బీజేపీతోనే మహబూబాబాద్‌ అభివృద్ధి | Sakshi
Sakshi News home page

బీజేపీతోనే మహబూబాబాద్‌ అభివృద్ధి

Published Mon, May 6 2024 5:05 AM

బీజేపీతోనే మహబూబాబాద్‌ అభివృద్ధి

డోర్నకల్‌: బీజేపీ గెలుపుతోనే మహబూబాబాద్‌ జిల్లా అభివృద్ధి సాధ్యమని, అజ్మీరా సీతారాంనాయక్‌ను గెలిపించాలని ఆ పార్టీ మహబూబాబాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ జగదీశ్వర్‌ కిరణ్మయి అన్నారు. డోర్నకల్‌ మండలం టేకులతండాలో ఆదివారం నిర్వహించిన బీజేపీ కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. మహబూబాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో సీతారాంనాయక్‌ మాత్రమే ఎంపీగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగల సమర్థుడని అన్నారు. ఆయన ఎంపీగా పని చేసిన సమయంలో డోర్నకల్‌ జంక్షన్‌ అభివృద్ధ్దితో పాటు పోస్టాఫీస్‌ భవనం ఏర్పాటుకు కృషి చేశారని గుర్తుచేశారు. సీతారాంనాయక్‌ను గెలిపిస్తే బయ్యారం చెరువును రిజర్వాయర్‌గా మారుస్తామని చెప్పారు.బూత్‌ కన్వీనర్‌ వినోద్‌కుమార్‌ ఆధ్యర్యంలో టేకులతండాలో భారీ సంఖ్యలో బీజేపీలో చేరారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, పార్లమెంట్‌ కన్వీనర్‌ సతీష్‌కుమార్‌, అసెంబ్లీ ప్రభారి బీరప్ప, మండల అధ్యక్షుడు గణేష్‌నాయక్‌, మున్సిపాలిటీ అధ్యక్షులు దేవానాయక్‌, మైనారిటీ నాయకులు రెహమాన్‌, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement