రోడ్డు ప్రమాదంలో పీఎస్‌ మృతి | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో పీఎస్‌ మృతి

Published Mon, May 6 2024 3:35 AM

రోడ్డు ప్రమాదంలో పీఎస్‌ మృతి

హసన్‌పర్తి: బైక్‌ అదుపు తప్పిన ఘటనలో పంచాయతీ కార్యదర్శి (పీఎస్‌) మృతిచెందాడు. ఈ ఘటన ఉనికిచర్ల–వడ్డేపల్లి మార్గమధ్యలోని సుబ్బయ్యపల్లి సమీపంలో జరిగింది. ఆత్మకూరు మండలానికి చెందిన నాగపురి మహేష్‌(45) ధర్మసాగర్‌ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గోపాలపురంలోని విష్ణుపురి కాలనీలో ఉంటూ రోజూ ధర్మసాగర్‌కు రాకపోకలు సాగిస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం ధర్మసాగర్‌ వెళ్లి సాయంత్రం బైక్‌పై ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యలోని సుబ్బయ్యపల్లి సమీపంలో బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో మహేష్‌ అక్కడక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement
Advertisement