తడిసిన వడ్లన్నీ కొనాల్సిందే
కరీంనగర్టౌన్: అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని యుద్ధప్రాతిపదికన కొనాల్సిందేనని బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి జాడి బాల్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ను బీజేపీ నాయకులతో కలిసి సందర్శించారు. 20 రోజుల నుంచి రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన వరిధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అకాల వర్షాలతో తేమశాతం వచ్చినా మళ్లీ వర్షాలు పడడంతో తేమశాతం కోసం మళ్లీ మళ్లీ వడ్లను ఆరబోసే పరిస్థితి వచ్చిందన్నారు. వరి ధాన్యం తేమశాతం వచ్చిన వెంటనే కొనుగోలు చేస్తే రైతులకు నష్టం జరిగి ఉండేది కాదని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టోపోతున్నారని, వరి ధాన్యం కొనుగోలులో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జొన్నకూటి సుధాకర్, కొమ్మెర రవీందర్రెడ్డి, వొడ్నాల కోటేశ్వర్, గోదారి నరేశ్, చిగురు శ్రీకాంత్, సాగర్, రావుల భాస్కరచారి తదితరులు పాల్గొన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి
కొత్తపల్లి: అకాల వర్షాలతో తడిసిన వరిధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పిలుపుమేరకు కొత్తపల్లి మండలంలో వరిధాన్యం కేంద్రాలను శనివారం బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ వడ్ల కొనుగోలు మీద లేదని మండిపడ్డారు. పంటకు బోనస్ ప్రకటిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. ఎకరాకు రూ.14 వేల చొప్పున వెంటనే బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రూ.2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. మండల నాయకులు రతన్ కుమార్, అనిల్, రేణు, ప్రశాంత్, అనిల్, మహేశ్, ప్రతాప్, ఆనందచారి, మల్లారెడ్డి, శ్రీనివాస్, సదానందం, తిరుపతి, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కొత్తపల్లిలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కౌన్సిలర్ వాసాల రమేశ్, శేఖర్, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా టార్పాలిన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.