నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు | Sakshi
Sakshi News home page

నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు

Published Mon, May 6 2024 3:40 AM

నేటినుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీసీఏ కో ర్సుల 2వ, ఆరో సెమిస్టర్ల ప రీక్షలు ఈనెల 6 నుంచి, నాల్గవ సెమిస్టర్ల పరీక్షలు 7 నుంచి నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎస్‌.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ తిరుమలాదేవి ఆదివారం తెలిపారు. 2వ సెమిస్టర్ల పరీక్షలు 6, 8, 10, 16, 18, 21, 25, 29 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు, నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు 7, 9, 15, 17, 20, 22, 28, 30 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆరో సెమిస్టర్‌ పరీక్షలు 6, 8, 10, 16, 18, 21, 25, 29, 31, జూన్‌ 7, 11, 12, 13 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయి. రెండో సెమిస్టర్‌ పరీక్షలకు 68,139, నాలుగో సెమిస్టర్‌కు 56,899, ఆరో సెమిస్టర్‌కు 46,077 మొత్తం 1,71,115 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకు ఉమ్మడి వరంగల్‌లో 44, ఉమ్మడి ఖమ్మంలో 30, ఉమ్మడి ఆదిలాబాద్‌లో 49 మొత్తం 123 సెంటర్లు ఏర్పాటు చేసి 123 మంది చీఫ్‌సూపరింటెండెంట్లను నియమించారు. ఓక్కో సెంటర్‌కు ఒక అజ్జర్వర్‌, వర్సిటీ పరిధిలో పది ఫ్లయింగ్‌స్క్వాడ్‌ బృందాలను నియమించినట్లు పేర్కొన్నారు. హాల్‌టికెట్లు కళాశాలల వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉన్నాయని, కళాశాలల నుంచి పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

మూడు ఉమ్మడి జిల్లాల్లో 123 పరీక్ష కేంద్రాలు

హాజరుకానున్న 1,71,115 మంది విద్యార్థులు

Advertisement
Advertisement