-
శనైశ్వరుడికి ప్రత్యేక పూజలు
బిజినేపల్లి: మండలంలోని నందివడ్డెమాన్లో జైష్ట్యాదేవి సమేత శనైశ్వరుడికి శనివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. శనిదోష నివారణ, శనిగ్రహ శాంతి కోసం ప్రత్యేక వస్త్రాలు ధరించి, జిల్లెడుపూలు, జమ్మి ఆకులు, నువ్వులనూ నెతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి, శాంతిమాకుర్, ఉమామహేశ్వర్లు బ్రహ్మసూత్ర శివుడికి రుద్రాభిషేక పూజలు, అర్చనలు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ గోపాల్రావు పాల్గొన్నారు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దాం కొల్లాపూర్ రూరల్: బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా చైల్డ్ హెల్ప్లైన్ ప్రతినిధులు కోరారు. డీడబ్ల్యూఓ రాజేశ్వరి ఆదేశాల మేరకు శనివారం మండలంలోని ఎల్లూరులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ బాల్యవివాహాలతో అనేక అనర్థాలు ఉంటాయని.. బాలికలకు 18ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లి చేయాలని సూచించారు. ఎవరైనా బాల్యవివాహాలు చేయాల ని యత్నిస్తే, అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అమరేష్ పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణ వేగవంతం
● కొనుగోలు కేంద్రానికి వచ్చిన ప్రతి గింజనూ కొనుగోలు చేయాలని డీఎస్ఓ స్వామికుమార్ అన్నారు. వర్షాలు కురుస్తున్నందున ధాన్యం తడవకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహించవద్దని అన్నారు. అదేవిధంగా రైతుల ఖాతాల్లో త్వరగా డబ్బులు పడేవిధంగా చూడాలన్నారు. రైతులు నేరుగా పొలం నుంచి కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువస్తుండటంతో తేమ శాతం ఎక్కువగా ఉంటుందని.. ధాన్యంలో 17 శాతం లోపు తేమ ఉండేవిధంగా రైతులు తమ పొలాల్లోనే ఆరబెట్టుకొని తీసుకురావాలని కోరారు. డీఎస్ఓ వెంట తహసీల్దార్ పాండునాయక్, ఏపీఎం నిరంజన్, ప్రభాకర్, పీఏసీఎస్ సీఈఓ రవీందర్రావు, సీసీ నర్సింహ, వీఓఏ పర్వత్బేగం ఉన్నారు. ● ‘సాక్షి’ కథనానికి స్పందించిన అధికారులు ● కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్, డీఎస్ఓ కొల్లాపూర్ రూరల్/పెంట్లవెల్లి/తెలకపల్లి/ ఉప్పునుంతల: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ‘అన్నదాతల ఆగచాట్లు’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు స్పందించారు. కొల్లాపూర్ మార్కెట్యార్డు, మాచినేనిపల్లి, పెంట్లవెల్లిలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ సీతారామారావు తనిఖీ చేయగా.. తెలకపల్లి, ఉప్పునుంతలలో ధాన్యం సేకరణ ప్రక్రియను డీఎస్ఓ స్వామికుమార్ పరిశీలించారు. రైతులకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యంలో తేమ శాతాన్ని చూశారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరించాలని ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న దృష్ట్యా ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో గన్నీ బ్యాగులు, టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. కొనుగోలుచేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. వడ్లను పూర్తిగా ఎండబెట్టిన తర్వాతే కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. అదనపు కలెక్టర్ వెంట తహసీల్దార్లు శ్రీకాంత్, హిమబిందు, ఎంపీడీఓ ప్రసన్నకుమారి, రామన్గౌడ్, కబ్బీర్ ఉన్నారు. -
నల్లమలలో భారీ వర్షం
అమ్రాబాద్: నల్లమలలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ వర్షం కురిసింది. అమ్రాబాద్ మండల కేంద్రంతో పాటు లక్ష్మాపూర్ (బీకే), మాధవానిపల్లి, ఒంగురోనిపల్లి, కుమ్మరోనిపల్లి తదితర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. లక్ష్మాపూర్ చెరువులోకి కొంత మేర నీరు వచ్చి చేరింది. కాగా, ఆయా గ్రామాల్లో వరిపంట కోత దశకు వచ్చిన సమయంలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట కోతలు కోసిన రైతుల ధాన్యం వర్షానికి తడిసిపోతోందని వాపోతున్నారు. వర్షాలతో ఓవైపు మేలు చేకూరుతుండగా.. మరోవైపు నష్టం వాటిల్లుతుందని పేర్కొంటున్నారు. -
ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభం
అచ్చంపేట: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, మోడల్, కేజీబీవీ, మహాత్మాగాంధీ జ్యోతిబాపూలే, సోషల్, ట్రైబల్, మైనార్టీ వెల్ఫేర్, ఓకేషనల్ జూనియర్ కళాశాలల్లో ఈనెల 9నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో మొత్తం 10,507 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా.. 9,621 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరంతా ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందనున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 76 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అడ్మిషన్ల ప్రక్రియ ఇలా.. ఇంటర్ ఫస్టియర్ తరగతులు జూన్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన టీసీ, స్టడీ సర్టిఫికెట్, తాత్కాలిక ఎస్ఎస్సీ మెమో ఆధారంగా ఇంటర్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఒరిజినల్ ఎస్ఎస్సీ మెమో సమర్పించిన తర్వాత అడ్మిషన్ నిర్దారిస్తారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలకు 29 శాతం, పీహెచ్ 5 శాతం, ఎన్సీసీ, స్పోర్ట్స్ కోటా 5 శాతం, ఎక్స్ సర్వీస్మెన్ 3 శాతం, ఈడబ్ల్యూఎస్ 10 శాతం సీట్లు కేటాయిస్తారు. 