పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసేందుకు వెళ్తూ.. | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసేందుకు వెళ్తూ..

Published Mon, May 6 2024 8:30 AM

పోస్ట

కారు ఢీకొట్టిన లారీ.. ఆరుగురికి తీవ్రగాయాలు

అద్దంకి: కారును లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని శాంతినగర్‌ సమీపంలో ఆదివారం జరిగింది. అందిన వివరాల మేరకు.. సంతమాగులూరు మండలంలోని వెల్లల చెరువు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు (బాబు) పంతులు ఆయన కుమార్తె విష్ణు, అక్క గోపు పద్మ, కేసరి శ్రీనివాస్‌రెడ్డి కారులో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసేందుకు అద్దంకి వస్తున్నారు. శాంతినగర్‌ సమీపంలో హైదరాబాద్‌ నుంచి ఒంగోలు వెళ్తున్న లారీ కారును ఢీ కొట్టింది. ప్రమాదంలో కారులోని ఆరుగురికి తీవ్ర గాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రులకు అద్దంకి ప్రభుత్వ వైద్యశాలలో ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం ఒంగోలు వైద్యశాలకు తరలించారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసేందుకు వెళ్తూ..
1/2

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసేందుకు వెళ్తూ..

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసేందుకు వెళ్తూ..
2/2

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసేందుకు వెళ్తూ..

Advertisement
Advertisement