-
రాకేశ్రెడ్డిని గెలిపించాలి
సాక్షి,యాదాద్రి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్రెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ నాయకుడు చింతల వెంకటేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జ్ ఇబ్రహీం కోరారు. శనివారం భువనగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సమస్యలపై అవగాహన కలిగి ప్రభుత్వాన్ని ప్రశ్నించే రాకేష్రెడ్డి కావాలా.. ప్రభుత్వానికి డబ్బా కొట్టే వ్యక్తి కావాలా అని ఓటర్లు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో విఫల ప్రభుత్వంగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న ప్రైవేట్, ఇంటర్, డిగ్రీ కళాశాలల స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం రాకేష్రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తారని, పట్టభద్రులు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, బబ్లు, పుట్ట వీరేశ్యాదవ్, కుతాడి సురేష్, ఓంప్రకాశ్ పాల్గొన్నారు. ఫ బీఆర్ఎస్ నాయకుడు చింతల వెంకటేశ్వర్రెడ్డి -
ఇబ్బందులు రానియొద్దు
మోటకొండూర్: వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా వీలైనంత త్వరగా కొనుగోళ్లు పూర్తి చేయాలని కలెక్టర్ హనుమంతు కె. జెండగే సూచించారు. శనివారం మోటకొండూర్ మండల కేంద్రంతో పాటు ముత్తిరెడ్డిగూడెం, నాంచారిపేట వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. జిల్లాలో దాదాపు అన్ని కేంద్రాల్లో కొనుగోళ్లు ముగిశాయని, ఇంకా కొన్ని కేంద్రాల్లో మాత్రమే పూర్తి కాలేదన్నారు. మండల కేంద్రంలో లారీ రావడం లేదని తెలపటంతో మరో లారీని పంపుతామని, వెంటనే ధాన్యాన్ని లోడ్ చేసి పంపాలని ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ శాంతిలాల్, ఆర్ఐ నరేష్, సంధ్య, రమేష్, అంజిరెడ్డి, భద్రయ్య, బంగారి, అశోక్ తదితరులున్నారు. -
రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్
సాక్షి, యాదాద్రి: బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, ఫోన్ ట్యాపింగ్ చేసి వ్యక్తిగత జీవితాల్లోకి కూడా తొంగి చూశారని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి ఆరోపించారు. శనివారం భువనగిరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రజావ్యతిరేక ప్రభుత్వంపై పోరాడిన తీన్మార్ మల్ల న్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఐదు నేరవేర్చినట్లు తెలిపారు. అధికారంలో వచ్చిన ఐదు నెలల్లో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తామన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు విషయంలో సఫలీకృతం అయ్యామని పేర్కొన్నారు. సమావేశంలో టీపీసీసీ డెలిగేట్ తంగళ్లపల్లి రవికుమార్, పీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నక్ ప్రమోద్కుమార్, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్లి వెంకటేశ్వర్లు, ఈరపాక నర్సింహ, రాములు పాల్గొన్నారు. ఫ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి -
విత్తనాలకు కృత్రిమ కొరత
సాక్షి, యాదాద్రి: రైతులు కోరుతున్న పత్తి విత్తనాలను బహిరంగ మార్కెట్లో వ్యాపారులు బ్లాక్ చేస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో విత్తనాలు నాటు కోవాలని ఆశతో ఉన్న రైతులకు బ్లాక్లో అధిక ధరలకు అమ్ముతున్నారు. ధరలపై ప్రశ్నించిన వారిని పత్తి విత్తనాలు లేవని తిప్పి పంపిస్తున్నారు. గ్రామాల్లో అరువుపై పత్తి విత్తనాలు తీసుకునే రైతులకు మూడు ప్యాకెట్లు అడిగితే ఒక ప్యాకెట్ కంపెనీది, మిగతా రెండు ప్యాకెట్లు సాధారణ రకానికి చెందినవి అంటగడుతున్నారు. రోహిణి కార్తె ప్రవేశంతో.. వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండడంతో చాలా వరకు బోర్లు వట్టిపోయాయి. వానాకాలంలో రైతులు వరికి బదులుగా పత్తి సాగుకు సిద్ధమవుతున్నారు. ఇందుకుగాను భూమిని చదును చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 1,35,000 ఎకరాల్లో పత్తి సాగు చేస్తుండగా 2,70,000 పత్తి విత్తనాలు ప్యాకెట్లు అవసరం ఉంటాయి. ఇప్పటికే రోహిణి కార్తె ప్రవేశించింది. ఈ కార్తెను రైతులు బలమైన కార్తెగా భావించి, ఈ సమయంలో విత్తనాలు విత్తితే మొక్క బలంగా పెరగడంతో పాటు దిగుబడులు అధికంగా ఉంటాయని నమ్ముతారు. దీంతో పత్తి విత్తనాల కోసం వ్యాపారుల వద్దకు బారులు తీరుతున్నారు. బ్లాక్ చేసి అధిక ధరలకు.. సంకేత్నాత్, యూఎస్–7067, ఆధ్యా, ఆశ, కబడ్డీ, అఖండ, రాశి–659, సదానంద్ ఇలా కొన్ని ప్యాకెట్లపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. పత్తి విత్తన కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, కంపెనీ డీలర్లు సిండికేట్గా మారి కొన్ని కంపెనీల విత్తనాలకు తీవ్రమైన కొరత చూపిస్తూ వాటిని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన బీటీ– 2 రకం విత్తనాల ప్యాకెట్ రూ.864కు అమ్మాలి. కానీ రూ.900 నుంచి రూ. 1400 వరకు విక్రయిస్తున్నారు. ఓ కంపెనీ ప్యాకెట్ ధర అయితే ఏకంగా రూ.2వేలకు పైగా విక్రయిస్తున్నారు. అధిక ధరలపై ఎవరైనా ప్రశ్నిస్తే మామూలు కంపెనీల విత్తన ప్యాకెట్లు లింక్ పెడుతున్నారు. అయితే కొందరు రైతులు తమకు కావాల్సిన విత్తనాలు కోసం ఏపీలోని గుంటూరు, మాచర్ల, మహారాష్ట్రలోని నాందేడ్, ఔరంగాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఆన్లైన్లో కొనుగోలు చేస్తున్నారు. అధిక ధరలకు విక్రయించొద్దు పత్తి విత్తనాలను ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవు. రైతుల అవసరాలకు అనుగుణంగా విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. గత వానాకాలంలో( 2023)లో 1,02,407 ఎకరాల్లో పత్తి సాగు కాగా, ఈ సారి 1,35,000 ఎకరాల్లో పత్తి సాగు చేస్తారని అంచనా వేశాం. ఇందుకోసం 2,70,000 ప్యాకెట్లు అవసరమవుతాయి. అధిక ధరలకు విక్రయించే వారిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. – అనురాధ, జిల్లా వ్యవసాయాఽధికారి ఫ సిండికేట్ అయిన విత్తన కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు ఫ కొన్ని కంపెనీల విత్తనాల కొరత చూపించి అధిక ధరలకు విక్రయం ఫ ప్రశ్నించిన రైతులకు స్టాక్ లేదని చెబుతున్న వ్యాపారులు ఫ అరువు రైతులకు సాధారణ కంపెనీ విత్తనాల అమ్మకం -
యాదాద్రిలో విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శనివారం విశేష పూజలు కొనసాగాయి. వేకువజామున శ్రీస్వామి, అమ్మవార్లకు సుప్రభాతం నిర్వహించిన అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన చేశారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలు జరిపించారు. సాయంత్రం వేళ జోడు సేవలను మాడ వీధిలో ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. జాతీయ సమైఖ్యత క్యాంప్లో ఆలేరు విద్యార్థుల ప్రతిభ ఆలేరురూరల్: హైదరాబాద్లోని మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 12 రోజల పాటు జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంపులో ఏక్ భారత్ శ్రేష్ఠా భారత్ జాతీయ ఎన్సీసీ క్యాంప్లో ఆలేరు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈమేరకు పాఠశాలకు చెందిన కొరుటూరి వైష్ణవి, మంతపురి జయశ్రీ, కొనపురం వైష్ణవి ఉత్తమ ఎన్సీసీ సర్టిఫికెట్లు పొందినట్లు ఎన్సీసీ అఽధికారి దూడల వెంకటేష్ శనివారం తెలిపారు. వారిని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. సంగీత మండపానికి రూ.10లక్షల విరాళంయాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ తూర్పు మాడ వీధిలో నూతనంగా నిర్మిస్తున్న సంగీత భవనానికి హైదరాబాద్లోని నారాయణగూడకు చెందిన నవనీత్రెడ్డి దంపతులు రూ.10లక్షలను విరాళంగా అందజేశారు. శనివారం యాదాద్రీశుడిని దర్శించుకున్న అనంతరం ఆలయ అధికారులకు వారు ఈ చెక్కు అందించారు. ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్ ప్రకటించాలి సూర్యాపేట టౌన్: వచ్చే నెలలో స్కూళ్లు పునః ప్రారంభం కానున్న నేపథస్యంలో ఎలక్షన్ కమిషన్(ఈసీ) అనుమతితో ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టీపీయూఎస్) రాష్ట్ర అధ్యక్షుడు కానుగంటి హన్మంతరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సరస్వతి ఉన్నత పాఠశాలలో టీపీయూఎస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆరేళ్లుగా బదిలీలు నిర్వహించకపోవడం వల్ల మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడమే కాక, ఎనిమిదేళ్లుగా పదోన్నతుల్లేక అనేక పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల కొరత ఏర్పడిందన్నారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేలోపు స్కూళ్లలో అన్నిరకాల పోస్టులను భర్తీ చేయాలని పేర్కొన్నారు. వేసవి సెలవుల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల విధుల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి తెలకలపల్లి పెంటయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెల్లంకొండ రామ్మూర్తి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంధ్యారాణి, రమేశ్ పాల్గొన్నారు. -
ప్రజల పక్షాన పోరాడేది బీజేపీనే..
