-
విదేశాలకు పారిపోతారేమో.. అష్నీర్ దంపతులకు ఢిల్లీ హై కోర్టు కీలక ఆదేశాలు
ప్రముఖ ఫిన్టెక్ సంస్థ భారత్పే కో-ఫౌండర్ అష్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్లకు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అష్నీర్ దంపతులు త్వరలో అమెరికాకు వెళ్లనున్నారు. అయితే వాళ్లిద్దరూ అమెరికాకు వెళ్లే ముందే సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.80 కోట్లు చెల్లించాలని ఆదేశించింది.దీంతో పాటు అష్నీర్, మాధురీలకు యూఏఈ గోల్డెన్ వీసా ఉంది. ఈ వీసా ఉన్న వారికి యూఏఈ ప్రభుత్వం తమ దేశ పౌరులుగా గుర్తిస్తూ వారికి ఎమిరేట్స్ కార్డ్ అనే ఐడెంటిటీ కార్డ్ ఇస్తుంది. ముందస్తు జాగ్రత్తగా ఎమిరేట్స్ కార్డ్ను కోర్టుకు సబ్మిట్ చేయాలని సూచించింది. అర్హులైన ఈ కార్డ్ దారులు 10ఏళ్ల పాటు యూఏఈ దేశ పౌరులుగా గుర్తింపు లభిస్తుంది.కేసేంటిభారత్పేలో విధులు నిర్వహించే సమయంలో అష్నీర్ గ్రోవర్ దంపతులు విలాసాల రుచి మరిగి రూ.81 కోట్ల సంస్థ నిధుల్ని కాజేశారు. ఆ కుంభకోణం వెలుగులోకి రావడంతో భారత్పే వారిద్దరిని సంస్థ నుంచి తొలగించింది. ఇదే అంశంపై అష్నీర్ దంపతుల్ని విచారించాలని కోరుతూ భారత్పే ఢిల్లీ హైకోర్ట్ను ఆశ్రయించింది. ఆ కేసులో వాళ్లిద్దరూ విదేశాలకు పారిపోకుండా గతేడాది నవంబర్లో ఎకనమిక్స్ అఫెన్స్ వింగ్ (ఈఓడబ్ల్యూ) లుకౌట్ నోటీసులు జారీ చేసింది.విదేశాలకు వెళ్లేందుకు ఈ తరుణంలో అమెరికాలో ఉన్న కుటుంబసభ్యులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. జూన్ 17 నుండి జూన్ 25 వరకు బర్కిలీలోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో సమ్మర్ కోర్సు, నేషనల్ స్టూడెంట్ లీడర్షిప్ కాన్ఫరెన్స్ కోసం తమ కుమారుడికి ఆహ్వానం అందిందని పిటిషన్లో పేర్కొన్నారు. విదేశాలకు పారిపోతేఈఓడబ్ల్యూ తరఫు న్యాయవాది ఈ పిటిషన్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అష్నీర్కు, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్లకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తే, వారు దేశానికి తిరిగి రాకపోయే అవకాశం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు. అందుకు అష్నీర్ దంపతుల న్యాయవాది దంపతులు దేశం విడిచి పారిపోరని, కలిసి ప్రయాణించే బదులు విడివిడిగా వెళ్లేందుకు అనుమతించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు విదేశాలకు వెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.షరతులు వర్తిస్తాయ్అయితే వారి ప్రయాణానికి సంబంధించి కొన్ని షరతులు విధించింది. అష్నీర్ గ్రోవర్, మాధురి జైన్ గ్రోవర్లు విదేశాలకు ఎప్పుడు వెళ్లాలన్న వారి ప్రయాణ ప్రణాళికలు, వారి ప్రయాణం, వసతి, ఖర్చులతో ఇలా మొత్తం సమాచారాన్ని కోర్టు, దర్యాప్తు అధికారులకు అందించాలని తీర్పులో వెలువరించింది. విదేశాలకు విడివిడిగానే కోర్టు ఆదేశాలతో అష్నీర్ గ్రోవర్ మే 26న అమెరికాకు వెళ్లి జూన్ 14న తిరిగి రావాల్సి ఉండగా, మాధురీ జైన్ జూన్ 15న ప్రయాణించి జూలై 1న తిరిగి రానున్నట్లు తెలుస్తోంది. -
ఆల్-ఇన్-వన్ పేమెంట్ డివైజ్ను ఏర్పాటు చేసిన ఫిన్టెక్ సంస్థ
దేశీయ ఫిన్టెక్ సంస్థ భారత్పే తన వినియోగదారులకు మరింత సౌకర్యాలు అందించేలా కొత్త పరికరాన్ని తయారుచేసింది. ఇందులో భాగంగా పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్), క్యూఆర్ కోడ్, స్పీకర్.. అన్నీ ఒకే పరికరంలో అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసింది. ఈ ఆల్-ఇన్-ఒన్ చెల్లింపు పరికరం ‘భారత్పే వన్’ను తాజాగా ఆవిష్కరించారు.మొదటి దశలో దాదాపు 100 నగరాల్లో దీన్ని పరిచయం చేసి, రానున్న ఆరు నెలల్లో 450 నగరాలకు విస్తరించాలన్నది కంపెనీ యోచిస్తోంది. హైడెఫినిషన్ టచ్స్క్రీన్ డిస్ప్లే, 4జీ, వైఫై కనెక్టివిటీ, తాజా ఆండ్రాయిడ్ ఓఎస్తో భారత్పే వన్ పనిచేస్తుందని సంస్థ వర్గాలు తెలిపాయి. పోర్టబుల్ డిజైన్, లావాదేవీల డాష్బోర్డ్లతో భారత్పే ఆఫ్లైన్ వ్యాపారులకు మరింత సేవలిందించేలా దీన్ని రూపొందించినట్లు తెలిపింది. డైనమిక్, స్టాటిక్ క్యూఆర్ కోడ్, ట్యాప్ అండ్ పే, డెబిడ్, క్రెడిట్ కార్డు చెల్లింపులు.. ఇలా విభిన్న మార్గాల్లో లావాదేవీలు నిర్వహించేలా ఏర్పాటు చేశారు.ఇదీ చదవండి: ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాపై నిషేధం.. స్పందించిన కంపెనీఫిన్టెక్ దిగ్గజ సంస్థ పేటీఎం ఇటీవల తమ వినియోగదారులకు యూపీఐ చెల్లింపులు, క్రెడిట్కార్డుల కోసం కొత్త సౌండ్బాక్స్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ పరికరాలు మేడ్ఇన్ఇండియా దృక్పథంతో తయారైనట్లు కంపెనీ తెలిపింది. ఈ సౌండ్బాక్స్లు 4జీ నెట్వర్క్ కనెక్టివిటీతో పాటు మెరుగైన సౌండ్ క్వాలిటీని అందిస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
లా ట్రిబ్యునల్ను ఆశ్రయించిన అశ్నీర్ గ్రోవర్.. కారణం అదేనా..
ప్రముఖ మొబైల్ యాప్ భారత్పే కో-ఫౌండర్, సంస్థ మాజీ ఎండీ అశ్నీర్ గ్రోవర్ కంపెనీ యాజమాన్యంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించారు. ప్రస్తుత భారత్పే బోర్డు అధికార దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. భారత్పే ఎండీగా తనను తిరిగి సంస్థలో నియమించాలని కోరుతూ ఆయన ఎన్సీఎల్టీను ఆశ్రయించారు. కంపెనీ రిసీలియెంట్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డు నిబంధనలను తారుమారు చేసి, యాజమాన్యంలో చట్టవిరుద్ధ మార్పులు చేసిందని చెప్పారు. ఆయన రాజీనామా అనంతరం 2022 మార్చి ఒకటో తేదీ నుంచి జారీ చేసిన షేర్లు / ఈఎస్ఓపీఎస్కు సంబంధించిన కంపెనీ నిర్ణయాలను తిరగదోడాలని డిమాండ్ చేశారు. దీనిపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అడిటింగ్కు ఆదేశించాలని ఎన్సీఎల్టీని కోరారు. భారత్పే సంస్థ నుంచి తన భార్య మాధురి జైన్ తొలగింపు చట్ట విరుద్ధమని, ఆమెను తిరిగి ఉద్యోగంలో నియమించాలన్నారు. తన రాజీనామా తర్వాత బోర్డులో కొత్తగా నియమించిన సభ్యులను తొలగించాలని అభ్యర్థించారు. కంపెనీల చట్టం-2013లోని 241, 242 సెక్షన్ల ప్రకారం పిటిషన్ దాఖలు చేసిన అశ్నీర్ గ్రోవర్..అణచివేతకు పాల్పడుతూ అధికార దుర్వనియోగంతో తనను తొలగించినందుకు కంపెనీ ప్రస్తుత యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదీ చదవండి: ఫ్యుయల్ ఆదా అవ్వాలంటే ఇది యాక్టివేట్ చేయాల్సిందే..! ఇటీవల గ్రోవర్ పిటిషన్ ఎన్సీఎల్టీ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 11కు వాయిదావేసింది. తన పిటిషన్కు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు సమర్పించినట్లు తెలిసింది. అశ్నీర్ గ్రోవర్ తన పిటిషన్లో కంపెనీ కో ఫౌండర్ శస్వత్ నక్రానీతోపాటు చైర్మన్ రజనీష్ కుమార్, మాజీ సీఈఓ కం డైరెక్టర్ సుశీల్ సమీర్ తదితర 12 మందిని ప్రతివాదులుగా చేర్చారు. -
‘దేవుడు నోరిచ్చాడు కదా అని’.. అశ్నీర్ గ్రోవర్పై కోర్టు ఆగ్రహం!
