దాబా పైనుంచి పడి యువకుడి దుర్మరణం | Sakshi
Sakshi News home page

దాబా పైనుంచి పడి యువకుడి దుర్మరణం

Published Mon, May 6 2024 3:40 AM

దాబా

నెక్కొండ : నిద్రమత్తులో బిల్డింగ్‌ మెట్లు దిగుతూ..ప్రమాదవశాత్తు పైనుంచి పడి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై మహేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. నెక్కొండలోని వరంగల్‌ రోడ్డులో గల అశ్విని బిర్యానీ పాయింట్‌లో చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామానికి చెందిన దాసరి కుమార్‌(34) వేయిటర్‌గా పని చేస్తున్నాడు. కాగా రాత్రి వరకు పని ఉండడంతో ఇంటికి వెళ్లకుండా అక్కడే డాబాపై నిద్రిస్తున్నాడు. శనివారం రాత్రి యజమాని సైతం బిర్యాని పాయింట్‌ను మూసేసి ఇంటికి వెళ్లారు. కాగా రాత్రి సమయంలో కుమార్‌ మూత్రవిసర్జన కోసం డాబా నుంచి దిగుతున్న క్రమంలో మెట్లపై నుంచి ప్రమాదవశాత్తు జారి పడగా షెటర్‌, గేటు తగిలింది. దీంతో కుమార్‌ తలకు, ముఖం ముందు భాగంలో తీవ్ర గాయాలై రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమీప గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో ఆదివారం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి తండ్రి వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేందర్‌ తెలిపారు. నర్సంపేట ఏరియా ఆస్పత్రిలో శవ పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని ఎస్సై పేర్కొన్నారు.

దాబా పైనుంచి పడి యువకుడి దుర్మరణం
1/2

దాబా పైనుంచి పడి యువకుడి దుర్మరణం

దాబా పైనుంచి పడి యువకుడి దుర్మరణం
2/2

దాబా పైనుంచి పడి యువకుడి దుర్మరణం

Advertisement
Advertisement