-
తీహార్ జైల్లో సీఎం కేజ్రీవాల్తో మంత్రి సౌరభ్ భరద్వాజ్ భేటీ
మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఆ పార్టీ ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ కలిశారు.ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను సీఎం కేజ్రీవాల్ను కలుసుకుని అరగంట సేపు ఫోన్ ద్వారా మాట్లాడుకున్నాం. మా ఇద్దరి మధ్యలో గ్రిల్, అద్దం ఉంది. మరోవైపు సీఎం కూర్చున్నారు.తమ ఇద్దరి ఫోన్ సంభాషణలో ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందవద్దని కేజ్రీవాల్ అన్నట్లు తెలిపారు. ఢిల్లీ ప్రజల ఆశీర్వాదంతో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా భరద్వాజ్ అన్నారు. #WATCH | Delhi: AAP leader and Delhi Minister Saurabh Bharadwaj says, "I met CM Arvind Kejriwal and talked to him for half an hour. There was a grill and a mirror in between, and on the other side CM was sitting; We communicated through a phone. He said that Delhiites should not… pic.twitter.com/J6AuUrfIzz— ANI (@ANI) April 24, 2024 -
ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు ఊరట..
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్ను ఢిల్లీ సీఎం పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించేదుకు హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు పేర్కొంది. మార్చి 21న కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత దేశ రాజధానిలో ప్రభుత్వ పాలన కొరవడిందని హిందూ సేన జాతీయ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త విష్ణు గుప్తా ఈ ప్రజా ప్రయోజన పిటిషన్ను దాఖలు చేశారు. దీనిని గురువారం జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోడాతో కూడిన డివిజన్ బెంచ్ బెంచ్ కొట్టేసింది. సీఎం పదవిలో కొనసాగాలా వద్దా అనే అంశం కేజ్రీవాల్ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. అయితే పిటిషనర్ ఈ అంశంపై రాజ్యాంగ అధికారులను(రాష్ట్రపతి లేదా గవర్నర్) సంప్రదించాలని హైకోర్టు కోరింది. ‘కొన్నిసార్లు వ్యక్తిగత ప్రయోజనం జాతీయ ప్రయోజనాలకు లోబడి ఉండాలి. కానీ అది అతని (కేజ్రీవాల్) వ్యక్తిగత నిర్ణయం. ఇది న్యాయస్థానం, కోర్టు ఎప్పుడైనా రాష్ట్రపతి పాలన, గవర్నర్ పాలన విధించిన సందర్భాలు ఉన్నాయా? దీనిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేదా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. చదవండి: తీహార్ జైలు నుంచి ఆప్ ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ సందేశం ప్రభుత్వం పనిచేయడం లేదని మేము ఎలా చెప్పగలం? దానిని నిర్ణయించడానికి లెఫ్ట్నెంట్ గవర్నర్కు పూర్తి సామర్థ్యం ఉంది. ఆయనకు మా మార్గదర్శకత్వం అవసరం లేదు. చట్టాం ప్రకారం ఏం చేయాలో ఆయన చేస్తారు’ అని పేర్కొంది. అనంతరం పిటిషనర్ గుప్తా మాట్లాడుతూ.. తన పిటిషన్ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ముందు దీనిని ప్రస్తావించనున్నట్లు చెప్పారు. కాగా సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ను తొలగించాలంటూ హైకోర్టులో దాఖలైన రెండో పిటిషన్ ఇది. కాగా మార్చి 28న సుర్జిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్ను హైకోర్టు కొట్టివేసింది. -
సీఎం కేజ్రీవాల్కు బర్త్డే విషెస్ చెప్పిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పుట్టినరోజు నేడు(ఆగస్టు16). ఈ ఏడాది ఆయన 56వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కేజ్రీవాల్కు పలువురు రాజకీయ నేతలు బర్త్డే విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ సీఎంకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీవాల్ ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలని ప్రధాని ఆకాంక్షించారు. Thank you for your wishes Sir. https://t.co/pa74MlU12I — Arvind Kejriwal (@ArvindKejriwal) August 16, 2023 అయితే మోదీ ట్వీట్కు కేజ్రీవాల్ బదులిచ్చారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సెనా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆదిత్య ఠాక్రే, రాజీవ్ శుక్లాతో తదితరులు కేజ్రీవాల్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చదవండి: వాస్తవం తెలుసుకోండి.. బీజేపీ తప్పుడు ప్రచారంపై సచిన్ పైలట్ ఫైర్ మనీష్ను మిస్ అవుతున్నా: కేజ్రీవాల్ కేజ్రీవాల్ తన పుట్టిన రోజున సీఎం డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను మిస్ అవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ ఈరోజు నా పుట్టినరోజు. చాలా మంది నాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అందరికీ ధన్యవాదాలు. కానీ నేను మనీష్ను చాలా మిస్ అవుతున్నాను. ప్రస్తుతం అతను తప్పుడు కేసులో జైలులో ఉన్నారు. Today is my birthday. Many people are sending their wishes. Thank you so much! But I miss Manish. He is in jail in a false case. Lets all take a pledge today - that we will do everything within our means to provide best quality education to every child born in India. That will… — Arvind Kejriwal (@ArvindKejriwal) August 16, 2023 ఈ రోజు మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం. భారత్లో పుట్టిన ప్రతి బిడ్డకు ఉత్తమమైన, నాణ్యమైన విద్యను అందించడానికి మా శక్తిమేర ప్రయత్నిస్తాం. అది పటిష్ట భారత్కు పునాది వేస్తుది. అది భారత్ను నంబర్ వన్గా తీర్చిదిద్దాలనే మన కలను సాకారం చేసుకోవడంలో సహాయపడుతుంది. అది మనీష్ను కూడా సంతోషపరుస్తుంది.’ అని పేర్కొన్నారు. కాగా ఢిల్లీలోని ప్రభుత్వం అధికారుల బదిలీలు, పోస్టింగ్లపై నియంత్రణ కోసం తీసుకొచ్చిన చట్టం కారణంగా కేజ్రీవాల్ సర్కార్, కేంద్ర ప్రభుత్వం మధ్య కొంతకాలంగా ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ(అమెండ్మెంట్) బిల్లు–2023’ లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందింది. ఇక రాష్ట్రపతి సంతకంతో బిల్లు చట్టరూపం దాల్చనుంది. చదవండి:మాజీ ప్రధాని వాజ్పేయి వర్ధంతి.. రాష్ట్రపతి, ప్రధాని నివాళులు -
సీఎం ఇంటి రిపేర్ల కోసం రూ.45 కోట్లు! మరి మోదీ రూ.8,400 కోట్ల విమానం సంగతేంటి..?