ప్రముఖ ఫిన్టెక్ సంస్థ భారత్పే మాజీ కో-ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్పై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటికి ఏది వస్తే అది సోషల్ మీడియాలో మాట్లాడొద్దని సూచించింది. క్షమాపణలు చెప్పడంతో పాటు రూ.2లక్షల జరిమానా కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అశ్నీర్ గ్రోవర్ భారత్పే గురించి ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆపోస్టులపై భారత్పే ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ను దాఖలు చేసింది. అందులో అశ్నీర్ తమ సంస్థను కించ పరుస్తూ పోస్టులు పెడుతున్నారని, భవిష్యత్లో అలాంటి పోస్టులు పెట్టకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. తాజాగా ఢిల్లీ హైకోర్టులో ఆ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా భారత్పే పిటిషన్ను కోర్టు కొట్టిపారేసింది. అయితే, భవిష్యత్లో అశ్నీర్ పెట్టే సోషల్ మీడియా పోస్ట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచింది. క్షమాపణలు చెప్పడంతో పాటు, రూ.2లక్షల ఫైన్ కట్టాలని తీర్పు వెలువరించింది. గత వారం అశ్నీర్ గ్రోవర్ భారత్పే ఈక్విటీ, సిరీస్ ఈ ఫండింగ్ గురించిన సమాచారాన్ని ఎక్స్లో పోస్ట్లో చేశారు. ఆ పోస్ట్లో టైగర్ గ్లోబుల్, డ్రాగోనీర్ ఇన్వెస్టర్ గ్రూప్తో పాటు ఇతర సంస్థలు భారత్పేలో 370 మిలియన్ల పెట్టుబడుల్ని పెంచాయని, ఫలితంగా ఆ సంస్థ విలువ 2.86 బిలియన్ డాలర్లకు చేరినట్లు ఆ పోస్ట్లో ప్రస్తావించారు. కొద్ది సేపటికే ఆ పోస్ట్ను అశ్నీర్ డిలీట్ చేశారు. దీనిపై భారత్పే ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో అశ్నీర్ పోస్ట్లు పెట్టకుండా నిషేధించాలని కోరింది. దీనిని ఢిల్లీ కోర్టు వ్యతిరేకించింది. కాకపోతే, అశ్నీర్ గ్రోవర్ ప్రవర్తన దృష్ట్యా ఢిల్లీ హైకోర్టు అతనికి హెచ్చరికలతో సరిపెట్టింది. సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. కోర్టు నిబంధనల్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని సూచించింది. -
భారత్పే సహ వ్యవస్థాపకుడికి లుకౌట్ నోటీసు జారీ.. ఎందుకంటే..
భారత్పే సహ వ్యవస్థాపకుడు, మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్, ఆయన భార్య మాధురీ జైన్లను గురువారం దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. న్యూయార్క్కు వెళ్లే విమానం ఎక్కకుండా చర్యలు తీసుకున్నారు. అయితే భారత్పేలో జరిగిన మోసంపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ఇటీవల లుకౌట్ సర్క్యులర్ను జారీ చేసింది. దాంతో వారిని దిల్లీలోని విమానాశ్రయంలో అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. న్యూయార్క్లో విహారయాత్రకు బయలుదేరిన అష్నీర్ దంపతులను విమానాశ్రయంలో భద్రతా తనిఖీకి ముందే ఆపివేసినట్లు ఈఓడబ్ల్యూ జాయింట్ కమిషనర్ సింధు పిళ్లై చెప్పారు. దిల్లీలోని వారి నివాసానికి తిరిగి రావాలని సూచించినట్లు తెలిపారు. వచ్చే వారం మందిర్ మార్గ్లోని ఈఓడబ్ల్యూ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని వారిని కోరారు. వారి అంతర్జాతీయ ప్రయాణాన్ని నిలిపేసేందుకు లుకౌట్ సర్క్యులర్ జారీ చేశామని, వారిని అధికారికంగా అరెస్టు చేయలేదని పిళ్లై స్పష్టం చేశారు. పోలీసులు చర్యలు తీసుకునేంతవరకు ఎలాంటి నోటీసులు అందలేదని అష్నీర్ గ్రోవర్ తన ఎక్స్ ఖాతాలో తెలిపారు. గురువారం రోజే తమను అదుపులోకి తీసుకున్నారని, కానీ శుక్రవారం రోజున వారికి నోటీసులు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. విమానం ఎక్కకుండా తమను ఆపిన ఏడు గంటల తర్వాత ఈఓడబ్ల్యూ నుంచి నోటీసు అందిందని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: అమెజాన్ అలెక్సా.. వందల ఉద్యోగులపై వేటు భారత్పే సహ వ్యవస్థాపకులు అష్నీర్ గ్రోవర్, అతని కుటుంబ సభ్యులు సంస్థ నిధులను దుర్వినియోగం చేసినట్లు అభియోగాలు దాఖలయ్యాయి. గతంలో వారు అందించని ఫిన్టెక్ సేవల కోసం బ్యాక్డేటెడ్ ఇన్వాయిస్లను ఉపయోగించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన చెల్లింపులను గుర్తించడంలో ఈఓడబ్యూ సైతం ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. డిసెంబర్ 2022లో భారత్పే అష్నీర్ గ్రోవర్, తన భార్య, కుటుంబ సభ్యుల ద్వారా రూ.81.28 కోట్ల మోసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ క్రిమినల్ కేసు దాఖలయింది. Hello ! Hello ! Kya chal raha hai India mein ? Filhaal to Ashneer stopped at airport chal raha hai janab. So facts: 1. I had not received any communication or summon from EOW since FIR in May till 8 AM today 17 morning (7 hours after returning from airport). 2. I was going to… pic.twitter.com/I0OHOXJd6F — Ashneer Grover (@Ashneer_Grover) November 17, 2023 -
‘భారత్పే’లో నిధులు బొక్కేశారు!,మరో వివాదంలో అశ్నీర్ గ్రోవర్ దంపతులు
ప్రముఖ ఫిన్టెక్ సంస్థ భారత్పే కో-ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్లు మరో వివాదంలో చిక్కుకున్నారు. ది ఎకనామిక్స్ ఆఫెన్స్ వింగ్స్ (ఈవోడ్ల్యూ) విచారణలో ఫిన్టెక్ కంపెనీ భారత్పేలో ఉండగా ఉద్యోగాల పేరిట మోసపూరిత లావాదేవీలు చేసినట్లు తేలింది. ఈ లావాదేవీలను భారత్పేలో కోచింగ్, డెవలప్మెంట్, రిక్రూట్మెంట్, రిసోర్స్ ప్లానింగ్ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన అశ్నీర్ భార్య మాధూరి జైన్ గ్రోవర్ను అడ్డుపెట్టుకుని చేసినట్లు తెలుస్తోంది. ఈ స్కాంలో మాధూరి జైన్ కుటుంబ సభ్యుల హస్తం ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఈఓడబ్ల్యూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. రిక్రూట్మెంట్ వర్క్కు సంబంధించిన కమిషన్లు చెల్లించేందుకు నిధులు కావాలంటూ తప్పుడు తేదీలు, ఇన్వాయిస్లు తయారు చేసినట్లు ఆరోపిస్తుంది. అంతేకాదు భారత్పేలో ఉద్యోగుల్ని నియామకాల కోసం నియమించుకున్న హెచ్ఆర్ కన్సల్టెన్సీలకు రూ.7.6 కోట్లు, జీఎస్టీ సకాలంలో చెల్లించలేదని, అదనపు ఛార్జీల కింద రూ.1.6 కోట్లు, ఇతర ఫేక్ ట్రాన్సాక్షన్స్ రూ.71.76 కోట్లు ఉన్నట్లు తేలింది. ఇలా మూడు సార్లుగా చేసిన మోసపూరిత లావాదేవీలు విలువ రూ.81 కోట్లుగా ఉందని ఈఓడబ్ల్యూ విచారణలో గుర్తించింది. ఆ విచారణ ఇంకా కొనసాగుతుంది. -
‘విలాసాల రుచి మరిగి’.. అశ్నీర్ గ్రోవర్ దంపతులకు మరో ఎదురు దెబ్బ!
