-
రాయ్బరేలీలో పోటీ చేయకపోడంపై ప్రియాంక తొలి స్పందన
ఉత్తరప్రదేశ్లోని అమేథీ, రాయ్బరేలీ స్థానాలు కాంగ్రెస్కు ఎంతో కీలకం. గాంధీ కుటుంబానికి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మారిన ఈ స్థానాల్లో గెలుపు ప్రస్తుతం ఆ పార్టీకి అత్యంత అవసరం. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తుండగా.. అమేథీ నుంచి పార్టీకి విధేయుడు కిషోరిలాల్ శర్మ బరిలో నిలిచారు. లోక్సభ అయిదో విడతలో భాగంగా ఈ రెండు స్థానాలతోపాటు యూపీలో 14 సీట్లకు మే 20న పోలింగ్ జరగనుంది.కాంగ్రెస్ కంచుకోటగా పేరొందిన రాయ్బరేలీలో సోనియా గాంధీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే ఇటీవల ఆమె రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆమె తనయురాలు ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ ఆమె పోటీ నుంచి తప్పుకొని అందరినీ షాక్కు గురిచేశారు. ప్రస్తుతం ప్రియాంక ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలను తన భూజాన వేసుకున్నారు. గత ఎన్నికల్లో కోల్పోయిన అమేథీని తిరిగి దక్కించుకోవడం.. సోదరుడు పోటీ చేస్తున్న రాయ్బరేలీలో మరోసారి విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు.తాజాగా లోక్సభలో పోటీ చేయడకపోవడంపై ప్రియాంక గాంధీ స్పందించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తరపున దేశ వ్యాప్తంగా ప్రచారంపై దృష్టి సారించేందుకే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పేర్కొన్నారు. తాను, రాహుల్ ఈ ఎన్నికల్ల పోటీ చేస్తే.. ఈ అంశాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకుంటుందని చెప్పారు.‘నేను గత 15 రోజులుగా రాయ్బరేలిలో ప్రచారం చేస్తున్నాను. గాంధీ కుటుంబానికి రాయబరేలీతో విడదీయరాని బంధం ఉంది. కాబట్టి, మేము ఇక్కడికి వచ్చి వారిని కలిసి వారితో సంభాషిస్తారని ప్రజలు భావిస్తున్నారు. రిమోట్ కంట్రోల్ ద్వారా ఇక్కడ ఎన్నికలను గెలవలేం’ అని అన్నారు.తోబుట్టువులిద్దరూ(రాహుల్, ప్రియాంక) ఎన్నికల్లో పోటీ చేస్తే.. కనీసం 15 రోజులు తమ నియోజకవర్గాల్లోనే ఉండాల్సి వచ్చేదని అన్నారు. ఆ సమయంలో దేశమంతా ప్రచారం చేయడం కూదరదని తెలిపారు. అయితే భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు ప్రియాంక సమాధానం దాటవేశారు.పార్లమెంట్ సభ్యురాలు కావాలని, ఎన్నికల్లో పోటీ చేయాలనీ తానెప్పుడూ అనుకోలేదని అన్నారు. ఏ బాధ్యతలు అప్పజెప్పిన పార్టీ కోసం నిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. నేను ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజలు భావిస్తే పోటీ చేస్తానని తెలిపారు.ఓడిపోతామనే భయంతో ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదిన్న బీజేపీ ఆరోపణలను ఆమె కొట్టిపారేశారు. బీజేపీ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ నడవడం లేదని ఆమె అన్నారు. తాను, సోదరుడు పోటీ చేస్తే అది బీజేపీకి లాభదాయకంగా మారుతుందని, ప్రచారానికి ఎవరూ అందుబాటులో ఉండరని తెలిపారు. అదే విధంగా అమేథీ నుంచి రాహుల్ ఓటమి భయంతో పారిపోయారంటూ ప్రధాని మోదీ సహా బీజేపీ చేస్తున్న ప్రచారంపై ప్రియాంక మండిపడ్డారు. ‘కాంగ్రెస్ పార్టీ అమేథీ, రాయ్బరేలీలను ఎప్పటికీ వదిలిపెట్టదు. కాంగ్రెస్కు, ఈ రెండు నియోజకవర్గాల మధ్య అపూ ర్వ బంధం ఉంది. గుజరాత్లోని వడోదర ఎన్నికల్లో ప్రధాని మోదీ ఎందుకు పోటీ చేయడం లేదు? ప్రధాని భయపడుతున్నారా? 2014 తర్వాత వడోదర ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదు? గుజరాత్ నుంచి పారిపోయారా?’ అని ప్రియాంక ప్రశ్నించారు. -
రాములమ్మ ఆలోచనలు ఏంటి? కాంగ్రెస్లో కొనసాగుతారా.. లేక?
సినీ హీరోయిన్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి క్రమంగా ప్రజలకు దూరం అవుతున్నారు. అనేక పార్టీలు మారిన రాములమ్మ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తూ తన ఉనికి చాటుకుంటున్నారు. తాజాగా బీజేపీ నేత కిషన్రెడ్డి కామెంట్స్ మీద ట్వీట్ చేసి సోషల్ మీడియాలో వైరల్గా మారారు. ఇంతకీ రాములమ్మ ఆలోచనలు ఏంటి? ఆమె కాంగ్రెస్లో కొనసాగుతున్నారా? లేక మరో గూటికి చేరాలనుకుంటున్నారా? లేడీ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న విజయశాంతి ఒకప్పుడు అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండే. 1998లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీతో రాజకీయ అరంగేట్రం చేసిన విజయశాంతి కమలం, కాంగ్రెస్ పార్టీలకు రెండు సార్లు రాజీనామాలు చేసి, మళ్ళీ చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి తర్వాత ఆ పార్టీని గులాబీ పార్టీలో విలీనం చేాశారు. కేసీఆర్తో వచ్చిన విభేదాల కారణంగా కాంగ్రెస్లో చేరిపోయారు. కొన్ని రోజులు హస్తం పార్టీలో యాక్టీవ్ గానే ఉన్నా.. ఆతర్వాత కాంగ్రెస్లో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని రెండోసారి బీజేపీలో చేరారు. బీజేపీ నాయకత్వం సీనియర్గా ఆమెకు గుర్తింపు ఇచ్చినా కొద్ది రోజులకే మళ్ళీ హస్తం గూటికి వచ్చారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరిన విజయశాంతి పలు జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేాశారు. ఎన్నికల అనంతరం ఏమైందో తెలియదు కానీ మళ్ళీ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర నుంచి లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు ఆరు నెలల పాటు విజయశాంతి పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. కానీ అడపాదడపాగా సోషల్ మీడియా వేదికగా పార్టీకి అనుకూలంగానో వ్యతిరేకంగానో తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విజయశాంతి. తాజాగా సోషల్ మీడియాలో విజయశాంతి పెట్టిన పోస్ట్ మరోసారి చర్చకు దారితీసింది.బీఆర్ఎస్ మీద కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వాఖ్యలకు కాంగ్రెస్ నేతగా విజయశాంతి కౌంటర్ ఇవ్వడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ట్వీట్ చేసారు. కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదని, ఆత్మగౌరవం, పోరాట తత్వం దక్షిణాది రాష్ట్రాల సహజ లక్షణమంటూ కిషన్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు. దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ అర్థం చేసుకోలేక పోయిందంటూ చురకలు అంటించారు విజయశాంతి. అయితే కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ను విమర్శిస్తే విజయశాంతి స్పందించడమే ఇప్పుడు చర్చకు దారితీసింది.చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి ప్రస్తుత పోస్ట్ చూస్తుంటే మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా అనే అనుమానం రాజకీయ వర్గాల్లో కలుగుతోంది. కిషన్ రెడ్డి వాఖ్యలను బీఆర్ఎస్ నేతలే పట్టించుకోలేదు అలాంటిది కాంగ్రెస్ నేత అయిన విజయశాంతికి ఏమవసరం అని పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తానికి సొంత పార్టీని ఇరకాటంలో పెట్టడంలో విజయశాంతి స్టైలే వేరనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
‘రంగారెడ్డి’ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది..?
