-
వ్యవసాయ పనులు షురూ..
జగిత్యాలఅగ్రికల్చర్: రోహిణి కార్తె శనివారం ప్రవేశించడంతో రైతులు వానాకాలం సాగుకు సమాయత్తం అవుతున్నారు. నైరుతి రుతుపవనాలు ఈ కార్తెలోనే రానుండడంతో పశువుల ఎరువును రైతులు పొలాల్లోకి తరలిస్తున్నారు. చెత్తాచెదారం లేకుండా చేస్తున్నారు. భారీవర్షం పడగానే విత్తనాలు వేసేలా ప్రణాళిక వేసుకుంటున్నారు. కూలీలతో ఒప్పందం ఏడాదంతా పనిచేసేందుకు రైతులు కూలీలతో ఒప్పందం చేసుకుంటున్నారు. ప్రస్తుతం మగమనిషికి రూ.లక్ష వరకు జీతం ఉన్నా.. దొరికే పరిస్థితి లేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారే పాలేర్లుగా ఉంటున్నారు. ఆడమనిషికి సుమారు రూ.50వేల వరకు ఇస్తున్నారు. విత్తనాలు సిద్ధం జిల్లాలో 4.16లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి, కంది, పెసర వంటి పంటలు సాగుకానున్నాయి. ప్రస్తుతం జనుము, జీలుగ, కంది, పెసర విత్తనాలు ఆగ్రోస్ సేవాకేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. జనుము, జీలుగ, పిల్లిపెసర, పెసర విత్తనాలు పంపిణీ చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. రైతులందరికీ అందడం గగనంగానే మారింది. రసాయన ఎరువుల కొనుగోలు గతంలో యూరియావంటి రసాయన ఎరువులకు కొరత ఏర్పడి రైతులు ఇబ్బందిపడ్డారు. దీనికితోడు రసాయన ఎరువుల ధరలు ఎప్పుడు పెరుగుతాయో..? ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ముందు జాగ్రత్తగా ఖరీఫ్ సీజన్కు సరిపడా యూరియా, కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేసి స్టాక్ పెట్టుకుంటున్నారు. రుణాలపై రైతుల సందిగ్ధం పంట రుణాలపై రైతుల్లో సందిగ్ధం నెలకొంది. వాస్తవంగా రైతులు మే, జూన్లో బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు రెన్యూవల్ చేసుకుంటారు. ప్రభుత్వం ఆగస్టు 15 లోపు రూ.2లక్షలలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. రుణాల రెన్యూవల్కు రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. వర్షాలపైనే ఆందోళన గతేడాది అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది కూడా సాధారణ వర్షపాతాలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతులు వానాకాలం సాగుకు సమాయత్తమవుతున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్ మొదటివారంలోనే రావచ్చనే అంచనాల దృష్ట్యా రైతులు అన్ని విధాలుగా సిద్ధం అవుతున్నారు. రోహిణి కార్తె ప్రవేశం సమాయత్తం అవుతున్న రైతులు -
‘డీఎంహెచ్వోను సస్పెండ్ చేయాలి’
జగిత్యాలటౌన్: 104 అంబులెన్స్ డ్రైవర్ రాజ్కుమార్ మృతికి కారకుడైన డీఎంహెచ్వో పుప్పాల శ్రీధర్ను సస్పెండ్ చేయాలని ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కాయితి శంకర్ డిమాండ్ చేశారు. వైద్యాధికారి వేధింపులు భరించలేక శుక్రవారం విధుల్లోనే గుండెపోటుతో మరణించాడని, మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని శనివా రం 104 సిబ్బందితో కలిసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. బాత్రూంలు, టాయ్లెట్లు క్లీన్ చేయిస్తూ రాజ్కుమార్ను తీవ్ర ఒత్తిడికి గురి చేశాడని, శ్రీధర్పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, లేకుంటే ఆందోళ న చేస్తామని హెచ్చరించారు. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కాయితి శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి మెట్టు దాస్, ప్రధాన కార్యదర్శి ఎనుగంటి రాజేశ్, రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్, జిల్లా అధ్యక్షుడు నక్క శేఖర్, మృతుడి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. డీఎంహెచ్వోపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు జగిత్యాలక్రైం: డీఎంహెచ్వో శ్రీధర్పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ వేణుగోపాల్ తెలిపారు. 104 డ్రైవర్ రాజ్కుమార్ను మూడు రోజులుగా ఇంటికి వెళ్లనీయకుండా.. విశ్రాంతి లేకుండా డ్యూటీలు వేస్తూ కులం పేరుతో దూషించాడని ఆయన అక్క గోస్కుల యశోద ఫిర్యాదు మేరకు డీఎంహెచ్వోపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
ఫలించిన చర్చలు
కోరుట్ల: బీడీ కార్మికుల వేతనపెంపు చర్చలు సఫలమయ్యాయి. హైదరాబాద్లో శనివారం బీడీ కార్మిక సంఘాలు, యాజమాన్యాల మధ్య చర్చలు జరిగాయి. కార్మికులు, ప్యాకర్స్, చెక్కర్ల వేతనాల పెంపునకు ఒప్పందం కుదిరింది. రెండేళ్ల క్రితం జరిగిన వేతన ఒప్పందం ఈ ఏడాది ఏప్రిల్తో ముగిసింది. కొత్త వేతన ఒప్పందం 2024 మే నుంచి అమల్లోకి రానున్నట్లు బీడీ కార్మిక సంఘాల ప్రకటించాయి. వెయ్యి బీడీలకు రూ.4.25 పెంపు కొత్త వేతన ఒప్పంద ప్రకారం బీడీ కార్మికులకు రూ.4.25 మేర వేతనం పెరగనుంది. ఇదివరకు ఉన్న మూలవేతనంపై ఈ పెంపు ఉండనుంది. దీనికి కరువు భత్యం, బోనస్ అదనం. వాస్తవానికి బీడీ కార్మిక సంఘాలు వెయ్యి బీడీలకు కనీసం రూ.10 నుంచి రూ.15 పెంచాలని డిమాండ్ చేయగా.. యాజమాన్యాలు ససేమిరా అన్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.50లక్షల మంది బీడీ కార్మికులు ఉన్న క్రమంలో అంతమొత్తం పెంచితే భారం పడుతుందని బీడీ తయారీ అసోసియేషన్ ప్రతినిధులు అభిప్రాయపడినట్లు సమాచారం. కనీసం రూ.8వరకై నా పెంచాలని కొన్ని కార్మిక సంఘాలు ప్రతిపాదించారు. చివరగా వెయ్యి బీడీలపై రూ.4.25 పెంపునకు ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదరడంతో చర్చలు సఫలమైనట్లు ప్రకటించారు. ప్రస్తుతం వెయ్యి బీడీలకు రూ.245.08 చెల్లిస్తున్నారు. పెరిగిన రూ.4.25తోపాటు కరువు భత్యం, బోనస్ కలిపి వేతనాలు చెల్లిస్తారు. ప్యాకర్లు..చెక్కర్లకూ.. బీడీ పరిశ్రమలో పనిచేసే ప్యాకర్లు, చెక్కర్లకు వేతనాల పెంపు ఒప్పందం కుదిరింది. పరిశ్రమలో పనిచేసే ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న వేతనంపై రూ.1700 పెంచారు. ప్యాకింగ్ కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న వేతనంపై నెలకు రూ.3,650 పెంచారు. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న టేకేదార్ల కమీషన్ పెంపు చర్చలు పూర్తి కాలేదు. చర్చల్లో బీడీ యాజమాన్య సంఘాల తరఫున అధ్యక్షుడు హితేంద్రఉపాధ్యాయ, జనరల్ సెక్రటరీ ధర్మేంద్రగాంధీ, ప్రతినిధులు రస్మికాంత్పటేల్, రామన్బాయ్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. బీడీ కార్మిక సంఘాల తరఫున ఏఐటీయూసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి సుతారి రాములు, డిప్యూటీ జనరల్ మహ్మద్ ముక్రం, ఐఎఫ్టీయూ తరఫున రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణ, ఎం.నరేందర్, బీఎంఎస్ ప్రతినిధులు కలాల శ్రీనివాస్, సుధీర్కుమార్, ఇతర కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. బీడీ కార్మికుల వేతనాల పెంపు రూ.4.25కు కుదిరిన ఒప్పందం కరువు భత్యం..బోనస్ అదనం -