ప్రముఖ ఫిన్టెక్ సంస్థ భారత్పే కో-ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్లకు ఎదురు దెబ్బ తగిలింది. భారత్పే చేసిన ఫిర్యాదుపై జరుగుతున్న విచారణను నిలిపివేయాలని అశ్నీర్ దంపతులు వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్ట్ కొట్టిపారేసింది. భారత్పేలో విధులు నిర్వహించే సమయంలో అశ్నీర్ గ్రోవర్ దంపతులు విలాసాల రుచి మరిగి రూ.81 కోట్ల సంస్థ నిధుల్ని కాజేశారు. ఆ కుంభకోణం వెలుగులోకి రావడంతో భారత్పే వారిద్దరిని సంస్థ నుంచి తొలగించింది. చదవండి👉 రండి! నా స్టార్టప్లో పనిచేయండి.. బెంజ్ కార్లు బహుమతిగా ఇస్తా! చదవండి👉 అప్పుడు బడాయి మాటలు..కక్కుర్తి పనులు, మరి ఇప్పుడు! ఇదే అంశంపై అశ్నీర్ దంపతుల్ని విచారించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్ట్ను ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ విచారణ వేగంగా కొనసాగిస్తుంది. ఈ తరుణంలో తమపై సంస్థ తప్పుడు అభియోగాలు మోపిందని, వెంటనే కేసు విచారణ నిలిపివేయాలని కోరుతూ అశ్నీర్ కోర్ట్లో పిటిషన్ దాఖలు చేశారు. మీ వైఖరి ఏంటో తెలిజేయండి అయితే, ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టీస్ అనూప్ జైరామ్ భంభానీ ధర్మాసనం తీర్పును వెలువరించింది. తమని విచారణ చేపట్టాలని అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వాలన్న అశ్నీర్ అభ్యర్ధనను జస్టీస్ భంభానీ సున్నితంగా తిరస్కరించారు. బదులుగా ముందస్తు బెయిల్కు దాఖలు చేసుకోవచ్చని తీర్పిచ్చారు. అంతేకాదు, ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ వేసిన పిటిషన్పై వివరణ ఇవ్వాలని కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈవోడబ్ల్యూతో పాటు భారత్పే సైతం విచారణపై స్టే విధించాలన్న అశ్నీర్ దంపతుల పిటిషన్పై తమ వైఖరి ఏంటో స్పష్టంగా తెలియజేయాలని కోరారు. చదవండి👉 చేసింది ఇక చాలు!! మా'స్టారు' మీ టైమ్ అయిపోయింది! అహర్నిశలు పనిచేస్తే.. అందుకు ప్రతిఫలం ఇదేనా ఈ సందర్భంగా పిటిషనర్ల తరుపు సీనియర్ న్యాయవాదులు వికాస్ పహ్వా, దయన్ కృష్ణన్లు తమ క్లయింట్ అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్లు పిటిషన్పై నోటీసు జారీ చేయడాన్ని వ్యతిరేకించారు. భారత్పేని స్టార్టప్ నుంచి యూనికార్న్ కంపెనీగా తీర్చిదిద్దడంలో తమ క్లయింట్ అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్లు అహర్నిశలు శ్రమించారని గుర్తు చేశారు. చట్టబద్ధమైన ఆడిటర్ల ద్వారా సంస్థలో కార్యకలాపాలు నిర్వహించారని, ఎలాంటి అవకతవకలు జరగలేదని వాదించారు. రూ.81.3 కోట్లు స్వాహా మరోవైపు, అష్నీర్ గ్రోవర్, అతని కుటుంబం బోగస్ హ్యూమన్ రిసోర్స్ కన్సల్టెంట్లకు చట్టవిరుద్ధమైన చెల్లింపులు చేశారని భారత్పే ఆధారాల్ని కోర్టుకు అందించింది. అనవసరమైన చెల్లింపులు,ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లో మోసపూరిత లావాదేవీలు, చెల్లింపుల ద్వారా సంస్థకు సుమారు రూ.81.3 కోట్ల నష్టం కలిగించారని ఫిర్యాదులో పేర్కొంది. భారత్పేలో కీలక పదవి భారత్పేలో మాధురీ జైన్ కంట్రోల్స్ హెడ్గా ఉన్నారు. ఫోరెన్సిక్ ఆడిట్లో అనేక అవకతవకలు జరిగినట్లు వెల్లడి కావడంతో 2022లో తొలగించారు. తదనంతరం, అష్నీర్ గ్రోవర్ మార్చి 2022లో సీఈవో పదవికి రాజీనామా చేశారు. కాగా, ఢిల్లీ హైకోర్ట్ ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 25న చేపట్టనుంది. చదవండి👉 ఆ వార్తల్లో నిజం లేదు.. వర్క్ ఫ్రమ్ హోమ్కు స్వస్తి పలకనున్నారా? -
BharatPe controversy: అష్నీర్ గ్రోవర్, ఫ్యామిలీకి భారీ షాక్
సాక్షి,ముంబై: పేమెంట్స్ యాప్ భారత్ పే ఫౌండర్, మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్ వివాదంలో అష్నీర్కు మరోసారి చుక్కెదురైంది. భారత్పే టాప్ లీడర్షిప్ నుంచి వివాదాస్పదంగా నిష్క్రమించిన తర్వాత, తాజాగా మోసం, ఫోర్జరీ, నేరపూరిత కుట్ర వంటి 8 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో గ్రోవర్తోపాటు ఐదుగురు కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. గ్రోవర్ కుటుంబ సభ్యులు ఫిన్టెక్ యునికార్న్ను దాదాపు రూ.81 కోట్ల మేర మోసగించారని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. గత ఏడాది ఫిన్టెక్ యునికార్న్ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా అష్నీర్ గ్రోవర్ , కుటుంబ సభ్యులపై ఆర్థిక నేరాల విభాగం (EOW) ఫిర్యాదు దాఖలు చేసింది. ఇందులో గ్రోవర్ భార్య మాధురీ జైన్ గ్రోవర్, ఆమె సోదరులు శ్వేతాంక్ జైన్, దీపక్ గుప్తా, సురేష్ జైన్ ఉన్నారు. కుటుంబ సభ్యులు పొందే సేవలకు అనుసంధానించబడిన ట్రావెల్ ఏజెన్సీలకు గ్రోవర్ అక్రమ చెల్లింపులు చేశారని ఆర్థిక నేరాల విభాగం ఆరోపించింది. ఆర్థిక నేరాల విభాగం ఆరోపణలు 86 నకిలీ, తప్పుడు ఇన్వాయిస్లను ఉపయోగించి గ్రోవర్, ఇతర నిందితులు రూ.7.6 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించింది. అంతేకాదు కుటుంబ సభ్యులు పొందే సేవలకు అనుసంధానంగాఉన్న ట్రావెల్ ఏజెన్సీలకు గ్రోవర్ అక్రమ చెల్లింపులు చేశారని ఆరోపించింది. అంతేకాదు సాక్ష్యాలను మాధురీ జైన్ నాశనం చేశారని ఆరోపించింది. త్వరలోనే నిందితులందరినీ అరెస్టు చేసే అవకాశం ఉందని అంచనా. మరోవైపు నేరం రుజువైతై గ్రోవర్ కుటుంబ సభ్యులకు గరిష్ఠంగా పదేళ్ల దాకా జైలు శిక్ష ఖరారు కానుందని తెలుస్తోంది. కాగా 2022, జనవరిలో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలు రావడంతో గ్రోవర్ను మార్చిలో తొలగించింది. డిసెంబరులో కంపెనీలో జరిగిన మోసాలపై కంపెనీ ఢిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగంలో క్రిమినల్ ఫిర్యాదు చేయడంతోపాటు, గ్రోవర్, అతని కుటుంబ సభ్యులపై ఢిల్లీ హైకోర్టులో సివిల్ దావా కూడా వేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా, వివిధ సెక్షన్ల ద్వారా నిందితులందరి నుండి రూ. 88 కోట్ల నష్టపరిహారాన్ని రికవరీ చేయాలని కంపెనీ కోరింది. భారత్పే ఫౌండర్ ట్యాగ్ని ఉపయోగించకుండా నిరోధించాలంటూ సింగపూర్లో కూడా దావా వేసింది. అయితే తాజా పరిణామంపై అష్నీర్ గ్రోవర్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. -
స్వర్గంలో ఉన్ననానాజీ, నానీ..నాన్న జాగ్రత్త: అష్నీర్ గ్రోవర్ భావోద్వేగం
సాక్షి, ముంబై: భారత్పే వ్యవస్థాపకుడు, షార్క్ ట్యాంక్ ఇండియా మాజీ ఇన్వెస్టర్అష్నీర్ గ్రోవర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి అశోక్ గ్రోవర్ (69)బుధవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని అష్నీర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మంగళవారం రాత్రి కన్నుమూసిన తండ్రికి వీడ్కోలు పలుకుతూ ‘‘బై పాపా.. లవ్ యూ...నాన్నను జాగ్రత్తగా చూసుకోండి’’ అంటూ స్వర్గంలో ఉన్న కుటుంబ సభ్యులు (తాతయ్య నానమ్మ, పెద్దమ్మ) ను కోరుతూ ఇన్స్టాలో ఒక ఫోటో షేర్ చేశారు. (ఇదీ చదవండి: ‘పాపం..చేప! నా బాధ వారికే తెలుస్తుంది’ ఎయిరిండియాపై పెట్ లవర్ ఫిర్యాదు వైరల్) అశోక్ గ్రోవర్ కన్నుమూతపైకమెడియన్ సునీల్ గ్రోవర్ సహా పలువురు సంతాపాన్ని వెలిబుచ్చారు. ఢిల్లీలో చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేసిన అశోక్కు కుమారుడు అష్నీర్తోపాటు కూతురు ఆషిమా ఉన్నారు. (సోషల్ మీడియా స్టార్, అన్స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్టాటా కంటే ఖరీదైన ఇల్లు) View this post on Instagram A post shared by Ashneer Grover (@ashneer.grover) -
భారత్పేపై అష్నీర్ గ్రోవర్ సంచలన వ్యాఖ్యలు..15 కోట్ల మంది డేటా చోరీ!