న్యూఢిల్లీ: డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసాన్ని రూ.45కోట్లు వెచ్చించి రినోవేట్ చేయించారని బీజేపీ ఆరోపించింది. ఆయన 'విలాసవంతమైన రాజు' అని విమర్శలు గుప్పించింది. ప్రజా ధనాన్ని కేజ్రీవాల్ తన లగ్జరీ లైఫ్ కోసం వెచ్చిస్తున్నారని మండిపడింది. ఇదే విషయంపై ఆయన నివాసం ముందు బీజేపీ కార్యకర్తలు బుధవారం నిరసన కార్యక్రమాలు చేపట్టడం ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే బీజేపీ ఆరోపణలకు ఆప్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. సీఎం ఉంటున్న ఇళ్లు 80 ఏళ్ల నాటిదని, ఇప్పుటికే పైకప్పు మూడు సార్లు కూలిపోయిందని తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా ట్విట్టర్లో షేర్ చేసింది. ఇలాంటి ఇంట్లో సీఎం ఉంటారా? మరమ్మతులు చేయించవద్దా? అని ప్రశ్నించింది. ये दिल्ली के CM का सरकारी घर है। 3 बार छत टूट कर गिरा। तब जा कर उसे PWD ने बनाया। कौन CM ऐसे टूटे घर में रहता होगा? टूटने से पहले बनवा लिया होता। जोगी जी के बंगले की कीमत 300 करोड़ से ज्यादा है। आवाज तक किसी की आवाज नहीं निकली। बाकी चिल्लाने वाले मानसिक कोढ़ है। उनकी राजनीति, pic.twitter.com/oKEtNVk2qn — Naresh Balyan (@AAPNareshBalyan) April 26, 2023 అలాగే ప్రధాని నరేంద్ర మోదీ కోవిడ్ సమయంలో రూ.8,400 కోట్లు పెట్టి ప్రత్యేక విమానాన్ని కొనుగోలు చేసిన విషయాన్ని ఆప్ గుర్తు చేసింది. ఆయన ఇంటి మరమ్మతుల కోసం రూ.500 కోట్లు వెచ్చించిన విషయాన్ని ప్రస్తావించింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఇంటి రిపేర్ల కోసం రూ.15కోట్లు వెచ్చించారని, గుజరాత్ సీఎం విమానం ఖరీదు రూ.191 కోట్లు అని ఎదురుదాడికి దిగింది. ఆప్ నేత సంజయ్ సింగ్ ఈమేరకు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కమలం పార్టీపై తీవ్రస్థాయిలో విరచుకుపడ్డారు. ఆ పార్టీ ఎప్పుడూ ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రయత్నిస్తుందని ధ్వజమెత్తారు. చదవండి: తమిళనాట డీఎంకే ఫైల్స్ కలకలం.. ఆడియో క్లిప్ రిలీజ్ చేసిన అన్నామలై -
అందులో అన్నాహజరే కూడా ఉన్నారా సార్!
అందులో అన్నాహజరే కూడా ఉన్నారా సార్! -
ముగిసిన కేజ్రీవాల్ సీబీఐ విచారణ
►అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ సుమారు 9గంటల పాటు విచారించింది. ఆదివారం విచారణకు హాజరైన అరవింద్ కేజ్రీవాల్ను సుదీర్ఘంగా సీబీఐ అధికారులు విచారించారు. లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి సమాచారాన్ని సేకరించే క్రమంలో కేజ్రీవాల్పై సీబీఐ అధికారులు ప్రశ్నలు వర్షం కురిపించారు. సాక్షిగానే కేజ్రీవాల్ను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీఆర్పీసీ 161 సెక్షన్ కింద కేజ్రీవాల్ స్టేట్మెంట్ను సైతం రికార్డు చేశారు. సీసీ కెమెరా పర్యవేక్షణలో మౌఖిక, లిఖిత పూర్వక స్టేట్మెంట్ను సీబీఐ అధికారులు తీసుకున్నారు. ► ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై సీబీఐ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి దాదాపు గంటన్నరగా ఆయనను అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 1,000 మంది పోలీసులను మోహరించారు. ఆ ప్రాంతంవైపు ఎవరూ రాకుండా 144 సెక్షన్ విధించారు. సీబీఐ కార్యాలయం వద్దకు వెళ్లిన ఆప్ నేతలు రాఘవ్ చద్దా, సంజయ్ సింగ్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు నిరసనకు దిగారు. న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ ఎదుట విచారణకు హాజరయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆదివారం ఉదయం సీబీఐ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో కేజ్రీవాల్ పాత్రపై అధికారులు ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్ని గంటల పాటు ఈ విచారణ కొనసాగుతుంది? బీజేపీ నేతలు చెబుతున్నట్లు కేజ్రీవాల్ను అరెస్టు చేస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. విచారణకు హాజరయ్యేందుకు ముందు ఓ వీడియో కూడా విడుదల చేశారు కేజ్రీవాల్. సీబీఐకి పూర్తిగా సహకరిస్తానని, ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తానని స్పష్టం చేశారు. అయితే బీజేపీ తనను కావాలనే లక్ష్యంగా చేసుకుని సీబీఐతో సమన్లు పంపించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. తాము చెప్పినట్టు వినకపోతే అరెస్టు చేస్తామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం అయ్యాక అనేక మార్పులు తీసుకొచ్చానని, భారత్ను ప్రపంచంలో నంబర్ వన్ చేయడమే తన లక్ష్యమని చెప్పారు. అభివృద్ధిని చూసి కొన్ని శక్తులు ఓర్వలేకపోతున్నాయని ద్వజమెత్తారు. దేశం కోసమే పుట్టానని, దేశం కోసం ప్రాణాలు సైతం ఇస్తానన్నారు. మరోవైపు కేజ్రీవాల్కు మద్దతుగా ఆప్ కార్యకర్తలు ఢిల్లీలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. -
'కేజ్రీవాల్ అవినీతి పరుడైతే.. ప్రపంచంలో ఒక్క నిజాయితీపరుడు ఉండడు'
న్యూఢిల్లీ: డిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి సీబీఐ కార్యాలయంలో ఆదివారం విచారణకు హాజరయ్యే ముందు వీడియో రిలీజ్ చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. సీబీఐ అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తానని స్పష్టం చేశారు. తనను అరెస్టు చేస్తామంటూ బీజేపీ ప్రచారం చేస్తోందని, ఆ పార్టీ అధికార అహంకారంతో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. 'మా మాట వినాలి లేదంటే జైల్లో పెడతాం అనే విధంగా బీజేపీ వ్యవహరిస్తోంది. దేశాన్ని ప్రేమిస్తా దేశం కోసం ప్రాణాన్ని సైతం ఇస్తా. రాజకీయాల్లోకి ఎన్నో ప్రశ్నల మధ్య పదేళ్ళ క్రితం అడుగులు వేశా. ఎన్నో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశా. జైల్లో పెడతామని చెప్పి పదేపదే బెదిరిస్తున్నారు. ఎనిమిదేళ్లలో ఢిల్లీని అభివృద్ధి చేసి చూపెట్టా. 30 ఏళ్లలో గుజరాత్లో ఏం అభివృద్ధి చేశారు. నా జీవిత లక్ష్యం భారత్ను ప్రపంచంలో నెంబర్ వన్ చేయడం. నేను షుగర్ వ్యాధిగ్రస్తుణ్ణి. ప్రతిరోజు 50 యూనిట్ల కంటే ఎక్కువ ఇన్సులిన్ తీసుకుంటున్నా. అయినా అవినీతికి వ్యతిరేకంగా ఒకసారి పది రోజులు ఇంకోసారి 15 రోజులు నిరాహార దీక్ష చేశా. సీబీఐ 100 సార్లు పిలిచినా వెళ్లి సమాధానం చెప్తా. దేశం కోసం పుట్టాను దేశం కోసం చస్తాను.' అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అలాగే ఆదాయపు పన్ను శాఖలో ఒకప్పుడు కమిషనర్గా పనిచేసిన విషయాన్ని కేజ్రీవాల్ గుర్తు చేశారు. బీజేపీ తాను అవినీతిపరుడ్ని అని ప్రచారం చేస్తోందని, అలాంటి వాడినైతే అప్పుడే రూ.కోట్లు సంపాదించేవాడినని పేర్కొన్నారు. ఒకవేళ అరవింద్ కేజ్రీవాలే అవినీతి పరుడైతే.. ప్రపంచంలో ఒక్కరు కూడా నిజాయితీ పరుడు ఉండడని అన్నారు. చదవండి: రూ.1,000 కోట్లు ఇచ్చానని చెబితే మోదీని అరెస్టు చేస్తారా?: కేజ్రీవాల్ -