సదరెం.. ఇక నిరంతరం
జగిత్యాల:సదరెం శిబిరాలు లేక దివ్యాంగులు ఇప్పటివరకు ఇబ్బంది పడ్డారు. వైద్యశాఖ ప్రకటించిన సమయానికి స్లాట్బుకింగ్ కాకపోవడం.. సాంకేతిక కారణాలు వీటికి తోడయ్యేవి. ఇక నుంచి ఆ సమస్య దూరం కానుంది. సదరెం శిబిరం కోసం అర్హులైన దివ్యాంగులు ఇక నిరీక్షించాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వం సదరెం శిబిరాలను ఇక నిరంతరం చేస్తూ నూతన విధానాన్ని తీసుకొచ్చింది. దివ్యాంగులు ఎప్పుడైనా స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇంతకుముందు నెలలో రెండు, నాలుగు శిబిరాలు మాత్రమే నిర్వహించేవారు. దీంతో దివ్యాంగులు ఆ తేదీలకు వారం రోజుల ముందునుంచే మీసేవ చుట్టూ గంటల తరబడి నిలబడి స్లాట్ బుక్ చేసుకునేవారు. అంతేకాకుండా ఒక శిబిరంలో 100–120 మందికి మాత్రమే వైద్యశాఖ అధికారులు అవకాశం కల్పించేవారు. స్లాట్లు దొరకక నెలల తరబడి వేచిచూసేవారు. ఇకనుంచి తగిన ధ్రువీకరణ పత్రాలతో అర్హులైన దివ్యాంగులు ఎప్పుడైనా మీసేవ కేంద్రాలకు వెళ్లి స్లాట్బుక్ చేసుకోవచ్చు. సెల్ఫోన్ మెసేజ్ ఆధారంగా.. స్లాట్ బుక్ చేసుకోగా శిబిరం తేదీ, స్థలం ఎక్కడ అన్నది మెసేజ్ వస్తుంది. స్లాట్ లేని పక్షంలో రిజర్వ్లో ఉంటుంది. ఎప్పుడైతే ఇస్తారో వారికి ఆటోమెటిక్గా స్లాట్ అలాట్ అవుతుంది. ఒకసారి బుక్ చేసుకోగానే మొబైల్కు మెసేజ్ వస్తుంది. ఎడిట్ ఆప్షన్ కూడా ఉండదు. స్లాట్ బుక్ చేసుకున్నప్పుడే ఎలాంటి పొరపాట్లూ లేకుండా చూసుకోవాలని అధికారులు అంటున్నారు. మీసేవలో స్లాట్ బుక్ చేసుకునే సమయంలో అన్ని సరిచూసుకున్నాకే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఓ సంఖ్యను కేటాయించనున్నారు. ఆ ప్రకారం టోకెన్లు జారీ చేస్తారు. సమయం ప్రకటించినప్పుడు వెళ్లాల్సి ఉంటుంది. ఎప్పుడైనా స్లాట్బుకింగ్ తప్పనున్న తిప్పలుఎప్పుడైనా నమోదు చేసుకోవచ్చు అర్హులైన వారు మీసేవకు వెళ్లి ఎప్పుడైనా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సమయం ఉంటే స్లాట్ ఇస్తారు. లేదా రిజర్వ్లో ఉంటుంది. తప్పులు లేకుండా నమోదు చేసుకోవాలి. – రాములు, సూపరింటెండెంట్ -
యూనిఫాం కుట్టుకేంద్రాల పరిశీలన
జగిత్యాల: మహిళలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం కుట్టే బాధ్యత అప్పగించినట్లు కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళాసంఘాలు కుడుతున్న యూనిఫాం కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. పాఠశాలలు ప్రారంభించే సమయానికి ముందే దుస్తులు అందించేలా చూడాలని, అవసరమైతే రోజుకు రెండుషిఫ్ట్లు పనిచేయాలని సూచించారు. గ్రామీణ మండలాల వారికి 1,20,822, పట్టణ పరిధిలో వారికి 40,941 మొత్తం 1,61,763 యూనిఫాంలు కుట్టి ఇవ్వాలన్నారు. ఆమె వెంట డీఆర్డీఏ పీడీ సంపత్రావు, మెప్మా ఏవో శ్రీనివా్స్, డీఎంసీ సునీత, టీఎంసీ రజిత పాల్గొన్నారు. ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకోవాలి● అడిషనల్ కలెక్టర్ రాంబాబువెల్గటూర్: రైస్మిల్లర్లు త్వరితగతిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని అదనపు కలెక్టర్ రాంబాబు ఆదేశించారు. శనివారం మండలంలోని రైస్మిల్లులను సందర్శించారు. వెంటవెంటనే దిగుమతి చేసుకోకుంటే కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత ఏర్పడుతుందని, సెంటర్లలో ధాన్యం పేరుకుపోతుందని, అకాలవర్షం కురిస్తే తడిచి రైతులు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. సివిల్ సప్లై జిల్లా మేనేజర్ హతీరాం, తహసీల్దార్ శేఖర్, సివిల్ సప్లై నాయబ్ తహశీల్దార్ శ్రీనివాస్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన విత్తనాలే విక్రయించాలిపెగడపల్లి: రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగుల మందులే విక్రయించాలని దుకాణ దారులను జిల్లా వ్యవసాయాధికారి వాణి ఆదేశించారు. మండలంలోని బతికపల్లి, పెగడపల్లి, సహకార సంఘం ఎరువులు, విత్తన దుకా ణాలను శనివారం పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. విత్తనాలు విక్రయించిన రైతులకు బిల్లులు ఇవ్వాలని, విడి విత్తనాలు విక్రయించొద్దని సూచించారు. వ్యవసాయ అధికా రుల సూచనలు పాటిస్తూ పంటలు సాగు చేసుకోవాలని, విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని, వ్యవసాయశాఖ ద్వారా గుర్తింపు పొందిన దుకాణాల్లోనే సరకులు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. నాసిరకం మందులు, నాణ్యతలేని విత్తనాలు విక్రయిస్తే దుకాణాల గుర్తింపును రద్దు చేయడంతోపాటు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని దుకాణదారులను హెచ్చరించారు. మండల వ్యవసాయాధికారి వినీల ఆమె వెంట ఉన్నారు. రసాయన ఎరువులు వాడొద్దుజగిత్యాలఅగ్రికల్చర్: పంటలకు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని పొలాస వ్యవసాయ కళాశాల ఇన్చార్జి అసోసియేట్ డీన్ ఝాన్సీరాణి అన్నారు. శనివారం కళాశాలలో రైతులకు జీవన ఎరువులు, సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యతపై శిక్షణ ఇచ్చారు. రసాయన ఎరువుల ద్వారా భూసారం దెబ్బతిని దిగుబడి తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు వాడి భూసారాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కో–ఆర్డినేటర్ ఆర్.సుష్మాదేవి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు సాయికుమార్, ఎల్లాగౌడ్, సత్యనారాయణరెడ్డి, శ్రీనివాస్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులు
జగిత్యాల: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూని ఫాంలను ఏజెన్సీల ద్వారా ప్రభుత్వం కుట్టిస్తోంది. 2022–23కు సంబంధించి రాజన్నసిరిసిల్లకు చెందిన భగీరథ, శామంతకమని, కమల్ గార్మెంట్స్ ఏజెన్సీ తీసుకుని యూనిఫాంలు సప్లై చేశారు. అయితే వారికి ఇప్పటివరకు కుట్టుకూలి ఇవ్వలేదు. విషయాన్ని సదరు ఏజెన్సీలు డీఈవో జగన్మోహన్రెడ్డికి ఫిర్యాదు చేశాయి. ఆయన జిల్లాలోని 25 పాఠశాలల హెచ్ఎంలకు షోకాజ్లు జారీ చేశారు. కుట్టుకూలి రూ.2,21,900 ఇవ్వకపోవడంలో ఆంతర్యమేమిటో తెలియడం లేదు. టెక్నికల్ సమస్యలతో ఇవ్వలేకపోయారా..? లేదా రిటర్న్ వెళ్లిపోయాయా తెలియాల్సి ఉంది. ఈ విషయమై డీఈవోను వివరణ కోరగా ఏజెన్సీల ఫిర్యాదు మేరకు హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని, నివేదిక తర్వాత చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. యూనిఫాంలు కుట్టుకూలి ఇవ్వడంలో జాప్యం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఏజెన్సీలు -
ఉదయం ఎండ.. సాయంత్రం ఈదురుగాలులు
జగిత్యాల: వాతావరణంలో ఉదయం.. సాయంత్రం మార్పులు వస్తున్నాయి. పొద్దంతా ఎండవేడిమి దంచికొడుతోంది. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాయంత్రం వరకు ఈదురుగాలులు వీస్తూ.. భయానకం కలిగిస్తోంది. రెండుమూడు రోజుల క్రితం వర్షాలు పడటంతో కొంత చల్లబడిన వాతావరణం.. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ప్రధాన రహదారులు కర్ఫ్యూను తలపిస్తున్నాయి. ధర్మపురిలోని నేరెళ్లలో శనివారం 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
గోదారి చెంత.. స్నానాలకు చింత
ధర్మపురి: ధర్మపురి వద్ద గోదావరి పూర్తిగా అడుగంటింది. దీంతో పుణ్యస్నానాలకు వస్తున్న భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నృసింహస్వామికి భక్తుల ద్వారా భారీగా ఆదాయం వస్తున్నా.. వారికి వసతులు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. గోదావరిలో కనీసం నీడ, నీటి వసతి లేకపోవడంపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉదయం తొమ్మిది దాటిందంటేనే సూర్యుడు సుర్రుమంటున్నాడు. అలాంటి ఎండలో గోదావరిలో ఇసుకదిబ్బలపై భక్తులు నడవలేకపోతున్నారు. ఇక్కడి గోదావరిలో స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందన్న నమ్మకం భక్తుల్లో ఉంది. అయితే గోదావరిలో ప్రవాహం వద్దకు వెళ్లేందుకు కనీస ఏర్పాట్లు లేవు. వృద్ధులు, పిల్లలు, బాలింతలు ఎండవేడిని భరించలేకపోతున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పుష్కరఘాట్ల వద్ద నామమాత్రంగా వేసిన పందిర్లు దేనికి ఉపయోగపడకుండాపోయాయి. భక్తుల స్నానాలు ఒకచోట.. పందిళ్లు మరోచోట ఉండడంతో భక్తులు వినియోగించుకోలేకపోయారు. స్నానాలు చేసేచోటనే నీడ వసతి, చలివేంద్రాలు, సీ్త్రలు బట్టలు మార్చుకునేలా తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రావును సంప్రదించగా.. గోదావరిలో స్నానాలకు వచ్చే భక్తులకు మున్సిపల్ పక్షాన తాగునీటి వసతి కల్పిస్తామన్నారు. ఆలయ ఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. భక్తుల సౌకర్యార్థం రూ.ఐదుకోట్లతో ప్రతిపాదనలు పంపించామన్నారు. బట్టలు మార్చుకునేందుకు.. నీడ, తాగునీరు కల్పనకు ప్రభుత్వానికి నివేదించామని వెల్లడించారు. ధర్మపురి వద్ద అడుగంటిన నది గోదావరిలోకి పట్టణ కలుషితాలు దెబ్బతింటున్న భక్తుల మనోభావాలు నిత్యం వేలాదిగా వస్తున్న భక్తులు -
కొండగట్టుకు చేరిన చేనేత కార్మికులు
● స్వామివారికి పట్టువస్త్రాల తయారీ కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు శ్రీఆంజనేయ స్వామి సన్నిధిలో ఈనెల 30 నుంచి జూన్ ఒకటో తేదీ వరకు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల జరుగనున్న విషయం తెల్సిందే. స్వామివారికి పట్టువస్త్రాలు తయారు చేసేందుకు సికింద్రాబాద్ పద్మశాలీ చేనేత కార్మికులు శనివారం కొండగట్టుకు చేరుకున్నారు. గుట్టపై ఆలయ పరిసరాల్లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం మగ్గం పనులను ప్రారంభించారు. ముందుగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి మగ్గంపైనే పట్టువస్త్రాలు తయారు చేస్తామని కార్మికులు తెలిపారు. -
ఈదురుగాలుల బీభత్సం
ఆదివారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2024మల్లాపూర్: రోడ్డుపై కూలిపోయిన వేప చెట్టుమేడిపల్లి: పిడుగుపడి కాలిపోతున్న తాటిచెట్టు● మల్లాపూర్లో కొట్టుకుపోయిన ఇంటిపైకప్పులు ● రోడ్లపై విరిగిపడిన చెట్లుమల్లాపూర్/మేడిపల్లి/కథలాపూర్: జిల్లాలోని మల్లాపూర్, కథలాపూర్, మేడిపల్లి మండలాల్లో శనివారం సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. చెట్లు విరిగిపడడతంతో రాకపోకలు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. ఇంటిపైకప్పులు ఎగిరిపోవడంతోపాటు విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. భారీ ఈదురుగాలులకు కథలాపూర్ మండలంలోని గంభీర్పూర్ శివారులోగల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కిందపడిపోయింది. చాలాచోట్ల విద్యుత్ వైర్లు తెగిపోయి.. స్తంభాలు పడిపోయాయి. రామడుగు పద్మ అనే మహిళ ఇంటిపై ఉన్న రేకులు లేచిపోయాయి. భీమారం మండలం రాగోజిపేటలో తాటిచెట్టుపై పిడుగుపడి పూర్తిగా కాలిపోయింది. దమ్మన్నపేటలో అల్లెపు లక్ష్మణ్, వేముల సురేశ్, అలకుంట మనోజ్, అలకుంట ఎల్లయ్య ఇళ్లపై రేకులు లేచిపోయాయి. సుమారు నాలుగు లక్షల ఆస్తినష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. న్యూస్రీల్ -
నకిలీ విత్తనాల నియంత్రణకు ప్రత్యేక నిఘా
జగిత్యాలక్రైం: నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జి ల్లావ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ సన్ప్రీత్సింగ్ సూచించారు. జిల్లా పోలీసు కా ర్యాలయంలో శుక్రవారం నేర సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ గుర్తుతెలియని మృతదేహాలు దొరికినప్పుడు కేసు నమోదు చేసిన వెంటనే ఫొటోలు సీసీటీఎన్ఎస్లో అప్లోడ్ చేయాలని సూ చించారు. దొంగతనాల నివారణకు రాత్రిపూట పెట్రోలింగ్, నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని తెలిపారు. ప్రజలకు సీసీ కెమెరాల ఉపయోగలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతీ పోలీస్స్టేషన్ పరిధిలో నిత్యం డ్రంకెన్డ్రైవ్ పరీక్షలు, వాహన తనిఖీలు నిర్వహించాలని, బహిరంగ ప్రదేశాల్లో మ ద్యపానంపై నిఘా పెంచాలన్నారు. జిల్లాలో గంజా యి, మత్తు పదార్థాలను నిర్మూలించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రాసిక్యూషన్లో భాగంగా కోర్టు జారీచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. లోక్ అదాలత్లో రాజీ పడే కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి, అవగాహన కల్పించాలని సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లా పరిధిలో నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలకు పాల్పడేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ షాప్ యజమానులు నిబంధనలకు లోబడి వ్యాపారాలు చేసుకోవాలని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతులకు అందించాలని సూచించారు. మార్కెట్లో బీటీ3 పత్తి విత్తనాలకు అనుమతి లేదన్నారు. గ్రామాల్లోకి వచ్చి విక్రయించే వారివద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని రైతులకు సూచించారు. నకిలీ విత్తనాల నివారణకు స్పెషల్ టాస్క్ఫోర్స్ టీంను ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో వ్యవసాయ అధికారుల సాయంతో అన్ని ఎరువుల దుకాణాలు తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు. డీఎస్పీలు రవీంద్రకుమార్, రఘుచందర్, ఉమామహేశ్వరరావు, రంగారెడ్డి, వ్యవసాయ అధికారులు, డీసీఆర్బీ, సీసీఎస్, ఐటీ కోర్ సీఐలు శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, రఫీక్ఖాన్ పాల్గొన్నారు. రైతులకు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నేరసమీక్షలో ఎస్పీ సన్ప్రీత్సింగ్ -