ప్రముఖ ఫిన్టెక్ సంస్థ భారత్పేపై ఆ కంపెనీ సహవ్యవస్ధాపకుడు, మాజీ సీఈఓ అష్నీర్ గ్రోవర్ సంచలన ఆరోపణలు చేశారు. భారత్పే ప్రస్తుత సీఈఓ భవిక్ కొలదియ 15 కోట్ల మంది భారత్పే యూజర్ల డేటా చౌర్యానికి పాల్పడ్డారని అన్నారు. ఇదే అంశంపై ఎన్పీసీఐకి లేఖ రాశారు. భారత్లో పే యూజర్ల డేటా ఉల్లంఘనతో యూజర్ల డేటా గోప్యత భగ్నమైందని ఆరోపిస్తూ గ్రోవర్ ఎన్పీసీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు గతంలో క్రెడిట్ కార్డు మోసంలో భవిక్ గతంలో దోషిగా తేలాడని, 18 నెలల పాటు గృహ నిర్బంధంలో ఉంచిన అనంతరం అతడిని భారత్కు తరలించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఫేక్ టికెట్ ఉపయోగించి గుజరాత్కు వెళ్లేందుకు ప్రయత్నించడంతో అతడిపై ఢిల్లీ ఎయిర్ పోర్ట్లో ఎఫ్ఐఆర్ నమోదైందని గ్రోవర్ చెప్పారు. అందకు సంబంధించిన ఆధారాలు తనవద్ద ఉన్నాయని చెప్పారు. ఇక గ్రోవర్ చేస్తున్న ఆరోపణలపై భారత్పే కంపెనీ స్పందించింది. కంపెనీ నుంచి తొలగించినందుకు గ్రోవర్ కక్షతోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని భారత్పే సీఈఓ భవిక్ కొలదియ పేర్కొన్నారు. -
రండి! నా స్టార్టప్లో పనిచేయండి.. బెంజ్ కార్లు బహుమతిగా ఇస్తా!
భారత్ పే మాజీ ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్ 3వ స్టార్టప్ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా స్టార్టప్ భవిష్యత్ ప్రణాళికలు ఏంటనేవి లింక్డిన్ పోస్ట్లో షేర్ చేశారు అశ్నీర్. తాను ప్రారంభించిన కొత్త వెంచర్లో ఉద్యోగులు, పెట్టుబడి దారులకు స్వాగతం అంటూ ఆహ్వానించారు. పైగా కొత్త స్టార్టప్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు మెర్సిడెజ్ బెంజ్ కార్లను బహుమతిగా ఇస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. 2023లో కొంత పని పూర్తి చేద్దాం! అంటూ థర్డ్ స్టార్టప్ పనులు చాలా నిశబ్ధంగా, శాంతియుతంగా కొనసాగుతున్నాయి.మార్కెట్ను షేక్ చేసేలా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నాం. మేం విభిన్నంగా బిజినెస్ కార్యకలాపాలు చేస్తున్నాం. కాబట్టి మీరు తదుపరి టూడో - ఫోడో అంశంలో భాగం కావాలనుకుంటే బిజినెస్ను ఎలా చేస్తున్నామో మీరు తెలుసుకోవాలంటూ కొన్ని ఇమెజెస్ను చూపించగా.. అందులో థర్డ్ యునికార్న్కు వెంచర్ క్యాపిటలిస్ట్లు నిధులు సమకూర్చరని ఒక ఇమేజ్లో ఉంది. దేశీ/స్వయంగా సంపాదించిన మూలధనాన్ని మాత్రమే ఉపయోగిస్తాం. జట్టులో 50 మంది సభ్యులు ఉంటారని అందులో జోడించింది. అంతే కాదు, ఉద్యోగులు కంపెనీలో ఐదేళ్లు పూర్తి చేస్తే, వారికి మెర్సిడెస్ ఇస్తామని అశ్నీర్ గ్రోవర్ ఆఫర్ చేశారు. -
భారత్పే సీఈఓ పదవికి సుహైల్ సమీర్ రాజీనామా
ఫిన్ టెక్ దిగ్గజం భారత్పేలోని పరిణామాలు మరోసారి చర్చకు దారి తీశాయి. గత సంవత్సరం సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ను తొలగించినప్పటి నుండి కంపెనీ కార్యకలాపాలను పట్టించుకోలేదనే కారణంగా సీఈవో సుహైల్ సమీర్ను తొలగించేందుకు ఆ సంస్థ యాజమాన్యం సిద్ధమైంది. సీఈవో పదవి నుంచి తప్పించి సమీర్కు చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ ఈ పదవిని కట్టబెట్టనుంది. జనవరి 7నుండి సీఎఫ్ఓ బాధ్యతలు చేపట్టనున్నట్లు భారత్పే ప్రకటించింది. ఇక ప్రస్తుత సీఎఫ్ఓ నలిన్ నేగీ తాత్కాలిక సీఈగా విధులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా భారత్పే బోర్డు ఛైర్మన్ రజనీష్ కుమార్ మాట్లాడుతూ, సమీర్ తన అద్భుతమైన సహకారం అందించినందుకు,వివిధ సవాళ్లను అధిగమించడంలో కంపెనీకి సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎస్బీఐ కార్డ్లో సీఎఫ్ఓగా నేగి గతేడాది ఆగస్ట్లో భారత్పేలో చేరారు. గతంలో అయనకు సుమారు 10 సంవత్సరాల పాటు ఎస్బీఐ కార్డ్లలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం ఉంది. వరుస రాజీనామాలు భారత్పే సంస్థలో గత కొద్దికాలంగా జరుగుతున్న వరుస ఘటనలతో నెలల వ్యవధిలో అనేక మంది సీనియర్ స్థాయి ఉద్యోగులు రాజీనామాలు చేశారు. వారిలో ఇటీవల, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ విజయ్ అగర్వాల్, పోస్ట్పే హెడ్ నెహుల్ మల్హోత్రా, లెండింగ్- కన్స్యూమర్ ప్రొడక్ట్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ రజత్ జైన్ సహా ముగ్గురు సీనియర్ ఎగ్జిక్యూటివ్లు కంపెనీకి రాజీనామా చేశారు. -
భారత్పే కో-ఫౌండర్, మాజీ ఎండీకి భారీ షాక్!
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ టెక్నాలజీ యునికార్న్ భారత్పే-తన మాజీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్, ఆయన కుటుంబంపై క్రిమినల్ కేసు, సివిల్ దావా దాఖలు చేసింది. మోసం, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై రూ. 88.67 కోట్ల వరకు నష్టపరిహారం చెల్లించాలని భారత్ పే డిమాండ్ చేసింది. ఇది చదవండి: రోడ్ కాంట్రాక్టర్లకు భారీ ఊరట! కేంద్ర మంత్రి గడ్కరీ ఆఫర్ దాదాపు 2,800 పేజీల ఫిర్యాదులో భారత్పే గ్రోవర్, ఆయన భార్య మాధురీ జైన్, ఇతర కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేసింది. నకిలీ బిల్లుల చెల్లింపు, కంపెనీకి సేవలు అందించడానికి కల్పిత విక్రేతల సృష్టి, రిక్రూట్మెంట్ కోసం కంపెనీకి అధిక చార్జీ వంటి ఆరోపణలు ఇందులో ఉన్నాయి. ఫిర్యాదుపై ఢిల్లీ హైకోర్టు గ్రోవర్, ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో సమాధానాలు చెప్పాలని సూచించింది. కేసు తదుపరి విచారణ జనవరి 9కి వాయిదా పడింది. (సరికొత్త అవతార్లో, టాటా నానో ఈవీ వచ్చేస్తోంది..?) నైపథ్యం ఇదీ.. నైకా ఐపీఓ కోసం నిధులను పొందడంలో విఫలం కావడానికి సంబంధించి కోటక్ గ్రూప్ ఉద్యోగిపై గ్రోవర్, ఆయన భార్య మాధురీ జైన్ గ్రోవర్ అనుచిత పదజాలం ఉపయోగించి, బెదిరించిన కేసులో ఈ సంవత్సరం ప్రారంభంలో నాలుగు సంవత్సరాల భారత్పే వార్తల్లో నిలిచింది. ఈ పరిస్థితిల్లో సంస్థ కార్పొరేట్ పాలన సమీక్షను నిర్వహించడానికి, గ్రోవర్ ఉద్దేశపూర్వక దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడో లేదో తెలుసుకోవడానికి అల్వారెజ్ మార్సల్, శార్దూల్ అమర్చంద్ మంగళదాస్, పీడబ్ల్యూసీలను భారత్పే నియమించింది. ఇది మార్చిలో కంపెనీ, ఆ సంస్థ బోర్డు నుండి గ్రోవర్, ఆయన భార్య తొలగింపునకు దారితీసింది. వారితోపాటు దుష్ప్రవర్తనకు పాల్పడిన ఉద్యోగులందరిపై చర్యలు తీసుకో వాలని సంస్థ నిర్ణయించింది. అష్నీర్ గ్రోవర్ నిరోధిత షేర్లను వెనక్కి తీసుకోవడంసహా, ఆయన పా ల్పడిన అవకతవకలపై చర్యలకూ ఉపక్రమించింది. ఇదీ చదవండి: వర్క్ ఫ్రం హోం: వచ్చే ఏడాది దాకా వారికి కేంద్రం తీపి కబురు -
భారత్పేకు మరో షాక్, కీలక కో-ఫౌండర్ ఔట్!