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా పార్టీ క్యాడర్లో ఇంకా అయోమయం కొనసాగుతోంది. హస్తం శ్రేణుల్లో ఈ ఆందోళనకు కారణమేంటి? పాత, కొత్త నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోందా ? గ్రూపు తగాదాలు పార్టీ క్యాడర్కు ఇబ్బందికరంగా మారాయా ? కొత్తవారు పెద్ద ఎత్తున చేరడంతో పాత నేతలు సైలెంట్ అయ్యారా ? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది ?ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ...గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి జంప్ అవుతారనే ప్రచారంతో పార్టీ క్యాడర్కు కునుకుపట్టనివ్వడం లేదు. హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినప్పటికీ వివిధ కారణాలతో కాంగ్రెస్లోకి వెళ్లడం లేదని తాత్కాలికంగా ప్రకటించారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి... కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కలిసి వచ్చారు. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉన్నప్పటికీ... పార్టీ నేతలు మాత్రం ఒప్పుకోవడం లేదట. ఒకవేళ నేతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ క్షణంలోనైనా మామా అల్లుళ్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ క్యాడర్ లో కన్య్ఫూజన్ క్రియేట్ చేస్తున్నాయి.ఇక బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి.. అనుకోని పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని రెండోసారి ఎంపీగా పోటీ చేశారు. అటు కాంగ్రెస్ క్యాడర్ సహకరించకపోవడం.. ఇటు బీఆర్ఎస్ క్యాడర్ తన వెంట రాకపోవడంతో రంజిత్ రెడ్డి చేవెళ్లలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు.మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సైలెంట్ అయిపోయారు. చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమై బీఆర్ఎస్ నుంచి వచ్చిన పట్నం సునీతారెడ్డి... రంజిత్ రెడ్డి కారణంగా మల్కాజిగిరి కాంగ్రెస్ లోక్ సభ స్థానానికి షిఫ్ట్ అయ్యారు. స్థానిక క్యాడర్ సహకారం లేకపోవడంతో పట్నం సునీతా మహేందర్ రెడ్డి చాలా ఇబ్బంది పడ్డారు. తాండూరు కాంగ్రెస్లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజులు ముందు కాంగ్రెస్లో చేరి మనోహర్ రెడ్డి... ఎమ్మెల్యేగా గెలిచారు. తొలుత మనోహర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు.అంతలోనే సోదరుడు మనోహర్ రెడ్డి రావడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు సోదరుల మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరింది. ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయారు. ఇంతలోనే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి... తాండూరును వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడిప్పుడే ముదురుతోంది. -
200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
2024 లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ జోస్యం చెప్పారు. అదే సమయంలో ఈ సారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 200 మార్కును కూడా దాటలేదని అన్నారు.లోక్సభ ఎన్నికల తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కాంగ్రెస్, సీపీఐ(ఎం)లు రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు. అయితే బీజేపీకి లబ్ధి చేకూర్చే టీఎంసీయేతర పార్టీలకు ఓటు వేయొద్దని మమతా బెనర్జీ ఓటర్లను కోరారు. ఆరంబాగ్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని గోఘాట్లో జరిగిన ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి బెనర్జీ మాట్లాడుతూ.. ఇండియా కూటమి పేరు పెట్టింది నేనే. బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమి నేతలు పనిచేస్తున్నారు. అదే ఇండియా కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు టీఎంసీ తన వంతు ప్రయత్నాలు చేస్తోందన్నారు. మోదీ 400 పై చీలూకు లోక్సభ స్థానాల్లో విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అవన్నీ సాధ్యమయ్యేవి కావు. 200 సీట్లు దాటడం గగనమేనని మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. -
పార్లమెంట్ ఎన్నికలు..BRS పరిస్థితి ఏంటి ?..KSR విశ్లేషణ
-
Sonia Gandhi: రాహుల్ను మీకు అప్పగిస్తున్నా
రాయ్బరేలి: ‘నా కుమారుడిని రాయ్బరేలీ ప్రజలకు అప్పగిస్తున్నా. రాహుల్ మిమ్మల్ని నిరాశపర్చడు’ అని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ శుక్రవారం రాయ్బరేలీలో ప్రచార సభలో పేర్కొన్నారు. ఎంపీగా 20 ఏళ్లు మీకు సేవ చేసుకునే అవకాశం ఇచ్చినందకు ధన్యావాదాలని అన్నారు. ‘నాకున్న ప్రతిదీ మీరిచి్చందే. కాబట్టి సోదరసోదరీమణులారా నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా. మీరంతా నన్ను మీ దానిగా భావిస్తారు’ అని అన్నారు. ఓటర్లతో భావోద్వేగ పూరితమైన బంధాన్ని నెలకొల్పే ప్రయత్నంలో రాహుల్నీ మీ సొంతవాడిగా భావించాలని విజ్ఞప్తి చేశారు. వేదికపై రాహుల్, ప్రియాంక గాం«దీలు సోనియా పక్కన నిలబడ్డారు. ‘ఇందిరా గాం«దీ, రాయ్బరేలీ ప్రజలు నాకు నేర్పిన విలువలు, పాఠాలనే నేను రాహుల్, ప్రియాంకలకు నేర్పాను. అందరినీ గౌరవించండి. బలహీనుల పక్షాన నిలబడి వారిని కాపాడండి. అన్యాయాలను ఎదిరించండి. ప్రజల హ క్కుల కోసం పోరాడండి. భయపడొద్దు. పోరాటాలు, సంప్రదాయాల్లో మీ మూలాలు బలంగా ఉన్నాయి’ అని వారిద్దరికీ నేర్పానని సోనియా గాంధీ అన్నారు. సోనియా తొలిసారిగా 2004లో రాయ్బరేలి ఎంపీగా గెలిచారు. రాజ్యసభకు ఎన్నికై ఇటీవల రాజీనామా చేసేదాకా 20 ఏళ్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ రాయ్బరేలీ బరిలో ఉన్నారు. 20 ఏళ్లు ఎంపీగా సేవ చేసుకునే అవకాశాన్ని తనకు రాయ్బరేలీ ప్రజలు కలి్పంచారని, ఇది తన జీవితంలో అమూల్యమైన ఘట్టమని సోనియా పేర్కొన్నారు. గత 100 ఏళ్లుగా తన కుటుంబం మూలాలు ఇక్కడి నేలతో ముడిపడి ఉన్నాయన్నారు. ఈ బంధం ఎంతో పవిత్రమైనదని, గంగా మాతతో అవధ్, రాయ్బరేలి రైతులకు ఉన్న బంధం లాంటిదే ఇదని పేర్కొన్నారు. రాయ్బరేలీకి ఇందిరా గాంధీ హృదయంలో ప్రత్యేక స్థానముందని, ఆమె పనిని తాను దగ్గరగా గమనించానని, రాయ్బరేలీ ప్రజల పట్ల ఇందిరకు ఎనలేని అభిమానమని పేర్కొన్నారు. అనారోగ్య కారాణాలు వల్ల సోనియా గాంధీ ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉన్నప్పటికీ కుమారుడి కోసం శుక్రవారం ప్రచారం చేయడం గమనార్హం. సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ కూడా ఈ సభలో పాల్గొన్నారు. సోనియాకు ముందు మాట్లాడిన రాహుల్ దేశంలోని యువత ఒక నిశి్చతాభిప్రాయానికి వచ్చారని, వారు మోదీని కోరుకోవడం లేదని తెలిపారు. జూన్ 4 తర్వాత ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని, అది ప్రజాప్రభుత్వమని చెప్పారు. భారత రాజ్యాంగ ప్రతిని చూపుతూ దీన్ని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు చింపి పాడేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. రాయ్బరేలీతో సమానంగా అమేథీని చూస్తా తాను గెలిస్తే అభివృద్ధి విషయంలో రాయ్బరేలి, అమేథీలను సమానంగా చూస్తానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అమేథీలో మూడుసార్లు ఎంపీగా నెగ్గిన రాహుల్ 2019లో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్థి, తమ కుటుంబానికి నమ్మినబంటు కిశోరీలాల్ శర్మ తరఫున రాహుల్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్తో కలిసి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ‘రాయ్బరేలిలో అభివృద్ధి పనులకు రూ. 10 ఖర్చు చేస్తే అదే పది రూపాయలు అమేథిలోనూ ఖర్చు పెడతాం.. అది నా హామీ’ రాహుల్ పేర్కొన్నారు. అమేథీ ప్రజలకు 40 ఏళ్ల పాటు నిస్వార్థంగా సేవలందించినందుకు కిశోరీలాల్ శర్మకు ధన్యవాదాలు చెప్పారు. అగి్నవీర్ నియామక విధానాన్ని రద్దు చేసి పరి్మనెంట్ నియామక పద్ధతిని తీసుకొస్తామని.. దీంట్లో పెన్షన్కు కూడా అవకాశం ఉంటుందని తెలిపారు. -
Narendra Modi: ప్రతిపక్షాలు గెలిస్తే అయోధ్యపైకి బుల్డోజర్లే
బారాబంకీ/ఫతేపూర్/హమీర్పూర్: కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలను ఈ ఎన్నికల్లో గెలిపిస్తే అయోధ్య రామమందిరంపైకి బుల్డోజర్లను పంపిస్తాయని, బాలరాముడు మళ్లీ టెంట్లోకి వెళ్లాల్సి వస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. బుల్డోజర్లను ఎక్కడికి పంపించాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వద్ద ట్యూషన్ చెప్పించుకోవాలని ఆ రెండు పారీ్టలకు సూచించారు. లోక్సభ ఎన్నికల్లో ఒక్కో దశ పోలింగ్ జరుగుతున్నకొద్దీ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి పేకమేడలా కూలిపోతోందని చెప్పారు. ఈ ఎన్నికల్లో తాము హ్యాట్రిక్ సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వంలో పేదలకు, యువతకు, మహిళలకు, రైతులకు మేలు చేసే కీలక నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ, ఫతేపూర్, హమీర్పూర్లో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. జూన్ 4వ తేదీ ఇక ఎంతోదూరంలో లేదని, మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమన్న సంగతి కేవలం మనకే కాదు, మొత్తం ప్రపంచానికి తెలుసని స్పష్టంచేశారు. ఎన్నికల బహిరంగ సభల్లో ప్రధానమంత్రి ప్రసంగాల్లోని విశేషాలివీ.. ఎన్నుకోవాల్సిన ఏకైక పార్టీ బీజేపీ ‘‘దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం అంకితమైన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఒకవైపు, దేశంలో అస్థిరత సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్న ‘ఇండియా’ కూటమి మరోవైపు ఈ ఎన్నికల బరిలో నిలిచాయి. మనకు మంచి చేసే ఎంపీలు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఎంపీలు కావాలి. కేవలం మోదీని దూషిస్తూ ఐదేళ్లు కాలం గడిపే ఎంపీలు మనకు అవసరమా? 100సీసీ ఇంజన్తో 1,000 సీసీ వేగం సాధ్యమా? బలమైన ప్రభుత్వమే అత్యంత వేగవంతమైన అభివృద్ధిని సాధించగలదు. అలాంటి అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. నిజంగా దేశ ప్రగతిని కోరుకుంటే మనం ఎన్నుకోవాల్సిన ఎకైక పార్టీ బీజేపీ. అయోధ్య రామమందిరంపై సమాజ్వాదీ పార్టీ పెద్దలు అనుచితంగా మాట్లాడారు. రామాలయం విషయంలో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తిరగదోడాలని కాంగ్రెస్ భావిస్తోంది. వారికి సొంత కుటుంబ ప్రయోజనాలు, రాజకీయ అధికారమే ముఖ్యం. కాంగ్రెస్–సమాజ్వాదీ పారీ్టలకు అధికారం అప్పగిస్తే అయోధ్యలో అలయాన్ని బుల్డోజర్లతో కూల్చేస్తారు. రామ్లల్లా మళ్లీ టెంట్లోకి పంపిస్తారు. ఆ రెండు పారీ్టలకు ఓటు బ్యాంకు కంటే ఏదీ ఎక్కువ కాదు. రిజర్వేషన్లపై ప్రతిపక్ష నేతలు దారుణంగా మాట్లాడుతున్నారు. మొత్తం రిజర్వేషన్లను ముస్లింలకే ఇవ్వాలని బిహార్ మాజీ ముఖ్యమంత్రి(లాలూ ప్రసాద్ యాదవ్) అన్నారు. అంటే దళితులు, గిరిజనులు, ఓబీసీలకు అన్యాయం చేయాలా? వారు ఉన్నత స్థాయికి చేరుకోవద్దా?’’ అని మోదీ ప్రశ్నించారు. -
Centre for the Study of Developing Societies: ఒపీనియన్లు వేరువేరయా!
ఎన్నికలగానే ముందుగా ఒపీనియన్ పోల్స్ వెలువడుతుంటాయి. ఫలానా పార్టీ అధికారంలోకి వస్తుందన్న అంచనాలు వెల్లువెత్తుతుంటాయి. ఇవి ఓటర్ల అభిప్రాయాలపై ఎంతో కొంత ప్రభావం చూపుతాయి. ఇలాంటి ఒపీనియన్ పోల్స్ ఫలితాల్లో కచి్చతత్వం ఎంతంటే చెప్పడం కష్టమే. ఈసారి ఎన్డీఏ కూటమి 400 పైచిలుకు లోక్సభ స్థానాలు సాధిస్తామని చెబుతుండటం తెలిసిందే. ఎన్డీఏ కూటమికి 372 స్థానాలు రావచ్చని ఎన్డీటీవీ పోల్ ఆఫ్ ఒపీనియన్స్ పోల్స్ సర్వే పేర్కొంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి 122 దాకా వస్తాయని అంచనా కట్టింది. కానీ, ఒపీనియన్ పోల్స్ ఫలితాలు కొన్నిసార్లు నిజమైనా, బెడిసికొట్టిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) కూడా ఇదే చెబుతోంది. 1998 నుంచి 2009 ఎన్నికల దాకా వెలువడ్డ పలు ఒపీనియన్ పోల్స్ను సీఎస్డీఎస్ విశ్లేషించగా ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి... అంచనాలు ఇలా.. 1998 లోక్సభ ముందస్తు ఎన్నికల తరుణంలో వచ్చిన ఒపీనియన్ పోల్స్ ఫలితాలకు దగ్గరగానే ఉన్నాయి. కానీ 1999 లోక్సభ ఎన్నికలపై వచ్చిన అంచనాలు అంత కచి్చతంగా లేవు. నాడు బీజేపీ సాధించబోయే స్థానాలను ఒపీనియన్ పోల్స్ ఎక్కువ చేసి చూపాయి. అలాగే 2004 లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఒపీనియన్ పోల్స్ జ్యోతిష్యం ఏమాత్రం పండలేదు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూపీఏ కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని పోల్స్ అసలే అంచనా వేయలేకపోయాయి. దాదాపు అన్ని ఒపీనియన్ పోల్స్ ఎన్డీఏ అధికారం నిలబెట్టుకుందనే చెప్పాయి. అలాగే 2009 లోక్సభ ఎన్నికల ముందు వేసిన అంచనాలు కూడా తప్పాయి. యూపీఏ అధికారాన్ని నిలుపుకుంటుందని మెజారిటీ ఒపీనియన్ పోల్స్ అంచనా వేయలేకపోయాయి. కానీ యూపీఏ కూటమికి 2004లో 222 లోక్సభ స్థానాలు రాగా 2009 ఎన్నికల్లో 262కు పెరిగాయి! 2014 లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఎన్డీఏ కూటమి 257 నుంచి 340 సీట్ల వరకు గెలుచుకోవచ్చని ఒపీనియన్ పోల్స్ అభిప్రాయపడ్డాయి. ఎన్డీఏకు 336 స్థానాలొచ్చాయి. కాంగ్రెస్ బలం బాగా పడిపోతుందన్న అంచనాలకు అనుగుణంగా 44 స్థానాలకే పరిమితమైంది. మళ్లీ 2019 ఎన్నికల్లో ఒపీనియన్ పోల్స్ అంచనాలు తప్పాయి. ఎన్డీఏకు 285 స్థానాలకు మించి రావని మెజారిటీ పోల్స్ పేర్కొనగా 353 స్థానాలు వచ్చాయి. బీజేపీ ఒంటరిగానే 303 స్థానాలు సాధించడం తెలిసిందే.ఎగ్జిట్ పోల్స్ కూడా అంతే! ప్రీ పోల్ సర్వేలకు, ఎగ్జిట్ పోల్ అంచనాలకు పెద్ద వ్యత్యాసం కనిపించదు. 2003 చివర్లో జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్తాన్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూల ఫలితాలు రావడంతో ఇండియా షైనింగ్ నినాదంతో 2004 కేంద్రంలో బీజేపీ ముందస్తు ఎన్నికలకు వెళ్లింది. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి 240–250 నుంచి స్థానాలు సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ప్రకటించగా ఫలితాలు రివర్సయ్యాయి. ఎన్డీఏ 187కే పరిమితమైంది. 2014 లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ సొంతంగా స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయలేకపోయాయి. 2016 చివర్లో మోదీ సర్కారు పెద్ద నోట్లను రద్దు చేశాక జరిగిన 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎగ్జిట్ పోల్స్ తుస్సుమన్నాయి. హంగ్ వస్తుందన్న వాటి అంచనాలకు భిన్నంగా బీజేపీ ఏకంగా 300 సీట్లతో ఘన విజయం సాధించింది.నిబంధనలు ఇలా... ఎన్నికల్లో ఎవరికి ఓటేసే అవకాశం ఉందంటూ ఓటర్ల అభిప్రాయాలను తెలుసుకుని రూపొందించేవి ఒపీనియన్ పోల్స్. ఓటేసి పోలింగ్ బూత్ల నుంచి తిరిగి వెళ్లే ఓటర్లను ప్రశ్నించి వేసే అంచనాలే ఎగ్జిట్ పోల్స్. ఒపీనియన్ పోల్స్ ఫలితాలను ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందు వరకు ప్రకటించవచ్చు. తుది దశ పోలింగ్ ముగిశాక ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసుకోవచ్చు.తప్పడానికి కారణమేమిటి? ఒపీనియన్ పోల్స్ అంచనాలు చాలా వరకు తారుమారు కావడానికి ఎన్నో కారణాలున్నాయి. అంచనాల్లో తప్పులు ఎంత తక్కువగా ఉంటే ఫలితాలు కచి్చతత్వానికి అంత దగ్గరగా ఉంటాయి. → 1999 లోక్సభ ఎన్నికల్లో ఒపీనియన్ పోల్స్ అంచనాలు, వాస్తవ ఫలితాల మధ్య 20 సీట్ల దాకా తేడా ఉంది. → 2009 ఎన్నికల్లో ఈ అంతరం 25–60 స్థానాలకు పెరిగింది. 2014లోనైతే ఏకంగా 50–100 స్థానాల తేడా వచి్చంది. → ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకుని తదనుగుణంగా ఈ సంస్థలు అంచనాలు వేస్తుంటాయి. అలా ఒక్కో పార్టీ/కూటమికి వచ్చే స్థానాలను లెక్కగడుతుంటాయి. → ఇది కాలం చెల్లిన పాత విధానమని నిపుణులు అంటున్నారు. → పోలింగ్ ఏజెన్సీలు సర్వేకు కావాల్సిన బలమైన వసతులు లేకపోవడం కూడా అంచనాల్లో తప్పులు పెరగడానికి కారణం. → ప్రతి నియోజకవర్గం నుంచి శాంపిల్ సైజు వీలైనంత ఎక్కువగా ఉండాలి. ఇందుకు భారీగా సిబ్బంది, నిధులు, సమయం కావాలి. → కానీ మన దగ్గర పోల్ ఏజెన్సీలకు ఈ వనరుల్లేవు. → పారీ్టల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే, ఫలితాల అంచనాలు అంత కష్టమవుతాయని సీఎస్డీఎస్ సైతం చెబుతోంది. → 2014 ఎన్నికల్లో 464 రాజకీయ పారీ్టలు పోటీ చేశాయి. 1998తో పోలిస్తే ఇది రెట్టింపు! → పోలింగ్ ఏజెన్సీలు పోటాపోటీగా పెరుగుతున్నాయి. దాంతో చాలా శాస్త్రీయంగా పోల్ సర్వేలు నిర్వహించకుండానే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. → సర్వే అంచనాలు ఎందుకు తప్పాయని చాలా పోలింగ్ ఏజెన్సీలు విశ్లేషణను చేసుకోవడం లేదు. → పైగా సర్వే ఫలితాలను ఎలా రూపొందించారో ఆధారాలను కూడా వెల్లడించడం లేదు. → ప్రీ పోల్ అంచనాలకు సంబంధించి జవాబుదారీ లేకపోవడం కూడా సమస్యకు కారణమే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సోనియా బర్త్డే కటాఫ్?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టిన తేదీ అయిన డిసెంబర్ 9ని పంట రుణ మాఫీకి కటాఫ్ తేదీగా ప్రకటించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. అదేరోజు తెలంగాణ ప్రకటన తేదీ కూడా కావడంతో దీన్ని సెంటిమెంట్గా కూడా ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7ను రుణ మాఫీకి కటాఫ్ తేదీగా చేయాలనే చర్చ కూడా జరుగుతోందని చెబుతున్నారు. ఈ రెండు తేదీల్లోనూ సోనియా పుట్టిన రోజునే కటాఫ్ తేదీగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. గతంలో డిసెంబర్ 11వ తేదీ కటాఫ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా లక్ష రూపాయల రుణమాఫీ చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు 2019 డిసెంబర్ 11వ తేదీని కటాఫ్గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకున్న రైతుల వ్యవసాయ పంట రుణాలను మాఫీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే సరిగ్గా నాలుగేళ్ల మధ్య కాలంలో రైతులు తీసుకున్న పంట రుణాలు మాఫీ చేస్తారని, దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు. గత డిసెంబర్ 9 తర్వాత నుంచి ఇప్పటివరకు రైతులు తీసుకున్న పంట రుణాలు మాఫీ కాబోవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మాఫీ కసరత్తు ముమ్మరం రుణమాఫీపై ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. తాము అధికారంలోకి వస్తే రూ.2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకేసారి రుణమాఫీ చేస్తామని కూడా స్పష్టం చేసింది. అంతేకాదు ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీలోపుగా హామీ నెరవేరుస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. దీంతో విధివిధానాలపై కసరత్తు వేగంగా జరుగుతోంది. వడ్డీపై తర్జనభర్జన రైతు యూనిట్గా కాకుండా, రైతు కుటుంబం యూనిట్గా రుణమాఫీని అమలు చేస్తారని అధికారులు చెబుతున్నారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీ కాబట్టి రైతుల సంఖ్య పెరుగుతుందని అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రూ.19,198.38 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని అప్పట్లో అంచనా వేశారు. 