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
జగిత్యాల: రోగులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంచాలకులు డాక్టర్ రవీందర్నాయక్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతె పట్టణ ఆరోగ్య కేంద్రంతో పాటు పలు సబ్సెంటర్లను తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రాల్లో మందుల నిల్వలు, నిర్వహణ పుస్తకాలు, రక్తనమూనాలు టీహబ్కు పంపుతున్నారా లేదా వంటి అంశాలను పరిశీలించారు. పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులను వైద్యం ఎలా అందుతుందని అడిగి తెలుసుకున్నారు. గర్భిణుల న మోదు, వారికి అందించే సేవలు, పిల్లలకు వ్యాక్సినేషన్, ఎంసీహెచ్ పోర్టల్ నిర్వహణను పరిశీలించా రు. జిల్లాలో 151 సబ్సెంటర్లలో సొంత భవనాలు ఉన్నవాటి వివరాలు, నిర్మాణాల గురించి అడిగి తెలుసుకున్నారు. డీఎంహెచ్వో కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో మృతిచెందిన రాజ్కుమార్ మృతదేహానికి నివాళి అర్పించారు. డీఎంహెచ్వో శ్రీధర్, ప్రోగ్రాం అధికారులు స మియోద్దీన్, శ్రీనివాస్, స్వామి, ప్రవీణ్చంద్ర, స్వాతిలక్ష్మణ్, సత్యనారాయణ, రమణ, భూమేశ్వర్ పాల్గొన్నారు. -
మల్యాల ఎంపీపీగా రవళి
● నెగ్గిన అవిశ్వాస తీర్మానం మల్యాల: మల్యాల మండల పరిషత్ చైర్పర్సన్గా మల్యాల ఎంపీటీసీ–1 సభ్యురాలు ఆగతంపు రవళి ఏకగ్రీవంగా ఎన్నికై ంది. మాజీ ఎంపీపీ మిట్టపల్లి విమలపై గతనెలలో నిర్వహించిన అవిశ్వాస పరీక్ష నెగ్గడంతో వైస్ ఎంపీపీ పోతాని రవిని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. నిబంధనల ప్రకారం నూతన ఎంపీపీ నియామకం కోసం ఆర్డీవో నోటీసు జారీ చేసి, శుక్రవారం ఎంపీడీవో స్వాతితో కలిసి ఆర్డీవో మధుసూదన్ మల్యాల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నియామకం కోసం ఎన్నికలు నిర్వహించారు. మల్యాల మండల పరిషత్లో 14మంది ఎంపీటీసీలకు గానూ 8మంది సమావేశానికి హాజరుకాగా, ఎంపీపీగా మల్యాల ఎంపీటీసీ–1 ఆగతంపు రవళి ఒక్కరే నామినేషన్ వేశారు. తాటిపల్లి ఎంపీటీసీ దొంగ అనిత రవళిని ఎంపీపీగా ప్రతిపాదించగా, రాంపూర్ ఎంపీటీసీ బలపరిచారు. మెజారిటీ సభ్యులు చేతులు ఎత్తడంతో ఆర్డీవో మధుసూదన్ రవళిని మల్యాల ఎంపీపీగా ఏకగ్రీవం అయినట్లు ప్రకటించారు. అనంతరం ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన ఎంపీపీ ఆగంతపు రవళివంశీని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మల్యాల మండల కేంద్రానికి వచ్చి ప్రత్యేకంగా అభినందించారు. -
ప్రచారం ఘనం.. ఏర్పాట్లు శూన్యం
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల రూరల్ మండలం పొలాస వ్యవసాయ పరిశోధనస్థానంలో శుక్రవారం నిర్వహించిన విత్తన మేళా ప్రచారం ఘనం.. ఏర్పా ట్లు శూన్యం అన్నట్లు జరిగింది. పొలాసలో విత్తనమేళా నిర్వహిస్తున్నట్లు కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరిగింది. శుక్రవారం నాటి కార్యక్రమానికి జిల్లావాసులే కాకుండా పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, సిరిసిల్ల, అదిలాబాద్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చారు. పరిశోధనస్థానం శాస్త్రవేత్తలు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో రైతులు అవస్థలు పడ్డారు. దాదాపు 500 క్వింటాళ్ల వరివిత్తనాలు(దాదాపు 2వేల బస్తాలు) మధ్యాహ్నం 12గంటల వరకే అయిపోయాయి. ఏర్పాట్లలో విఫలం గతంలో విత్తనమేళాకు సాధారణస్థాయిలోనే రైతులు వచ్చేవారు. శుక్రవారం ఏకంగా 2వేల నుంచి 3వేల మంది తరలివచ్చారు. రైతులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు, టోకెన్ కోసం, డబ్బులు చెల్లించేందుకు, గోదాంలో విత్తనాలు తీసుకునేందుకు వేర్వేరు లైన్లు ఏర్పాటు చేయడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఫలితంగా గంటలకొద్ది క్యూలో నిల్చున్నా చాలామందికి విత్తనాలు దొరకలేదు. కొందరు రైతులు సిబ్బంది, శాస్త్రవేత్తలతో వాగ్వాదానికి దిగారు. ఏ మేరకు విత్తనాలు ఉన్నాయో తెలియక శాస్త్రవేత్తలు టోకెన్లు నిలిపివేసి చేతులెత్తేశారు. దీంతో కొందరికి ఒకటి చొప్పున విత్తన బస్తా దొరకగా.. చాలామంది నిరాశతో వెనుదిరిగారు. పోటెత్తిన రైతులు.. దొరకని విత్తనాలు ‘విత్తన మేళా’లో అన్నదాతల అగచాట్లు చేతులేత్తేసిన శాస్త్రవేత్తలుఒక్కబస్తా దొరకలేదు మా ఊరు నుంచి నలుగురం రైతులం పరిశోధనస్థానానికి వచ్చాం. ఒక్క బస్తా కూడా దొరకలేదు. బస్తాలు అయిపోయాయని చెప్పారు. కొద్దిసేపు చూసి ఇంటికి వెళ్లిపోయాం. విత్తన మేళా ఏర్పాట్లు ఘోరంగా ఉన్నాయి. – కానుగంటి సురేశ్, మూలరాంపూర్, ఇబ్రహీంపట్నం -
స్కిజోఫ్రీనియా ఓ మానసిక వ్యాధి
జగిత్యాలటౌన్: స్కిజోఫ్రీనియా ఓ మానసిక వ్యాధి అని, ఈ వ్యాధికి గురైనవారు అపనమ్మకాలు, హాల్యునేషన్కు గురై సమాజానికి దూరంగా ఉంటూ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారని, నివారణకు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో అధునాతన వైద్యం, అనుభవజ్ఞులైన వైద్యులు అందుబాటులో ఉన్నారని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు పేర్కొన్నారు. ప్రపంచ స్కిజోఫ్రీనియా దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆస్పత్రిలో సైకియాట్రిక్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రాములు మాట్లాడుతూ.. మెదడులో జరిగే కొన్ని రసాయన చర్యలతో పాటు జన్యుపరమైన కారణాలు, తీవ్రమైన మానసిక ఒత్తిడితో ఈ జబ్బు సోకుతుందన్నారు. సరైన సమయంలో వ్యాధిని గుర్తించి చికిత్స అందించకపోతే తీవ్రత పెరిగి ఆహారం తీసుకోకపోవడం, ఉన్మాదులుగా మారడం, మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం లాంటివి జరుగుతాయని అన్నారు. స్కిజోఫ్రినియా నివారణకు యాంటిసైకోటిక్స్ లాంటి మందులు అందించవచ్చని తెలిపారు. సైకియాట్రిక్ డిపార్ట్మెంట్ హెచ్వోడీ విశాల్, ఆర్ఎంవో నవీన్, డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీధర్, సాకేత్, వరుణ్ పాల్గొన్నారు. -
ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తాం
