హజ్‌ యాత్రికులకు నేడు వ్యాక్సినేషన్‌ | Sakshi
Sakshi News home page

హజ్‌ యాత్రికులకు నేడు వ్యాక్సినేషన్‌

Published Mon, May 6 2024 3:35 AM

-

న్యూశాయంపేట : వరంగల్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల పరిధి హజ్‌ యాత్రకు వెళ్లే వారికి నేడు(సోమవారం) రెండో విడత వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హజ్‌ కమిటీ వ్యాక్సినేషన్‌ క్యాంప్స్‌ కో–ఆర్డినేటర్లు డాక్టర్‌ అనీస్‌ సిద్ధిఖీ, సర్వర్‌ మోహియొద్దీన్‌ ఘాజీ ఓ ప్రకటనలో తెలిపారు. వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఐఎంఏ హాల్‌లో ఉదయం 9 గంటలకు వైద్యశాఖ ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా జిల్లాల పరిధి యాత్రీకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement