖిలా వరంగల్/హన్మకొండ: దశాబ్ది కాలంగా పేదలకు పెద్ద దిక్కుగా నిల్చిన ఎంజీఎం ఆస్పత్రిలో మంగళవారం సాయంత్రం 4.30 నుంచి రాత్రి 9గంటల వరకు కరెంట్ లేదు.. ఐదు గంటలు కరెంట్ లేకుంటే రోగుల పరిస్థితి ఏంటీ.. ఈ ఘటనే కరెంటు కోతలకు ఉదాహరణ.. విద్యావంతులారా మీరే ఆలోచించాలి’ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ‘ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చని రేవంత్రెడ్డి పచ్చి మోసగాడు.. ఇంకా ఎన్నిరోజులు మోసపోదాం.. విద్యావంతులు మేల్కొనాలి.. పట్టభద్రుల సమస్యలు, ప్రజా సమస్యలపై అడిగెటోడు, కడిగెటోడు, నిలదీసేవాడు కావాలి కానీ బాకా ఊదేటోడు కాదు.. అధికార స్వరాలు కాదు.. ధిక్కార స్వరాలు కావాలి. రాకేశ్రెడ్డి లాంటి విద్యావంతుడినే ఎన్నుకోవాలి’ అని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నర్సంపేటలోని పద్మశాలి గార్డెన్లో, వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ఉర్సుగుట్ట నాని గార్డెన్లో, పశ్చిమ నియోజకవర్గంలోని హంటర్ రోడ్డు సీఎస్ఆర్ గార్డెన్స్లో మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్భాస్కర్ అధ్యక్షతన జరిగిన వరంగల్–ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధిని చెప్పుకోవడంలో విఫలమయ్యామని, ఇప్పుడు ఆ పరిస్థితి ఉండొద్దన్నారు. రైతుబిడ్డ, గోల్డ్మెడలిస్టు విద్యావంతుడైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని గెలిపిద్దామా.. మహిళల మెడలో పుస్తెలతాడు లాక్కొని.. బూతు మాటలు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిద్దామా.. అనేది మీరే ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలయ్యాయని, రూ.2లక్షల రుణమాఫీ కాలేదని, రైతు బంధు రైతుల ఖాతాల్లోకి రాలేదని ఆరోపించారు. ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చారా.. బీఆర్ఎస్ ఎంపిక చేసిన ఉద్యోగాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పత్రాలు అందజేసి అధికారంలోకి రాగానే 35వేల ఉద్యోగాలు ఇచ్చామనటం సిగ్గుచేటన్నారు. వరంగల్లో 24 అంతస్తుల మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం పనులు ఎందుకు నిలిపారో మీరే అడగాలని, కొత్త పరిశ్రమలు తీసుకువచ్చే స్థాయి, ఉన్న కంపెనీలను కాపాడుకునే సత్తా కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. జిల్లాలో ఒక్కో పరిశ్రమ తరలిపోతున్నదని, ఐటీ కంపెనీ టెక్ మహీంద్ర మరికొద్ది రోజుల్లో పోనుందని చెప్పారు. ఆయా సమావేశాల్లో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, డాక్టర్ సంజయ్, సంజయ్కుమార్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్, చల్లా ధర్మారెడ్డి, తాటికొండ రాజయ్య, బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మ ణరావు, జెడ్పీ చైర్మన్ సుధీర్కుమార్, సునీ తారావు, నాయకులు వాసుదేవరెడ్డి, రవీందర్సింగ్, రామకృష్ణారావు, వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు సిద్ధం రాజు, మరుపల్లి రవి, సోమిశెట్టి ప్రవీణ్, వేల్పుగొండ సువర్ణ, దిడ్డి కుమారస్వామి, పల్లం పద్మ, నాయకులు బస్వరాజు శ్రీమాన్, రమేష్బాబు, జనార్దన్గౌడ్, రజనీ కాంత్, పట్టభద్రులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడంటే ఏం లాభంవిద్యావంతుల్లారా.. ఆలోచించండి కరెంట్ కోతలకు ఎంజీఎం ఘటనే ఉదాహరణ జిల్లాలోని కంపెనీలు ఒక్కొక్కటి తరలిపోతున్నాయి.. మల్లన్న గెలిస్తే చట్టసభలు బూతు మాటలకు వేదిక విద్యావంతుడైన ఓరుగల్లు బిడ్డ రాకేశ్రెడ్డిని గెలిపించాలి పట్టభద్రుల సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రసంగించడానికి లేవగానే కార్యకర్తలు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో కేటీఆర్ కల్పించుకుని ఎన్నికల్లో ఓడగొట్టి ఇప్పుడు సీఎం సీఎం అంటే ఏమి లాభం. వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్లోనూ ఓడగొట్టారంటూ చలోక్తి విసిరారు.టీ20 మ్యాచ్లను ఆపేసి ఎన్నికలపై దృష్టిపెట్టండి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ నిజమైన టీ 20 మ్యాచ్ ఈ నెల 27న ఉందన్నారు. టీ 20 మ్యాచ్లు, సీరియల్ చూడడం మానేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు దృష్టి సారించాలన్నారు. అప్పటి ఎమ్మెల్యేను పిలిస్తే సస్పెండ్ చేసిన బీజేపీ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి మాట్లాడుతూ తాను బీజేపీలో ఉండగా ఎదుటి పక్షాలను ప్రత్యర్థులుగా మాత్రమే చూశానని, శత్రువులుగా చూడలేదన్నారు. శివరాత్రి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేగా దాస్యం వినయ్భాస్కర్ను పిలిస్తే పార్టీ తనను సస్పెండ్ చేసిందన్నారు. మండలి ఎన్నికల్లో ఓరుగల్లు బిడ్డనైన తనను ఆశీర్వదించాలని కోరారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
స్ట్రాంగ్ రూమ్ల తనిఖీ
ఏయూ డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
అడ్డగోలుగా పార్కింగ్ చేస్తే.. అంతే
సరకు రవాణాలో సరికొత్త వ్యూహాలు
బాలికపై కేజీహెచ్ ఉద్యోగి లైంగిక వేధింపులు
India Meteorological Department: రాజస్తాన్లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత
కేకే లైన్లో డీఆర్ఎం తనిఖీలు
జంతు సంరక్షణ చట్టం నోడల్ అధికారిగా ఏసీపీ శ్యామలరావు
కెమికల్ ఇంజినీరింగ్లో విస్తృత అవకాశాలు
తప్పక చదవండి
- బ్యాంక్ల్లో ఇబ్బందులా?, ఆర్బీఐకి ఫిర్యాదు చేయండిలా..
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి అఖిలేష్?
- మరో ఎంపీ లండన్లో ఉన్నా.. నన్ను టార్గెట్ చేశారు: స్వాతి మలివాల్
- మాకంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చుంటే రాజీనామా చేస్తా
- Malaysia Masters 2024: ఫైనల్లో పీవీ సింధు
- రాజ్కోట్లో పెను విషాదం
- ‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
- Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
- మీ ఇంటిని చక్కదిద్దుకోండి..!
- కలిసికట్టుగా ముందుకు..
Advertisement