మల్లాపూర్: రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జగిత్యాలలోని ఇందిరాభవన్లో ఎమ్మెల్సీ జీవన్రెడ్డిని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎలాల జలపతిరెడ్డి నేతృత్వంలో మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ జీవన్రెడ్డి మాట్లాడుతూ.. సోనియాగాంధీని వేడుకలకు ముఖ్య అథితిగా ఆహ్వానిస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి వచ్చిన అభ్యంతరమేంటని ప్రశ్నించారు. సోని యాపై కిషన్రెడ్డి వ్యాఖ్యలు సరికావని, బేషరతుగా వెనక్కి తీసుకోవాలన్నారు. పూండ్ర శ్రీని వాస్రెడ్డి, నల్ల బాపురెడ్డి, మిట్టపెల్లి జీవన్రెడ్డి, మరిపెల్లి మల్లయ్య, గోపిడి రాజశేఖర్రెడ్డి, ఆనంద్గౌడ్, నాగార్జునరెడ్డి, ఎండీ.రఫీ, సంతోశ్, సురేష్, రాజం, లక్ష్మణ్ పాల్గొన్నారు. త్వరగా పనులు పూర్తి చేయాలిజగిత్యాలరూరల్: అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా సెర్ఫ్ ఏపీడీ చరణ్దాస్ అన్నారు. శుక్రవారం జగిత్యా ల మండల సమైక్య కార్యాలయంలో జగిత్యాల రూరల్, అర్బన్ మండలాల మహిళ సమైక్య సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు యూ నిఫాంలు గడువులోపు అందించాలని కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్లింకేజీ నూత న టార్గెట్ ఇవ్వడం జరిగిందని, రూరల్ మండలంలో 890 సంఘాలకు 55.11 కోట్లు, అర్బన్ మండలంలో 169 సంఘాలకు 9.92 కోట్లు లింకేజీ టార్గెట్ ఇవ్వడం జరిగిందన్నారు. ఎంపీడీవోలు రమాదేవి, విజయలక్ష్మీ, జిల్లా సెర్ఫ్ డీపీఎంలు విజయలక్ష్మీ, మానిక్రెడ్డి, వెంకటేశం, ఏపీఎం గంగాధర్, సీసీలు రవీందర్, సాగర్, మరియ, గంగారాం పాల్గొన్నారు. ప్రసవాల సంఖ్య పెంచాలికోరుట్ల: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేలా కృషి చేయాలని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ సూచించారు. కోరుట్ల ప్రభు త్వ ఆస్పత్రిని శుక్రవారం తనిఖీ చేశారు. పలు రికార్డులు పరిశీలించారు. ఓపీ వివరాలను సూపరింటెండెంట్ సునీతను అడిగి తెలుసుకున్నారు. నూతరంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. అనంతరం రాయికల్, మెట్పల్లి, ధర్మపురి, కోరుట్ల వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వైద్యాధికారులు సునీత, సాజిద్, రవి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పాలిసెట్కు 92.5శాతం హాజరుజగిత్యాల: పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 2,177 మందికి గానూ 2,017మంది విద్యార్థులు హాజరయ్యారు. 160మంది గైర్హాజరయ్యారు. అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. పలు కేంద్రాలను కలెక్టర్ యాస్మిన్ భాషాతో పాటు కన్వీనర్లు పరిశీలించారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభంజగిత్యాల: జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ప్రథ మ సంవత్సరం ద్వితీయ భాష పరీక్షలో 1,334 మందికి గానూ 1,243మంది విద్యార్థులు హాజరయ్యారు. 91 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం ద్వితీయ భాష పరీక్షకు 665 మందికి 633మంది హాజరు అయ్యారు. 32 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థులు సకాలంలో కేంద్రానికి హాజరు కావాలని, ఐదు నిమిషాలు ఆలస్యమైతే లోనికి అనుమతించరని కన్వీనర్ నారాయణ తెలిపారు. -
ఆమెకు అండగా..
జగిత్యాల: మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం రక్షణగా నిలు స్తోంది. మున్సిపాలిటీల్లో లైంగిక వేధింపులపై ఫి ర్యాదులు స్వీకరించి, సమస్యను పరిష్కరించడం కోసం అంతర్గత కమిటీలు వేస్తున్నారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులపై వేధింపులను అరికట్టేందుకు సంబంధితశాఖ చర్యలు తీసుకుంటోంది. వారికి రక్షణగా ఉంటూ, చట్ట పరమైన చర్యలు తీసుకునేలా కమిటీలో అందరూ మహిళా సభ్యులు ఉండే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలు ఉన్నాయి. అన్నింట్లో కలిపి మహిళా ఉద్యోగులతో పాటు, కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు 500మంది వరకు పని చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో మహిళా ఉద్యోగులపై వేధింపులు పెరుగుతున్నాయన్న నేపథ్యంలో ము న్సిపల్శాఖ కమిటీలను వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా మున్సిపాలిటీల కమిషనర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు మహిళా ఉద్యోగుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రానప్పటికీ ఇతర ప్రాంతాల్లో జరిగిన సంఘటన ఆధారంగా మున్సిపాలిటీల్లో కమిటీ వేయాలని నిర్ణయించారు. మహిళా ఉద్యోగులు ఎలాంటి వేధింపులకు గురైనా కమిటీకి ఫిర్యాదు చేస్తే స్వీకరించి సమస్యను పరిష్కరిస్తారు. ఈ కమిటీలో సభ్యులుగా సీనియర్ మహిళా ఉద్యోగులను ఎంపిక చేస్తారు. మహిళా ఉద్యోగులపై ఎలాంటి వేధింపులు జరిగినా ఈ కమిటీకి ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల సమక్షంలో చర్యలు తీసుకుంటారు.ఉద్యోగులకు ఎంతో మేలు మున్సిపాలిటీలో మహిళా కమిటీలు మహిళా ఉద్యోగులపై వేధింపులు అరికట్టేందుకు చర్యలు కమిటీలో అందరూ మహిళా సభ్యులేగతంలో సైతం ఇలాంటి కమిటీలు ఉన్నప్పటికీ మున్సిపాలిటీలో మాత్రం ఈసారి ప్రత్యేకంగా అంతర్గత కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో చాలామంది ఉద్యోగులు మహిళలే ఉంటున్నారు. కొన్నిచోట్ల వేధింపులకు గురైనప్పటికీ చెప్పుకోలేక ఇబ్బందులకు గురవుతుంటారు. ప్రస్తుతం ఈ కమిటీలు ఏర్పడుతుండటంతో వారు గోప్యంగా సమస్యను చెప్పుకుంటే పరిష్కారమయ్యే అవకాశం మెండుగా ఉంది. కొన్ని సందర్భాల్లో మహిళలు వేధింపులకు గురైనా చెప్పుకోలేకపోతారు. ఉన్నతాధికారులకు చెబితే ఏమైనా సమస్యలు ఏర్పడతాయనే ఉద్దేశంతో లో లోపలే మదనపడుతుంటారు. ప్రస్తుతం ఈ మహిళా కమిటీలు ఏర్పాటు అవుతుండడంతో రక్షణగా ఉంటుందని జిల్లాలోని మున్సిపాలిటీల్లో పనిచేసే మహిళా ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
గందరగోళంగా క్యూలైన్
మేము మేళాకు వచ్చేవరకు నాలుగైదు క్యూలైన్లు ఉన్నాయి. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. అప్పటికే ఒక్కొక్కరు క్యూలైన్లలో ఉండి రెండు గంటలయ్యింది అని చెప్పారు. మేము సైతం విత్తనాలు తీసుకోకుండానే వెనుతిరిగాం. – గురిజాల బుచ్చిరెడ్డి, గొల్లపల్లిఒకబస్తా దొరికింది క్యూలైన్లలో రెండు గంటలు ఉంటే ఒక్కబస్తా దొరికింది. మా ఊరి నుంచి పదిమందిమి వచ్చాం. క్యూలైన్లు ఉన్నప్పటికీ.. కొందరు రైతులు తోసుకురావడంతో గందరగోళం ఏర్పడింది. శాస్త్రవేత్తలు సరైన ఏర్పాట్లు చేయలేదు. – మల్లారెడ్డి, ఎండపల్లి -
ఆక్వాహబ్ రాదా.. ఉపాధి లేదా?
● నీరులేక మిడ్మానేరు వెలవెల ● సిరిసిల్ల ఆక్వాహబ్పై నీలినీడలు ● చీర్లవంచ, చింతల్ఠాణా వద్ద భూకేటాయింపు ● ఆసక్తి చూపిన మూడు కంపెనీలు వెనక్కి ● అగమ్యగోచరంగా రూ.102 కోట్లు, 365 ఎకరాలు ● అసలు ప్రాజెక్టే ఉండకపోవచ్చంటున్న బీఆర్ఎస్ నేతలు ● 23 వేలమందికి ఉపాధి కల్పన కలే!సాక్షిప్రతినిధి, కరీంనగర్: గత ప్రభుత్వం సిరిసిల్లలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆక్వా హబ్ రద్దయ్యిందా? దాదాపు 23 వేల మందికి ఉపాధి కల్పన లక్ష్యంగా దేశీయ, బహుళజాతీ కంపెనీలను సిరిసిల్ల కు ఆహ్వానించేందుకు ఏర్పాటు చేసిన ప్రాజెక్టు ఇక అడుగు ముందుకు వేసే పరిస్థితి లేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో మిడ్మానేరులో నీటి లభ్యత, స్థానిక వాతావరణం ఆక్వా హబ్ ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన(టీఎస్ ఐఐసీ) ఆధ్వర్యంలో తంగళ్లపల్లి మండలంలో 365 ఎకరాల భూ సేకరణ, ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన అధ్యయనం కూడా పూర్తిచేసింది. కానీ.. ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రాజెక్టు కోసం సిద్ధం చేసిన రూ.102 కోట్లు. 365 ఎకరాల కేటాయింపులు అగమ్యగోచరంగా మారాయి. ఎక్కడ నిర్మించతలపెట్టారు? దాదాపు రూ.102.9 కోట్ల వ్యయంతో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతలఠాణాలోని ముంపు గ్రామాల్లో ఆక్వా హబ్ ఏర్పాటు చేయాల్సింది. దీనిపై ఇప్పటికే సర్వే పూర్తిచేసిన అధికారులు.. భూకేటాయింపులు కూడా జరిపారు. రెండు గ్రామాల పరిధిలో 365 ఎకరాలు ఇందుకోసం కేటాయించారు. ఇవి మిడ్మానేరు ముంపు గ్రామాలు కావడం, గోదావరి బేసిన్లో మిడ్మానేరు ఉండటం, కాళేశ్వరం నుంచి నిరంతరం నీటిని ఎత్తిపోసే సౌలభ్యం ఉండటంతో టీఎస్ ఐఐసీ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యూహాత్మకంగా ఈ రెండు గ్రామాలను ఎంపిక చేసింది. ఆక్వా రంగంలో సత్తా చాటాలకునే కంపెనీలకు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి భూమి, రోడ్లు, విద్యుత్, నీరు, వ్యర్థాల నిర్వహణ తదితర సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చింది. అప్పటికే ఇక్కడ ఫిషింగ్ ఇండియా, ఆనంద్ గ్రూప్స్, ప్రెష్ టు హోమ్ సంస్థలు కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ముందుకువచ్చాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. మత్స్య పరిశ్రమ ఏర్పాటై ఉండేది. ప్రభుత్వం మారడంతో టీఎస్ ఐఐసీ, స్థానిక కలెక్టర్, రెవెన్యూ అధికారులెవరూ ప్రాజెక్టు మనుగడపై ఇంతవరకూ ప్రకటన చేయలేదు. బంజరు భూమి, కొండ ప్రాంతాలు.. వాస్తవానికి చీర్లవంచ, చింతలఠాణా రెండూ ముంపుగ్రామాలే. ముంపు పోను రెండు గ్రామాల్లో మిగిలిన సర్వే నంబర్లు 224, 225, 226, 310, 613, 614, 698, 699, 701, 702, 704, 715, 718, 719లోని 365 ఎకరాలను ఈ పరిశ్రమ నిర్మాణానికి కేటాయించారు. ఇందులో అధికశాతం బంజరుభూమి, కొండ ప్రాంతం. అందుకే, ఇక్కడ ఆక్వా హబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆక్వా హబ్కు ప్రతీరోజు 15.52 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) నీటిని అందించాలనుకున్నారు. పరిశ్రమల నుంచి 10.8 ఎంఎల్డీ రిసైకిల్డ్ వాటర్ విడుదలవుతుందని అంచనా వేశారు. అంతేకాకుండా నీటి వ్యర్థాల శుద్ధికి 13 ఎంఎల్డీల సామర్థ్యంతో భారీ ఎస్టీపీ, ఇక ఘన వ్యర్థాలు, ఎలక్ట్రిక్వ్యర్థాల నిర్వహణను టీఎస్ ఐఐసీ చూసుకుంటానంది. ఆ కంపెనీలు వెనక్కే? ఆక్వా హబ్ పార్క్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఫిషింగ్ ఇండియా, ఆనంద్ గ్రూప్స్, ప్రెష్ టు హోమ్ సంస్థలు ఆసక్తి చూపాయి. కంపెనీలు ఏర్పాటు చేసేందుకు వీలుగా 194 ఎకరాలు ప్లాటింగ్, 79 ఎకరాల్లో పచ్చదనం, రోడ్ల కోసం 31 ఎకరాలు, సామాజిక సదుపాయాల కింద 14 ఎకరాలు కేటాయించి అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా తంగళపల్లి నుంచి 120 అడుగుల పొడవుతో రోడ్డు నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. తొలిదశలో రూపొందించిన ప్రణాళిక ప్రకారం.. మరిన్ని కంపెనీలు హబ్లో కొలువు దీరితే.. తొలిదశలో దాదాపు 5,000 మందికి, ప్రాజెక్టు పూర్తయ్యాక దాదాపు 17,500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేశారు. అందులోనూ తొలుత మిడ్మానేరులోని ముంపుగ్రామాలకు.. ఆ తర్వాత ఉమ్మడి జిల్లా యువతకు కొలువుల్లో ప్రాధాన్యం దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ.. ప్రాజెక్టు ఇక రద్దయినట్లేనని బీఆర్ఎస్ నేతలు వాఖ్యానిస్తుండటంతో స్థానిక యువతలో తీవ్ర నిరాశ ఆవహించింది. -
నమ్మించి.. నట్టేట ముంచి
వేములవాడ: వేములవాడ పట్టణానికి చెందిన పూజారి మహేశ్ రూ.2కోట్లతో ఉడాయించిన ఘటనలో ఇరుక్కున్న బాధితులు బావురుమంటున్నారు. ఈనెల 4 నుంచి పూజారి ఆచూకీ కోసం నిత్యం అతని ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. తమ డబ్బులే కాకుండా బంధువులు, మిత్రుల వద్ద తీసుకొచ్చి మహేశ్కు అప్పగించామని, ఇప్పుడు వారికి తామే జవాబుదారీగా ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక చాలా మంది మధ్యవర్తిగా ఉండి అప్పులు ఇప్పించి జమానత్, ష్యూరిటీ సంతకాలు చేసి ఇబ్బందులు పడుతున్నారు. పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపితే తప్ప తమ సమస్యకు పరిష్కారం లభించేలా లేదని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి. ఇప్పటికే బాధితుల గోడు విన్న పోలీసులు ఫిర్యాదులు స్వీకరించి విచారణ ముమ్మరంగా చేపట్టారు. బావురుమంటున్న బాధితులు పోలీసులపైనే ఆశలు బంధువుల డబ్బులు పూజారికిచ్చి అవస్థలు -
No Headline
ఆవు, లేగదూడ విక్రయించిన పూజారిపై ఫిర్యాదు చందుర్తి(వేములవాడ): మండలంలోని నర్సింగపూర్–మోహినికుంట శ్రీమల్లికార్జునస్వామి ఆలయానికి ఓ భక్తులు ఇచ్చిన ఆవు, లేగదూడను పూజారి భద్రయ్య విక్రయించారని దేవాదాయ, ధర్మదాయశాఖ సహాయ కమిషనర్కు ఆలయ కమిటీ సభ్యులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ నక్క గంగాధర్, సభ్యులు కాసారపు శ్రీనివాస్రెడ్డి, పెరుక గంగరాజు, చింతకుంట గంగాధర్, ఇల్లంతకుంట గణేశ్, కొత్త ఎల్లారెడ్డి, సంపునూరి దశరథం ఉన్నారు. వెంకన్నకు క్షీరాభిషేకంధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసచార్యులు మంత్రోచ్ఛవాలతో ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీహవనం నిర్వహించారు. -
తడిసిన ధాన్యం కొనుగోలు
జగిత్యాల: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయని, తడిసినా కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్యపడొద్దని కలెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. 427 కేంద్రాల ద్వారా గురువారం వరకు 3,60,547 టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ఇప్పటివరకు 90 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని, అత్యధిక ధాన్యం కొనుగోలు చేసిన జిల్లాగా రాష్ట్రంలో రెండోస్థానంలో నిలిచిందన్నారు. అకాలవర్షాలతో తడిసిన 15,779 క్వింటాళ్ల ధాన్యాన్ని బాయిల్డ్ రైస్మిల్లులకు తరలించామన్నారు. ధాన్యం తొందరగా తూకం వేయాలి కొండగట్టు(చొప్పదండి): ధాన్యాన్ని వెంటవెంటనే తూకం వేసి మిల్లులకు పంపించాలని అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. కొడిమ్యాలలోని ధాన్యం కోనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రెండు, మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలన్నారు. సివిల్ సప్లయ్ డీఎం హతీరం, ఎఫ్ఐ స్వామి తహసీల్దార్ రాజమణి ఉన్నారు. కలెక్టర్ యాస్మిన్ బాషా -
కొలతలు కుదిరేనా..?
జగిత్యాల: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం యూనిఫాంలు అందిస్తోంది. గతంలోనూ యూనిఫాంలు ఇచ్చినప్పటికీ కొలతలు లేకుండానే కుట్టడంతో కొందరు విద్యార్థులకు టైట్, మరికొందరికి లూజ్గా కనిపించాయి. దీంతో విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు. తాజాగా అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు యూనిఫాంలు కుట్టించే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించింది. దీంతో మహిళా సంఘాల సభ్యులు ఏప్రిల్లో వారివారి సమీపంలో ఉన్న స్కూళ్లకు వెళ్లి విద్యార్థుల కొలతలు తీసుకున్నారు. అయితే తరగతికి ఒక్క విద్యార్థి నుంచి మాత్రమే కొలతలు తీసుకున్నారు. ఈ క్రమంలో ఒక్క విద్యార్థి కొలతలు అందరు విద్యార్థులకు సరిగా కుదిరేనా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా తరగతిలో ఒక్కో విద్యార్థి ఒక్కో ఎత్తు.. ఒక్కో మందం.. ఒక్కో బరువు ఉంటారు. అందరూ సమానంగా ఉండే అవకాశాలు తక్కువ. కానీ.. మహిళా సంఘాలు మాత్రం తరగతికి ఒక విద్యార్థి కొలతలు మాత్రమే తీసుకోవడంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముందని తల్లిదండ్రులు అంటున్నారు. ఒక్కో విద్యార్థి కొలతలు తీసుకుని కుడితే సౌకర్యంగా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం అంచనాల ప్రకారమే మహిళా సంఘాలు విద్యార్థులకు డ్రెస్సులు కుడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో మెప్మా, గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్ సంఘాలు యూనిఫాంలు కుట్టే బాధ్యత తీసుకున్నాయి. వీటిపై పర్యవేక్షణ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులు చూస్తున్నారు. జిల్లాకు చేరుకున్న టెస్కో వస్త్రాలు యూనిఫాంలు కుట్టేందుకు కావాల్సిన బట్ట జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మార్సీలకు చేరాల్సి ఉన్నప్పటికీ కొన్ని సమస్యల వల్ల జిల్లా కేంద్రానికే వచ్చాయి. వారు జిల్లా కేంద్రం నుంచి ప్రతి మండల కేంద్రాల్లోని ఎమ్మార్సీ కేంద్రాలకు పంపించారు. వారు అక్కడ మహిళాసంఘాలకు అప్పగించారు. ఒకవేళ విద్యార్థులకు తగ్గట్లుగా కుట్టలేకపోతే ప్రభుత్వం యూనిఫాంలు అందజేసినా ఫలితం ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం అయితే ఒక డ్రెస్కు ప్రభుత్వం రూ.50 కుట్టు కూలి ఇస్తోంది. ప్రభుత్వం మరింత పెంచే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మహిళాసంఘాలు మాత్రం మరింత కూలి పెంచి ఇవ్వాలని, ప్రస్తుతం ఇస్తున్నవి సరిపోవని చెబుతున్నారు. బిగుతుగా ఉంటే ఇబ్బందులే... గతంలో కొలతలు లేకుండా దుస్తులు కుట్టడంతో విద్యార్థులకు బిగుతుగా.. లేకుంటే లూజ్గా ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం మహిళాసంఘాలకు అప్పగించినప్పటికీ వారు సైతం విద్యార్థుల కొలతలు తీసుకున్నప్పటికీ సక్రమంగా ఉంటాయా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో టైట్, లూజు ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ సరి చేసుకున్నారు. ఈసారైనా విద్యార్థులకు సరైన కొలతలతో యూనిఫాంలు ఇస్తే తల్లిదండ్రులకు ఆర్థికభారం తప్పే అవకాశాలుంటాయి. జిల్లా వివరాలు..సెర్ప్ మహిళా సంఘాలకు కేటాయించిన స్కూళ్లు : 702విద్యార్థులు : 58,059 మంది యూనిఫాంలు : 1,20,822మెప్మా మహిళా సంఘాలకు కేటాయించిన స్కూళ్లు : 129విద్యార్థులు : 16,105 మంది యూనిఫాంలు : 40,941 ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాంలు కుట్టించే బాధ్యత మహిళా సంఘాలకు.. జూన్ 12లోపు ఇవ్వాలన్నది గడువు సైజ్ సరిపోక గతంలో ఇబ్బందులుజూన్ 12 వరకు గడువు పాఠశాలల పునఃప్రారంభానికి సమయం తక్కువగా ఉంది. మహిళాసంఘాల సభ్యులు యూనిఫాంలు కుట్టడం ఇటీవలే ప్రారంభించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ యూనిఫాంలు కుట్టే బాధ్యతను పర్యవేక్షిస్తోంది. ఇంత తక్కువ సమయంలో యూనిఫాంలు అందే అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయి. జిల్లాలో 1,61,763మంది విద్యార్థులున్నారు. వీరందరికీ అందాలంటే మరింత సమయం పట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అందేలా చూస్తాం విద్యార్థులకు సంబంధించిన యూనిఫాంలను సకాలంలో విద్యార్థులకు అందేలా చూస్తాం. మహిళా సంఘాల సభ్యులు బాధ్యత తీసుకుని కుట్టిస్తున్నారు. జూన్ 12లోపు దాదాపుగా పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – సంపత్రావు, డీఆర్డీఏ పీడీ -
వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు
సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నాం సేంద్రియ ఎరువుల కోసమే ఈ ఎఫ్ఎస్టీపీ కేంద్రాలను ఏర్పాటుచేశాం. జగిత్యాలలో నూకపల్లి డంపింగ్యార్డు వద్ద రూ.1.50 కోట్లతో ప్రారంభించాం. మానవ వ్యర్థాల తరలింపునకు ఐదు వాహనాలకు లైసెన్స్ ఇచ్చాం. కేంద్రాల నిర్వహణను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించాం. – అనిల్బాబు, మున్సిపల్ కమిషనర్ జగిత్యాల: మొన్నటివరకు మున్సిపాలిటీల్లో ఎవరిదైనా సెప్టిక్ ట్యాంక్ నిండితే సమీప ఇళ్ల ప్రజలకు ఇబ్బందిగా ఉండేది. ట్యాంక్ శుభ్రం చేసేవారు ఉన్నా.. వ్యర్థాలను ట్యాంకుల్లో నింపుకొని వెళ్లి ఎక్కడ పారబోయాలనేది సమస్యగా మారేది. కొందరు ట్యాంకర్ల నిర్వాహకులు రోడ్ల పక్కన, ఇళ్ల సమీపంలో డంప్ చేసేశారు. తద్వారా ఆ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లేది. ప్రజలు రోగాలబారిన పడేవారు. ఈ నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీల్లో ఫికల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎఫ్ఎస్టీపీ)ను సుమారు రూ.1.50కోట్లతో