2020లో రూ.25 వేల లోపు రుణాలు మాఫీ (రూ.408.38 కోట్లు) చేశారు. ఆ తర్వాత రూ.25 వేల నుంచి రూ.37 వేల లోపు రైతులకు చెందిన కొందరికి రూ.763 కోట్ల రుణాలను మాఫీ చేశారు. ఇలా విడతల వారీగా మాఫీ చేశారు.తాజాగా కటాఫ్ తేదీని డిసెంబర్ 9వ తేదీగా ప్రకటిస్తే..అప్పటివరకు రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయలలోపు రుణాలను మాఫీ చేస్తారు. అయితే రుణ బకాయిలకు వడ్డీ కూడా తోడు కానుంది. అంటే బ్యాంకులకు వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై ఏం చేయాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వాస్తవ రుణ బకాయిలు రూ.30 వేల కోట్లు ఉంటే, వడ్డీతో కలిపి దాదాపు రూ.40 వేల కోట్ల వరకు అవ్వొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంటుంది. కటాఫ్ తేదీని బట్టి ఇది మారుతుందని అంటున్నారు. బంగారం కుదవబెట్టి, సాగు చేయని భూములకు రుణాలు తీసుకుంటే..? బంగారం కుదువబెట్టి తీసుకున్న పంట రుణాలకు కూడా మాఫీ వర్తింపచేయాలా వద్దా అన్నదానిపై చర్చ జరుగుతోంది. రైతుబంధు సొమ్మును అందరికీ ఇచ్చి దురి్వనియోగం చేశారంటూ విమర్శలు వచి్చన నేపథ్యంలో రుణమాఫీని కూడా సమగ్రంగా పరిశీలించాకే వర్తింప జేయాలనే ఆలోచన ఉన్నట్లు చెబుతున్నారు. కొందరు రైతులు సాగు చేయని భూములకు, కొండలు గుట్టలకు కూడా పంట రుణాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.సొంత అవసరాలకు కూడా ఏదో రకంగా పంట పేరుతో రుణాలు తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. ఇటువంటి వారికి కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తారా? అనే సందేహం వ్యక్తమవుతోంది. అయితే గత ఐదేళ్లలో ఎవరు సాగు చేశారో చేయలేదో ఇప్పుడు తెలుసుకోవడం కష్టం అవుతుందని, కొండలు గుట్టల పేరుమీద రుణాలు తీసుకుని ఉంటే వాటిని గుర్తించగలమా లేదా అనే చర్చ అధికారుల్లో జరుగుతోంది. ప్రధానంగా ఒకేసారి రుణమాఫీ అనేది ఎలా జరుగుతుందోనన్న చర్చ కూడా వ్యవసాయ శాఖ, బ్యాంకు అధికారుల మధ్య జోరుగా సాగుతోంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ రుణమాఫీకి మార్గదర్శకాలను ఖరారు చేసే పనిలో వ్యవసాయ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. గత ప్రభుత్వ హయాంలో రుణమాఫీకి సంబంధించిన వివరాలు లక్ష లోపు రుణాలు రైతులు రుణాలు 0– రూ.25 వేలు 2.96 లక్షలు రూ.408.38 కోట్లు రూ.25 వేలు– రూ.50 వేలు 5.72 లక్షలు రూ.1790 కోట్లు రూ.50 వేలు– రూ.75 వేలు 7 లక్షలు రూ.4000 కోట్లు రూ.75 వేలు – రూ.లక్ష 21లక్షలు రూ. 13000కోట్లు మొత్తం 36.68 లక్షలు రూ. 19,198.38 కోట్లు -
కాంగ్రెస్ లో టెన్షన్: పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై గాంధీ భవన్ లో చర్చ
-
తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
సాక్షి, హైదరాబాద్: ‘ఆర్టీసీ ఉద్యోగుల విలీన’ప్రక్రియ ఊసే లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదున్నర నెలలు దాటినా, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై కిమ్మనటం లేదు. ఇప్పటికిప్పుడు సంస్థ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే, వారి జీతాలు పెంచాలి. దీంతో ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుంది. 2015 నాటి వేతన సవరణ బకాయిలను చెల్లించేందుకే ప్రభుత్వం కిందామీదా పడుతోంది. ఈ తరుణంలో ఆర్టీసీ ఉద్యోగుల జీతాల భారాన్ని తలపైకెత్తుకోవటం ఎందుకన్న ఉద్దేశంతో దాన్ని పక్కనపెట్టిందన్న అనుమానాలున్నాయి. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఎన్ని పర్యాయాలు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా నోరు మెదపటం లేదు. 2019లోనే విలీనంపై చర్చ ⇒ ఆర్టీసీలో 2019లో సుదీర్ఘ సమ్మె జరిగిన సమయంలో ఉద్యోగుల విలీనంపై కొంత చర్చ జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ నేతలు కూడా నాటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ తర్వాత అది చల్లారిపోయింది. ⇒గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనూహ్యంగా 2023 ఆగస్టులో విలీనం అంశాన్ని ఉన్నట్టుండి తెరపైకి తెచి్చంది. ⇒అదే నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో దానిపై సానుకూలత వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు కూడా ప్రవేశపెట్టారు. ⇒సెపె్టంబర్ మొదటివారంలో బిల్లుపై గవర్నర్ ఆమోదముద్ర వేయటంతో ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారినట్టు అయ్యింది. ⇒విధివిధానాలకు ఓ కమిటీ ఏర్పాటు చేసి వదిలేసింది. ⇒ అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమలులోకి రావటంతో ఆ ప్రక్రియ అక్కడితో ఆగిపోయింది. ఎన్నికల హామీలో ఉంది.. నిలబెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున వెంటనే, ఆ హామీని నెరవేర్చాలి. విలీనం కోసం ఉద్యోగులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తక్కువ జీతాలతో పనిచేస్తున్నామన్న ఆవేదన నుంచి ఉపశమనం పొందే ఆ ప్రక్రియను వెంటనే చేపట్టి వారికి న్యాయం చేయాలి. –అశ్వత్థామరెడ్డి, ఆర్టీసీ కార్మిక సంఘం నేత కొత్త కమిటీ వేసి నివేదిక తెప్పించాలి విలీన ప్రక్రియ 90 శాతం పూర్తయింది. విధివిధానాలకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ వద్దనుకుంటే ఈ ప్రభుత్వం కొత్త కమిటీ వేసి వీలైనంత తొందరలో నివేదిక తెప్పించుకొని దాన్ని అమలు చేయాలి. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు కూడా పెరిగేందుకు ప్రభుత్వం సహకరించినట్టవుతుంది. – మర్రి నరేందర్ఉద్యోగుల్లో తీవ్ర నైరాశ్యంఆర్టీసీ ఉద్యోగులకు ప్రత్యేక వేతన సవరణ ఉన్నందున వీరికి పీఆర్సీ వర్తించదు. విలీనమయితేనే పీఆర్సీ పరిధిలోకి వస్తారు. జీతాలు కూడా కాస్త అటూఇటుగా ప్రభుత్వ ఉద్యోగుల దరికి చేరుతాయి,. అయితే విలీన ప్రక్రియ కాలయాపన జరిగే కొద్దీ, పదవీ విరమణ పొందే ఆర్టీసీ ఉద్యోగులు ఆ లబి్ధకి దూరమవుతున్నారు. ఇప్పటికే 1,800 మంది పదవీ విరమణ పొందారు. ప్రభుత్వ ఉద్యోగిగా పదవీ విరమణ పొందితే ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలుంటాయి. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో రోజురోజుకూ ఆందోళన పెరుగుతోంది. -
Kishori Lal Sharma: ఆమె నాకు పోటీయే కాదు!