నల్లగొండ టూటౌన్ : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ, ఉపాధ్యాయులకు సంబంధించిన 46 జీఓ రద్దు, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి ఇలా.. ఉద్యోగులు, ప్రజల పక్షాన పోరాడే దమ్ము బీజేపీకే ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. శనివారం నల్లగొండలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దాంతాలకు కట్టుబడి ప్రజల కోసం పని చేసిన ప్రేమేందర్రెడ్డికి పట్టభద్రులంతా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కాంగ్రెస్తో కోట్లాడేది బీజేపీనే అని, మండలిలో ముస్లిం రిజర్వేషన్లు బిల్లు అడ్డుకోవాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలన్నారు. ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, పట్టభధ్రులంతా రైతుబిడ్డలే అయినందున కాంగ్రెస్ మోసాన్ని గమనించాలన్నారు. విద్యా వ్యవస్థను, వ్యవసాయాన్ని, నిరుద్యోగుల బతుకులను కేసీఆర్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ కూడా సర్వనాశనం చేస్తోందన్నారు. రాష్ట్ర అప్పులు తీర్చి ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి రేవంత్రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శించారు. తాను ప్రజల కోసం 12 సార్లు జైలుకు వెళ్లి వచ్చానని, మూడు సార్లు చంపుతామని బెదిరించినా భయపడ లేదన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలపై ప్రజల పక్షాన కోట్లాడి జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమే అన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్రెడ్డి, సంకినేని వెంకటేశ్వర్రావు, సీనియర్ నేతలు రచనారెడ్డి, ప్రకాష్రెడ్డి, శానంపుడి సైదిరెడ్డి, గోలి మధుసూదన్రెడ్డి, నూకల నరసింహారెడ్డి, పిల్లిరామరాజు, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, బండారు ప్రసాద్, వీరెల్లి చంద్రశేఖర్ పాల్గొన్నారు.ఫ బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ -
రేపు ‘పట్టభద్రుల’ పోలింగ్
సాక్షి, యాదాద్రి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం జరగనుంది. అభ్యర్థుల ప్రచారం చివరి రోజైన శనివారం ముగిసింది. ఇక ఓటర్లను నేరుగా కలిసి ఓట్లు అభ్యర్థించే పనిలో పడ్డారు. గెలుపు కోసం ప్రధాన పార్టీలు ప్రలోభాలకు తెరలేపాయి. ఇక ఎమ్మెల్సీ పోలింగ్ పూర్తయ్యే వరకు జిల్లాలోని మద్యం దుకాణాలు మూసి వేయనున్నారు. ఈ మేరకు కలెక్టర్ హనుమంతు కే. జెండగే ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం 4 గంటల వరకు సాగిన ప్రచారం ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 4 గంటల వరకు సాగింది. అభ్యర్థుల తరపున ఆయా పార్టీల నేతలు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థ్ధి తరపున ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, భువనగిరి, మునుగోడు ఎమ్మెల్యేలు కుంభం అనిల్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, మిగతా కాంగ్రెస్ నాయకులు తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. టీపీసీసీ అఽధికార ప్రతినిధి హర్షవర్ధన్రెడ్డి భువనగిరిలో ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి తరపున మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, పైళ్ల శేఖర్రెడ్డి, గాదరి కిశోర్కుమార్, బూడిద భిక్షమయ్యగౌడ్, చింతల వెంకటేశ్వర్రెడ్డి, గొంగిడి మహేందర్రెడ్డి ప్రచారం చేశారు. బీజేపీ తరపున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు పాశఽం భాస్కర్తోపాటు జిల్లాలోని నియోజకవర్గం, మండల స్థాయి నాయకులు ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో ప్రచార జోరు.. ప్రఽస్తుత ఎన్నికల్లో బహిరంగ ప్రచారం, ఓటర్లను కలవడంతో పాటు సోషల్ మీడియాను మునుపెన్నడూ లేనివిధంగా వాడేశారు. అభ్యర్థులు తమ మెసేజ్ల ద్వారా ఓటు అభ్యర్థించారు. గడువు ముగిసే వరకు ఆయా పార్టీల నాయకులు వాట్సాప్ మెసేజ్, ఫోన్ కాల్స్తో ఓటు వేయాలని కోరారు. ప్రలోభాల ఎర ఎమ్మెల్సీ పోటీలో ఉన్న ప్రధాన పార్టీ అభ్యర్థుల తరుపున ఓటర్లకు ప్రలోభాల ఎర వేస్తున్నారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగా ఓటర్లను కలిసి డబ్బులు పంచే కార్యక్రమానికి తెర లేపారు. సంస్థలు, వ్యక్తిగతంగా సమూహాలుగా గుర్తించి ఓటుకు నోటు పంపిణీ చేపడుతున్నట్లు తెలిసింది. ఓ ప్రధాన పార్టీ ఓటుకు రూ.2 వేలు ఇచ్చేందుకు ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. మిగతా ప్రధాన పార్టీల అభ్యర్థులు డబ్బుల పంపిణీ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పోల్ చిటీలు ఇచ్చే క్రమంలోనే ఓటుకు నోటు ఇవ్వాలని నిర్ణయించారు. ఫ ముగిసిన ప్రచారం ఫ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు పాటించాలి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసే సమయమైన 27వ తేదీ సాయంత్రం 4 గంటలను ఆధారంగా చేసుకుని 48 గంటల ముందు నుంచి ఎలాంటి ప్రచారాలు, సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కే.జండగే శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్లను ఆకర్షించడం వంటివి చేయకూడదని, ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టరీత్యా శిక్షార్హులవుతారని వెల్లడించారు. -
డీసీసీబీ చైర్మన్పై అవిశ్వాసం?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డిపై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. త్వరలోనే అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు డైరెక్టర్లు సన్నద్ధమవుతున్నారు. డైరెక్టర్లలో పలువురు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరడంతో డీసీసీబీలో ఆ పార్టీ బలం పెరిగింది. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా ఎమ్మెల్యేలను గెలుచుకోవడంతోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో తమ పార్టీకి చెందిన వారికి ముఖ్య పదవులను కట్టేబట్టే ఆలోచనల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగానే డీసీసీబీ పీఠాన్ని ఆధీనంలోకి తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి భావిస్తున్నారు. మొదటి నుంచి పార్టీ అభివృద్ధి కోసం పని చేసిన వారికి ఆ పదవిని కట్టబెట్టాలని ఆయన ఆలోచనలో ఉన్నారు. దీంతో అవిశ్వాసానికి అవసరమైన డైరెక్టర్ల మద్దతు కూడగట్టి జూన్ మొదటివారంలో నోటీసు ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. తొమ్మిదికి చేరిన కాంగ్రెస్ బలం డీసీసీబీలో మొత్తం 21 మంది డైరెక్టర్లు ఉండాలి. అందులో ప్రస్తుతం 19 మంది ఉన్నారు. మరో ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉన్నా ఆయా రిజర్వేషన్ల సభ్యులు లేకపోవడంతో చేయలేదు. ప్రస్తుతం ఉన్న 19 మంది డైరెక్టర్లలో 18 మంది టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే. మునుగోడు పీఏసీఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్రెడ్డి మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్. ఇటీవల డీసీసీబీ వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్రెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి చెందిన డైరెక్టర్లలో తుంగతుర్తికి చెందిన గుడిపాటి సైదులు, భువనగిరికి చెందిన అందెం లింగంయాదవ్, నాగార్జునసాగర్కు చెందిన ఇరిగినేని అంజయ్య (గతంలో బీఆర్ఎస్లో ఉండగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఎస్పీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు.), మిర్యాలగూడకు చెందిన బంటు శ్రీనివాస్, కోదాడకు చెందిన వీరస్వామి, కొండా సైదయ్య, నల్లగొండకు చెందిన పాశం సంపత్రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ బలం తొమ్మిదికి చేరింది. 