ప్రారంభించింది. అప్పటినుంచి సెప్టిక్ట్యాంక్ శుభ్రం చేసే సమస్యకు తెరపడినట్లయ్యింది. మున్సిపాలిటీల్లోగానీ, ఇతర ప్రాంతాల్లోని సెప్టిక్ ట్యాంకులు నిండితే సంబంధిత ట్యాంకర్లు ఎఫ్ఎస్టీపీ కేంద్రానికి తరలిస్తున్నారు. ఆ కేంద్రంలో మానవ వ్యర్థాలతో ఎరువులను తయారు చేస్తున్నారు. ఆ ఎరువును ప్రకృతివనాలు, పార్క్ల్లోని చెట్లకు వినియోగిస్తున్నారు. సేంద్రియ ఎరువులే లక్ష్యంగా.. సేంద్రియ ఎరువులే లక్ష్యంగా జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎఫ్ఎస్టీపీ ప్లాంట్లను ప్రారంభించారు. సుమారు 50వేల లీటర్ల వ్యర్థాల సామర్థ్యం గల ట్యాంక్ను ఏర్పాటుచేశారు. ఇందులో ప్రత్యేక యంత్రాల ద్వారా మానవ వ్యర్థాలను శుభ్రం చేసి వారంపాటు సోలార్ విద్యుత్ ద్వారా దానిని ఎరువుగా మార్చుతారు. తద్వారా దుర్వాసన వచ్చే అవకాశం ఉండదు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లోని ఈ కేంద్రాలను ప్రైవేట్ లిమిటెడ్ ఏజెన్సీ వారు కొందరు లీజుకు తీసుకున్నారు. వీరు ట్యాంకర్ల ద్వారా వచ్చిన వ్యర్థాన్ని ఎరువులను ఉత్పత్తి చేస్తుంటారు. ఒక బ్యాగు 25 కిలోల చొప్పున ప్యాకింగ్ చేస్తున్నారు. హరితహారం మొక్కల కోసం.. గతంలో హరితహారం కింద పట్టణంతోపాటు, వివిధ చోట్ల అనేక మొక్కలు నాటిన విషయం తెల్సిందే. వీటికి ఎఫ్ఎస్టీపీలో తయారైన ఎరువులనే వినియోగిస్తున్నారు. కిలో ఎరువును రూ.15 చొప్పున లభిస్తోంది. సదరు ఎరువులు కావాల్సిన వారు మున్సిపల్ అధికారులను సంప్రదిస్తే వారికి కూడా విక్రయిస్తున్నారు. తద్వారా మున్సిపాలిటీకి ఆదాయం కూడా వస్తోంది. సుందరీకరణలో భాగంగా డివైడర్లలో.. రోడ్లకు ఇరువైపులా.. ఉద్యావనంలో అనేక మొక్కలు నాటారు. మానవ వ్యర్థాలతో తయారుచేసిన ఎరువును వేయడం ద్వారా మొక్కలు దృఢంగా ఉండటంతోపాటు, చనిపోకుండా ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఎఫ్ఎస్టీపీ కేంద్రాలు జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి బల్దియాలో మాత్రమే ఉన్నాయి. ధర్మపురి, రాయికల్లో లేకపోవడంతో ఈ రెండు బల్దియాల నుంచి మానవ వ్యర్థాలను జగిత్యాల ఎఫ్ఎస్టీపీ ట్యాంక్కు తీసుకొస్తున్నారు. లైసెన్స్ గల రెండు ట్యాంకర్లు ధర్మపురి, రాయికల్కు వెళ్తుంటాయి. ఎఫ్ఎస్టీపీ ట్యాంక్ల ఏర్పాటుతో రోగాలు దూరమయ్యాయని అంటున్నారు బల్దియా ప్రజలు. ఎవరైనా ట్యాంక్ నిండినప్పుడు 14420 నంబరును సంప్రదిస్తే మున్సిపల్ వారే వాహనాన్ని పంపిస్తున్నారు. బల్దియాల్లో ఎఫ్ఎస్టీపీ ట్యాంకులు రూ.1.50 కోట్లతో ఒక్కో కేంద్రం జగిత్యాల, మెట్పల్లి, కోరుట్లలో ఏర్పాటు ప్రజలకు దూరంకానున్న రోగాలు -
సోనియాను ఆహ్వానిస్తే విమర్శలా..?
సారంగాపూర్: రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియాగాంధీని ఆహ్వానిస్తే కేంద్రమంత్రి కిషన్రెడ్డి విమర్శించడం అర్థరహితమని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. మండలకేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటుకు యువత, విద్యార్థుల బలిదానాలకు చలించిపోయిన సోని యా.. పార్లమెంట్లో తెలంగాణ బిల్లును ఆమోదించారని, అలాంటి ఆమెను ఉత్సవాలకు ఆహ్వానిస్తే తప్పేంటని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం పదేళ్లలో ఏయే పంటలకు గిట్టుబాటు ధర కల్పించిందో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. పదేళ్ల క్రితం ధాన్యానికి రూ.1450 ఉంటే ఇప్పుడు కేవలం రూ.2200కు మాత్రమే చేరిందన్నారు. మోదీ పాలనలో రసాయన ఎరువులు, డీజిల్ ధరలు రెండింతలు పెరిగాయని విమర్శించారు. సన్నాలకు రూ.500 బోనస్ అందించడం ద్వారా రైతులు, వినియోగదారులకు మేలు జరుగుతుందన్నారు. 50శాతం సబ్సిడీపై అన్నిరకాల విత్తనాలను అందుబాటులో ఉంచాలని రాష్ట్రప్రభుత్వానికి సూచించారు. న్యారబోయిన గంగాధర్, వురుమల్ల లక్ష్మారెడ్డి, ఏనుగు మల్లారెడ్డి, నారపాక లక్ష్మణ్, గడ్డం తిరుపతిరెడ్డి తదితరులు ఉన్నారు. బీర్పూర్ మండలం చిత్రవేణిగూడెంకు చెందిన కాంగ్రెస్ నాయకుడు మెస్రం సురేందర్ మృతిచెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఇందిరమ్మ ఇళ్లు కేటాయించి ప్రభుత్వపరంగా ఆదుకుంటామన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ఈ కొత్తరకం స్నాక్స్ వంటకాలు.. ట్రై చేయండిలా..!
డ్రగ్స్ కేసులో ప్రముఖ సింగర్ అరెస్ట్
టీ20 ప్రపంచకప్ కోసం న్యూయార్క్కు బయల్దేరిన టీమిండియా
పెళ్లి కోసం అబ్బాయిని తీసుకెళ్లినా.. ఇంట్లో వాళ్లు నమ్మేలా లేరు: అంజలి
ఈ మినీ మెషిన్తో.. స్కిన్ సమస్యలకు చెక్!
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
'సలార్ 2' పక్కన పెట్టేశారని రూమర్స్.. ఒక్క ఫొటోతో క్లారిటీ
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్ధం
Viral Video: నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. కార్లు, కత్తులతో ఫైటింగ్
ఓటీటీ లవర్స్కు జియో సినిమా బంపరాఫర్
తప్పక చదవండి
- టీ20 ప్రపంచకప్ కోసం న్యూయార్క్కు బయల్దేరిన టీమిండియా
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
- Viral Video: నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. కార్లు, కత్తులతో ఫైటింగ్
- ఓటీటీ లవర్స్కు జియో సినిమా బంపరాఫర్
- చరిత్ర సృష్టించిన షకీబ్.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడిగా..!
- Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'!
- బ్యాన్ చేసిన వారే ఆమె టాలెంట్కు నివ్వెరపోయారు
- సెలక్ట్ చేసి చివరి నిమిషంలో హ్యాండిచ్చేవారు: హీరోయిన్
- ఇన్సూరెన్స్ లైసెన్స్ అప్లికేషన్ను విత్ డ్రా.. పేటీఎం మరో కీలక నిర్ణయం
- క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావా
Advertisement