సాక్షి, ముంబై: ఫిన్టెక్ కంపెనీ భారత్పేకు మరో షాక్ తగిలింది.సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ రాజీనామా చేసిన కొన్ని నెలల వ్యవధిలోనే రెండో వ్యవస్థాపకుడు భావిక్ కొలాదియా సంస్థకు గుడ్బై చెప్పడం గమనార్హం. ఇప్పటికే నిధుల దుర్వినియోగం ఆరోపణలతో ఇబ్బందులు పడుతున్న భారత్పే కంపెనీకి, కంపెనీ ఐటీ బ్యాక్బోన్గా ఉన్న కిలాదియా వైదొలిగారు. ఆయన కాంట్రాక్ట్ పదవీకాలం జూలై 31, 2022తో ముగిసిందని, అయితే కంపెనీ వీడేందుకే కొలాదియా నిర్ణయించుకున్నారని కంపెనీ ఆగస్టు 2న ఒక ప్రకటనలో తెలిపింది.అతిపెద్ద ఫిన్టెక్ కంపెనీలలో ఒకటిగా మారిన కృషిన ఆయన అంతర్భాగంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా అవసరమైనప్పుడు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటారని నమ్ముతున్నాయని కంపెనీ తెలిపింది. మరోవైపు భారత్పే తన అతిపెద్ద పెట్టుబడులలో ఒకటని, రానున్న కాలంలో కూడా పెట్టుబడులు కొనసాగిస్తానని కొలాడియా చెప్పారు. పనిని, కుటుంబాన్ని బ్యాలెన్స్ చేయడంపై దృష్టి పెట్టాలనుకుంటున్నానని చెప్పారు. అలాగే భారత్పేని స్థాపించిన రోజు నుంచి తాను, శాశ్వత్ భారత్పే, స్థాపించడంతోపాటు, దాని అభివృద్ధికి కృషి చేశామని చెప్పుకొచ్చారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఫిన్టెక్ కంపెనీ BharatPeకి సహ వ్యవస్థాపకుడు, ఎంపీ అష్నీర్ గ్రోవర్ కంపెనీ నిధుల దుర్వినియోగం ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అష్నీర్ గ్రోవర్ రాజీనామా తర్వాత భారత్పే బోర్డు ఆయనతో పాటు ఆయన భార్య కంపెనీ నిధుల్లో భారీ అవకతవకలు చేసిన ఆరోపణలు, తర్వాత బోర్డు గ్రోవర్ మధ్య వివాదం చివరికి గ్రోవర్ రాజీనామాకు దారి తీసింది. అలాగే ఈ సంవత్సరం ప్రారంభంలో గ్రోవర్, భరత్పే మేనేజ్మెంట్ మధ్య వివాదం చెలరేగినప్పుడు, కొలాడియా, గ్రోవర్ మధ్య వాగ్వాదం ఆడియో రికార్డ్ బయటపడటం కలకలం రేపింది. అటు మనీకంట్రోల్ రిపోర్టు ప్రకారం, కీలక ఎగ్జిక్యూటివ్లు వరుసగా కంపెనీకి గుడ్ బై చెప్పారు. కంపెనీ వ్యవస్థాపక సభ్యుడు సత్యం నాథనిగత జూన్లో రాజీనామా చేశారు. ప్రధాన రెవెన్యూ అధికారి నిషిత్ శర్మ సంస్థాగత రుణ భాగస్వామ్య అధిపతి చంద్రిమా ధర్ నిష్క్రమించారు. ఆ తరువాత కొద్ది రోజులకే మరో కీలకమైన టెక్ నిపుణుడు నథాని కంపెనీని వీడారు. -
ఐరన్ లెగ్ మహిమ : జొమాటోకు కోట్లలో నష్టం..ఈయనే కారణమా!
దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రముఖ ఫుడ్ ఆగ్రిగ్రేటర్ జొమాటో షేర్లు భారీగా కుదేలవుతున్నాయి. సోమవారం ఎన్ఎస్ఈలో జొమాటో 14శాతం షేర్లు పడిపోయి రూ.46 వద్ద జీవిత కాల కనిష్ఠాన్ని తాకాయి. చివరకు 11.28 శాతం నష్టంతో రూ.47.60 వద్ద ముగియగా..దీంతో నిన్నఒక్కరోజే జొమాటో రూ.1000కోట్లు (అంచనా) నష్టపోయింది.మంగళవారం సైతం ఆ సంస్థకు నష్టాల పరంపర కొనసాగుతుంది. ఇవ్వాళ మార్కెట్ కొనసాగే 2.50గంటల సమయానికి ఎన్ఎస్ఈలో జొమాటో షేర్లు భారీగా నష్టపోయి రూ.42.15 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ తరుణంలో భారత్ పే మాజీ ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్ స్పందించారు. జొమాటో- స్విగ్గీలు మెర్జ్ అయితే జొమాటో షేర్ రాకెట్ వేగంతో రూ.450కి చేరుతుందని ట్విట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్కాగా.. జొమాటో షేర్లు నష్టపోవడానికి అశ్నీరే అంటూ మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. On the stock market - @letsblinkit served piping hot misery to @zomato in 10 minutes ! Yeh hi agar @Swiggy ko merge kar liya hota to ₹450 ka stock hota !! — Ashneer Grover (@Ashneer_Grover) July 26, 2022 ఐరన్ లెగ్ అశ్నీర్ జొమాటో షేర్ల పతనానికి అశ్నీర్ గ్రోవరే కారణమని నివేదికలు చెబుతున్నాయి. ఎందుకంటే? ఫినెట్క్ కంపెనీ భారత్ పే'ను స్థాపించిన అశ్నీర్ గ్రోవర్, ఆయన భార్య మాధురీ జైన్లపై సంస్థ నిధుల్ని కాజేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. విచారణ చేపట్టిన అల్వరెజ్ అండ్ మార్షల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సైతం... అశ్నీర్, మాధురీ జైన్ కంపెనీ డబ్బుతో బ్యూటీ ప్రొడక్టులు కొనుక్కోవడంతో పాటు జల్సాలు చేసిందన్న ఆరోపణలను నిజమని తేల్చింది. అశ్నీర్ రాజీనామా దీంతో భారత్పే మాధురీ జైన్ను విధుల నుంచి తొలగించింది. ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అశ్నీర్ సైతం భారత్పేలో తన పదవికి రాజీనామా చేశారు. తనపై కుట్ర చేశారని, ఎలాంటి తప్పు చేయలేదంటూ వాదనకు దిగారు. చివరకు చేసేది లేక భారత్ పే నుంచి బయటకు వచ్చిన అశ్నీర్ తన కుటంబ సభ్యులకు చెందిన అమెరికన్ కంపెనీతో కలిసి మరో స్టార్టప్ను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అప్పుడు భారత్పే.. ఇప్పుడు జొమాటో ఇక భారత్ పేతో తలెత్తిన విభేదాల కారణంగా ఆర్ధిక సమస్యల నుంచి బయట పడేందుకు అశ్నీర్ తన కిరాణ డెలివరీ యాప్ సంస్థ బ్లింకిట్ను జొమాటోకు అమ్మేశారు. జొమాటో రూ. 4,447 కోట్ల డీల్తో షేర్ల మార్పిడి ద్వారా కంపెనీని సొంతం చేసుకుంది. దీంతో బ్లింకిట్ అశ్నీర్ది కావడం, ఇప్పటికే భారత్పే నిధుల్ని కాజేయడం వంటి ఇతర కారణాల వల్ల జొమాటో మదుపర్లు అప్రమత్తమయ్యారు. జొమాటో షేర్లను అమ్మేసిస్తున్నారు. దీంతో ఎన్ఎస్ఈలో జొమాటో షేర్లు భారీగా నష్టపోతున్నాయి. చదవండి: అప్పుడు బడాయి మాటలు..కక్కుర్తి పనులు, మరి ఇప్పుడు! -
అప్పుడు బడాయి మాటలు..కక్కుర్తి పనులు, మరి ఇప్పుడు!
ఫిన్టెక్ స్టార్టప్ భారత్పే మాజీ సీఈవో అశ్నీర్ గ్రోవర్ స్టార్టప్ వరల్డ్లో మరోసారి హాట్ టాపిగ్గా మారారు. బడాయి మాటలు..కక్కుర్తి పనులతో కొని తెచ్చుకున్న కష్టాల నుంచి తేరుకొని ఇప్పుడు మరో సంస్థను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. మిలియన్ డాలర్లు పెట్టుబడుల కోసం అన్వేషిస్తున్నారు. అశ్నీర్ గ్రోవర్ పరిచయం అక్కర్లేని పేరు. భారత్పే ఫౌండర్గా, అతని భార్య మాధురి జైన్ కంట్రోల్స్ ఆఫ్ హెడ్ హోదాలో అవినీతికి పాల్పడారంటూ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే సంస్థ సొమ్ముతో వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించుకున్నారు. భోగ భాగ్యాలు అనుభవించారు. కోటి రూపాయలు డైనింగ్ టేబుల్, మూడున్నర కోట్ల కారు ఉందంటూ గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకున్నారు. చివరికి చేసిన పాపం ఊరికే పోదన్నట్లు మహీంద్రా కోటక్ బ్యాంక్కి చెందిన మహిళా అధికారిని దుషించారు. సంబంధిత ఆడియో సంభాషణలు వెలుగులోకి రావడంతో అశ్నీర్ కథ అడ్డం తిరిగింది. చివరికి సంస్థ నుంచి బలవంతంగా బయటకు నెట్టేయించుకునే పరిస్థితికి దిగజారారు. Today I turn 40. Some will say I’ve lived a full life and experienced more things than most. Created value for generations. For me it’s still unfinished business. Time to disrupt another sector. It’s time for the Third Unicorn !! pic.twitter.com/wb7ZQe41FY — Ashneer Grover (@Ashneer_Grover) June 14, 2022 అయినా సరే ఇప్పుడు మరో స్టార్టప్ను ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నారు. అశ్నీర్ తన 40వ బర్త్ డే సందర్భంగా స్టార్టప్ను యూనికార్న్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇందుకోసం అమెరికాలో తన కుటుంబానికి చెందిన ఓ సంస్థతో పాటు ప్రైవేట్ ఈక్విటీ సంస్థలతో సంప్రదించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అశ్నీర్ మాత్రం భారత్పేలో అమ్మిన తన వాటాతో బిజినెస్ను ప్రారంభించనున్నట్లు మరికొన్ని నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. మరోవైపు అశ్నీర్ ఫిన్టెక్ సంస్థను నెలకొల్పుతారా? లేదంటే ఇతర రంగానికి చెందిన స్టార్టప్ను ప్రారంభిస్తారా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. చదవండి👉చేసింది ఇక చాలు!! మా'స్టారు' మీ టైమ్ అయిపోయింది! -
భారత్పేతో జాగ్రత్త! అలాంటి పనులు చేస్తే జైలుకే?
న్యూఢిల్లీ: అవకతవకలు, దుష్ప్రవర్తన ఆరోపణలపై పలువురు ఉద్యోగులు, వెండార్లను తొలగించినట్లు, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు పేమెంట్స్ సేవల స్టార్టప్ సంస్థ భారత్పే వెల్లడించింది. అలాగే మాజీ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ పేరు ప్రస్తావించకుండా, ఆయనకు కేటాయించిన షేర్లను కూడా వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది. గ్రోవర్ ఎండీగా వ్యవహరించినప్పుడు చోటు చేసుకున్న అవకతవకలు, కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలపై కంపెనీ బోర్డు సవివరంగా చర్చించిన మీదట ఈ చర్యలు తీసుకున్నట్లు భారత్పే పేర్కొంది. కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు పునరావృతం కాకుండా సీనియర్ మేనేజ్మెంట్, ఉద్యోగులకు కొత్త ప్రవర్తనా నియమావళిని, వెండార్లకు సంబంధించి సమగ్రమైన కొనుగోళ్ల విధానాన్ని అమలు చేస్తున్నట్లు వివరించింది. ‘తప్పుడు లేదా అడ్డగోలు రేట్లతో ఇన్వాయిస్లు ఇచ్చిన చాలా మంది వెండార్లు ఇకపై కంపెనీతో వ్యాపార లావాదేవీలు జరపకుండా బ్లాక్ చేశాం. జీఎస్టీ విచారణలో కూడా వీరి పేర్లు ఉన్నాయి. ఇప్పటికే చెల్లించిన మొత్తాలను రికవర్ చేసుకునేందుకు వారికి లీగల్ నోటీసులు కూడా జారీ చేశాం. రాబోయే రోజుల్లో వారిపై సివిల్ / క్రిమినల్ కేసులు కూడా వేయబోతున్నాం‘ అని భారత్పే తెలిపింది. కొత్త సీఎఫ్వోను ఎంపిక చేసే ప్రక్రియలో ఉన్నామని, తరచుగా అంతర్గత ఆడిట్ కూడా నిర్వహిస్తామని పేర్కొంది. చదవండి: తప్పు చేస్తే సహించేదేలే..! అష్నీర్కు భారత్పే ఇన్వెస్టర్ల వార్నింగ్! -
‘నా సత్తా ఏంటో అప్పుడు చూపిస్తా’
అవమానకర రీతిలో భారత్పే నుంచి బయటకు పంపబడ్డ ఆశ్నీర్ గ్రోవర్ తన సత్తా ఏంటో చూపిస్తానంటూ సవాల్ విసిరారు. చండీగడ్లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన గ్రోవర్.. త్వరలోనే తన సొంత డబ్బులతో ఓ స్టార్టప్ పెడతానని, ఏ ఇన్వెస్టరు దగ్గర నుంచి నిధులు సమీకరించకుండానే ఆ స్టార్టప్ను లాభాల్లోకి తెచ్చి చూపెడతానంటూ ప్రకటించారు. యూనికార్న్ హోదా పొందిన స్టార్టప్లలో ఒకటైన భారత్పే శాత్వత్తో కలిసి ఆశ్నీర్గ్రోవర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఇన్వెస్టర్లు ఈ కంపెనీలో పెట్టుబడులు పెట్టడంతో క్రమంగా యూనికార్న్గా ఎదిగింది. అయితే కంపెనీ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై కో ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్లను భారత్ పే నుంచి బయటకు సాగనంపారు. గడిచిన ఆరు నెలలుగా భారత్పే విషయంలో ఇటు అశ్నీర్ గ్రోవర్, అటు బోర్డు మెంబర్లతో నిత్యం మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ఇన్వెస్టర్లుగా స్టార్లప్లోకి ప్రవేశించిన వారు చివరకు తననే బయటకు పంపారంటూ అనేక సందర్భాల్లో అశ్నీర్ వెల్లడించారు. ఈ క్రమంలో అసలు ఇన్వెస్టర్లు లేకుండా పూర్తగా సొంత సొమ్ముతో స్టార్టప్ ప్రారంభించి సక్సెస్ బాట పట్టిస్తానంటూ శపథం చేశారు. చదవండి: ఏం చిల్లరగాళ్లు ఉన్నర్రా మీరు ! బాధ్యత లేదా ? -
తప్పు చేస్తే సహించేదేలే..! అష్నీర్కు భారత్పే ఇన్వెస్టర్ల వార్నింగ్!
న్యూఢిల్లీ: ఇటీవల ఫిన్టెక్ సంస్థ భారత్పేలో జరుగుతున్న వివాదాలపై తాజాగా సీక్వోయా క్యాపిటల్ తీవ్రంగా స్పందించింది. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేదిలేదని స్పష్టం చేసింది. ఉద్ధేశపూర్వకంగా అవకతవకలకు తెరతీస్తే తగిన విధంగా స్పందించనున్నట్లు తెలియజేసింది. వాటాదారులు, ఉద్యోగులకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలియజేసింది. వాటాదారులు, ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో వెనకడుగు వేయబోమని, అవసరమైతే ఆర్థికంగా సైతం ఎదుర్కోనున్నట్లు వివరించింది. భారత్పేలో సీక్వోయా క్యాపిటల్కు 19.6 శాతం వాటా ఉంది. కంపెనీ సక్రమంగా వ్యవహరించే విషయంలో కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలియజేసింది. అక్రమాలకు పాల్పడిన అభియోగాలపై ఇటీవల కంపెనీ మాజీ చీఫ్ అష్నీర్ గ్రోవర్పై భారత్పే బోర్డు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. కంపెనీకి చెందిన అన్ని టైటిల్స్, పొజిషన్ల నుంచి గ్రోవర్ను తప్పించింది. చదవండి: ఆ విషయాన్ని బోర్డు చూసుకుంటుంది,'అష్నీర్' నిధుల దుర్వినియోగంపై సమీర్! -
ఆ విషయాన్ని బోర్డు చూసుకుంటుంది,'అష్నీర్' నిధుల దుర్వినియోగంపై సమీర్!
న్యూఢిల్లీ: ఫిన్టెక్ కంపెనీ భారత్పే మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2021–22)లో పటిష్ట పనితీరు చూపినట్లు కంపెనీ సీఈవో సుహయిల్ సమీర్ తాజాగా పేర్కొన్నారు. లాభనష్టాలులేని(బ్రేక్ఈవెన్) స్థితికి చేరే బాటలో వృద్ధి పథాన సాగుతున్నట్లు తెలియజేశారు. 18–24 నెలల్లో పబ్లిక్ ఇష్యూని సైతం చేపట్టే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు. కంపెనీ మాజీ చీఫ్ అష్నీర్ గ్రోవర్ నిధుల దుర్వినియోగ ఆరోపణ అంశాన్ని బోర్డు చూసుకుంటుందని పేర్కొన్నారు. ఉద్యోగులకే తమ తొలి ప్రాధాన్యత అని, టీముల స్థిరత్వంపై దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. ఇక బిజినెస్ వృద్ధి ద్వితీయ ప్రాధాన్యతగా పేర్కొంటూ ఇందుకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఇది కంపెనీ ఫలితాలలో ప్రతిఫలిస్తున్నట్లు తెలియజేశారు. చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో కంపెనీ ప్రతీ అంశంలోనూ 20 శాతం పురోగతి సాధించినట్లు వెల్లడించారు. కోవిడ్–19 జనవరిలో దెబ్బతీసినప్పటికీ లావాదేవీలు, టీపీవీ, రుణాల ఏర్పాటు, ఆదాయం తదితర పలు అంశాలలో ప్రస్తావించదగ్గ వృద్ధి సాధించినట్లు వివరించారు. టీపీవీ జోరు క్యూఆర్ కోడ్ల ద్వారా షాపు యజమానులు డిజిటల్ చెల్లింపులను చేపట్టేందుకు వీలు కల్పించే భారత్పే 225 పట్టణాలకు విస్తరించినట్లు సుహయిల్ తెలియజేశారు. 80 లక్షలకుపైగా మర్చంట్స్ నమోదైనట్లు, లావాదేవీ విలువ(టీపీవీ) 2.5 రెట్లు ఎగసి 16 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 1.2 లక్షల కోట్లు)ను తాకినట్లు వెల్లడించారు. 65 కోట్ల డాలర్ల(రూ. 4,875 కోట్లు) విలువైన రుణాలకు సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. బయ్ నౌ పే లేటర్ విభాగంలో ఐదు నెలల క్రితం ఆవిష్కరించిన పోస్ట్పే నెలకు 10 లక్షల లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 5 కోట్ల డాలర్ల(రూ. 375 కోట్లు) విలువైన టీపీవీ సాధించినట్లు వెల్లడించారు. -
భారత్పే బోర్డు సభ్యులపై ఆశ్నీర్ గ్రోవర్ ఊరమాస్ పంచ్లు!
భారత్పే బోర్డులో మొదలైన ముసలం ఇంకా చల్లారడం లేదు. అవినీతి ఆరోపణలపై బోర్డు నుంచి బయటకు నెట్టబడిన ఆ కంపెనీ మాజీ ఫౌండర్ ఆశ్నీర్ గ్రోవర్ ప్రస్తుతం బోర్డులో ఉన్న సభ్యులపై వరుసగా పంచ్లు విసురుతున్నారు. ఈ క్రమంలో మరోసారి ఊరమాస్ పంచ్ డైలాగులతో విరుచుకుపడ్డారు. ఈ ఏడాదికి సంబంధించిన తొలి త్రైమాసిక ఫలితాలను ఇటీవల భారత్పే ప్రకటించింది. ఈ ఫలితాల్లో క్షీణత కనిపించింది. దీన్ని అవకాశంగా మలుచుకున్న ఆశ్నీర్ గ్రోవర్ ట్విట్టర్లో రెచ్చిపోయారు. భారత్పే ఫస్ట్ క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. రజనీష్కుమార్, సుహైల్ సమీర్ వంటి అసమర్థుల నాయకత్వంలో భారత్పే ఫలితాలో క్షీణత కనిపిస్తోంది. కంపెనీ నిధులు ఆవిరైపోతున్నాయి. తాళాలు దొంగలించడం. కార్నర్లో బడ్డీ కొట్టు నిర్వహించడం రెండు ఒకటి కాదు. మీ నాన్నమ్మ గుర్తుకు వస్తుందా? మార్కెట్ మీకు అసలైన పరీక్ష పెడుతుంది. నిజాన్ని పట్టి చూపుతుంది అంటూ పంచ్ విసిరారు. భారత్పే స్టార్టప్ను 2018లో ఆశ్నీర్ గ్రోవర్, శాశ్వత్ నక్రానీలు స్థాపించారు. ఆ తర్వాత 2020లో భారీగా ఇన్వెస్ట్ చేసిన సుహైల్ సమీర్ భారత్పే గ్రూపు చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత క్రమంగా భారత్పే బోర్డులో లుకలుకలు మొదలయ్యాయి. చివరకు 2022 జనవరిలో భారత్పే నుంచి అశ్నీర్గ్రోవర్ను బలవంతంగా బయటకు పంపారు. దీంతో అవకాశం చిక్కినప్పుడల్లా అశ్నీర్ గ్రోవర్ పంచ్లు వేస్తున్నారు. తాజాగా భారత్పే సీఈవో సుహైల్ సమీర్, చైర్పర్సన్ హోదాలో ఉన్న రజనీష్ కుమార్ లక్ష్యంగా మాటల తూటాలు పేల్చారు. So I just heard @bharatpeindia closed it’s first quarter of ‘degrowth’ and ‘maximum cash burn’ under able (sic) leadership of Rajnish Kumar and Suhail Sameer. ‘Chaabi chheenna and hatti chalana do alag alag skills hai !’ Ab Nani yaad aayegi - markets are the ultimate test & truth — Ashneer Grover (@Ashneer_Grover) April 7, 2022 చదవండి: ఏం చిల్లరగాళ్లు ఉన్నర్రా మీరు ! బాధ్యత లేదా ? -
Bharat Pe: ఇదెక్కడి లొల్లిరా నాయనా ? ఇంతలా దిగజారి పోయారు !
ఫిన్టెక్ స్టార్టప్ కంపెనీగా మొదలై యూనికార్న్గా ఎదిగి ఎంతోమంది ఔత్సాహిక ఎంట్రప్యూనర్లకు స్ఫూర్తిని ఇచ్చింది భారత్పే. కానీ ఇప్పుడు బోర్డు సభ్యలు మధ్య చెలరేగిన గొడవలతో ఆ కంపెనీ ప్రతిష్ట మసకబారుతోంది. దిగజారుడు విమర్శలతో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కంపెనీని సొమ్ముతు ఇష్టారీతగా ఖర్చు చేయడంతో పాటు అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకున్నాడనే ఆరోపణలతో భారత్పే ఫౌండర్లలో ఒక్కడైన అశ్నీర్ గ్రోవర్ను ఇటీవల కంపెనీ నుంచి బయటకు పంపారు. అప్పటి నుంచి అశ్నీర్గ్రోవర్పై ఏదో ఆరోపణ వస్తూనే ఉంది. దానికి అతను కౌంటర్ ఇస్తూనే ఉన్నాడు. నిన్నటికి నిన్న కంపెనీ డబ్బులను ఇష్టారీతిగా ఖర్చు పెడుతూ పది కోట్ల రూపాయల విలువైన డైనింగ్ టేబుల్ కొనుగోలు చేశాడనే ప్రచారం జరిగింది. ఇప్పుడు దానికి మంచి మరో చిల్లర ఆరోపణలు అతనిపై వచ్చాయి. క్రికెట్ టోర్నీని వదల్లేదు 2021 అక్టోబరు, నవంబరులో టీ 20 వరల్డ్ కప్ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నీకి భారత్పే గ్లోబల్ పార్టనర్గా వ్యవహరించింది. ఈ క్రమంలో టోర్నీ నిర్వాహకులు తమ పార్టనర్లకు ప్రతీ మ్యాచ్కి 700ల వరకు ఉచిత్ పాస్లు అందించారు. అయితే గ్లోబప్ పార్టనర్గా భారత్పేకు దక్కిన పాసులను అశ్నీర్గ్రోవర్ అమ్ముకుని కోట్లు సంపాదించాడనే మరో ఆరోపణ తెరపైకి వచ్చింది. ఫ్రీ పాసుల అమ్మకం? ప్రతీ పాసుని కనీసం 750 దిర్హాం (ఇండియన్ కరెన్సీలో రూ.15,000)లకు అమ్ముకున్నాడని, వీఐపీ పాస్ల ధర అయితే చెప్పలేమని కొందరు మాజీ ఉద్యోగులు చెప్పినట్టుగా జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి. పేరుకే భారత్ పే ఉద్యోగులకు కొన్ని జనరల్ స్టాండ్లకు సంబంధించిన పాస్లు అందాయని మిగిలనవి అశ్నీర్ అమ్ముకున్నాడనే తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. What BharatPe Board thinks I am doing at ICC World Cup “10 ka 2, 10 ka 2, 10 ka 2 - aye sahab mangta hai kya ticket black mein ?!” What I am actually doing is ensuring Suhail Sameer and @sumeetsingh29 don’t drink silly the hospitality section dry. Kuchh nahi mila to kuchh bhi !!! pic.twitter.com/jI7vmWDECx — Ashneer Grover (@Ashneer_Grover) March 16, 2022 కపట నాటకాలు ఆపండి క్రికెట్ టోర్నమెంట్ పాసులు అమ్ముకున్నట్టు తనపై వస్తున ఆరోపణలపై అశ్నీర్ గ్రోవర్ స్పందించారు. భారత్పే చేస్తున్న ప్రచారాన్ని బట్టి నేను స్టేడియం దగ్గరర పది ఇవరై పది ఇవరై అంటూ పాసులు అమ్ముకున్నానా? ఎందుకీ చిల్లర ఆరోపణలు ? కపటత్వాన్ని ఇకనైనా ఆపండి అంటూ భారత్పే బోర్డుకు సూచించాడు. ఈ మేరకు మ్యాచ్ జరుగుతున్నప్పుడు వీఐపీ స్టాండ్లో తాను ఉన్నప్పటి ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశాడు అశ్నీర్ గ్రోవర్. Just tell us whether or not we keep invested on BharatPe? Many small investors invested because of you. — Raj (@Raj_Chen) March 17, 2022 మీకు బాధ్యత లేదా బోర్డులో తలెత్తిన లుకలుకలతో గత మూడు నెలలుగా ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దీనిపై భారత్పేలో ఇన్వెస్ట్ చేసిన ముదుపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిమ్మల్ని నమ్మి మీ కంపెనీలో మా డబ్బులు ఇన్వెస్ట్ చేశాం. అది మరిచి మీరు వ్యక్తిగత దూషణలతో కంపెనీ ప్రతిష్ట దిగజార్చుతున్నారు. బాధ్యతగా వ్యవహరించండి అంటూ సూచిస్తున్నారు. చదవండి: భారత్పే వ్యవహారాలపై జీఎస్టీ దర్యాప్తు -
భారత్పే.. బంగారు రుణాలు
ముంబై: ఫిన్టెక్ సంస్థ భారత్పే తాజాగా బంగారం రుణాల విభాగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం కొన్ని నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలతో (ఎన్బీఎఫ్సీ) చేతులు కలిపింది. బంగారం తనఖాపై రూ. 20 లక్షల వరకూ రుణాలు ఆఫర్ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. హైదరాబాద్తో పాటు బెంగళూరు, ఢిల్లీ తదితర నగరాల్లో తమ వ్యాపార కస్టమర్లకు ఈ సర్వీసు అందుబాటులో ఉందని భారత్పే తెలిపింది. దీన్ని ఈ ఏడాది ఆఖరు నాటికి 20 నగరాలకు విస్తరించనున్నట్లు, సుమారు 500 కోట్ల మేర రుణాలు మంజూరు చేయగలమని ఆశిస్తున్నట్లు వివరించింది. వడ్డీ రేటు వార్షికంగా అత్యంత తక్కువగా సుమారు 4.7 శాతంగా ఉంటుందని, దరఖాస్తు ప్రక్రియ.. రుణ వితరణ డిజిటల్ పద్ధతిలో 30 నిమిషాల్లోపే పూర్తి కాగలదని పేర్కొంది. 6,9,12 నెలల కాల వ్యవధికి కస్టమర్లు రుణాలు తీసుకోవచ్చని భారత్పే చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుహెయిల్ సమీర్ తెలిపారు. రెండు నెలల పాటు పైలట్ ప్రాతిపదికన పసిడి రుణాల స్కీమ్ను పరీక్షించామని, రూ. 10 కోట్ల వరకు రుణాలు మంజూరు చేశామని ఆయన పేర్కొన్నారు. -
బంగారం రుణం తీసుకునే వ్యాపారులకు భారత్ పే శుభవార్త..!
ప్రముఖ మర్చంట్స్ పేమెంట్స్ ఫ్లాట్ ఫారం భారత్ పే తమ మర్చంట్ భాగస్వాములకు శుభవార్త చెప్పింది. తమ మర్చంట్ భాగస్వాములకు బంగారు రుణాలను అందించనున్నట్లు పేర్కొంది. కంపెనీ ఇంతకు ముందు అసురక్షిత రుణాల కేటగిరీలోని కొలాటరల్ ఫ్రీ రుణాలను అందజేసింది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) సుహైల్ సమీర్ నేతృత్వంలోని ఈ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఆమోదం గల నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల(ఎన్బీఎఫ్సీ)తో చేసుకున్న భాగస్వామ్యం ఒప్పందంలో భాగంగా రూ.20 లక్షల వరకు బంగారు రుణాలను అందించనున్నట్లు తెలిపింది. భారత్ పే కంపెనీ ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నగరాలలో వ్యాపారులకు బంగారు రుణాలను అందిస్తున్నట్లు ప్రారంభించింది. 2022 చివరి నాటికి 20 నగరాలకు విస్తరించాలని భావిస్తుంది. 2022 చివరి నాటికి ₹500 కోట్ల రుణాలను నెలకు 0.39% వడ్డీరేటుతో అందించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ రుణ దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా డిజిటల్ రూపంలో ఉంటుందని, అసెస్ మెంట్ ప్రక్రియ పూర్తయిన 30 నిమిషాల్లోనే రుణం మంజూరు చేయనున్నట్లు భారత్ పే ఒక ప్రకటనలో తెలిపింది. భారత్ పే యాప్లో సులభంగా రుణం కోసం దరఖాస్తు చేయవచ్చని కంపెనీ పేర్కొంది. ఎన్బీఎఫ్సీ భాగస్వామ్యంతో సంస్థ డోర్ స్టెప్, బ్రాంచ్ కలెక్షన్ సేవలు రెండింటినీ అందిస్తోంది. వ్యాపారులు ఆరు, తొమ్మిది, 12 నెలల పాటు రుణాలు తీసుకోవచ్చు. ఈజీ డైలీ ఇన్స్టాల్ మెంట్(ఈడిఐ) ద్వారా రుణాన్ని తిరిగి చెల్లించే ఆప్షన్ కూడా వారికి ఉంది. కంపెనీ త్వరలో ఈక్వేటెడ్ నెలవారీ ఇన్ స్టాల్ మెంట్(ఈఎమ్ఐ) చెల్లింపును ప్రారంభించనుంది. భారత్ పేను 2018లో షష్వత్ నక్రానీ, భావిక్ కొలదియా కలిసి స్థాపించారు. (చదవండి: ఎయిర్ ఇండియా నూతన చైర్మన్గా చంద్రశేఖరన్ నియామకం..!) -
ఇది ఏమైనా స్పేస్ రాకెట్టా, టైం మిషనా..!జస్ట్ 10 కోట్ల డైనింగ్ టేబుల్..!
కంపెనీలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొవడంతో ఆశ్నీర్ గ్రోవర్ను అన్ని పొజిషన్ల నుంచి భారత్పే తొలిగించినా విషయం తెలిసిందే. కాగా భారత్ పే సహవ్యవస్థాపకుడు, షార్క్ టాంక్ ఇండియా హోస్ట్ ఆశ్నీర్ గ్రోవర్ వ్యవహారం ఇప్పట్లో సర్దుమనిగేలా లేదు.ఆశ్నీర్పై అనేక ఆరోపణలు మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి.తాజాగా ఒక డైనింగ్ టేబుల్ కొనేందుకు ఏకంగా రూ. 10 కోట్ల రూపాయలను గ్రోవర్ ఖర్చు చేశాడనే వార్తలు తెరపైకి వచ్చాయి. కాగా ఈ వ్యవహారంపై ఆశ్నీర్ గ్రోవర్ తనదైన శైలిలో ట్విటర్లో స్పందించాడు. మోసపోవద్దు..! డైనింగ్ టేబుల్పై రూ. 10 కోట్లను ఖర్చు చేశాడనే వ్యాఖ్యలను ఆశ్నీర్ గ్రోవర్ తిప్పి కొట్టారు. ఆశ్నీర్ తన ట్విట్లో..ఇది స్పేస్ రాకెట్టా..లేక టైం మెషినా..? జస్ట్ రూ. 10 కోట్ల విలువైన డైనింగ్ టేబుల్! అత్యంత ఖరీదైన డైనింగ్ టేబుల్ను కల్గిన గిన్నిస్ వరల్డ్ రికార్డు నాపై లేదు.నాకు అలాంటి ఉద్దేశం కూడా లేదు..భారత్పే బోర్డు సభ్యులు తనపై చేస్తోన్న ఆరోపణలపై మోసం పోవద్దు.ఒక వేళ మీరు ఆ వార్తలను నమ్మితే కంపెనీలాగా మీరు కూడా విశ్వసనీయతను కోల్పోతారంటూ మీడియాకు ఆశ్నీర్ గ్రోవర్ విన్నవించారు. అంతేకాకుండా తన వాటాలో అది కూడా 0.5 శాతం విలువ కూడా చేయదంటూ తెలిపాడు. ఆ టేబుల్కు వెచ్చించే పది కోట్ల రూపాయలతో 1000 మందికి ఉపాధి కలిగేలా చేస్తానని పేర్కొన్నారు. It’s not even worth 0.5% of that. I’d rather put ₹10cr in business and create employment for 1,000 of folks so that they can earn & put dignified meal on their tables for their families. Score; Self Goal (Loss of Credibility) by BharatPe Board / Investors - 1 : Lavishness - 0. — Ashneer Grover (@Ashneer_Grover) March 13, 2022 ఇదిలా ఉండగా కొద్ది రోజలు క్రితం ఆశ్నీర్ గ్రోవర్ కంపెనీ డబ్బులతో లగ్జరీకారును, 10 కోట్ల విలువైన డైనింగ్ టేబుల్ను కొన్నాడంటూ బ్లూమ్బర్గ్తో సహా పలు మీడియా సంస్థలు రాసుకొచ్చాయి. చదవండి: ఒక కప్పు కాఫీ ఎక్కువ తాగితే ఫైన్ కట్టాల్సిందే.. కొంపముంచిన కక్కుర్తి
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- స్వాతిమలివాల్పై దాడి.. కేజ్రీవాల్ సహాయకుడికి నో బెయిల్
- యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ ఘన విజయం
- హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
- అతనితో రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు!
- శెభాష్ శ్రేయస్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే
- పాయింట్ బ్లాంక్లో డీజేపై కాల్పులు
- భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
- ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
- గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
- ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Advertisement