'సమాజం ఎటుపోతుందో అర్థంకావట్లేదు.. ఆ కిరాతకులను ఉరి తీయాలి'
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 20 ఏళ్ల యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ విషయంపై స్పందించారు. ఇది అత్యంత కిరాతకమైన చర్య అని వ్యాఖ్యానించారు. నిందితులను ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దారుణాలు చూసినప్పుడు సమాజం ఎటుపోతుందో అర్థంకావడం లేదని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. యువతికి ఇలా జరగడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. తాగిన మత్తులో యువతిని కారుతో ఢీకొట్టి మృతదేహాన్ని కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఈ ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కేజ్రీవాల్ గుర్తు చేశారు. వారి వారి ఇళ్ల నుంచే అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. యువతి మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతోందన్నారు. ఆదివారం తెల్లవారుజామున స్కూటీపై వెళ్తున్న యువతిని తప్పతాగి కారులో వెళ్తున్న యువకులు ఢీకొట్టారు. ఆమె కారు చక్రాల మధ్య ఇరుక్కున్న విషయాన్ని గుర్తించకుండా.. వాహనాన్ని కిలోమీటర్ల మేర తిప్పారు. ఈ కిరాతక ఘటనలో యువతి దస్తులు చిరిగిపోయాయి. ఆమె మృతదేహం రోడ్డుపై నగ్నంగా లభ్యమవ్వడం ఢిల్లీలో కలకలం రేపింది. అనంతరం పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు. చదవండి: ఢిల్లీలో ఘోరం: నడిరోడ్డుపై నగ్నంగా యువతి మృతదేహం -
సీఎంను డిన్నర్కు ఆహ్వానించిన ఆటోవాలా
అహ్మదాబాద్: ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో ప్రచారాన్ని ముమ్మరం చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇందులో భాగంగా ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అహ్మదాబాద్లో ఆటో డ్రైవర్లతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో ఆప్ విజయం కోసం ఆటోవాలాలు తమవంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో లాగా గుజరాత్లోనూ ఆప్ కోసం ప్రచారం నిర్వహించి తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. అయితే ఈ సమావేశంలో ఓ ఆటోడ్రైవర్ కేజ్రీవాల్ను తన ఇంటికి డిన్నర్కు రావాలని ఆహ్వానించాడు. పంజాబ్లో ఓ ఆటోవాలా ఇంటికి వెళ్లి కేజ్రీవాల్ భోజనం చేసిన వీడియో తాను చూశానని, ఇప్పుడు తన ఇంటికి కూడా డిన్నర్కు వస్తారా? అని అతను అడిగాడు. దీనికి స్పందించిన ఢిల్లీ సీఎం.. వెంటనే తాను డిన్నర్కు వస్తానని చెప్పారు. దీంతో అక్కడున్నవారంతా చప్పట్లుకొట్టారు. అయితే తనను తీసుకెళ్లేందుకు హోటల్కు రావాలని ఆటోడ్రైవర్కు కేజ్రీవాల్ సూచించారు. తనతో పాటు మరో ఇద్దరు ఆప్ నేతలు కూడా వస్తారని పేర్కొన్నారు. అంతేకాదు ఏ సమయానికి డిన్నర్కు రావాలని కూడా ఆటో డ్రైవర్ను అడిగారు. ఆ తర్వాత రాత్రి 8గంటలకు టైంను ఫిక్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోనూ ఆప్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. Delhi CM @ArvindKejriwal accepts a Dinner Invitation from an Autorickshaw Driver of Gujarat ❤️#TownhallWithKejriwal pic.twitter.com/0lf5kS5rkn — AAP (@AamAadmiParty) September 12, 2022 చదవండి: కాంగ్రెస్ షేర్ చేసిన ఆర్ఎస్ఎస్ నిక్కర్ ఫోటోపై తీవ్ర దుమారం -
సావర్కర్ కాదు భగత్ సింగ్ వారసులం.. అరెస్టులకు భయపడం: కేజ్రీవాల్
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రంపై విమర్శలతో విరుచుకుపడ్డారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై తప్పుడు కేసు బనాయించాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము బ్రిటిషర్లకు భయపడకుండా ఉరికంభం ఎక్కిన భగత్ సింగ్ వారసులమని, బ్రిటిషర్లకు క్షమాణలు చెప్పిన సావర్కర్ వారసులం కాదని వ్యాఖ్యానించారు. జైలు అంటే ఆప్ నేతలకు భయం లేదని, బీజేపీనే భయపడుతుందని ధ్వజమెత్తారు. 2021-22లో ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ తీసుకొచ్చింది. అయితే దీనిలో నిబంధనలు అతిక్రమించారని, దీని వల్ల లిక్కర్ మాఫియాకు రూ.144 కోట్ల ప్రయోజనం చేకూరిందని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. ఆ కాసేపటికే కేంద్రంపై కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఫైనాన్షియల్ క్విడ్ ప్రోకో జరిగిందని, ఎక్సైజ్ శాఖ ఇంఛార్జ్గా ఉన్న సిసోడియానే దీన్ని అమలు చేశారని చీఫ్ సెక్రెటరీ నివేదిక తెలిపింది. దీన్ని లెఫ్టినెంట్ గవర్నర్తో పాటు సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కూడా పంపారు. అయితే ఇదంతా ఫేక్ అని కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కేజ్రీవాల్ అంటున్నారు. 'ఈరోజుల్లో కొత్త రూల్ వచ్చింది. ఎవర్ని జైలుకు పంపాలో ముందు కేంద్రం నిర్ణయిస్తుంది. ఆ తర్వాత వారిపై కేసు నమోదవుతుంది. సిసోడియాపై చేస్తున్న ఆరోపణలను పరిశీలించాను. అందులో ఒక్కటి కూడా నిజం లేదు. అది ఫేక్ కేసు' అని మీడియా సమావేశంలో కేజ్రీవాల్ అన్నారు. సిసోడియా తనకు 22 ఏళ్లుగా తెలుసునని, ఆయన ఎంతో నిజాయితీ పరుడని పేర్కొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వేవ్ను చూసి బీజేపీ భయపడుతోందని, అందుకే తమపై తప్పుడు ఆరోపణలు చేసి జైలుకు పంపాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ఢిల్లీలో జరుగుతున్న అభివృద్ధిని ఆపాలని బీజేపీ కుట్ర చేస్తోందని, కానీ అది వాళ్లకు సాధ్యం కాదన్నారు. ఢిల్లీ విద్యావ్యవస్థలో సిసోడియా సమూల మార్పులు తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పారు. చదవండి: 94 యూట్యూబ్ చానళ్లపై నిషేధం -
పద్మ అవార్డులకు వైద్యుల పేర్లు
న్యూఢిల్లీ: ఈ ఏడాది పద్మ అవార్డుల కోసం ఢిల్లీ ప్రభుత్వం ముగ్గురు వైద్యుల పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం వెల్లడించారు. డాక్టర్లు ఎస్కే సరిన్, సురేశ్ కుమార్, సందీప్ బుధిరాజలు ఇందులో ఉన్నారని చెప్పారు. కోవిడ్ 19 పోరాటంలో భాగంగా వీరు చేసిన సేవలను గుర్తుంచుకొని పేర్లను సిఫారసు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది కేవలం వైద్యుల పేర్లను మాత్రమే పంపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మొత్తం 9,427 మంది ప్రజలు కలసి 740 మంది పేర్లను సూచించారన్నారు. ఇందులో డాక్టర్లు, పారమెడిక్స్, ఇతర ఆరోగ్య రంగ నిపుణులు ఉన్నారన్నారు. ఇందులో ముగ్గురి పేర్లను డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా నేతృత్వంలోని కమిటీ ఖరారు చేసిందన్నారు. వారిలో ఐఎల్బీఎస్ వైస్ చాన్సలర్ డాక్టర్ ఎస్.కె సరిన్, ఎల్ఎన్జేపీ హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేశ్ కుమార్, గ్రూప్ మెడికల్ డైరెక్టర్ ఆఫ్ మ్యాక్స్ హెల్త్ కేర్ గ్రూప్ డాక్టర్ సందీప్ బుధిరాజలు ఉన్నారని తెలిపారు. -
ఇలా చేస్తే వ్యాక్సిన్ కొరత అస్సలు ఉండదు: ఢిల్లీ సీఎం
న్యూఢిల్లీ: వాక్సిన్ కొరతను అధిగమించేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక సూచనలు చేశారు. దేశంలో రెండు కంపెనీలు మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేస్తున్నాయని. ఇదే తరహాలో అయితే, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి రెండేళ్లు పడుతుందని అన్నారు. రెండు కంపెనీలతో దేశమంతా వ్యాక్సిన్ ఇవ్వడం అసంభవమని పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ.. వ్యాక్సిన్ ఫార్ములాను కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తయారుచేసే ఇతర కంపెనీలకు ఫార్ములాను అందజేయాలని కోరారు. అప్పుడే భారతీయులందరికీ వ్యాక్సిన్లు లభిస్తాయని అన్నారు. వ్యాక్సిన్ తయారీని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉందని సీఎం అరవింద్ కేజ్రీవాల్అన్నారు. అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు నేషనల్ ప్లాన్ రూపొందించాలని కేంద్రానికి సూచించారు. కేవలం రెండు కంపెనీలపైనే వ్యాక్సిన్ తయారీకి ఆధారపడకుండా, ఈ రెండు కంపెనీల నుంచి కేంద్రం ఫార్ములా సేకరించి అన్ని కంపెనీలకూ వ్యాక్సిన్ తయారుచేసే అవకాశం ఇవ్వాలని ఆయన కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలు తమ లాభాల్లో కొంత భాగాన్ని ఒరిజినల్ వ్యాక్సిన్ తయారీదారులకు రాయల్టీగా చెల్లించాలన్నారు. చదవండి: సెకండ్ వేవ్ గుణపాఠం: ముందే మేల్కొన్న ముఖ్యమంత్రి.. ఇండియన్ కోవిడ్ స్ట్రెయిన్ ఆందోళనకరం: డబ్ల్యూహెచ్ఓ -
‘మహమ్మారిని నియంత్రించాం’
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులో ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. జూన్ నెలాఖరు నాటికి ఢిల్లీలో 60,000 యాక్టివ్ కేసులు ఉంటాయని అంచనా వేయగా ఇప్పుడవి 26,000గా నమోదయ్యాయని చెప్పారు. గత వారం ప్రతిరోజూ 4000 కేసులు వెలుగుచూడగా ఇప్పుడు తాజా కేసులు 2500కు పడిపోయాయని గుర్తుచేశారు. ఇక గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 2,1999 కోవిడ్-19 కేసులు నమోదవగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 87,360కి చేరింది. ఢిల్లీలో కరోనా మహమ్మారి బారినపడి ఇప్పటివరకూ 2742 మంది మరణించారు. గత వారం రోజులుగా రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని ఇది వైరస్ బలహీనపడుతోందనేందుకు సంకేతమని చెప్పారు. ఢిల్లీలో ముమ్మరంగా చేపడుతున్న టెస్టింగ్లో కూడా ఈ ధోరణి కనిపించిందని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఢిల్లీలో కరోనా రోగుల రికవరీ రేటు 60 నుంచి 66 శాతానికి పెరిగిందని వెల్లడించారు. మరణాల రేటు మూడు శాతంగా ఉందని చెప్పారు. చదవండి : కరోనా కట్టడికి 5 ఆయుధాలు: సీఎం -
లాక్డౌన్: కేజ్రీవాల్ వినూత్న నిర్ణయం
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ గడువు ఈ నెల 17తో ముగియనున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ గడువు పొడిగించాలా, వద్దా అనే దానిపై నిర్ణయాన్ని ప్రజలకే వదిలిపెట్టాలని ఆయన భావించారు. మే 17 తర్వాత లాక్డౌన్ కొనసాగించాలా, అవసరం లేదా అనే దానిపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 1031 నంబర్, వాట్సప్ నంబరు 8800007722 లేదా delhicm.suggestions@gmail.com సలహాలు, సూచనలు పంపాలని ప్రజలను కోరారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ప్రజలు తమ అభిప్రాయాలను తెలపవచ్చని ప్రకటించారు. కాగా, లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన నిర్మాణ రంగ కార్మికులకు రూ. 5 వేలు చొప్పున ఆర్థిక సాయం చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ను మరోసారి పొడిగించాలని ప్రధాని మోదీకి పలువురు ముఖ్యమంత్రులు సూచించారు. కరోనా నియంత్రణ, లాక్డౌన్ నిర్వహణ, ఆర్థిక రంగ ఉద్దీపన సహా పలు అంశాలపై సోమవారం రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లాక్డౌన్కు సంబంధించి తమ సమగ్ర వ్యూహాలను మే 15 లోగా పంపించాలని ముఖ్యమంత్రులను ఈ సందర్భంగా ప్రధాని కోరారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ పొడిగింపుపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. కాగా, ఈరోజు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. (రీస్టార్ట్కి రెడీ అవుదాం) -
కేజ్రీవాల్పై బీజేపీ పోస్టర్ వార్
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్పై బీజేపీ పోస్టర్ వార్కు తెరలేపింది. కేజ్రీవాల్ దేశ ద్రోహులకు మద్దతిస్తారని ఆరోపిస్తూ ఆయనకు వ్యతిరేకంగా ఢిల్లీలో పలుచోట్ల బీజేపీ నేత కపిల్ మిశ్రా ఆధ్వర్యంలో పోస్టర్లు వెలిశాయి. దేశ వ్యతిరేక నినాదాలు చేసే వారిని కేజ్రీవాల్ కాపాడతారంటూ రాసిఉన్న పోస్టర్లను నగరంలోని మండీ హౌస్, కన్నాట్ ప్లేస్, అశోకా రోడ్, ఐటీఓ సహా పలు కూడలి ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. కాగా, జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య కుమార్ జాతి వ్యతిరేక నినాదాలు చేసినట్టు నిరూపితం కాలేదని ఢిల్లీ ప్రభుత్వం హోం శాఖ పేర్కొన్న నేపథ్యంలో ఈ పోస్టర్లు ఏర్పాటుకావడం గమనార్హం. ఆప్ రెబెల్ నేతగా పేరొందిన కపిల్ మిశ్రా ఇటీవల ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మిశ్రా బీజేపీ తరపున ప్రచారం చేశారు. -
మళ్లీ వరాలు కురిపించిన సీఎం
సాక్షి, న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ రాజధాని ప్రజలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి వరాలు కురిపించారు. నీటి బిల్లుల బకాయిలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్టు మంగళవారం ఆయన మీడియా సమావేశంలో ప్రకటించారు. ఢిల్లీ నీటి మండలి రికార్డులను ప్రక్షాళన చేస్తూ నీటి బిల్లుల బకాయిలను రద్దు చేసే పథకాన్ని తాము ప్రకటిస్తున్నామని పేర్కొన్నారు. నీటి బకాయిల్లో వినియోగదారులు చెల్లించాల్సిన బిల్లు బకాయిలతో పాటు బిల్లింగ్లో దొర్లిన పొరపాట్లు కూడా ఉన్నాయని సీఎం వెల్లడించారు. ఢిల్లీలో అన్ని వర్గాల ప్రజలు ముందుకొచ్చి నీటి మీటర్లను బిగించుకుని ప్రధాన స్రవంతిలో కలవాలని, నవంబర్ 30లోగా మీటర్లు బిగించుకున్నవారికే తాము ఈ పథకాన్ని వర్తింపచేస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కాగా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగానికి ఎలాంటి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని ఇటీవల కేజ్రీవాల్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
హస్తిన హ్యాట్రిక్ విజేత
ఢిల్లీ పీఠాన్ని వరసగా మూడు సార్లు దక్కించుకున్న విజేత ఆమె. పదిహేనేళ్లపాటు ఢిల్లీని పరిపాలించి ఢిల్లీ రూపురేఖలను మార్చి నగరం స్థాయిని పెంచిన నాయకురాలు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల్ని భాగస్వామ్యుల్ని చేసే భాగిదాని వ్యవస్థను ప్రవేశపెట్టి మంచి పరిపాలనా దక్షురాలిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.పెద్ద భవంతులు, ఫ్లై ఓవర్లు, ఢిల్లీ మెట్రో ఆమె హయాంలోనే వచ్చాయి. 81 ఏళ్ల వయసులోనూ అదే ఉత్సాహం వయసుతో రాజకీయాలకు పని లేదని నిరూపిస్తూ ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ పడుతూ కాంగ్రెస్ ప్రచారాన్ని ముందుండి నడిపించారు. బీజేపీ అభ్యర్థి మనోజ్ తివారీ చేతిలో ఓటమి పాలైనప్పటికీ 81 ఏళ్ల వయసులో ఆమెలో ఉన్న ఉరిమే ఉత్సాహం కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపింది. పంజాబ్లోని కపుర్తలాలో 1938, మార్చి 31వ తేదీన జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీలో డాక్టరేట్ సాధించారు. ఆమె భర్త దివంగత వినోద్ దీక్షిత్ ఐఏఎస్ అధికారి. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు సందీప్ దీక్షిత్ కాంగ్రెస్ సభ్యుడే. కుమార్తె లతికా సయ్యద్. ఆసక్తికరం...షీలా ప్రేమాయణం! ఢిల్లీ విశ్వద్యాలయంలో చరిత్ర చదివే సమయంలో ïషీలా కపూర్కు వినోద్ దీక్షిత్తో పరిచయమైంది. వినోద్ దీక్షిత్ కాంగ్రెస్ నేత ఉమా శంకర్ కొడుకు. వినోద్ చురుకైన వాడు, మంచి క్రికెటర్ అని ïషీలా తన ఆత్మకథలో రాశారు. ఇద్దరు మిత్రుల మధ్య ప్రేమ వ్యవహారంలో ఏర్పడిన వివాదంలో మధ్యవర్తిత్వం వహించిన షీలా, వినోద్ ఆతర్వాత దగ్గరయ్యారు. అయితే, తాను బ్రాహ్మణ కులస్తురాలు కాకపోవడంతో వినోద్ తల్లిదండ్రులు పెళ్లికి గట్టిగా అభ్యంతరం చెప్పారని పంజాబీ ఖత్రీ అయిన షీలా తెలిపారు. ఆతర్వాత వినోద్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా స్థాయిలో 9వ ర్యాంకు సాధించడంతో తమ పెళ్లికి అడ్డుచెప్పలేదని షీలా పేర్కొన్నారు. అనూహ్యంగా రాజకీయ ప్రవేశం షీలా మామ ఉమా శంకర్ స్వాతంత్య్ర పోరాటయోధుడు. తర్వాత ఆయన ఇందిర కేబినెట్లో మంత్రి అయ్యారు. ఆయన రాజకీయాల్లో ఎదగడానికి షీలా తెరవెనుక సహకారం అందించారు. ఇందిరాగాంధీని తరచూ కలిసేవారు. షీలాలోని పాలనా నైపుణ్యాన్ని గుర్తించిన ఇందిర ఆమెను ఐక్యరాజ్యసమితిలో మహిళా అంశంపై జరిగే సదస్సుకు భారత్ తరఫున ప్రతినిధిగా పంపారు. అదే షీలా రాజకీయ జీవితానికి పునాది వేసింది. 1984–89 సంవత్సరాల మధ్య ఐక్యరాజ్య సమితిలో భారత్ రాయబారిగా సేవలు అందించారు. రాజీవ్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. 1998 నుంచి వరసగా మూడు ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికై తిరుగులేని నేతగా ఎదిగారు. 2014లో కేరళ గవర్నర్గా అయిదు నెలలు కొనసాగారు. వివాదాలు, పురస్కారాలు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బెస్ట్ చీఫ్ మినిస్టర్ అవార్డు, 2009లో బెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ది ఇయర్గా ఎన్డీటీవీ పురస్కారం, అసోచామ్ సంస్థ నుంచి ఢిల్లీ వుమెన్ ఆఫ్ ది డికేడ్ అచీవర్స్ అవార్డు వంటివి అందుకున్నారు. రూ.3.5 కోట్ల కేంద్ర నిధుల్ని ఆమె తన సొంత రాజకీయ ప్రకటనల కోసం ఖర్చు చేశారని బీజేపీ కోర్టుకెక్కింది. 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడల్లో వీధి దీపాల సామగ్రి కొనుగోలులో అవకతవకలు జరిగాయని కాగ్ వేలెత్తి చూపించింది. -
ఢిల్లీ ముఖ్యమంత్రి కాన్వాయ్పై కర్రలతో దాడి
-
కేజ్రీవాల్ కాన్వాయ్పై కర్రలతో దాడి
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కాన్వాయ్పై శుక్రవారం మధ్యాహ్నం కొందరు దుండగులు కర్రలు చేబూని దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారి ఒకరు వెల్లడించారు. ఉత్తర ఢిల్లీలో 25 అనధికార కాలనీల్లో అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు సీఎం వెళుతుండగా నరేలా ప్రాంతంలో దాడి జరిగినట్టు సమాచారం. కేజ్రీవాల్ కారును ఆపేందుకు దాదాపు వంద మంది కర్రలతో ఆయన కారుపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. సీఎం కారు అద్దాలు పగులగొట్టేందుకూ వీరు ప్రయత్నించారు. కాగా గతంలోనూ కేజ్రీవాల్పై దుండగులు దాడికి యత్నించారు. గత ఏడాది నవంబర్లో ఢిల్లీ సెక్రటేరియట్లో సీఎం కార్యాలయం వెలుపల ఓ వ్యక్తి కేజ్రీవాల్పై కారం చల్లారు. 2014 లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా దక్షిణ ఢిల్లీలో జరిగిన రోడ్షోలో ఓ వ్యక్తి కేజ్రీవాల్ చెంప చెళ్లుమనిపించారు. అంతకుముందు హర్యానాలో ఓ రోడ్షోలోనూ కేజ్రీవాల్పై దాడిచేసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించడం కలకలం రేపింది. -
ఏపీ సీఎం చంద్రబాబుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ క్లాస్
-
రాజ్యసభకు కేజ్రీవాల్?!