2/3 మెజారిటీ అవసరం నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే బ్యాంకు డైరెక్టర్లలో మూడింట రెండో వంతు (2/3) డైరెక్టర్ల ఆమోదం అవసరం. దాని ప్రకారం ప్రస్తుతం బ్యాంకులో ఉన్న 19 మంది డైరెక్టర్లలో అవిశ్వాసం నెగ్గేందుకు 14 మంది డైరెక్టర్ల మద్దతు కావాలి. అయితే డీసీసీబీ పీఠం ఆశిస్తున్న కుంభం శ్రీనివాస్రెడ్డి నల్లగొండలో సమావేశం నిర్వహించినప్పుడు 13 మంది హాజరైనట్లు తెలిసింది. మంత్రి వచ్చాక అవిశ్వాసం నోటీసు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. వారిద్దరు వచ్చాక జూన్ మొదటి వారంలో అవిశ్వాసం నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. ఇక వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లాలని భావించినా అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధం అవుతున్న క్రమంలో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. టెస్కాబ్లో 10న అవిశ్వాసం రాష్ట్రస్థాయిలోని టెస్కాబ్ చైర్మన్, వైస్ చైర్మన్పైనా అవిశ్వాసం కోరుతూ డైరెక్టర్లు ఇటీవల నోటీసు అందజేశారు. టెస్కాబ్ చైర్మన్గా ఉన్న రవీందర్రావు కరీంనగర్ డీసీసీబీ చైర్మన్ కాగా, వైస్ చైర్మన్గా ఉన్న గొంగిడి మహేందర్రెడ్డి నల్లగొండ డీసీసీబీ చైర్మన్. ఈనెల 10వ తేదీన టెస్కాబ్లో నిర్వహించే అవిశ్వాస తీర్మానం నెగ్గితే వీరు ఆయా పదవులు కోల్పోనున్నారు. 16వ రోజున అవిశ్వాసం కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం నోటీసు ఇచ్చాక 15 రోజుల సమయం ఇస్తారు. 16వ రోజున అవిశ్వాసం తీర్మానం పెడతారు. అందులో నెగ్గితే డీసీసీబీ చైర్మన్ పదవి నుంచి గొంగిడి మహేందర్రెడ్డిని తొలగిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆమోదంతో నూతన చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. ఒకవేళ అవిశ్వాసం వీగిపోతే గొంగిడి మహేందర్రెడ్డి చైర్మన్గా కొనసాగుతారు. ఫ కాంగ్రెస్లో చేరిన 8 మంది డైరెక్టర్లు ఫ అనుకూల డైరెక్టర్లతో ఇటీవల భేటీ అయిన ఆశావహ డైరెక్టర్ ఫ అవిశ్వాసానికి 14 మంది మద్దతు అవసరం ఫ మద్దతు కూడగటేందుకు ముమ్మర ప్రయత్నాలు ఫ జూన్ మొదటి వారంలో అవిశ్వాసం పెట్టే ఆలోచన ఫ టెస్కాబ్లోనూ అవిశ్వాసం పెట్టిన సభ్యులు చైర్మన్ రేసులో కుంభం శ్రీనివాస్రెడ్డి డీసీసీబీ చైర్మన్ రేసులో కుంభం శ్రీనివాస్రెడ్డి ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రధాన అనుచరుడైన ఆయన ప్రస్తుతం డీసీసీబీ డైరెక్టర్గా ఉన్నారు. మొదటి నుంచి రాజగోపాల్రెడ్డికి వెన్నంటి ఉన్న ఆయనను డీసీసీబీ చైర్మన్ను చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి పట్టుదలతో ఉన్నట్లు తెలిసింది. -
పరీక్ష కేంద్రాల్లో వసతులు కల్పించాలి
సాక్షి,యాదాద్రి: వచ్చే నెల 9న నిర్వహించనున్న గ్రూప్– 1 పరీక్షకు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ హనుమంతు కే.జెండగే అధికారులను ఆదేశించారు. పరీక్ష ఏర్పాట్లపై డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేశ్చంద్రతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్లో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భువనగిరి పట్టణంలో మదర్ థెరిసా హైస్కూల్, మాంటెస్సోరీ హైస్కూల్, దివ్యబాల విద్యాలయం హైస్కూల్, వెన్నెల ఇనిస్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్, భువనగిరి కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎస్ఎల్ఎన్ఎస్ కాలేజీ, పహడీ నగర్ లోని శ్రీ నవభారత్ కాలేజీ, జాగృతి కళాశాల మొత్తం 9 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 3,349 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు. పది మంది అబ్జర్వర్లు, 9 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్స్, 39 మంది ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లను నియమించినట్లు చెప్పారు. కేంద్రాల వద్ద ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 144 సెక్షన్ విధించాలని సూచించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, అంబులెనన్స్ అందుబాటులో ఉంచాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కె.గంగాధర్, భువనగిరి ఆర్డీఓ అమరేందర్, ట్రాఫిక్ ఏసీపీ ప్రభాకర్రెడ్డి, ప్రొఫెసర్ బాలాజీ, మున్సిపల్ కమిషనర్ రామాంజుల రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి, జిల్లా రవాణా అధికారి సాయికృష్ణ, జిల్లా పౌర సంబంధాల అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా వైద్యశాఖ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వంశీకృష్ణ, విద్యుత్ శాఖ డీఈ శ్రీనివాసచారి, ఆర్టీసీ డివిజనల్ మేనేజర్ శ్రీనివాసగౌడ్, సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్, పరీక్షల విభాగం సూపరింటెండెంట్ పార్థసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హనుమంతు కే.జెండగే -
ఐదు నెలల్లోనే అపఖ్యాతి