33.3 శాతం అంటే 1/3 వంతు సీట్లు బాలికలకు రిజర్వు చేస్తారు. పదో తరగతిలో పొందిన గ్రేడింగ్ ఆధారంగా అడ్మిషన్లలో ప్రాధాన్యం ఇస్తారు. తెలంగాణ ఇంటర్ బోర్డు గుర్తింపు పొందిన అనుబంధ కళాశాలల్లో మాత్రమే ప్రవేశాలు పొందాలని ఆధికారులు సూచిస్తున్నారు. అందుబాటులో ఉన్న కళాశాలల జాబితాను అధికారిక వెబ్సైట్ (tsbie.cgg.gov.in)లో చూడవచ్చు.సద్వినియోగం చేసుకోవాలి.. ఇంటర్ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తమకు నచ్చిన కోర్సుల్లో అడ్మిషన్ పొందవచ్చు. అన్ని రకాల కోర్సులు, సదుపాయాలు ఉన్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కాలేజీల్లోనే చేర్పించాలి. ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించి ఆర్థికంగా నష్టపోవద్దు. – వెంకటరమణ, డీఐఈఓ -
టీబీ నియంత్రణకు కృషిచేయాలి
నాగర్కర్నూల్ క్రైం: టీబీ వ్యాధి నియంత్రణకు వైద్య సిబ్బంది నిరంతరం కృషిచేయాలని రాష్ట్ర ప్రోగ్రాం అధికారి రాజేశం అన్నారు. జిల్లాకేంద్రంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో శుక్రవారం రాత్రి స్థానిక వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్కర్నూల్ను టీబీ రహిత జిల్లాగా మార్చాలన్నారు. టీబీ వ్యాధిగ్రస్తులకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి సరైన మందులు అందేలా చూడాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందన్నారు. టీబీ వ్యాధిగ్రస్తుల వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు అందించాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ సుధాకర్లాల్, జిల్లా టీబీ ప్రోగ్రాం అధికారి కృష్ణమోహన్, వైద్యులు సాయినాథ్రెడ్డి, ప్రదీప్ పాల్గొన్నారు. -
పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
నాగర్కర్నూల్: జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక వసతుల పనులను పాఠశాలల పునఃప్రారంభం నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఉదయ్కుమార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి సీఎస్ శాంతికుమారి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులు, ధరణి దరఖాస్తులు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై కలెక్టర్లతో వీసీ నిర్వహించి సమీక్షించారు. పాఠశాలల పునఃప్రారంభానికి ముందే ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన కనీస మౌలిక వసతుల కల్పన పనులు పూర్తిచేయాలని కలెక్టర్లను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ అమ్మ ఆదర్శ పాఠశాలల్లో చేపడుతున్న పనులు నాణ్యతగా ఉండాలన్నారు. జిల్లాలోని 778 ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం, టాయిలెట్స్, ఎలక్ట్రిసిటీ, పెయింటింగ్, బెంచీలు, గ్రీన్ చాక్ బోర్డు, మైనర్ మరమ్మతు వంటివి వెంటనే పూర్తిచేయాలన్నారు. నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడొద్దని, నాణ్యమైన మరుగుదొడ్లు, టాయిలెట్స్లో మంచి టైల్స్, రన్నింగ్ వాటర్ ఉండాలని ఆదేశించారు. పాఠశాలల్లో మున్సిపల్ నల్లా లేని చోట హెచ్ఎండబ్ల్యూఎస్ వారితో మాట్లాడి పైప్లైన్ ద్వారా పిల్లలకు మంచి తాగునీరు అందేలా చూడాలన్నారు. పాఠశాలల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని చెప్పారు. పాఠశాలల్లో తలుపులు, కిటికీలు, ఫ్లోరింగ్ వంటివి మరమ్మతు చేయాలన్నారు. పాఠశాలల్లో పనులు చేపట్టక ముందు.. పనులు చేపట్టిన తర్వాత ఫొటోలను తీయాలన్నారు. గ్రామస్థాయి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల తోడ్పాటుతో పనులు పూర్తి చేయాలని, పాఠశాలల్లో అన్ని వసతులతో రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులకు స్వాగతం పలకాలని సూచించారు. యూనిఫాం కుట్టు పనులు స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని, ఏ సంఘంలోనైనా కెపాసిటీకి తగిన పనులు చేయకపోతే ఇతర సంఘాలకు అప్పగించాలని, సకాలంలో డ్రెస్సులు కుట్టేలా క్షేత్రస్థాయిలో ఏపీఎంలు పర్యవేక్షించాలన్నారు. పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన మార్పులు ధరణి మాడ్యుల్స్లో చేయడం జరిగిందన్నారు. ప్రజావాణి దరఖాస్తులలో అధికంగా రెవెన్యూ, ధరణి సంబంధిత సమస్యలు అధికంగా వస్తున్నాయని, వీటిని ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో జూన్ 7 వరకు ప్రజావాణిని నిలిపివేశామని, ప్రజావాణి పునఃప్రారంభానికి ముందే పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులు పూర్తిస్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ప్రారంభించామని, చివరి దశలో పెండింగ్ ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కుమార్ దీపక్, సీతారామారావు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఉదయ్కుమార్ -
అన్నదాతల అగచాట్లు
కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల తిప్పలు వివరాలు 8లో uకేంద్రంలోనే ఉంటున్నాం.. తెలకపల్లి వ్యవసాయ మార్కెట్లోని కొనుగోలు కేంద్రానికి వరి ధాన్యాన్ని తీసుకొచ్చి వారం రోజులైంది. అధికారులు తేమ శాతం రాలేదని, హమాలీల కొరత ఉందంటూ దాటవేస్తున్నారు. దీంతో తూకం మరింత ఆలస్యమవుతోంది. ఇప్పటికే చాలామంది రైతులు ప్రైవేటు వ్యక్తులకు ధాన్యం అమ్ముకున్నారు. మిగిలిన కొద్దిపాటిది అయినా వెంటనే కొనుగోలు చేయాలి. – వీరారెడ్డి, రైతు, దాసుపల్లి, తెలకపల్లి మండలం సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలోని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం కష్టించి పడించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి వారం, పదిరోజులు గడుస్తున్నా తూకం వేయకపోవడంతో రైతులు రోజుల తరబడి కేంద్రాల వద్దే నిరీక్షించాల్సి వస్తోంది. ఓవైపు కమ్ముకొస్తున్న మేఘాలు, వాన చినుకులకు రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు ప్లాస్టిక్ కవర్లు కప్పి ఉంచుతున్నారు. తమ ధాన్యం ఎప్పుడు కొంటారోనని ఎదురుచూస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులకే విక్రయం.. ఈ సీజన్లో అధిక శాతం వరిధాన్యాన్ని రైతులు ప్రైవేటు వ్యక్తులకే విక్రయించారు. జిల్లావ్యాప్తంగా ఈసారి మొత్తం 1.10 లక్షల మె.ట., ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యం కేవలం 21,221 మె.ట., మాత్రమే. జిల్లా అధికారులు నిర్దేశించుకున్న లక్ష్యంలో కనీసం పావువంతు కూడా కొనుగోలు పూర్తి కాలేదు. మరోదిక్కు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తెచ్చిన రైతులకు తేమశాతం పేరుతో అధికారులు కొర్రీలు పెడుతున్నారు. అలాగే చాలావరకు కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీనికితోడు లారీల ద్వారా ధాన్యం రవాణా సైతం నత్తనడకన సాగుతోంది. ఫలితంగా రైతులు కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. మేలు రకం వరిధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో మంచి ధర పలుకుతుండటం.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో తేమ పేరుతో రోజుల తరబడి గడుపుతుండటంతో రైతులు ఎక్కువగా ప్రైవేటు వ్యక్తులకు అమ్మేందుకే మొగ్గుచూపారు. ఇప్పటికే సగానికి పైగా ధాన్యాన్ని రైతులు ప్రైవేటుకు అమ్ముకున్నారు. మిగిలిన కొద్దిపాటి ధాన్యాన్ని కూడా అధికారులు సకాలంలో సేకరించలేకపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. హమాలీలు లేరంట.. మా ఊళ్లోని ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వరిధాన్యం తెచ్చి వారం రోజులు దాటింది. ఎప్పుడెప్పుడు తూకం వే స్తారోనని ఎదురుచూస్తున్నాం. తూకం వేసేందుకు ఇక్కడ హమాలీలు లేరని, బిహార్ కులీలు వచ్చి తూకం వేస్తారని చె బుతున్నారు. ఎప్పుడు వర్షం వచ్చి ధాన్యం కొ ట్టుకుపోతుందో తెలియక ప్లాస్టిక్ కవర్లు కప్పి ధా న్యం కాపాడుకుంటున్నాం. పెద్ద వాన వస్తే మా పరిస్థితి ఏమవుతుందోనని భయంగా ఉంది. – బత్తుల తిరుపతమ్మ, మహిళా రైతు, ఉప్పునుంతల జిల్లాలో ప్రైవేటు వ్యక్తులకే అధికశాతం ధాన్యం వారాల తరబడి అధికారులు కొర్రీలు కొనుగోలు లక్ష్యం లక్ష మెట్రిక్ టన్నులు.. ప్రభుత్వం కొన్నది 22 వేలు -
ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కల్వకుర్తి టౌన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 8, 10వ తరగతి పాసై.. 14 ఏళ్లు పైబడిన విద్యార్థులు చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ జిల్లా కన్వీనర్ లక్ష్మణస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు గాను 10వ తరగతి మెమో, ఆధార్, ఫోన్ నంబర్, బోనోఫైడ్, కుల ధ్రువీకరణ, పాస్ ఫొటో జతచేసి www.iti.telangana.gov.in వెబ్సైట్లో వచ్చేనెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. బెస్ట్ అవైలబుల్ రెసిడెన్షియల్లో.. నాగర్కర్నూల్ క్రైం: ప్రస్తుత విద్యా సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 1, 5 తరగతుల్లో ప్రవేశాల కోసం ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రాంలాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను శనివారం నుంచి వచ్చే నెల 7వరకు తమ కార్యాలయంలో అందజేయాలన్నారు. పాఠశాలలో ప్రవేశానికి కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుందని, పూర్తి వివరాలకు సెల్ నం.63039 64467ను సంప్రదించాలని కోరారు. దోస్త్ ద్వారా డిగ్రీలో.. కొల్లాపూర్: దోస్త్ ద్వారా డిగ్రీలో అడ్మిషన్లు పొందాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రామరాజుయాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో చేరే విద్యార్థుల్లో ప్రతిభావంతులైన వారికి ఉచిత బస్పాస్ సౌకర్యం కల్పిస్తామన్నారు. న్యాక్ ద్వారా గుర్తింపు పొందిన కళాశాలల్లో కొల్లాపూర్ డిగ్రీ కళాశాల ఒకటన్నారు. నిపుణులైన అధ్యాపకులు కళాశాలలో అందుబాటులో ఉన్నారన్నారు. అడ్మిషన్ల కోసం దోస్త్ కన్వీనర్ సి.రమేష్కుమార్ సెల్ నెం.85199 91419ను సంప్రదించాలని చెప్పారు. బైక్ల వేలంలో పాల్గొనండి నాగర్కర్నూల్ క్రైం: జిల్లా పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఉన్న 6 స్క్రాప్ ద్విచక్రవాహనాలను బహిరంగ వేలం వేస్తున్నట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ వేలంను ఈ నెల 28న నిర్వహిస్తామని, ఆసక్తి గలవారు పాల్గొనాలని కోరారు. మహిళలను వేధిస్తే చర్యలు నాగర్కర్నూల్ క్రైం: మహిళలను వేధింపులకు గురిచేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే ఆపద సమయంలో షీటీంను సంప్రదిస్తే రక్షణ కల్పిస్తామని ఏఎస్పీ రామేశ్వర్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో షీటీం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చన్నారు. ఎవరైనా వేధింపులకు గురైతే సెల్ నం.87126 57675ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో షీటీం ఏఎస్ఐ విజయలక్ష్మి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. -
చెంచుల అభిప్రాయం మేరకే ముందుకు..
మన్ననూర్: అమ్రాబాద్ పులుల రక్షిత అభయారణ్యంలో అడవులు, వన్యప్రాణులతో కలిసి జీవనం సాగిస్తున్న ఆదివాసీ చెంచుల అభిప్రాయం మేరకే అడవుల్లో ఏ పనులైన చేపడుతాయని డీఎఫ్ఓ రోహిత్రెడ్డి తెలిపారు. ఏడాదిలో 9 నెలలపాటు సలేశ్వరం క్షేత్రాన్ని సందర్శించుకునేందుకు అటవీశాఖ ఏర్పాటు చేసే సఫారీ గురించి శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రతిఏటా సలేశ్వరంలో జరుపుకొనే ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి ఒకేసారి వేల సంఖ్యలో వచ్చే భక్తుల రద్దీని తగ్గించేందుకు సఫారీ ఏర్పాటు ప్రతిపాదనలు తీసు కువస్తున్నది నిజమేనని చెప్పారు. ఈ క్రమంలో రాంపూర్, అప్పాపూర్ తదితర పెంటల్లో నివాసం ఉంటున్న చెంచులతో అటవీశాఖ తరపున సమాలోచనలు చేసిన అనంతరం కలెక్టర్కు ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ నిర్ణయం ప్రాతిపదికన అటవీశాఖ ఉన్నతాధికారి పీసీసీఎఫ్ అనుమతి తర్వాతే చేపడుతామన్నారు. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి ఇప్పటి వరకు జిల్లాస్థాయిలోనే చర్చ జరగలేదన్నారు. వేలు, లక్షల సంఖ్యలో ప్రజలు ఒకేసారి అభయారణ్యంలోకి వెళ్లి ఉత్సవా లు జరుపుకోవడం ఫారెస్టు నిబంధనలకు విరుద్ధం కాబట్టే.. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల దిశలో ఉన్నామన్నారు. ప్రస్తుతం అటవీ సరిహద్దులో ఇది వరకు వివిధ ప్రాంతాల్లో ఉన్న రహదారులలోనే మట్టి వేస్తూ సరిచేస్తున్నామన్నారు. సలేశ్వరం సందర్శనలో భాగంగా సఫారీ కోసం రోడ్లు వేస్తున్నామని ఓ దినపత్రికలో వచ్చిన కథనంలో ఎంత మాత్రం నిజం లేదని డీఎఫ్ఓ కొట్టిపారేశారు. అట వీ శాఖ, 108 సిబ్బంది చెంచుల కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లేందుకు వీలుగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రస్తుతం రోడ్లకు మరమ్మతు చేస్తున్నామన్నారు. సలేశ్వరం సఫారీ ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇది వరకు ఉన్న రోడ్లనే ఉపయోగిస్తామన్నారు. -
రోజు రూ.2 కోట్లకుపైగానే..
ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు బస్టాండ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా కనిపించింది. ఈ నెల 12 మినహాయించి మిగతా రోజుల్లో మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ నిత్యం రూ.2 కోట్లపైగా ఆదాయం వచ్చింది. ఆర్టీసీ రీజియన్ అధికారులు ప్రజలకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవడంతో బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా అన్ని డిపోల నుంచి హైదరాబాద్ రూట్లో అధిక ఆదాయం సమకూరింది. ఈ మార్గంలోని బస్సులు ప్రయాణికులతో కనిపించాయి. మహాలక్ష్మి పథకం ప్రయాణికులతోపాటు ఇతరులు అధిక సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారు. ఈ రోజుల్లో ఆర్టీసీ రీజియన్ మెరుగైన ఆక్యుపెన్షి రేషియోను పొందింది. ఈ ఐదు రోజుల్లో రీజియన్లోని పది డిపోలు 100కుపైగా ఓఆర్ను సాధించింది. -
కేంద్రాల వద్ద టార్పాలిన్లు కరువు..
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు ఆలస్యంగా సాగుతుండటం, మరోవైపు వర్షాల నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకునేందుకు కేంద్రాల వద్ద కనీసం టార్పాలిన్లు కూడా అందుబాటులో లేవు. దీంతో రైతులే ప్లాస్టిక్ కవర్లను సమకూర్చుకుని ధాన్యంపై కప్పుతున్నారు. అలాగే ధాన్యం తూకం కోసం తమవంతు వచ్చే వరకు రోజుల తరబడి కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్నారు. రైతుల ఇబ్బందులపై జిల్లా పౌరసరఫరా శాఖ అధికారిని సంప్రదించేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
గాలివాన దుమారం
తిమ్మాజిపేట, బిజినేపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో గురువారం గాలివాన దుమారం రేపింది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. అకాల వర్షంతో ఆరబెట్టిన ధాన్యంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడసి ముద్దయ్యింది. ధాన్యం కుప్పల కిందకు నీరు చేరకుండా రైతులు నానా తంటాలు పడ్డారు. ఈదురుగాలులతో మామిడికాయలు రాలిపోయాయి. మహదేవునిపేట – గంగారం గ్రామాల మధ్య భారీ చెట్టు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాగా, వర్షంతో వాతావరణం చల్లబడింది. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. – బిజినేపల్లి -
ధాన్యం సేకరణలో వేగం పెంచాలి
పెంట్లవెల్లి: కొన్ని రోజులుగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని డీఆర్డీఓ ఓబులేష్ అన్నారు. మండలంలోని జటప్రోల్, గోప్లాపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ధాన్యం తడవకుండా జాగ్రత్తలు పాటించాలని.. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణ చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం నర్సరీలను పరిశీలించారు. హరితహారం కార్యక్రమానికి అన్నిరకాల మొక్కలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. డీఆర్డీఓ వెంట ఎంపీడీఓ ప్రసన్నకుమారి, ఏపీఎం గౌసొద్దీన్ తదితరులు ఉన్నారు. నేడు డయల్ యువర్ ఆర్ఎం స్టేషన్ మహబూబ్నగర్: డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వి.శ్రీదేవి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ప్రయాణికులు తమ సూచనలు, సలహాలను 99592 26295 నంబర్కు తెలియజేయాలని కోరారు. -
అగ్నివీర్ వాయుకు దరఖాస్తుల ఆహ్వానం
నాగర్కర్నూల్ క్రైం: భారత వాయుసేనలో అగ్నివీర్ వాయుగా చేరేందుకు ఆసక్తిగల అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి సీతారాం గురువారం ప్రకటనలో తెలిపారు. ఈనెల 22 నుంచి జూన్ 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారని.. భారత వాయుసేనలో చేరాలనుకునే యువత ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు agnipathvayu.cdac.in వెబ్సైట్లో సంప్రదించాలని సూచించారు. స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోండి నాగర్కర్నూల్ క్రైం: గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2024–25 విద్యా సంవత్సరం అందించే నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కమలాకర్ గురువారం ప్రకటనలో తెలిపారు. మాస్టర్ పీహెచ్డీ, రీసెర్చ్ ప్రోగ్రాం కోసం విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే గిరిజన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ అందిస్తుందని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు overseas.tribal.gov.in పోర్టల్ ద్వారా ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశానికి అవకాశం మన్ననూర్: కార్పొరేట్ కళాశాలల్లో 2024–25 విద్యాసంవత్సరం ప్రవేశానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ జిల్లా అధికారి రాంలాల్ గురువారం ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, ఎయిడెడ్, బెస్ట్ అవైలబుల్, నవోదయ, తెలంగాణ ఆదర్శ పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రమే ఇందుకు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు ఎస్ఎస్సీ మెమో, బోనాఫైడ్, టీసీ, ఆధార్, కుల ధ్రువపత్రాలతో జూన్ 10వ తేదీలోగా http://telangana. gov.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ‘ఐటీఐలో చేరండి’ మన్ననూర్: ప్రభుత్వ ఆదేశాల మేరకు 2024–25–26 విద్యా సంవత్సరం ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో ప్రవేశానికిగాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మన్ననూర్ ఐటీఐ ప్రిన్సిపాల్ జయమ్మ గురువారం ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు మొబైల్ ఐడీ, ఆధార్ కార్డును ఐడీగా చూపించాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగల ఎస్ఎస్సీ విద్యార్థులు కుల ధ్రువపత్రం, ఎస్ఎస్సీ మెమో, బోనాఫైడ్, టీసీ, ఆధార్ కార్డుతో http://www. ititelangana.gov.in వెబ్సైట్లో జూన్ 10వ తేదీలోగా దరకాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 80960 35178, 63000 619644 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. సమస్యల పరిష్కారానికి 1104 యూనియన్ కృషి నాగర్కర్నూల్ క్రైం: విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి 1104 యూనియన్ నిరంతరం కృషి చేస్తోందని జిల్లా అధ్యక్షుడు రాంచందర్ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం 1104 యూనియన్ నాగర్కర్నూల్ డివిజన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీనివాసులు, కార్యదర్శిగా అమరేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్, సహాయ కార్యదర్శిగా ఉపేందర్ యాదవ్ ఎన్నిక కాగా.. పలువురు శాలువా, పూలమాలతో సత్కరించారు. 20 నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు వెల్దండ: మండలంంంలోని భైరాపూర్లో ఈనెల 20నుంచి 24వ తేదీ వరకు లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. మొదటి రోజు ఉదయం 6 గంటలకు మేదిని పూజ, విశ్వక్సేన ఆరాధన, రక్షా బంధనం, 21న అర్చన, ధ్వజారోహణం, హోమం, పూర్ణాహుతి, భేరిపూజ, వాహన సేవ, ఎదుర్కోళ్ల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 22న లక్ష్మీ నరసింహస్వామికి అభిషేకం, పూర్ణాహుతి, కల్యాణోత్సవం, 23న పుష్పయాగం, తీర్థగోష్ఠి, 24న హోమం, స్వామివారి రథయాత్ర ఉంటాయని వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. -
పరిసరాల శుభ్రతతోనే డెంగీ నివారణ
నాగర్కర్నూల్ క్రైం: పరిసరాల శుభ్రతతోనే డెంగీ వ్యాధిని నివారించవచ్చని డీఎంహెచ్ఓ డా.సుధాకర్లాల్ అన్నారు. జాతీయ డెంగీ నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగీ వ్యాధికి కారణమయ్యే దోమలను నిర్మూలించేందుకు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో డెంగీ నివారణ కోసం గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటిని సర్వేచేసి, జ్వరం లక్షణాలు ఉంటే టీ–హబ్ ద్వారా ఉచితంగా నిర్దారణ పరీక్షలు చేయిస్తున్నామని చెప్పారు. డెంగీ చికిత్సకు అన్ని ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి శుక్రవారం విధిగా డ్రైడే పాటించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.వెంకట్ దాస్, డా.నారాయణస్వామి, మలేరియా నివారణ అసిస్టెంట్ అధికారి ఆర్.శ్రీనివాసులు, కేశవులు, నిరంజన్, రమేష్రెడ్డి, కుమార్, కల్యాణ్, సురేష్, రాజవర్ధన్, గిరి పాల్గొన్నారు. -
డ్రైవింగ్లో అప్రమత్తత అవసరం
నాగర్కర్నూల్ క్రైం: ఆర్టీసీ డ్రైవర్లు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయాలని జిల్లా రవాణా శాఖ అధికారి చిన్నబాలు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో గురువారం నిర్వహించిన క్యాష్ అవార్డుల ప్రధానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నాగర్కర్నూల్ ఆర్టీసీ డిపోను జీరో యాక్సిడెండ్ డిపోగా ఉండాలని.. అందుకు ప్రతి డ్రైవర్ ఏకాగ్రతతో బస్సులను నడపాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ఫోన్ మాట్లాడుతూ, మద్యం తాగి డ్రైవింగ్ చేయకూడదన్నారు. డీఎం దేవరాజ్ మాట్లాడుతూ.. నాగర్కర్నూల్ డిపోను ఆదాయంలో ముందువరుసలో ఉంచేందుకు ఉద్యోగులందరూ కృషి చేయాలని కోరారు. ఆర్టీసీ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తూ.. సంస్థపై నమ్మకం పెరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో గ్యారేజ్ ఇన్చార్జి భాస్కర్, సిబ్బంది రామకృష్ణ, బాల్రెడ్డి, శ్రీనివాసులు, పరశురాం, నారాయణ పాల్గొన్నారు. -
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ పరిధిలో గురువారం డిగ్రీ 2, 6వ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 49 కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఉదయం జరిగిన రెండో సెమిస్టర్ పరీక్షకు 11,848 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 11,227 మంది హాజరయ్యారు. ఇక మధ్యాహ్నం జరిగిన ఆరో సెమిస్టర్ పరీక్షకు 11,448 మందికిగాను 11,108 మంది హాజరైనట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా, కొండనాగులలో ఇద్దరు, నాగర్కర్నూల్లో ఒక విద్యార్థి మాల్ ప్రాక్టిస్కు పాల్పడుతూ అధికారులకు పట్టుబడగా.. డిబార్ చేసినట్లు పీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ రాజ్కుమార్ తెలిపారు. -
ఫలించిన ఎన్నికల సంఘం చర్యలు..
లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు. ఓటుహక్కు వినియోగంపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సామాజిక మధ్యమాల ద్వారా కొత్త ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారం చేపట్టారు. ఎన్నికల విధుల్లో ఉండి ఓటుకు దూరమయ్యే వారు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు మరిన్ని వర్గాలకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించారు. వైద్యులు, మెడికల్ సిబ్బంది, జర్నలిస్టులు, ఇతర ఎమర్జెన్సీ విభాగాల వారికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం అందించారు. మారుమూల ప్రాంతాలు, గిరిజన ఆవాసాలు, చెంచు గూడెల్లోని ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగం కోసం అదనంగా 113 పోలింగ్ ఉపకేంద్రాలను ఏర్పాటుచేశారు. ప్రధానంగా చెంచుపెంటల్లోనూ తాత్కాలిక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఎన్నికల్లో చెంచులు, గిరిజనులు, వృద్ధులు భాగస్వామ్యమయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా గత లోక్సభ ఎన్నికలకన్నా ఈసారి ఓటింగ్ పెంచడంలో ఎన్నికల యంత్రాగం సఫలీకృతమైంది. -
జాతీయ రహదారి పనులు వేగవంతం చేయాలి
నాగర్కర్నూల్: జిల్లాలో నేషనల్ హైవే అభివృద్ధి పనులు, నేషనల్ హైవే–167 కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు 79 కిలోమీటర్ల వరకు కొనసాగుతున్న విస్తరణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ఉదయ్కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం నాగర్కర్నూల్ కలెక్టర్ ఛాంబర్లో కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ సంబంధిత శాఖలైన రెవెన్యూ, జాతీయ రహదారి అధికారులతో భూసేకరణ పనులు, జాతీయ రహదారి పురోగతి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జాతీయ రహదారికి సంబంధించి జిల్లాలోని కొల్లాపూర్ మండల పరిధిలోని వరిదేల గ్రామపరిధిలో భూసేకరణ పనులను వేగవంతం చేయాలని, అందుకు సంబంధించిన భూ యజమానులు, రైతులకు రావాల్సిన నష్టపరిహారాన్ని త్వరితగతిన చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ వరకు 79 కిలోమీటర్ల పరిధిలో కొనసాగుతున్న విస్తీర్ణ పనుల్లో ఇప్పటివరకు 33 కిలోమీటర్ల రహదారి పనులు పూర్తయినట్లు జాతీయ రహదారి ఆర్అండ్బీ ఎస్సీ, కలెక్టర్కు వివరించారు. కార్యక్రమంలో జాతీయ రహదారి ఆర్అండ్బీ ఎస్ఈ ధర్మారెడ్డి, కొల్లాపూర్ ఆర్డీఓ నాగరాజ్, రెవెన్యూ ఆర్అండ్బీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఉదయ్కుమార్ -
సమష్టి కృషితోనే ఎన్నికల ప్రక్రియ విజయవంతం
నాగర్కర్నూల్: అధికారుల సమష్టి భాగస్వామ్యంతో ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయగలిగామని నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఉదయ్ కుమార్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మార్చి 16 నుంచి మే 14 వరకు స్ట్రాంగ్ రూంలో ఈవీఎంలు భద్రపరిచే ప్రక్రియ వరకు ఎన్నికల నిర్వహణలో వనపర్తి, గద్వాల జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లాల నోడల్ అధికారులు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఏఆర్వోల సహాయ, సహకారాల అందించారన్నారు. నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికలు విజయవంతంగా పూర్తి కావడంతో ఎన్నికల అధికారులు సిబ్బంది బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఉదయ్కుమార్కు పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతిఒక్కరిని ఆయన అభినందించారు. జిల్లాలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం చాలా సంతోషమన్నారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ విభాగం నోడల్ అధికారులు మంచి శిక్షణ అందజేసి ఎన్నికలను సమర్థవంతంగా నిర్వర్తించడంలో కీలక భాగస్వామ్యం వహించారన్నారు. ఎన్నికల సిబ్బందికి అన్ని వసతులు కల్పించడం, నాణ్యమైన భోజనాన్ని అందించడంలో అధికార యంత్రాంగం సఫలీకృతమైందన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, వివిధ విభాగాల ఎన్నికల నోడల్ అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అందరికీ తెలిసినా ...
కృష్ణానదిలో నిషేధిత అలవి వలలతో చేపల వేట ప్రతి ఏడాది సాగుతోంది. నదీ తీర ప్రాంతాల్లోని కొందరు మత్స్యకారులు చేపలు పట్టే ప్రాంతాలను (పట్లు) అలవి వ్యాపారులకు రూ.లక్షలకు అమ్ముకుంటారు. ఆ ప్రాంతంలోనే అలవి వలలు విసిరి చేపలు పడుతుంటారు. అలవి వలలు విసిరేందుకుగాను వైజాగ్ నుంచి మత్స్యకారులను పిలిపిస్తారు. తీర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజాప్రతినిధులు, మండల అధికారులకు ఈవిషయం తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కాగా, గతంలో మంచాలకట్ట, జటప్రోల్ గ్రామాలకు చెందిన సంప్రదాయ మత్స్యకారులు అలవి వలల వినియోగంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. మత్స్యశాఖ అధికారులు స్పందించి అలవి వేటగాళ్లపై కేసులు నమోదు చేశారు. అడపాదడపా ఇటువంటి కేసులు మినహాయిస్తే.. అలవి వలల వినియోగంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. -
No Headline
కొల్లాపూర్: కృష్ణానదిలో మత్స్యసంపద దోపిడీకి గురవుతోంది. నదిలో నీటిమట్టం పూర్తిగా తగ్గడంతో నిషేధిత అలవి వలలతో చేపపిల్లలను పట్టే మత్స్యకారులు రంగంలోకి దిగారు. నదిలో యథేచ్ఛగా అలవి వలలతో అక్రమ వేట సాగిస్తూ, మత్స్యసంపదను లూటీ చేస్తున్నారు. బీచుపల్లికి దిగువ నుంచి చిన్నంబావి, పెంట్లవెల్లి, కొల్లాపూర్ మండలాల వెంట కృష్ణానది ప్రవహిస్తోంది. ఈసారి నదిలో నీటిమట్టం పూర్తిగా తగ్గడంతో వ్యాపారులు నిషేధిత అలవి వలలతో వేట ప్రారంభించారు. అందుకోసం చిన్నంబావి మండల పరిధిలో ఒకచోట, మల్లేశ్వరం, సోమశిల, అమరగిరి సమీప ప్రాంతాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు. అలవి వలల కారణంగా నదిలో చేపలు పెరగడం లేదని. తమ జీవనోపాధి దెబ్బతింటోందని సంప్రదాయ మత్స్యకారులు వాపోతున్నారు. సరిహద్దులు మారుతూ చేపల వేట.. తెలంగాణ, ఏపీ సరిహద్దుల వెంట కృష్ణానది ప్రవహిస్తోంది. నదికి ఓవైపు తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి, మరోవైపు ఏపీ పరిధిలోకి వస్తుంది. దీన్ని అలవి వ్యాపారులు తమకు అనువుగా మార్చుకుంటున్నారు. తెలంగాణ అధికారులు దాడులకు వచ్చినప్పుడు ఏపీ వైపు.. అక్కడి అధికారులు దాడులకు వచ్చినప్పుడు తెలంగాణ వైపు తమ గుడారాలను మార్చేస్తున్నారు. ఉదయం ఓవైపు, సాయంత్రం మరోవైపు వలలను లాగుతున్నారు. -
ముఖ్యనేతల పనితీరుపైనా..
కొడంగల్ నియోజకవర్గంలో 50వేల మెజార్టీ ఇవ్వాలని సభావేదికగా ప్రజలకు విజ్ఞప్తి చేసిన రేవంత్రెడ్డి.. ఆ నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో పోలింగ్కు నాలుగైదు రోజుల ముందు హైదరాబాద్లో సమావేశమై అనుసరించాల్సి వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. అయితే పోలింగ్ అనంతరం కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు, కోస్గి, దౌల్తాబాద్తో పాటు ఇతర నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో సైలెంట్గా క్రాస్ ఓటింగ్ సాగినట్లు ప్రచారం చోటుచేసుకుంది. దీనిపై పార్టీలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం కాగా.. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మండలాలు, గ్రామాలు, బూత్ల వారీగా నిశితంగా పరిశీలించి ఎక్కడెక్కడ క్రాస్ ఓటింగ్ జరిగింది? అక్కడ కాంగ్రెస్ నాయకులు ఎందుకు పసిగట్టలేకపోయారు? వారు ప్రజల మధ్య తిరిగారా..లేదా? వంటి వివరాలతో సమగ్ర నివేదిక అందజేయాలని వేగులను ఆదేశించినట్లు సమాచారం. అనుకూల, ప్రతికూల అంశాలతో పాటు కాంగ్రెస్ నియోజకవర్గ ముఖ్య నేతల పనితీరుపైనా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసినట్లు వినికిడి. ఈ బాధ్యతను తనకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న ఒకరికి అప్పగించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
కొత్త కోర్సులు...
పీయూ పరిధిలో సుమారు 31 వేల సీట్ల భర్తీకి ప్రతి సంవత్సరం ప్రభుత్వం అనుమతి ఇస్తున్నప్పటికీ.. పూర్తిస్థాయిలో భర్తీ కావడం లేదు. గత సంవత్సరం 50 శాతం కూడా సీట్లు భర్తీ కాలేదు. ఈక్రమంలో సీట్ల భర్తీని పెంచేందుకుగాను ప్రభుత్వం వృత్తి ఆధారిత కోర్సులను తీసుకువచ్చింది. అందులో భాగంగా మహబూబ్నగర్ ఎంవీఎస్, ఎన్టీఆర్ కళాశాలలతో పాటు జడ్చర్లలోని బీఆర్ఆర్ కళాశాలల్లో కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. బీఏ (హెచ్ఈపీ) స్పెషల్ కోర్సులో జర్నలిజం, అంతర్జాతీయ రాజకీయాలు, పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సిలబస్లో మార్పులు తెచ్చారు. ఇక బీఎస్సీలో ఫార్మారంగంలో సేల్స్, మార్కెటింగ్లో సులభంగా ఉద్యోగాలు పొందేవిధంగా కొత్త కోర్సు ఉంది. బీకాం విభాగంలో ఫైనాన్స్ కోర్సు తీసుకువచ్చారు. బీబీఏలో రీటేయిల్ ఆపరేషన్ వంటి కోర్సులు ఉన్నాయి. వీటిలో వారానికి మూడు రోజుల పాటు విద్యాబోధన, మూడు రోజులు ఇంటర్న్షిప్ ఉండనుంది. -
మన పెళ్లికి ఒప్పుకోరు.. ఇద్దరం చనిపోదాం
బల్మూర్: బాలికను ప్రేమ పేరుతో వంచించాడు. పెళ్లికి పెద్దలు అడ్డు చెబుతారని ఆమెను నమ్మించి ఆత్మహత్యకు ప్రేరేపించాడు. చివరకు ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన నాగర్కర్నూల్ జిల్లా బల్మూరులో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి బాలిక కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. బల్మూర్కు చెందిన రాఘవేందర్ అదే గ్రామానికి చెందిన బాలిక(15) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.అయితే పెళ్లికి కుటుంబసభ్యులు అడ్డు చెబుతున్నారని రాఘవేందర్ ఈ నెల 11న గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలం వద్దకు బాలికను తీసుకెళ్లాడు. నువ్వు మైనర్.. పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకోవడం లేదు. ఇద్దరం కలిసి పురుగు మందు తాగి చనిపోదామని చెప్పా డు. వెంట తెచ్చిన పురుగు మందును మొదటగా ఆమెకు తాగించి, తాను కూడా తాగినట్టు నటించాడు. బాలిక అపస్మారక స్థితికి చేరుకోగానే మరో యువకుడి సహాయంతో బాలికను బైక్పై అచ్చంపేట ఆస్పత్రికి తరలించాడు.ఆపై బాలిక కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. ఆరోగ్య పరిస్థితి విషమించడంలో మెరుగైన వైద్యం కోసం ఆమెను నిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ ఆ బాలిక సోమవారం రాత్రి మృతి చెందింది. అయితే తమ కూతురుతో బలవంతంగా పురుగు మందు తాగించాడని బాలిక కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.పరిహారంగా రెండెకరాల భూమి బాలిక మృతిపై బల్మూర్లో పంచాయితీ పెట్టిన గ్రామపెద్దలు, కులస్తులు రెండెకరాల భూమి çపరిహారంగా ఇవ్వాలని తీర్మానించినట్టు తెలిసింది. రాఘవేందర్ తండ్రికి ఉన్న భూమిలో రెండు ఎకరాలు బాలిక తరఫున బంధువు పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని కాగితాలు రాసుకొని ధరణిలో స్లాట్ కూడా మంగళవారం బుక్ చేసినట్టు సమాచారం. భూమి మార్పిడి జరిగిన వెంటనే ఆస్పత్రిలో ఉన్న మృతదేహానికి ఆత్మహత్య కేసుగా నమోదు చేయించి ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలు జరిపించాలని ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. ఈ విషయమై ఎస్ఐ బాలరాజును వివరణ కోరగా బాలిక ఆత్మహత్యపై తమకు ఫిర్యాదు అందలేదని చెప్పారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు
యాదాద్రికి పోటెత్తిన భక్త జనం (ఫోటోలు)
నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
'బేబి' హీరో ఇంతలా మారిపోయాడేంటి? ఏకంగా అలా..
యశ్ దయాల్పై కోహ్లి ఫైర్.. దెబ్బకు ధోని ఖేల్ ఖతం!
భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా?
మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
టీడీపీపై బొత్స సెటైర్లు
తప్పక చదవండి
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement