టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరికలు | Sakshi
Sakshi News home page

టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరికలు

Published Mon, May 6 2024 8:30 AM

టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరికలు

చెరుకుపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సంక్షేమం చూసి వైఎస్సార్‌ సీపీలో చేరికలు జోరుగా సాగుతున్నాయని ఎమ్యేల్యే అభ్యర్థి డాక్టర్‌ ఈవూరు గణేష్‌ అన్నారు. నిజాంపట్నం మండలం కళ్లిఫలం గ్రామంలో టీడీపీకి చెందిన గౌడ సంఘీయులు 30 కుటుంబాల వారు ఆ గ్రామ వైఎస్సార్‌ సీపీ నాయకుడు బెల్లంకొండ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆ పార్టీని వీడి గుళ్లపల్లిలోని ఈవూరి గణేష్‌ క్యాంపు కార్యాలయంలో ఆదివారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. వీరికి డాక్టర్‌ గణేష్‌ పార్టీ కండువాలు కప్పి సాదర స్వాగతం పలికారు. బెల్లంకొండ వెంకటనారాయణ, సాంబయ్య, వెంకటస్వామి, శ్రీనివాసరావు, మణిఖంఠ, నాగలక్ష్మీ, నాగరాజు, శ్రీనివాసరావు, కాటూరి మునేశ్వరరావు, రాజమ్మ, మంగమ్మ, వెంకటేశ్వరమ్మ, పరిశా ప్రసాద్‌, బొలగాని వెంకయ్య, నాగేంద్రం, వెంకట రమణ, తదితరులు పార్టీలో చేరి వారిలో ఉన్నారు.

Advertisement
Advertisement