కేసీఆర్ వల్లే తెలంగాణలో అభివృద్ధి జరిగింది : జగదీష్రెడ్డి కేసీఆర్ వల్లే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ఫ్లోరైడ్ నుంచి విముక్తి కల్పించేందుకు మిషన్ భగీరథకు రూపకల్పన, పరిశ్రమలు తీసుకురావడం, తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి మాత్రం కేటీఆరేనని పేర్కొన్నారు. పరిశ్రమల ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించారని, సంక్షోభంలో ఉన్న చేనేత పరిశ్రమను గట్టెక్కించేందుకు అనేక పథకాలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. హామీలను అమలు చేయకుండా తప్పించుకు తిరుగుతున్న కాంగ్రెస్ పెద్దలను గల్ల పట్టుకొని నిలదీయాలంటే బీఆర్ఎస్ అభ్యర్థి రాఖేష్రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.చౌటుప్పల్ : కాంగ్రెస్ పార్టీ ఆచరణకు సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిందని, వాటిని అమలు చేయకపోవడంతో ప్రజలు చీదరించుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. ప్రభుత్వం ఐదు నెలల్లోనే అపఖ్యాతి మూటగట్టుకుందన్నారు. వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చౌటుప్పల్ మండలం దామెర గ్రామంలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మునుగోడు నియోజకవర్గ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మినహా మరే హామీ కూడా అమలు కాలేదన్నారు. బస్సుల్లో ఆడవాళ్లు కొట్టుకుంటుండగా, మగవారు తిట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎవ్వరు కూడా రాష్ట్రం పరువుకు భంగం కలిగించరని, రేవంత్రెడ్డి మాత్రం తెలంగాణ అప్పుల్లో ఉందని ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సెక్రటేరియట్లో లంకెబిందెలున్నాయని వస్తే ఖాళీ కుండలు ఉన్నాయని వ్యాఖ్యలు చేసిన వ్యక్తి కూడా ముఖ్యమంత్రేనా? అని ప్రశ్నించారు. యాదాద్రి క్షేత్రం వెయ్యేళ్లు చెక్కుచెదరకుండా ఉండేలా తీర్చిదిద్దారని, వెయ్యి గ్రామాల్లో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమివేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎన్ని పార్టీలు మారిండో అందరికీ తెలుసన్నారు. రాజగోపాల్రెడ్డి, రేవంత్రెడ్డి ఇద్దరూ ఏ రకంగా బూతులు తిట్టుకున్నారో కూడా గుర్తుందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు ఉండాలంటే ఉన్నత విద్యావంతుడైన రాఖేష్రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, గాదరి కిశోర్, సూర్యాపేట జెడ్పీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ, సీనియర్ నాయకులు మునగాల నారాయణరావు, చెరుకు సుధాకర్, పల్లె రవికుమార్, పీఏసీఎస్ చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గిర్కటి నిరంజన్, మార్కెట్ మాజీచైర్మన్ బొడ్డు శ్రీనివాస్రెడ్డి, సుర్వి యాదయ్య, గుండెబో యిన అయోధ్య, వెంకటేశం, ఢిల్లీ మాధవరెడ్డి, ఊడుగు మల్లేష్, సుర్వి మల్లేశం, దయాకరాచారి, కృష్ణ పాల్గొన్నారు.ఫ బస్సుల్లో ఉచిత ప్రయాణం మినహా అన్నింటిలో విఫలం ఫ ఫ్లోరైడ్ భూతాన్ని తరిమినఘనత బీఆర్ఎస్దే ఫ యాదాద్రి ఆలయం వెయ్యేళ్లు చెక్కుచెదరకుండా తీర్చిదిద్దాం ఫ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ -
రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వండి
సాక్షి,యాదాద్రి : దేశీ (డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్పుట్ డీలర్స్) కోర్సుల్లో శిక్షణ పొందిన వ్యవసాయ డీలర్లు రైతులకు అవసరమైన సమాచారం అందజేయాలని కలెక్టర్ హనుమంతు కే.జెండగే సూచించారు. వ్యవసాయం, పశుపోషణ, సెరికల్చర్, సాంకేతిక నైపుణ్యంపై దేశీ శిక్షణ పొందిన 40 మంది డీలర్లకు శుక్రవారం ఆయన సర్టిఫికెట్లు అందజేశారు. సాగులో సాంకేతిక పరిజ్ఞానం ముఖ్యమని, రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చి అధి దిగుబడులు సాధించేలా ప్రోత్సహించాలని కోరారు. విత్తన, ఎరువుల వినియోగ చట్టాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఏరువాక శాస్త్రవేత్త అనిల్, ఏడీఏలు ఉన్నారు. పాఠశాలల్లో అభివృద్ధి పనులపై సమీక్ష పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమావేశమై పాఠశాలల్లో జరుగుతున్న పనులను సమీక్షించారు. ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం లోగా పనులన్నీ పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో 673 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 51,848 మంది విద్యార్థుల యూనిఫామ్ కుట్టేందుకు మండల కేంద్రాలకు క్లాత్ పంపినట్లు పేర్కొన్నారు. 541 స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా యూనిఫామ్ డ్రెస్సులు కుట్టించి జూన్5వ తేదీలోగా విద్యార్థులకు అందజేయాలని సూచించారు. ఫ కలెక్టర్ హనుమంతు కే.జెండగే -
4.59 లక్షల ఎకరాలు
సాగు అంచనాభువనగిరి : వానాకాలం సీజన్ పంటల సాగు ప్రణాళికను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. ఏ పంట ఎంత మేరకు సాగు కానుంది, ఇందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు ఎంత అవసరం అవుతాయని అంచనాలు రూపొందించింది. గత సీజన్ కంటే ఈసారి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉందని ఉన్నట్లు అంచనా వేశారు. వరి వైపే మొగ్గు జిల్లాలో ఈసారి వానాకాలం 4,59,850 ఎకరాల్లో పంటలు సాగువుతాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. ఎప్పటి మాదిరిగానే వరి, పత్తి అధికంగా సాగయ్యే అవకాశం ఉందని, ఆ తర్వాత పత్తి, కందులు సాగు కానున్నట్లు అధికారులు ప్రకటించిన గణాంకాల ప్రకారం తెలుస్తోంది. గత ఏడాది వానాకాలంలో 3,09,368 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అధికారులు ప్రణాళిక రూపొందించారు. కాగా ఈసారి అదనంగా 1,50,482 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ సీజన్ నుంచి ధాన్యానికి బోనస్గా రూ.500 ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం, ముందస్తుగా, సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో రైతులు ఎక్కువగా వరి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి నివేదిక.. సాగు ప్రణాళిక ఖరారు చేసిన అధికారులు.. అందుకు అనుగుణంగా అవసరమయ్యే విత్తనాలు, ఎరువుల ఇండెంట్ను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేశారు. వరి, కందులు, నూనె గింజలు కలిపి 71,284 క్వింటాళ్ల విత్తనాలు అవసరం అని బావిస్తున్నారు. పత్తి విత్తనాలు 270,000 ప్యాకెట్లు అవసరమని నిర్ణయించారు. వీటితో పాటు ఎరువులు 80,594 మెట్రిక్ టన్నులు కావాలని ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఎరువుల డిమాండ్ ఇలా.. యూరియా 35260, డీఏపీ 1,4530, ఎంవోపీ 5,812, కాంప్లెక్స్ 23248, ఎస్ఎస్పీ 1,744 మొత్తం 8,0594 మెట్రిక్ టన్నుల ఎరువులు కావాల్సి ఉంది. నేటినుంచి రోహిణి కార్తె సాధారణంగా రైతులు రోహిణి కార్తెలో సాగు ప్రారంభిస్తారు.ఈ కార్తెలో విత్తనాలు వేస్తే మంచి దిగుబడి వస్తుందని నమ్మకం. శనివారం నుంచి రోహిణి కార్తె మొదలు కానుండడంతో రైతులు దుక్కులు దున్ని విత్తనాలు వేసే పనిలో నిమగ్నులు కానున్నారు. ప్రస్తుతం అకాల వర్షాలు పడుతుండడంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో దుక్కులు దున్ని, విత్తనాలు వేయడం ప్రారంభించారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని రైతులు భూములు సాగు చేయడం, దమ్ము వేయడం వంటి పనులు చేసుకుంటున్నారు. వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు చేసిన వ్యవసాయ శాఖ ఫ గత సంవత్సరం కంటే 1,50,482 ఎకరాలు ఎక్కువ ఫ ఈసారి కూడా వరి, పత్తిదే అగ్రస్థానం ఫ ఎరువులు, విత్తనాల కోసం ప్రభుత్వానికి ఇండెంట్ ఇచ్చిన వ్యవసాయ శాఖ ఫ దుక్కులు సిద్ధం చేస్తున్న రైతులు సాగు అంచనా ఇలా.. పంట గత వానాకాలం ఈ సారి విత్తనాలు (క్వింటాళ్లలో) వరి 3,05,691.13 2,85,000 71,012.50 పత్తి 1,02,407.30 1,35,000 2,70,000ప్యాకెట్లుపప్పులు 3,482.39 8,500 208.27 చిరుధాన్యాలు 150.2 200 –– నూనె గింజలు 45.04 150 63.48 ఇతర పంటలు –– 21,000 –– మొత్తం 3,09,368.76 4,59,850సకాలంలో ఎరువులు భువనగిరి రూరల్ : రైతులకు ఇకనుంచి సకాలంలో ఎరువులు అందనున్నాయని కలెక్టర్ హనుమంతు కే.