కిశోరీ లాల్ శర్మ.. అమేథీలో కాంగ్రెస్ తురుపు ముక్క. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఊహించని ప్రత్యరి్థ. రాజీవ్గాంధీ నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్కు నమ్మిన బంటు ఈ 63 ఏళ్ల కేఎల్ శర్మ. ఇన్నాళ్లు తెరవెనుక చక్రం తిప్పిన శర్మ ఇప్పుడు నేరుగా బరిలోకి దిగి బీజేపీతో అమీతుమీ తేల్చుకోనున్నారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన బలం. గాం«దీలతో మైత్రి సహా.. పలు అంశాలపై ఆయన పంచుకున్న ముచ్చట్లివి.. ఇన్నాళ్లు తెర వెనుక ఉన్నారు. ఇప్పుడు తెరమీదకు వచ్చారు. ఈ మార్పు ఎలా ఉంది? ఎన్నికలకు సంబంధించి పెద్దగా మార్పు లేదు. నేనెప్పుడూ ఒంటరిగా ఏమీ చేయలేదు. 25–30 ఏళ్లుగా నాతో కలిసి పనిచేస్తున్నవారున్నారు. కాలం మారింది.. కొత్తగా చేయాలి. టీమ్ అదే.. పని తీరే మారింది. ఐదేళ్ల కిందట రాహుల్ ఓడిపోయిన చోట నుంచి పోటీని ఎలా చూస్తున్నారు? గతంలో పొరపాట్లు జరిగాయి. దాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు? ఎలా? అన్న అంతర్మథనం జరిగింది. రెండు విషయాలు బలంగా పనిచేశాయి. బీజేపీ ప్రభుత్వం నుంచి ఎదురైన ఒత్తిడితోపాటు మా వైపు నుంచి కూడా లోపాలు జరిగాయి. ఆ ఎన్నికల్లో దిశా నిర్దేశం చేసే నాథుడు లేరని కార్యకర్తలు వాపోయారు. బీజేపీ గెలిచింది 55,000 ఓట్ల తేడాతోనే. అది పెద్ద నంబర్ కాదు. ఓటమికి కారణమైన వారినే అభ్యరి్థగా నిలబెట్టారని బీజేపీ ఆరోపణ కదా! 2019 ఎన్నికల్లో నేను అమేథీలో లేను. రాయ్బరేలీలో పోలింగ్, ఎన్నికల నిర్వహణ చూస్తున్నాను. ఇప్పుడు నేను, నా ప్రత్యేక బృందం ఇక్కడ పనిచేస్తోంది. తేడా అదే! ‘గాంధీ కుటుంబ చప్రాసి’ వ్యాఖ్యలను ఎలా ఎదుర్కొంటారు? నేనెవరినో అమేథీ, రాయ్బరేలీ ప్రజలందరికీ తెలుసు. 1980లో యువజన కాంగ్రెస్ కార్యకర్తగా నా రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1983లో రాజీవ్ గాంధీ జీ 20 ప్రోగ్రామ్ను పర్యవేక్షించడానికి కొంతమంది యువ నాయకులను ఎంపిక చేశారు. వారిలో నేను ఒకడిని. ఒకటిన్నర బ్లాకులు చూసుకోవాల్సిన బాధ్యత నాకు అప్పచెప్పారు. ‘అమేథీ మే దిల్ లగ్ గయా’ (అమేథీ మీద మనసు పారేసుకున్నా). ఇక్కడే ఉండిపోయాను. కొందరు నన్ను సోనియాగాం«దీకి పీఏ అంటారు. ఎవరేమనుకున్నా.. నేను ప్రజాప్రతినిధిని. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిని. స్టార్ క్యాంపెయినర్ని. 2013లో ఏఐసీసీ కార్యదర్శిగా, సీపీ జోషితో కలిసి బిహార్కు కో–ఇన్చార్జ్గా ఉన్నాను. బిహార్లో కూటమి ఏర్పాటు చేసినప్పుడు 27 స్థానాల్లో విజయం సాధించాం. ఏం తెలియకుండా మాట్లాడేవారికి నేనేం చెప్పగలను? మీ కుటుంబం? భార్య. ఇద్దరు కూతుళ్లు. ఒకరు ఎంబీఏ చేసి మార్కెటింగ్లో ఉద్యోగం చేస్తున్నారు. రెండో కూతురు వ్యాపారవేత్త. మీ పోటీతో పారీ్టలో అంతర్గత విభేదాలు పెరిగాయని భావిస్తున్నారా? పారీ్టలో అంతర్గత పోరు ఉంది. కానీ నా విషయానికి వస్తే అది లెక్కలోకి రాదు. నేను వాళ్ళ అన్నయ్య లాంటివాడిని. తిట్టగలను, ప్రేమగా మాట్లాడగలను. వాళ్లూ నాతో అలాగే ఉంటారు. పోటీకి గ్రూపులు మంచివే. కానీ పార్టీని దెబ్బతీసే గ్రూపులు ఉండొద్దని చెబుతుంటా. ఎన్నికల్లో పోటీ చేయమని మిమ్మల్ని ఎవరు అడిగారు? అమేథీలోని ఇతర కార్యకర్తలు కోరుకున్నట్లే నేను కూడా రాహుల్జీ పోటీ చేయాలని కోరుకున్నా. కానీ నామినేషన్లకు ముందు ప్రియాంక ‘కిషోరీ జీ మా కుటుంబం కోసం మీరు ఎన్నో ఎన్నికల్లో పోరాడారు. ఈ ఎన్నికల్లో మేం మీకోసం పోరాడాలనుకుంటున్నాం’ అని చెప్పారు. నేను అంగీకరించాను. మీ ప్రచారానికి చాలా తక్కువ సమయం ఉంది! స్మృతి ఇరానీ ఎంత ప్రచారమైనా చేసుకోనీ. ఆమె అసలు నాకు పోటీయే కాదు. కష్టపడి పని చేయడమే నాకు తెలుసు. ఇక నిర్ణయం ప్రజలది. స్మృతి ఇరానీ చేస్తున్న ఆరోపణల విషయానికొస్తే, ఆమెను కించపరిచేలా నేనెప్పుడూ మాట్లాడలేదు. నాపై నోరు పారేసుకోవడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
9 సీట్లలో గెలుపు ఖాయం
సాక్షి , హైదరాబాద్ : ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 9 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆ పార్టీ నియమించిన ఎన్నికల నిర్వహణ కమిటీ తేల్చి చెప్పింది. మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను 13 చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ, పోల్ మేనేజ్మెంట్లో విఫలమైనట్లు పేర్కొంది. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్ కన్వినర్గా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, పీసీసీ ఉపాధ్యక్షుడు ఎంఆర్జీ వినోద్రెడ్డి, పుష్పలీల, రాములు నాయక్ తదితరులు సభ్యులుగా ఏర్పాటైన కమిటీ.. ఈ మేరకు ఒక మధ్యంతర నివేదికను ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీకి సమర్పించింది.తాము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా గుర్తించిన అంశాలను గురువారం గాం«దీభవన్లో మున్షీకి వివరించింది. బీఆర్ఎస్ను నిలువరించ గలిగినప్పటికీ, ఆపార్టీ ఓటర్లను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడంలో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదని తెలిపింది. బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి మళ్లి, కొన్నిచోట్ల కాంగ్రెస్ గెలుపు అవకాశాలను దెబ్బకొట్టినట్లు పేర్కొంది. 13 నుంచి 14 సీట్లు లక్ష్యంగా పనిచేసినా.. లోక్సభ ఎన్నికల్లో 13 నుంచి 14 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పార్టీ పనిచేసినప్పటికీ, ఎన్నికల నిర్వహణలో సరైన ప్రణాళికతో ముందుకు వెళ్లక పోవడం వల్ల నాలుగైదు సీట్లలో వెనుకబడినట్లు కమిటీ తన నివేదికలో పేర్కొంది. పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వరంగల్, భువనగిరి, జహీరాబాద్లలో ప్రత్యర్థి పారీ్టల కన్నా బలంగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది.కొన్ని నియోజకవర్గాల్లో పోల్ మేనేజ్మెంట్లో 2 శాతం నుంచి 8 శాతం వరకు మెరుగ్గా ఉంటే, నాలుగైదు నియోజకవర్గాల్లో 25 శాతం వరకు మెరుగైన స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఆదిలాబాద్, చేవెళ్ల, నిజామాబాద్, మెదక్ స్థానాల్లో ఇంకొంత కష్టపడి ఉంటే బాగుండేదని, అయినా ఈ నియోజకవర్గాల్లో కూడా గెలుపు అవకాశాలు ఉన్నట్లుగా పేర్కొన్నట్లు సమాచారం. మూడుచోట్ల బీజేపీకే అవకాశాలు: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మల్కాజిగిరి, కరీంనగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీకే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కాంగ్రెస్ ఎన్నికల నిర్వహణ కమిటీ నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించలేదని, అప్పటికి ఇప్పటికీ పార్టీ పురోగతి ఆశించినంత లేదని పేర్కొంది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సరైన ప్రణాళికతో ముందుకు వెళితే బాగుండేదని కమిటీ సూచించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ ఓట్లు బదిలీ కావడం, ఎన్నికలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లడం బీజేపీకి అనుకూలంగా మారినట్లు విశ్లేíÙంచింది. టీజేఎస్, సీపీఐ, సీపీఎం పార్టీలతో సమన్వయం లేకపోవడం కూడా కొన్ని నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలను దెబ్బకొట్టినట్లు అభిప్రాయపడింది. -
కొందరి బలహీనత వల్లే పీఓకే చేజారింది.. నెహ్రూపై విదేశాంగ మంత్రి
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) భారత్లో అంతర్భాగమేనని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. కొంతమంది బలహీనత వల్లే పీఓకేపై భారత్ నియంత్రణ కోల్పోయిందని ఆరోపించారు. ఒకరు చేసిన పొరపాటే దీనికి కారణమని చెప్పారు. భారత తొలి ప్రధాని జవహార్లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా ఉద్ధేశిస్తూ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్లో ‘విశ్వబంధు భారత్’ పేరుతో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ పీఓకేపై జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్ విలీనం చేసుకునే విషయమై లక్ష్మణ రేఖ వంటివి ఉన్నాయంటే తాను నమ్మబోనని చెప్పారు.లక్ష్మణ రేఖ వంటిది ఏదీ లేదని పేర్కొన్నారు. భారత్లో పీఓకే అంతర్భాగమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కొందరి బలహీనత వల్లే పీఓకే తాత్కాలికంగా మన నుంచి చేజారిందని, దానిపై పట్టు కోల్పోవడానికి వారి పొరపాటే కారణం అని నెహ్రూపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. విశ్వ వేదికపై మన స్థానాన్ని బలంగా ఉంచుకోవాలని భావిస్తున్నానని, స్వీయ విశ్వాసాన్ని ఏనాడూ వీడొద్దన్నారు.చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, పాక్తో బీజింగ సహకారంపై జై శంకర్ విమర్శలు గుప్పించారు. ‘నేను చైనా రాయబారిగా ఉన్నాను, చైనా గత చర్యల గురించి మనందరికీ తెలుసు. ఈ భూమిని పాకిస్తాన్ లేదా చైనా తమదని చెప్పుకోలేదని మేము వారికి పదేపదే చెప్పాము. సార్వభౌమాధికారం ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే, అది భారతదేశం. మీరు ఆక్రమిస్తున్నారు, మీరు అక్కడ నిర్మిస్తున్నారు, కానీ చట్టపరమైన హక్కు మాదే.’నని పేర్కొన్నారు.చైనా పాకిస్తాన్ మధ్య 1963 సరిహద్దు ఒప్పందాన్ని కూడా జైశంకర్ ఎత్తి చూపారు. అక్కడ పాకిస్తాన్ దాదాపు 5,000 కి.మీ భూభాగాన్ని చైనాకు అప్పగించిందని అన్నారు. ‘1963లో, పాకిస్తాన్- చైనా తమ స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అంగీకరించాయి. చైనాను దగ్గరగా ఉంచడానికి, పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో దాదాపు 5,000 కి.మీలను డ్రాగన్కు అప్పగించింది. ఈ ప్రాంతం భారతదేశానికి చెందింది’ ఆయన తెలిపారు. -
Ranga Reddy: కాంగ్రెస్లో ఏం జరుగుతోంది?
అధికారంలోకి వచ్చినప్పటికీ.. కాంగ్రెస్ క్యాడర్లో అయోమయం కనిపిస్తోంది. హస్తం శ్రేణుల్లో కనిపించని ఆందోళనకు కారణమేంటీ ? కొత్త, పాత నేతల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోందా? గ్రూపు తగాదాలు ఇబ్బందికరంగా మారాయా ? కొత్తవారు చేరడంతో పాత నేతలు సైలెంట్ అయ్యారా ? ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ... కాంగ్రెస్ లోకి జంప్ అవుతారనే ప్రచారం క్యాడర్ను కునుకుపట్టనివ్వడం లేదు. హైదరాబాద్ నగర శివారులోని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పటికీ కాంగ్రెస్లోకి వెళ్లడం లేదని తాత్కాలికంగా ప్రకటించారు. మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి... కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ను కలిసి వచ్చారు. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి రెడీగా ఉప్పప్పటికీ... పార్టీ రాష్ట్ర నేతలు మాత్రం ఒప్పుకోవడం లేదట. ఒకవేళ్ల రాష్ట్ర నేతలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ క్షణంలోనైనా మామ అల్లుళ్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ క్యాడర్లో కన్య్ఫూజన్ క్రియేట్ చేస్తున్నాయి.ఇక బీఆర్ఎస్ చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి.. అనుకోని పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని రెండో సారి ఎంపీగా పోటీ చేశారు. అటు కాంగ్రెస్ క్యాడర్ సహకరించకపోవడం.. ఇటు బీఆర్ఎస్ క్యాడర్ తన వెంట రాకపోవడంతో రంజిత్ రెడ్డి చేవెళ్లలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో అక్కడ ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి సైలెంట్ అయిపోయారు. చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు అన్ని రకాలుగా సిద్ధమై బీఆర్ఎస్ నుంచి వచ్చిన పట్నం సునీతారెడ్డి... రంజిత్ రెడ్డి కారణంగా మల్కాజిగిరి కాంగ్రెస్ లోక్ సభ స్థానానికి షిఫ్ట్ అయ్యారు. స్థానిక క్యాడర్ సహకారం లేకపోవడంతో పట్నం సునీతా మహేందర్ రెడ్డి చాలా ఇబ్బంది పడ్డారు.తాండూరు కాంగ్రెస్లో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజులు ముందు కాంగ్రెస్లో చేరి మనోహర్ రెడ్డి... ఎమ్మెల్యేగా గెలిచారు. మనోహర్ రెడ్డి సోదరుడు శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. అంతలోనే సోదరుడు మనోహర్ రెడ్డి రావడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు సోదరుల మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరింది.ఎవరికి వారు అన్నదమ్ముళ్లు గ్రూపులుగా విడిపోయారు. ఇంతలోనే పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి... తాండూరును వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని ప్రకటించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్ వార్ ఇప్పుడిప్పుడే ముదురుతోంది. ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కప్పుకున్న కండువా రంగులు మారుతున్నాయి తప్పా.. నేతలు మారడం లేదనే టాక్ వినిపిస్తోంది. పీసీసీ చీఫ్, సీఎం రేవంత్.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పాలిటిక్స్ ను ఎలా సెట్ చేస్తారనేది చూడాలి. -
‘అమేథీలో నా ప్రత్యర్థి ప్రియాంకానే’
లక్నో: లోక్సభ ఎన్నికల్లో తన ప్రత్యర్థి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా అని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అన్నారు. తనకు చిన్న పిల్లల వలే రాజకీయాలు చేయటం ఇష్టం లేదని తెలిపారు. స్మృతి ఇరానీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంకా గాంధీపై విమర్శలు చేశారు.‘ఈ ఎన్నికల్లో అమేథీలో నా ప్రత్యర్థి.. ప్రియాంకా గాంధీ వాద్రా. నాపై ఆమె తెర వెనక నుంచి పోరాటం చేస్తున్నారు. కనీసం ఆమె సోదరుడు రాహుల్ గాంధీ నయం. ఆయన ప్రత్యక్షంగా పోటీలో ఉన్నారు. 2014లో రాహుల్ 1.07 లక్షల మెజార్టీతో గెలుపొందారు’ అని ప్రియాంకా గాంధీని ఎద్దేవా చేశారు.ఇక.. కాంగ్రెస్ పార్టీ అమేథీ పార్లమెంట్ స్థానంలో గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కిషోరి లాల్ శర్మను బరిలో నిలిపిన విషయం తెలిసిందే. అదేవిధంగా కాంగ్రెస్ కంచుకోట స్థానమైన రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే రాహుల్ గాంధీ కేరళలోని వాయ్నాడ్లో సైతం పోటీ చేసిన విషయం తెలిసిందే.ఇక.. అమేథీ, రాయ్ బరేలీ స్థానాలు ప్రియాంకా గాంధీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ రెండు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఆమె కృషి చేస్తున్నారు. ఈ రెండు నియోజకవర్గాలో అన్ని తానై నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ప్రచారంలో దుసూకువెళ్తున్నారు.అమేథీ, రాయ్బరేలీ సెగ్మెంట్లలో ఐదో విడత మే 20న పోలింగ్ జరగనుంది. ఇక.. గతంలో రాయ్బరేలీలో సోనియా గాంధీ చేతీలో ఓడిపోయిన దినేష్ ప్రతాప్ సింగ్ను మళ్లీ బీజేపీ బరిలోకి దించింది. -
అమేథీలో గెలుపెవరిది..?
-
PM Narendra Modi: మతం ఆధారంగా బడ్జెట్ కేటాయింపులా?
