రూ.2.94 లక్షల నగదు సీజ్‌ | Sakshi
Sakshi News home page

రూ.2.94 లక్షల నగదు సీజ్‌

Published Mon, May 6 2024 5:10 AM

రూ.2.94 లక్షల నగదు సీజ్‌

కాళేశ్వరం : మహారాష్ట్రలోని సిరొంచ నుంచి భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం అంబట్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి నగదు తీసుకు వస్తుండగా పోలీసులు కాళేశ్వరం బార్డర్‌ చెక్‌పోస్టు వద్ద ఆదివారం తనిఖీ చేసి పట్టుకున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు చేపట్టిన తనిఖీల్లో అంబట్‌పల్లికి చెందిన బొమ్మ ఆంజనేయులు రూ.2.94లక్షల నగదుతో పట్టుబడ్డాడు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో తనిఖీ అధికారులు నగదును స్వాధీనం చేసి సీజ్‌ చేశారు. సీఐ రాజేశ్వర్‌రావు, ఎస్సై భవానీసేన్‌, పలుశాఖల అధికారులు ఉన్నారు.

Advertisement
Advertisement