జెండగే తెలిపారు. భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలోని వేర్ హౌజింగ్ గోదాములో ఏర్పాటు చేసిన ఎరువుల ర్యాక్ పాయింట్ను శుక్రవారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో నాలుగున్నర లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగయ్యే అవకాశం ఉందని, 80 వేలకు పైగా మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయన్నారు. ఇప్పటి వరకు మిర్యాలగూడ, హైదరాబాద్లోని సనత్నగర్ ర్యాక్ పాయింట్ల నుంచి ఎరువులు వచ్చేవన్నారు. ఇప్పుడు జిల్లాలోనే ర్యాక్ పాయింట్ అందుబాటులోకి వచ్చినందున, రైతులు సకాలంలో ఎరువులు పొందవచ్చన్నారు. ఎరువులు, విత్తనాలు లైసెన్స్ డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేయాలని, తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఎల్ఎన్ఎస్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ పచ్చిమట్ల శివరాజ్గౌడ్, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వైస్ చైర్మన్ భాస్కర్రెడ్డి, లాజిస్టిక్ రీజినల్ మేనేజర్ శేషు కుమార్, డీజీఎం వెంకటేశ్వర్లు, ఏడీఏ దేవ్సింగ్ తదితరులు పాల్గొన్నారు. సాగు విస్తీర్ణం పెరగనుంది గత వానాకాలం కంటే ఈ సారి సాగు విస్తీర్ణం పెరగనుంది. ఇప్పటికే వర్షాలు కురుస్తుండడంతో పలు చోట్ల రైతులు పత్తి విత్తనాలు విత్తుతున్నారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాల కోసం ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. –అనురాధ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
కనుల పండువగా ఊంజలి సేవ
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజలి సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు.సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. ఆండాళ్ అమ్మవారిని ఊరేగిస్తున్న సమయంలో మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టింపజేసి ఊంజలి సేవోత్సవం చేపట్టారు. అనంతరం హారతి ఇచ్చారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ, ఆరాధన అనంతరం అభిషేకం, అర్చనలు చేశారు. అలాగే ఆలయ ముఖ మండపం, ప్రాకార మండపంలో శ్రీసుదర్శన హోమం, నిత్యకల్యాణం, వేద ఆశీర్వచనం, సువర్ణ పుష్పార్చన తదితర కై ంకర్యాలు గావించారు. రాత్రి శయనోత్సవం చేసి ఆలయానికి ద్వారబంధనం చేశారు. ఆండాళ్దేవికి పూజలు నిర్వహిస్తున్న అర్చకులు -
పాలిసెట్కు 1,373 మంది హాజరు
భువనగిరి : జిల్లాలో శుక్రవారం నిర్వహించిన పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. పరీక్ష నిర్వహణకు ఏడు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష జరిగింది. 1,496 మంది విద్యార్థులకు 1,373 మంది హాజరయ్యారు. 123 మంది గైర్హాజరయ్యారు. మొత్తం 91.78 శాతం మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు పాలిసెట్ జిల్లా కో ఆర్డినేటర్ షాఫిజ్ అక్తర్ తెలిపారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం భువనగిరి : ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 16 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం జరిగిన ప్రథమ సంవత్సరం పరీక్షలకు 1.272 మంది విద్యార్థులకు గాను 1,172 మంది హాజరయ్యారు. 99 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన సెకండియర్ పరీక్షకు 542 మందికి 506 మంది విద్యార్థులు హాజరయ్యారు. 36 మంది గైర్హాజరైనట్లు డీఐఈఓ రమణి తెలిపారు. హెడ్ కానిస్టేబుల్కు బంగారు పతకాలు యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బాంబ్స్వ్కాడ్ టీంలో పని చేస్తున్న కానిస్టెబుల్ అంబోజు అనిల్కుమార్ జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించారు. ఈ నెల 22 నుంచి 23వ తేదీ వరకు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి పాన్ ఇండియా మాస్టర్ అథ్లెటిక్స్ చాంయన్షిప్ పోటీల్లో 400, 800, 3,000 మీటర్ల పరుగు పందెంలో అనిల్కుమార్ మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకాలు కై వసం చేసుకున్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను త్వరలో ఆస్ట్రేలియాలో జరిగే అంతర్జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై నట్లు అనిల్కుమార్ తెలిపారు. ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తాం బీబీనగర్ : రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి భరోసా ఇచ్చారు. శుక్రవారం బీబీనగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్ వల్ల కొనుగోళ్లు కాస్త ఆలస్యం అయ్యాయని, వారం రోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పారు. ఎప్పటికపుడు అధికారులు, మిల్లర్లతో మాట్లాడుతూ కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.వ్యవసాయం గురించి తెలియని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి.. రైతుల గురించి మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పంజాల రామాంజనేయులుగౌడ్, గోలి పింగళ్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్రెడ్డి, పొట్టోల శ్యామ్గౌడ్, ఎంపీటీసీ గోలి నరేందర్రెడ్డి, గడ్డం బాలకృష్ణ, పంజాల పెంటయ్య, మల గారి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వారంలోగా కొనుగోళ్లు పూర్తి చేయాలి
చౌటుప్పల్ : ధాన్యం కొనుగోళ్లు వారం రోజుల్లో పూర్తి చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్ అనితారామచంద్రన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ హనుమంతు కె.జెండగేతో కలిసి శుక్రవారం చౌటుప్పల్ మండలం దేవలమ్మనాగారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోళ్లకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. మూడు రోజుల్లో కొనుగోళ్లు పూర్తిచేసి కేంద్రాన్ని ఎత్తివేయాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం నర్సరీకి వెళ్లి మొక్కలను పరిశీలించారు. మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అలాగే స్థానిక ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. జూన్ 2లోపు పూర్తి కావాలని ఆదేశించారు. అక్కడి నుంచి చిన్నకొండూరు గ్రామానికి వెళ్లి మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నడుస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. పాఠశాలలు తెరిచేలోపు విద్యార్థుల యూనిఫామ్ కుట్టడం పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఆమె వెంట డీఆర్డీఓ కృష్ణణ్, సివిల్ సప్లయ్ డీఎం గోపీకృష్ణ, డీఎస్ఓ శ్రీనివాస్రెడ్డి, ఇంచార్జి డీసీఓ ప్రవీణ్కుమార్, తహసీల్దార్ హరికృష్ణ, ఎంపీడీఓ సందీప్కుమార్, డీఎల్పీఓ ఉన్నారు.ఫ పంచాయతీరాజ్ కమిషనర్ అనితారామచంద్రన్ -
