ఎన్నికల సమరంలో పేదలు జగన్‌ వైపు నిలవాలి | Sakshi
Sakshi News home page

ఎన్నికల సమరంలో పేదలు జగన్‌ వైపు నిలవాలి

Published Mon, May 6 2024 8:30 AM

ఎన్నికల సమరంలో పేదలు జగన్‌ వైపు నిలవాలి

వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీ ఇశ్రాయేల్‌ పిలుపు

పర్చూరు (చినగంజాం): పేదలకు, పెత్తందారులకు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో పేదలు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వైపు నిలవాలని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీ ఇశ్రాయేల్‌ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన ఇడుపులపాడు గ్రామంలో ప్రచారం నిర్వహించారు. సీఎం జగన్‌ ఐదేళ్లలో దళితులకు అనేక సంక్షేమ పథకాలు అందించి, వారి జీవితాల్లో అనేక మార్పులు తీసుకొచ్చారన్నారు. దళితులు బాగుపడటం చంద్రబాబుకి ఇష్టం లేదని విమర్శించారు. కూటమి సభ్యుల కల్లబొల్లి మాటలు నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరని స్పష్టం చేశారు. వైఎస్సార్‌ సీపీ పర్చూరు అసెంబ్లీ అభ్యర్థి యడం బాలాజీని, ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో దుడ్డు శేషగిరి, నూతలపాటి బలరాం, పిల్లి సుందరరావు, జొన్నలగడ్డ ఇజ్రాయేల్‌, మూట్లూరి కృపారావు, కంభంపాటి కోటి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement