అబద్ధాల కాంగ్రెస్‌కు పరాభవం తప్పదు | Sakshi
Sakshi News home page

అబద్ధాల కాంగ్రెస్‌కు పరాభవం తప్పదు

Published Sun, May 5 2024 6:10 AM

అబద్ధాల కాంగ్రెస్‌కు పరాభవం తప్పదు

● బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌

కథలాపూర్‌(వేములవాడ): అబద్ధపు హామీతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు పార్లమెంట్‌ ఎన్నికల్లో పరాభవం తప్పదని బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బోయినపెల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. శనివారం కథలాపూర్‌ మండలకేంద్రంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకొచ్చిన నాలుగు నెలల్లోనే ప్రజా వ్యతిరేకతకు గురైన కాంగ్రెస్‌ ప్రపంచ రికార్డు సృష్టించిందని ఎద్దేవా చేశారు. మత రాజకీయాలు చేస్తూ ఎంపీ బండి సంజయ్‌ రాజకీయ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ లోక బాపురెడ్డి, ఎంపీపీ జవ్వాజి రేవతి, జెడ్పీటీసీ నాగం భూమయ్య, వైస్‌ ఎంపీపీ కిరణ్‌రావు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

భీమారంలో ప్రచారం..

మేడిపల్లి: మేడిపల్లి, భీమారం మండలాల్లోని పోరుమల్ల, కట్లకుంట, కొండపూర్‌, మన్నేగూడెం గ్రామాల్లో వినోద్‌కుమార్‌ పర్యటించారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కరీంనగర్‌కు చేసిందేమీలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో హరిచరన్‌రావు, సత్తిరెడ్డి, అజిత్‌రావు, అంగడి ఆనంద్‌ ఆదిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement
Advertisement