నల్లగొండ కలెక్టర్ హరిచందన పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన పేరుతో ఫేస్బుక్లో గుర్తు తెలియని వ్యక్తులు నకిలీ ఖాతా ఓపెన్ చేశారు. ప్రొఫైల్లో కలెక్టర్ హరిచందన ఫొటోతోపాటు బ్యాక్గ్రౌండ్లో గతంలో ఆమె చేసిన కార్యక్రమాలతో కూడిన ఫొటోలతో హరిచందన్ ఐఏఎస్ పేరుతో ఖాతాను రూపొందించి ఓపెన్ చేశారు. దీంతో కలెక్టర్కు తెలిసిన వారు ఎవరైనా ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తే దానికి యాక్సెప్ట్ చేసి, ఆ ఖాతాలో ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న వారికి హరిచందన ఐఏఎస్ పేరుతో కలిగిన ఖాతా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపుతున్నారు. అది నిజమని భావించిన వారు యాక్సెస్ట్ చేయడంతో అసలు కథ అప్పుడు మొదలవుతోంది. ఫేస్బుక్ మెసేంజర్ ద్వారా చాటింగ్ మొదలు పెడుతున్నారు. తనకు సంతోష్కుమార్ అనే సీఆర్పీఎఫ్ ఆఫీసర్ ఫ్రెండ్ ఉన్నారని, ఆయనకు ట్రాన్స్ఫర్ అయిందని, తన ఇల్లును తక్కువ ధరకు అమ్ముతున్నారంటూ చాటింగ్ మొదలు పెడుతున్నారు. మీకు తెలిసిన వారికి విక్రయించి పెట్టమని, లేదంటే మీరే తీసుకోండని మాటల్లో పెట్టి, ఫోన్నెంబరు తీసుకొని మరొక నంబరుతో వాట్సాప్ ద్వారా చాటింగ్ చేస్తూ డబ్బులు లాగే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇల్లు ఎలాగూ తీసుకుంటారని భావిస్తున్నానని, తాను ప్రస్తుతం మీటింగ్లో ఉన్నానని, అర్జంట్ అవసరం ఉందంటూ డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ దాసరి హరిచందనను వివరణ కోరగా, తనకు ఫేస్బుక్ ఖాతా లేదని, అది ఫేక్ అకౌంట్ అయి ఉంటుందని, ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఎవరు నమ్మిమోసపోవద్దని పేర్కొన్నారు.ఫ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తూ.. మెసెంజర్లో చాటింగ్ ఫ మా ఫ్రెండ్ సీఆర్పీఎఫ్ ఆఫీసర్ ఇల్లు అమ్ముతారంటూ చాటింగ్ ఫ మీకు తెలిసిన వారికి అమ్మించమంటూ మెసేజ్లు -
రైతులే విత్తనాలు తయారు చేసుకోవాలి
త్రిపురారం : రైతులు తమకు కావాల్సిన విత్తనాలను తమ పొలంలోనే తయారు చేసుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కంపాసాగర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాసరావు, వ్యవసాయ పరిశోధన స్థానం హెడ్ డాక్టర్ లింగయ్య సూచించారు. శుక్రవారం త్రిపురారం మండలంలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కంపాసాగర్లో వ్యవసాయ పరిశోధన స్థానం, కృషి విజ్ఙాన కేంద్రం ఆధ్వర్యంలో వరి విత్తన మేళా నిర్వహించారు. యాదాద్రిభువనగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలోని రైతులకు వరి విత్తనాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు విత్తనాల కోసం ప్రైవేటు వ్యాపారులపై ఆధారపడి ఆర్థికంగా నష్టపోవద్దని అన్నారు. విత్తనాలను కొనుగోలు చేసే సమయంలో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటించాలన్నారు. కార్యక్రమంలో విస్తరణ శాస్త్రవేత్త పల్లవి, ఉమ్మడి జిల్లాలోని రైతులు పాల్గొన్నారు. -
మల్లన్న గెలుపులో యువజన కాంగ్రెస్ పాత్ర కీలకం
నల్లగొండ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపులో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని స్పోర్ట్స్ అథారిటీ రాష్ట్ర చైర్మన్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంప్ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం యువజన కాంగ్రెస్ కార్యకర్తల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి శివసేనారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్రెడ్డి, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న గెలిస్తే ఆ క్రెడిట్ యువజన కాంగ్రెస్కే దక్కుతుందన్నారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గౌని రాజారమేష్యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్సింగ్ నాయక్, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్టా రాకేష్, ఎండీ గౌస్, జిల్లా ఉపాధ్యక్షుడు జయంత్రెడ్డి, నల్లగొండ, సాగర్ మిర్యాలగూడ ,దేవరకొండ , నకిరేకల్ నియోజకవర్గాల అధ్యక్షులు జహంగీర్బాబా, పగడాల నాగరాజు, ఆజర్, హరికృష్ణ, జలంధర్రెడ్డి, నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, మండల అధ్యక్షుడు నవీన్గౌడ్, కనగల్ అధ్యక్షుడు రాజు పాల్గొన్నారు.ఫ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తకాపు శివసేనారెడ్డి -
ప్రయాణికులపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఫిర్యాదు
నకిరేకల్ : ఆర్టీసీ బస్సులో ప్రయాణికులకు, డ్రైవర్కు మధ్య వివాదం తలెత్తింది. దీంతో సదరు డ్రైవర్ పోలీస్స్టేషన్ ఎదుట బస్సును నిలిపి గొడవ చేసిన ప్రయాణికులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. నార్కట్పల్లి డిపో ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు బయలుదేరింది. హైదరాబాద్లోనే మహిళా ప్రయాణికులతో బస్సు నిండిపోయింది. మార్గమధ్యలో నకిరేకల్కు చేరుకున్నాక బస్సులోనుంచి కొంత మంది ప్రయాణికులు దిగిపోయారు. అందులో నలుగురు మహిళా ప్రయాణికులు బస్సును కొద్ది సేపు ఆపండి.. తమ బంధువులు వస్తున్నారని డైవర్ను కోరారు. కొద్దిసేపు బస్సు ఆపినప్పటికీ వారు రాకపోవడంతో డ్రైవర్ బస్సును కదిలించడంతో డ్రైవర్తో మహిళా ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. డ్రైవర్కు ప్రయాణికులకు మధ్య గొడవ ముదరడంతో సదరు డ్రైవర్ బస్సును పోలీస్ స్టేషన్ దగ్గరకు తీసుకెళ్లి నిలిపివేశారు. విధి నిర్వహణకు ప్రయాణికులు ఆటంకం కలిగించారని ప్రయాణికులపై పోలీస్స్టేషన్లో డ్రైవర్ ఫిర్యాదు చేశారు. అనంతరం డ్రైవర్కు, ప్రయాణికులకు పోలీసులు సర్దిచెప్పి పంపించడంతో సమస్య సద్దుమనిగింది. -
హత్య కేసులో నిందితులకు రిమాండ్
భువనగిరి క్రైమ్ : మండలంలోని పచ్చర్లబోడ్ తండాలో లింగును హత్య చేసిన నిందితులను అరెస్టు చేసి శుక్రవారం కోర్టుకు రిమాండ్ చేసినట్లు ఏసీపీ రవికిరణ్రెడ్డి తెలిపారు. వివరాల ప్రకారం.. పచ్చర్లబోడ్ తండాకు చెందిన లింగుకి, దేవిసింగ్కు మధ్య పాత కక్షలు ఉన్నాయి. కాగా గతంలో లింగుపై హత్య, దోపిడీ, దొంగతనం కేసులు ఉన్నాయి. ఈ క్రమంలో లింగు తనను చంపుతాడనే అనుమానంతో జనవరి 11న లింగుని దేవిసింగ్ తన కోళ్లఫారంలోకి పిలిచి మద్యం తాపించి మైకంలో ఉన్న లింగు మెడపై కత్తితో నరికాడు. లింగు తిరగబడితే దాడిచేయడానికి పొనుగోతు నరేష్ను గడ్డివాము చాటుకు కాపలాగా ఉంచాడు. దేవిసింగ్ రెండుసార్లు కత్తితో నరకడంతో లింగు చనిపోయాడు. అనంతరం శవాన్ని ప్లాస్టిక్ నల్ల పట్టాలో చుట్టి తాడుతో బిగించారు. రక్తం కనిపించకుండా చెరిపేశారు. దేవిసింగ్, నరేష్ ఇద్దరు కలిసి హీరో యాక్టివా వాహనంపై లింగు శవాన్ని వేసుకుని కిలో మీటర్ దూరంలో ఉన్న మూసీ కాలువలో వేశారు. లింగు సెల్ఫోన్ తీసుకుని ఉప్పల్ వద్ద చెరువులో పడవేశారు. అనంతరం తండాకు చేరుకున్నారు. పోలీసులు అనుమానంతో ప్రశ్నించగా నిందితులు హత్య చేశామని ఒప్పుకున్నారు. శవాన్ని పడేసిన ప్రదేశాన్ని చూపించారు. కాగా శవం పూర్తిగా కుళ్లిపోయి ఉన్నది. పంచనామ నిర్వహించిన అనంతరం గ్రామంలో నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. -