నాసిక్: కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో 15 శాతం నిధులను మైనారీ్టలకే కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. మతం ఆధారంగా బడ్జెట్ కేటాయింపులను తాము అనుమతించే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. అలాగే విద్య, ఉద్యోగాల్లో మతపరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని స్పష్టంచేశారు. 2004 నుంచి 2014 దాకా కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు బడ్జెట్లో 15 శాతం నిధులను వారికి ప్రీతిపాత్రమైన ఓటు బ్యాంక్కు కట్టబెట్టడానికి ప్రయతి్నంచిందని చెప్పారు. అప్పట్లో బీజేపీ గట్టిగా ప్రతిఘటించడంతో కాంగ్రెస్ వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న తాను కాంగ్రెస్ ప్రతిపాదనను వ్యతిరేకించానని తెలిపారు.కానీ, మైనారీ్టలకు 15 శాతం నిధుల ఆలోచనను కాంగ్రెస్ ఇప్పటికీ విరమించుకోలేదని, ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి వస్తే అమలు చేయాలని యోచిస్తోందని విమర్శించారు. బుధవారం మహారాష్ట్రలోని పింపాల్గావ్ బస్వంత్, థానే పట్టణాల్లో లోక్సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. మతం ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు అనేది చాలా ప్రమాదకరమైన ఆలోచన అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మత ఆధారంగా దేశాన్ని ఇప్పటికే ఒకసారి విభజించిందని, మరో సారి అలాంటి పథకమే రచిస్తోందని ధ్వజమెత్తారు. తాము మతాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన ఘనతలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికలు కేవలం ఎంపీలను ఎన్నుకోవడం కోసం కాదని అన్నారు. దేశం కోసం బలమైన నిర్ణయాలు తీసుకొనే సామర్థ్యం గల ప్రధానమంత్రిని ఎన్నుకోవడానికి జరుగుతున్నాయని ఉద్ఘాటించారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని వివరించారు. గత పదేళ్లలో తన పని తీరును ప్రజలు గమనించారని. వికసిత్ భారత్ కోసం తనను మూడోసారి గెలిపించాలని కోరారు. -
రుణమాఫీకి రూ.40 వేల కోట్లు!
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీకి నిధుల సర్దుబాటు అంశం ఆర్థిక శాఖను కలవరానికి గురి చేస్తోంది. బహిరంగ మార్కెట్లో తీసుకునే అప్పులు, కేంద్ర గ్రాంట్లు, రాష్ట్రానికి వచ్చే నెలసరి ఆదాయం మొత్తం.. రెవెన్యూ వ్యయం, ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్లు, సంక్షేమ కార్యక్రమాలు, గతంలో చేసిన అప్పులకు అసలు, వడ్డీ చెల్లింపులకే సరిపోతుంటే.. రుణమాఫీకి నిధులు ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆగస్టు 15వ తేదీలోగా ఎట్టి పరిస్థితుల్లోనూ రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో నిధుల వేటలో తలమునకలైంది. రైతు రుణాలు అసలు, వడ్డీ కలుపుకొని దాదాపు రూ.40 వేల కోట్లు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. సంక్షేమం, గృహ నిర్మాణం ఎలా?ఎన్నికల సమయంలో గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న రైతు సంక్షేమ మండలి (ఎఫ్డబ్ల్యూసీ)కి రైతు రుణాలన్నింటినీ బదలాయించి, రైతుల పాస్ పుస్తకాలను విడిపించి వారికి అందించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా చెబుతున్నారు. అయితే కార్పొరేషన్కు రుణ మొత్తాన్ని బదలాయించినా..ఆ మొత్తం ‘ఆర్థిక జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ’ (ఎఫ్ఆర్బీఎం) పరిధిలోకే వస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎఫ్ఆర్బీఎం పరిధిలోనే రుణం తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా.. ఈ ఒక్క పథకానికే భారీ మొత్తంలో నిధులు తీసుకుంటే, మిగిలిన సంక్షేమ పథకాలు, గృహ నిర్మాణం తదితర పథకాలకు నిధులెలా అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. అప్పు చెల్లించడానికి అప్పు కుదురుతుందా?దాదాపు 40 లక్షల మంది రైతుల బకాయిలకు సంబంధించి ఐదేళ్ల కాలంలో బ్యాంకులకు వడ్డీ, అసలు కలుపుకొని రూ.40 వేల కోట్ల వరకు అవుతుందని అంచనా. కాగా ఇప్పటికే దాదాపు ఆరు నెలలు గడిచిపోయాయి. ఒకవేళ ఆర్బీఐ, ఆర్థిక సంస్థలు అంగీకరించినా.. రుణమాఫీ కింద ప్రతినెలా చెల్లించేందుకు రూ.800 కోట్లకు పైగానే కచ్చితంగా పక్కన పెట్టాల్సి వస్తుందని అంటున్నారు. ఇప్పటికే అనివార్య ఖర్చుల భారం పెరిగి ఇతర కార్యక్రమాలకు నిధులు సర్దుబాటు కావడం లేదని, ఇప్పుడు కొత్తగా చేరే రుణమాఫీ పద్దు ఖజానాకు భారమేనని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. మరోవైపు అప్పు చెల్లించడం కోసం తిరిగి అప్పు చేయడానికి ఆర్థిక సంస్థలు ఎంతవరకు అంగీకరిస్తాయన్నది అనుమానమేనని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇక మహాలక్ష్మి, ఉద్యోగుల పీఆర్సీ, ఇతర పథకాలు దశల వారీగా అమలు చేసినా.. వాటికి కూడా నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు. అయితే రైతు రుణమాఫీకి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అధికారవర్గాలు అందుకు ఉన్న మార్గాలను అన్వేషించే పనిలో పడ్డాయి.తొలి మూడు నెలల్లో రూ.11 వేల కోట్లుఈ ఆర్థిక సంవత్సరంలో రూ.59 వేల కోట్ల మేర అప్పులు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రణాళికల్లో ప్రతిపాదించింది. ఈ మేరకు ఆర్బీఐ ద్వారా తొలి త్రైమాసికంలో (ఏప్రిల్, మే, జూన్) రూ.11 వేల కోట్లను రుణాల రూపంలో సేకరించాలని నిర్ణయించింది. ఆ మొత్తంలో ఇప్పటికే రూ.6 వేల కోట్లు పూర్తి కాగా, మే నెలలోనే మరో రూ.2 వేల కోట్ల రుణ సేకరణ ఆర్బీఐ వద్ద షెడ్యూల్ అయి ఉంది. జూన్లో మరో రూ.3వేల కోట్లను తీసుకోనుంది. మొత్తం మీద ఆర్బీఐకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ మూడు నెలల్లో రూ.11 వేల కోట్ల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనుంది. ఎన్నికల వేళ అప్పుల మోతఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త అప్పుల మోత మోగించింది. ఏప్రిల్, మే నెలల్లో ఇప్పటికే రూ.6 వేల కోట్ల రుణాలను బహిరంగ మార్కెట్ నుంచి సేకరించింది. ఆర్బీఐ ద్వారా సెక్యూరిటీలను వేలం వేసి ఈ మొత్తాన్ని తీసుకుంది.ఏప్రిల్ నెలలో రెండు దఫాల్లో రూ.2 వేల కోట్లు తీసుకోగా, మే నెలలో రెండు దఫాల్లో రూ.4 వేల కోట్లను సేకరించింది. ఏప్రిల్ 23న రూ.1,000 కోట్లు, అదే నెల రెండో తేదీన రూ.1,000 కోట్లు, మే 7వ తేదీన రూ.3 వేల కోట్లు, మే 14న మరో రూ.1,000 కోట్లు తీసుకుంది. ఈ మొత్తాన్ని 12 నుంచి 28 ఏళ్ల కాలవ్యవధిలో చెల్లించనుంది. -
రైతు సమస్యలుపక్కనపెట్టి రాజకీయాలా?
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయిలో రైతులు పడుతు న్న ఇబ్బందులను విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను నెల రోజులుగా పట్టించుకోవడం లేదన్నారు. రైతుల దయనీయ పరిస్థితికి అద్దం పట్టే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయని చెప్పారు. తెలంగాణభవన్లో బుధవారం కేటీఆర్ మీడియా తో మాట్లాడారు. ధాన్యం కొనుగోలుపై పర్యవేక్షణ లేదని, హమాలీలు, ధాన్యం సంచుల కొరత, తరు గు పేరిట క్వింటాల్కు మూడున్నర కిలోల చొప్పున కోత విధించడం వంటి సమస్యలు ఉన్నాయన్నారు. వీటిపై కామారెడ్డి, నిర్మల్, సిరిసిల్ల తదితర జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగుతున్నారని చెప్పారు. రాజకీయాలను పక్కన పెట్టి ఎఫ్సీఐ ద్వారా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసేలా చూడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో రైతులకు అండగా రోడ్డెక్కి ఆందోళన చేస్తామన్నారు. రైతాంగం ఆందోళన, ధైర్యం చెడొ ద్దని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కేటీఆర్ పిలుపుని చ్చారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు వారి తోనే బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందన్నారు. రుణ మాఫీ, ధాన్యం కొనుగోలు, బోనస్ వంటి హామీలు అమలయ్యేంత వరకు రైతుల తరపున బీఆర్ఎస్ పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.అప్పులపై రేవంత్ ప్రజలకు క్షమాపణ చెప్పాలిగత ప్రభుత్వం అప్పులు చేసిందంటూ శ్వేతపత్రాల పేరిట చిల్లర రాజకీయం చేసిన సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం రూ.3.89లక్షల కోట్లు మాత్రమేనని ఆర్బీఐ నివేదిక వెల్లడించిందన్నారు. అప్పులు చేయడం తప్పు అని ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఎందుకు అప్పులు చేస్తుందని ప్రశ్నించారు. కొత్తగా చేస్తున్న అప్పులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పులు చేయడానికి అప్పులు చేయడం దివాలాకోరు విధానం అని, దీనిపై ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఏనాడూ విద్యుత్ ఉద్యోగులను పల్లెత్తు మాట అనలేదని, ఉద్యోగులతో తమది పేగుబంధం అని కేటీఆర్ పేర్కొన్నారు. నయీం లాంటి వ్యక్తికి కాంగ్రెస్ టికెట్వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ పట్టభద్రుల ఎమ్మె ల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ బ్లాక్మెయిలర్, ఎన్నో పార్టీలు మారిన నయీం తరహా వ్యక్తికి టికెట్ ఇచ్చిందన్నారు. ఈ స్థానం నుంచి ఇప్పటివరకు నాలుగు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు, ఐదున్నర నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వపాలన చూసి బీఆర్ఎస్కు మద్దతు పలకాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా 30 వేల మంది ఉద్యోగులు భర్తీ కాగా, సీఎం రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలతో తన ఖాతాలో వేసుకుంటున్నాడని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ కోసం ప్రశ్నించే గొంతుకగా బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని కోరారు. నల్లగొండపైనే కాంగ్రెస్ ఆశలుఎంపీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక్క స్థానంలోనే గెలిచే అవకాశముందని కేటీఆర్ అన్నారు. కేవలం నల్లగొండ ఎంపీ స్థానంపైనే కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుందన్నారు. తెలంగాణభవన్లో కేటీఆర్ మీడి యాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే... ‘పార్లమెంటు ఎన్నికలు ఆశావ హంగా జరిగినట్టు ఈ రోజు మా ఎంపీ అభ్యర్థులతో జరిగిన భేటీలో చెప్పారు. నేను ప్రత్యేకంగా చేయించిన సర్వేలోనూ బీఆర్ఎస్ కు అనుకూలంగా సైలెంట్ ఓటింగ్ పడినట్టు తేలింది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు సరిగ్గా లేరు. సునీతా మహేందర్రెడ్డికి మల్కాజిగిరితో ఏమైనా సంబంధం ఉందా. బండి సంజయ్ను గెలిపించేందుకు వెలిచాల రాజేందర్రావు లాంటి అడ్రస్ లేని వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. నాగర్ కర్నూల్లో మా అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమా ర్కు బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. నాగర్కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరీంనగర్, ఖమ్మం, మెదక్, చేవెళ్లలో పక్కాగా గెలుస్తున్నాం. పెద్ద పల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్లో బీజేపీతో బీఆర్ఎస్కు ప్రధానంగా పోటీ ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు లాభం జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మళ్లీ గెలుస్తారని మాకు సమాచారం ఉంది’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. -
‘బీజేపీకి ఓటేస్తే నేను జైలుకే’.. కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటర్లను ఉద్దేశిస్తూ.. ప్రజలు బీజేపీకి ఓటు వేస్తే తాను తిరిగి జైలుకు వెళ్లాల్సి వస్తుందని, అందుకే ఇండియా కూటమి అభ్యర్ధులను ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు. ఢిల్లీ లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో ఆప్, కాంగ్రెస్ పోటీ చేస్తున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ చాందినీ చౌక్ లోక్సభ అభ్యర్థి జేపీ అగర్వాల్కు మద్దతుగా మోడల్ టౌన్లో కేజ్రీవాల్ రోడ్షో నిర్వహించారు.నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానుఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. నేను మీ మధ్య ఉండటానికి జైలు నుండి నేరుగా వచ్చాను. ఈ వ్యక్తులు (బీజేపీ) నన్ను కటకటాల వెనక్కి నెట్టారు. నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారని నాకు బాగా తెలుసు. నేను చిన్న వ్యక్తిని. మాది ఢిల్లీ, పంజాబ్లలో ప్రభుత్వాలున్న చిన్న పార్టీ అని కేజ్రీవాల్ అన్నారు.ఇంతకీ నేను చేసిన తప్పు ఏమిటి? నన్ను ఎందుకు జైలులో పెట్టారని నేను ఆలోచిస్తున్నాను. ఇంతకీ నేను చేసిన తప్పు ఏమిటి? అని తనని తాను ప్రశ్నించుకున్నారు. పిల్లలకు మంచి విద్యను అందించడం, వారికి మంచి పాఠశాలలు నిర్మించడం, మొహల్లా క్లినిక్లు ప్రారంభించడం, ప్రజలకు ఉచితంగా మందులు అందేలా చేయడం నేను చేసిన తప్పా అని అన్నారు. మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఇప్పుడు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెబుతున్నారు. నేను జైలుకు వెళ్లాలా వద్దా అన్నది మీ చేతుల్లోనే ఉంది. మీరు కమలం (బీజేపీ గుర్తు) ఎంచుకుంటే నేను మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. మీరు ఇండియా కూటమి అభ్యర్థిని ఎంచుకుంటే.. నేను జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదు అని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఓటు వేసేముందు ఆలోచించండిఓటు వేయడానికి వెళ్లినప్పుడు కేజ్రీవాల్ జైలుకు వెళ్లాలా అని మీరు ఆలోచించాలి అని ఆయన అన్నారు. నేను జైలులో ఉన్నప్పుడు తనను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు జరిగాయని కానీ హనుమంతుడి ఆశీర్వాదం వల్ల నేను బలంగా ఉన్నాను అని ఆరోపించారు. -
కాంగ్రెస్ రైతు వ్యతిరేక చర్యలు.. రాష్ట్రవ్యాప్త నిరసనకు కేసీఆర్ పిలుపు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా… గురువారం రాష్ట్రవ్యాప్త నిరసనకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి..ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచించడం,మోసం చేయడం, దగా చేయడమేనని మండిపడ్డారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ రైతువ్యతిరేక విధానాలను కేసీఆర్ ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 90శాతం రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారని, ఈ విషయం తెలిసి రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా ఎలాప్రకటిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం ద్వారా తెలంగాణ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి వచించిందని మండిపడ్డారు. ఓట్లు డబ్బాలో పడంగనే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిందని, అందుకే నాలిక మడతేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారని విమర్శించారు. ఇదే సన్న వడ్లకు మాత్రమే అనే మాట ఎన్నికలకు ముందు గనుక చెప్పింటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కుతుక్కు చేసేవాళ్లు. ఇప్పటికీ ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారన్నారు.‘రైతుబంధు ఇవ్వకుండ , రైతు భరోసా ఇయ్యకుండా రైతాంగాన్ని అన్నిరకాలుగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. అందుకే రైతాంగ హక్కులను హామీలను సాధించేందుకే బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపట్టింది బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులపక్షాన నిలబడి కొట్లాడాలి. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనడానికి నిర్లక్ష్యం వహిస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తూ గోస పుచ్చుకుంటున్నది. రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించే దిశగా నిరసన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజూ వడ్ల కల్లాలకాడికి బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లాలి. వారికి అండగా నిలవాలి. రైతుల హక్కులను కాపాడేందుకు వారికి అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది’ అని అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. -
మాజీ గవర్నర్ కమలా బెనివాల్ కన్నుమూత
కాంగ్రెస్ సీనియర్ నేత, గుజరాత్ మాజీ గవర్నర్ కమలా బెనివాల్ (97) మరణించారు. బుధవారం జైపూర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు . కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బెనివాల్ను ఆమె కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ మరణించారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.కాగా కమలా బెనివాల్ గుజరాత్తో పాటు త్రిపుర, మిజోరం రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు . ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బెనివాల్ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో ఇతర పదవులను నిర్వహించడమే కాకుండా రాజస్థాన్ డిప్యూటీ సీఎంగా పనిచేశారు.రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ , మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పలువురు ప్రముఖులు బేనీవాల్ మృతికి సంతాపం తెలిపారు. -
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
కోల్కతా: సీట్ల పంపకం విషయంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్తో విభేదించారు. దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సభ్యత్వం తీసుకోవడాన్ని తాత్కాలికంగా నిలిపి వేశారు. అయితే ఈ విషయంలో ఆమె కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తే దానికి బయటి మద్దతు ఇస్తానని మమతా బెనర్జీ హామీ ఇచ్చారు. ఇండియా కూటమిలో పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్, సీపీఐ(ఎం)లను కలపవద్దు. ఎందుకంటే ఆ రెండు పార్టీలు మాతో లేరు. బీజేపీతో ఉన్నారని మండిపడ్డారు. -
స్వాతి మలివాల్పై దాడి.. కేజ్రీవాల్ మౌనమేల?
న్యూఢిల్లీ: బిభవ్ కుమార్తో రాజీనామా చేస్తారా? లేదంటే అరవింద్ కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్పై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేయడం నిజమేనని ఆప్ వెల్లడించిన తరుణంలో బీజేపీ స్పందించింది.సీఎం పదవికి రాజీనామా చేయాలి బిభవ్ కుమార్తో రాజీనామా చేయించాలని, లేదంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షాజియా ఇల్మీ డిమాండ్ చేశారు. స్వాతి మలివాల్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఇల్మీ.. కేజ్రీవాల్ బెదిరింపులకు గురిచేస్తున్నారా అని ప్రశ్నించారు.మహిళా ఎంపీపై దాడి జరిగితే మౌనమేలామరోవైపు ఓ మహిళా ఎంపీపై దాడి జరిగినా కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ కార్గేతో పాటు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఈ అంశంపై మౌనం వహించడాన్ని తప్పుబట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ గురించికేజ్రీవాల్ అధికారిక నివాసంలో తనపై దాడి జరిగిందని మలివాల్ సోమవారం సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదునే ఇల్మీ ప్రస్తావిస్తూ.. కేజ్రీవాల్ నివాసంలో ఆమెను కొట్టినట్లు స్పష్టంగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ గురించి (ఇల్మీ గతంలో ఆప్లో పనిచేశారు) నాకు బాగా తెలుసని అన్నారు.బిభవ్తో రాజీనామా చేయించాలి. లేదంటే తనకు తానే రాజీనామా చేయాలని అరవింద్ కేజ్రీవాల్ను బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షాజియా ఇల్మీ నొక్కాణించారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
- Virat Kohli: బహుశా ఇదే చివరి మ్యాచ్.. కోహ్లి వ్యాఖ్యలు వైరల్
Advertisement