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి
హుజూర్నగర్ : ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతిచెందిన సంఘటన హుజూర్నగర్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ శివారులోని మాగ్ధుమ్నగర్కు చెందిన జడ నాగయ్య (45) ట్రాక్టర్తో స్థానిక పోతిరేని కుంట చెరువు నుంచి తన వ్యవసాయ పొలానికి మట్టి తోలుతున్నాడు. ఈ క్రమంలో మేరిగ గురవయ్య పొలం వద్దకు రాగానే ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో నాగయ్య తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. నాగయ్య చిన్న కుమారుడు జడ భానుప్రకాష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి కొండమల్లేపల్లి : మండలంలోని పెండ్లిపాకల సమీపంలో ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన మరో ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. పెద్దవూర మండలం ఉట్లపల్లి గ్రామానికి చెందిన పెరిక శ్రీను, చిలుముల కనకయ్య ఇరువురు కలిసి శుక్రవారం ఉదయం తమ స్వగ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై దేవరకొండలో ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లారు. పని ముగించుకొని తిరిగి ఉట్లపల్లికి వెళ్లే క్రమంలో కొండమల్లేపల్లి మండలం చిన్నఅడిశర్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని పెండ్లిపాకల ఎక్స్ రోడ్డు వద్ద కొండమల్లేపల్లి నుంచి అంగడిపేటకు వెళ్తున్న ఎలిమినేటి అనిల్ అనే యువకుడు వారి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టాడు. దీంతో పెరిక శ్రీను తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. కనకయ్యకు గాయాలయ్యాయి. అనిల్కు సాధారణ గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య అశ్విని, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడు మేసీ్త్ర పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బంగారు గొలుసు అప్పగింత యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు పోగొట్టుకున్న బంగారు గొలుసును కొండపైన విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ పోలీసులు గుర్తించి అప్పగించారు. భక్తులు, ఎస్పీఎఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్కు చెందిన నిఖిల్ తన కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రీశుడి దర్శనానికి శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో వచ్చాడు. స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చిన తరువాత కుటుంబ సభ్యులతో కలిసి నిఖిల్ ఉత్తర మాడ వీధిలో కూర్చున్నాడు. ఈ సమయంలో నిఖిల్ తన మెడలో ఉన్న సుమారు తులం బంగారం గొలుసు ఎక్కడో పడిపోయిందని గుర్తించాడు. 3 గంటల సమయం వరకు బంగారు గొలుసు కోసం వెతికి కొండ కిందకు వెళ్లిపోయాడు. తిరిగి నిఖిల్ మరోసారి గొలుసు వెతికేందుకు వచ్చాడు. ఈ క్రమంలో ఎస్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం, కానిస్టేబుల్ కె.సోమేష్కుమార్గౌడ్ బంగారు గొలుసును గుర్తించారు. వివరాలు తెలసుకున్న అనంతరం బంగారు గొలుసును భక్తుడికి అప్పగించారు. -
యాత్రికులను మోసం చేసిన ట్రావెల్స్ యాజమాన్యం
రామగిరి(నల్లగొండ): విహార యాత్రకు వెళ్లిన ప్రయాణికులను ట్రావెల్స్ యాజమాన్యం మోసం చేసిన ఘటన తిప్పర్తి మండలంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..తిప్పర్తి మండలంలోని మామిడాల గ్రామానికి చెందిన 70 మంది కలిసి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన రెండు బస్సుల్లో ఒక్కో బస్సులో 35 మంది చొప్పున ఈ నెల 16వ తేదీన తెలంగాణ, ఆంధ్రపదేశ్, కర్ణాటక, రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలను చూసుకుంటూ గోవా వెళ్లి వచ్చేవిధంగా ఒప్పదం చేసుకొని బయలుదేరారు. కాగా వారి ఒప్పందం ప్రకారం కాకుండా ఒకరోజు ముందుగానే యాత్రికులు నిద్రిస్తున్న సమయంలో డ్రైవర్ బస్సును హైదరాబాద్ మీదుగా వారి స్వగ్రామానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. గమనించిన యాత్రికులు ఎక్కడికి వెళ్తున్నావంటూ డ్రైవర్ను నిలదీశారు. మీ యాత్ర ముగిసింది.. ఇంతకు మించి ఇతర ప్రాంతానికి తీసుకెళ్లడం కుదరదు, మీరు ఇచ్చిన నగదు తిరిగి ఇవ్వడం కుదరదని చెప్పడంతో డ్రైవర్తో వారు వాగ్వాదానికి దిగారు. దీంతో సదరు బస్సు డ్రైవర్లు ఇద్దరు మహబూబ్నగర్ జిల్లా సమీపంలోని జడ్చర్ల వద్ద గురువారం అర్ధరాత్రి బస్సును వదిలి వెళ్లిపోయారు. ప్రయాణికులు స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఏర్పాటు చేసిన డ్రైవర్ సహకారంతో బస్సులో స్వగ్రామం మామిడాలకు చేరుకున్న యాత్రికులు ట్రావెల్స్ యాజమాన్యంపై తిప్పర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫ యాత్ర ముగియకుండానే బస్సును వదిలేసి పరారైన డ్రైవర్ ఫ పోలీసుల సాయంతో స్వగ్రామానికి చేరుకున్న యాత్రికులు -
ఎమ్మెల్సీ ఓటు వేయండిలా..
నల్లగొండ: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల 27న జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ ఉప ఎన్నిక బ్యాలెట్ పేపర్ పద్ధతిన నిర్వహిస్తున్నారు. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇతర సాధారణ ఎన్నికలకు ఓటు వేసే విధానంలో చాలా తేడా ఉంటుంది. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఓటు వేసే క్రమంలో ఈవీఎంలను వాడతారు. ఆ ఎన్నికల్లో అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు ఉంటుంది. ఒకే అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అందుకు భిన్నంగా ఉంటాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరికీ ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేసే అవకాశం ఓటర్లకు ఉంటుంది. ప్రాధాన్యత క్రమంలోనే ఓటు.. ● ప్రతి ఓటరు బరిలో ఉన్న మొత్తం అభ్యర్థుల్లో ఒక్కరికి లేదా కొందరికి లేదా అందరికీ ఓటేయవచ్చు. ● కేవలం అంకెలు మాత్రమే ఆ బాక్సులో ప్రాధాన్యత క్రమంలో వేయాల్సి ఉంటుంది. ● మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తేనే ఆ ఓటు చెల్లుబాటు అవుతుంది. ● ఏ వ్యక్తికై తే మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తారో ఆ వ్యక్తి బ్యాలెట్ పేపర్ వరుసలో ఏ నంబర్లో ఉన్నా కూడా.. బాక్సులో 1 అనే అంకె వేయాల్సి ఉంటుంది. ● 1, 2, 3, 4, 5 ఇలా ప్రాధాన్యత క్రమంలో పోటీలో ఉన్న అభ్యర్థులకు ఓటు వేయాలి. కేవలం ఒక్కరికి కూడా ఓటేయొచ్చు● పోటీలో ఎంత మంది అభ్యర్థులు ఉన్నా అందులో 40వ సీరియల్ నంబర్లో ఉన్న అభ్యర్థికి ఒక్కరికే ఓటు వేయాలంటే అతడికి ఎదురుగా ఉన్న బాక్సులో 1 అని ఓటు వేసి మిగతా వారికి వేయకున్నా ఆ ఓటు చెల్లుతుంది. ● 1వ నంబర్ ప్రాధాన్యత ఓటు వేయకుండా 2, 3, 4 నంబర్లతో ఓట్లేస్తే ఆ ఓటు చెల్లదు. ● తప్పనిసరిగా 1 నుంచి సీరియల్గా మాత్రమే ఓటు వేయాలి. ● ఒక అభ్యర్థికి ఒక అంకెను మాత్రమే వేయాలి. ● అంకెలను తెలుగులో కానీ, ఇంగ్లిష్లో, ఇతర భాషాల్లో వన్, టు, త్రీ అని పదాలు, అక్షరాల్లో రాయకూడదు. ● బ్యాలెట్ పేపర్పై ఎలాంటి సంతకాలు చేయకూడదు. ● వేలిముద్ర వేయకూడదు. ● అభ్యర్థికి ఎదురుగా ఉన్న బాక్సులో రైట్ గుర్తు, ఇంటు గుర్తు పెట్టకూడదు. సొంత పెన్నుతో ఓటు వేయవద్దు.. ● బ్యాలెట్లో ఓటర్ ఓటు వేసేటప్పుడు సొంత పెన్నుతో ఓటు వేయరాదు. ● అలా వేస్తే ఓటు చెల్లదు. ● ఒకరికి ఇచ్చిన ప్రాధాన్యత ఓటు మరో అభ్యర్థికి ఇచ్చినా ఆ ఓటు చెల్లదు. ● ఒకరికి 1వ నంబర్ వేసి దాన్ని పదేపదే దిద్దినా ఆ ఓటు మురిగిపోతుంది. ● బ్యాలెట్ పేపర్ను బాక్సులో వేయకుండా తీసుకెళ్తే కేసు నమోదు చేస్తారు. ● బాక్సు మధ్యలో మాత్రమే నంబర్ రాయాల్సి ఉంటుంది. ● రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఊదా రంగు స్కెచ్ పెన్నుతో గాక ఇతర ఏ పెన్నులతో రాసినా అది చెల్లుబాటు కాదు. ● ఏ అంకెలు వేయకుండా ఖాళీ బ్యాలెట్ పేపర్ ఇచ్చిన ఆ ఓటు చెల్లుబాటు కాదు.ఫ బరిలో ఉన్న అభ్యర్థులందరికీ ఓటు వేయొచ్చు ఫ ‘1’ప్రాధాన్యత అంకె ఇవ్వకుండా మిగతావి ఇస్తే ఆ ఓటు చెల్లదు ఫ అధికారి ఇచ్చిన పెన్నునే ఉపయోగించాలి ఫ ఈ నెల 27న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ఓటు వేసే విధానం.. ప్రతి అభ్యర్థికి ఎదురుగా పార్టీ పేరు లేదా స్వతంత్ర అభ్యర్థి అని రాసి ఉంటుంది. పార్టీల గుర్తులు ఉండవు. అభ్యర్థి పేరు ఎదురుగా ఖాళీ బాక్స్ ఉంటుంది. పోలింగ్ అధికారి ఇచ్చిన పెన్నుతో మాత్రమే ఓటరు తన ఓటు వేయాల్సి ఉంటుంది. అభ్యర్థి పేరు ఎదురుగా ఖాళీ బాక్స్లో పెన్నుతో కేవలం నంబర్ మాత్రమే వేయాల్సి ఉంటుంది. -
ఫ్లోరోసిస్ బాధితురాలి కోరిక నెరవేర్చిన ఐఏఎస్
కోదాడరూరల్ : ఫ్లోరోసిస్ బాధితురాలు సువర్ణ గీసిన బొమ్మ తనకు చేరాలని చివరి కోరికను నెరవేర్చారు ఐఏఎస్ అధికారి స్మితాసబర్వాల్. మర్రిగూడ మండలంసాయిబండతండాకు చెందిన సువర్ణ.. ఇందిరాగాంధీ, ప్రధాని మోదీ, కేసీఆర్, రాహుల్గాంధీ, ఆనంద్మహింద్రా వంటి అనేక మంది ప్రముఖుల చిత్రాలను గీసింది. ఆమె ప్రతిభను చూసి ఎన్ఆర్ఐ సుధీర్ ఆమెకు శిక్షణ ఇప్పించాడు. వాటిని వేలం వేయగా రూ.5లక్షల బహుమతులు కూడా వచ్చాయి. అయితే సువర్ణ గతేడాది అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె గీసిన స్మితాసబర్వాల్, పీవీ సింధు చిత్రాలను వారికి అందజేయాలని చనిపోయే ముందు చెప్పింది. ఆ విషయాన్ని జలగం సుధీర్ ట్వీట్ చేయగా స్పందించిన స్మితాసబర్వాల్ కోదాడలో ఉన్న చిత్రపటాన్ని తెప్పించుకొని తన కార్యాలయంలో పెట్టుకుందని సుధీర్ కార్యాలయ సిబ్బంది తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న పటిక, బెల్లం పట్టివేతకోదాడరూరల్ : ఏపీ నుంచి అక్రమంగా తెలంగాణలోకి తరలిస్తున్న నల్లబెల్లంతోపాటు పటికను కోదాడ ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. ఎకై ్సజ్ సీఐ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ నుంచి తెలంగాణలోకి నిషేధిత నల్లబెల్లం, పటికను రాష్ట్రంలోకి కోదాడ మీదుగా వస్తుందనే సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించారు. ఖమ్మం క్రాస్రోడ్లో శుక్రవారం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నుంచి ఖమ్మం వైపు ఇద్దరు వ్యక్తులతో వస్తున్న బొలేరోను ఆపి తనిఖీ చేయగా అందులో 100 కేజీల నల్లబెల్లం, 600 కేజీల పటిక పట్టుబడినట్లు తెలిపారు. అదేవిధంగా అనంతగిరి మండలంలోని చనుపల్లి వద్ద ద్విచక్రవాహనంపై సారా తరలిస్తున్న వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన బెల్లం, పటిక, బొలేరో, ద్విచక్రవాహనాన్ని సీజ్ ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ఆటో బోల్తా.. 20మంది ఉపాధి కూలీలకు గాయాలు
అర్వపల్లి: ఉపాధి హామీ పథకం పనులకు కూలీలను తీసుకెళ్తున్న ఆటో బోల్తాపడి 20 మంది వరకు కూలీలకు గాయాలయ్యాయి. ఈ సంఘటన జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కూలీలు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎస్సారెస్పీ కాలువలను ఉపాధిహామీ పథకం పనుల్లో భాగంగా శుభ్రం చేయడానికి శుక్రవారం ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలో కాలువ కట్టపై గుంత వద్ద ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన ఉపాధి కూలీలు కోడెబోయిన భాగ్యమ్మ, కోడెబోయిన రామనర్సమ్మ, గుడిపల్లి అరుణ, వేములకొండ రామనర్సమ్మ, ఎరగాని వెంకటమ్మ, వేములకొండ నాగమ్మ, పేరెల్లి లక్ష్మీనర్సమ్మ, అంబటి యాదమ్మ, ఇందుర్తి కమలమ్మ, చామకూరి పద్మ, చామకూరి లింగమ్మ, బొల్లం రాంబాయమ్మ, మద్ది ప్రమీల, ఇందుర్తి రంగనాయకమ్మ, జానమ్మ, కవిత, సైదమ్మతో పాటు మరికొందరు గాయపడ్డారు. వారిని వెంటనే అంబులెన్స్, మరో వాహనంలో సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. వారికి డాక్టర్లు వైద్యచికిత్స చేయగా సాయంత్రం ఇళ్లకు చేరుకున్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తీవ్ర తుపానుగా రెమాల్.. ప్రధాని హై లెవెల్ మీటింగ్
#SRH: లీగ్ మ్యాచ్ల్లో అదరగొట్టారు.. ప్లే ఆఫ్స్లో తుస్సుమన్పించారు
కామెడీ ఎంటర్టైనర్గా వస్తోన్న నమో.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్!
'రోజుకి ఒక రాయి తినండి': గూగుల్ ఏఐ దిమ్మతిరిగే సమాధానం
కొండ చరియల బీభత్సం.. 670 మంది మృతి
పాఠాలు చెబుతున్న ఏఐ టీచరమ్మ..
ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే పదవీకాలం పొడిగింపు
సన్నజాజి నడుముతో మౌనీ రాయ్.. మాళవిక అందాలు
పాన్ కార్డులో మార్పులు చేసుకోండిలా..
ఎన్నికలు ముగియగానే కాశ్మీర్కు.. అమిత్ షా కీలక ప్రకటన
తప్పక చదవండి
- ఎన్నికలు ముగియగానే కాశ్మీర్కు.. అమిత్ షా కీలక ప్రకటన
- టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్.. కానీ ఒకే ఒక కండీషన్!?
- జూన్లో బ్యాంకులు పని చేసేది ఎన్ని రోజులంటే..
- హైదరాబాద్లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి..
- చంపుతామని బెదిరిస్తున్నారు: స్వాతిమలివాల్
- ఆ నలుగురికి చివరికి మిగిలిందేంటి?
- ఇంట్లో ఆంక్షలు? ఎవరు స్ట్రిక్ట్? సితార ఫన్నీ ఆన్సర్స్
- ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
- ఓటీటీ లవర్స్కు జియో సినిమా బంపరాఫర్
Advertisement