సాక్షి, న్యూఢిల్లీ : అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి రాజ్యసభ సభ్యుల ఎంపిక పెను సవాలును విసురుతోంది. అసెంబ్లీలో ఆ పార్టీకి ఉన్న సంఖ్యాబలంతో ముగ్గురిని పెద్దల సభకు పంపవచ్చు. ఇప్పటివరకూ రెండు స్థానాలకుగాను పార్టీ నేతలైన ఆశుతోష్, సంజయ్ సింగ్ల పేర్లును ఆ పార్టీ పరిశీలిస్తోంది. దాదాపు వీరి పేర్లే ఖరారు అయ్యే అవకాశం ఉంది. ఇక మూడో అభ్యర్థి విషయంలోనే పేచీ ఉంది. ఈ సీటును ఒక ప్రొఫెసర్ను పంపాలని మొదట నుంచి కేజ్రీవాల్ ఆలోచిస్తున్నారు. అయితే అది వాస్తవరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తానే మూడో అభ్యర్థిగా పోటీ చేయాలనే భావనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలావుండగా.. రాజ్యసభకు నామినేషన్ల గడువు శనివారంతో మొదలై, జనవరి 5తో ముగుస్తుంది. జనవరి 16న ఎన్నికలు జరుగుతాయి. ఆప్ను వెంటాడుతున్న తిరస్కరణలు మూడో అభ్యర్థి విషయంలో ఆప్ అధినేత కొంతకాలంగా డైలమాలో ఉన్నారు. మూడో అభ్యర్తిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్ను నిలబెట్టేందుకు ఆప్ ఆసక్తి చూపింది. ఈ విషయంపై ఠాకూర్తో కేజ్రీవాల్ ప్రత్యేకంగా సమావేశమ్యారు. ఈ సమావేశంలోనే ఆప్ సూచనను ఆయన సున్నితంగా తిరస్కరించారు. మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ శౌరి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఆర్ నారాయణ మూర్తి, నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థిలను కూడా ఆప్ సంప్రదించింది. అయితే వారంతా రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని సున్నింతగా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఇక మూడో అభ్యర్థిగా తానే పోటీ చేయాలని అరవింద్ కేజ్రీవాల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కుమార్ విశ్వాస్కు నో ఛాన్స్ ఆప్ సీనియర్ నేత కుమార్ విశ్వాస్ను మాత్రం రాజ్యసభ అభ్యర్థిగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపిక చేయపోవచ్చని ఆప్ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్తో ఆ మధ్య పలు సందర్భాల్లో కుమార్ విశ్వాస్ విభేదించడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. -
ముఖ్యమంత్రుల మాటల యుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీని ఆవరించిన పొగమంచు, వాతావరణ కాలుష్యం ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధానికి కారణంగా నిలిచింది. ఢిల్లీ వాతావరణ కాలుష్యంపై సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్తో చర్చించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విటర్ వేదికగా కేజ్రీవాల్, అమరేందర్ సింగ్ పరస్పరం వాగ్బాణాలు సంధించుకున్నారు. పంజాబ్లో పంటలను తగలబెట్టడం వల్ల ఢిల్లీలో వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది, దాన్ని తక్షణం నిలుపుచేయండి.. అంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అమరేందర్ సింగ్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఢిల్లీ పరిస్థితులకు ఒకరకంగా మీరే కారణం అంటూ కేజ్రీవాల్ మాటల దాడి చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆవేదనను నేను అర్థం చేసుకోగలను.. కానీ పరిస్థితులు నా చేతులు దాటి వెళ్లిపోయాయి. కాలుష్య నివారణకు జాతీయ స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిందే.. అంటూ పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ ట్వీట్ ద్వారానే సమాధానం చెప్పారు. My office continuously trying to take time from CMs of Punjab n Haryana for me to meet the two CMs. Its an emergency — Arvind Kejriwal (@ArvindKejriwal) 8 November 2017 Share your concern over stubble burning and pollution @ArvindKejriwal, Centre alone can solve the problem given its national implications. — Capt.Amarinder Singh (@capt_amarinder) 8 November 2017 I agree sir that Centre shud take lead. But pl grant me time to discuss if together we can present a plan to centre. Del is choking sir https://t.co/qMQJX6Y4It — Arvind Kejriwal (@ArvindKejriwal) 8 November 2017 Situation is serious but Punjab helpless as problem is widespread & state has no money to compensate farmers for stubble management (1/2). — Capt.Amarinder Singh (@capt_amarinder) 8 November 2017 -
అందరివాడవుతున్న ‘అరవిందుడు’
►సీఎం కేజ్రీవాల్ వైఖరిలో స్పష్టమైన మార్పు ►రాజకీయ విమర్శల జోలికి వెళ్లని వైనం ►ఢిల్లీ అప్డేట్స్కే పరిమితమైన కేజ్రీవాల్ ట్వీటర్ అకౌంట్ ►సీఎం వైఖరిలో మార్పుపై ఆప్లో విస్తృత చర్చ న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరచుగా ట్విటర్లో ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేస్తుండేవారు. ఇతర ప్రత్యర్థులపైనా సందర్భానుసారం విరుచుకుపడుతుండేవారు. కానీ, రెండు నెలలుగా ఆయన ట్వీటర్ అకౌంట్ మూగవోయింది. అందులో ఢిల్లీ అప్డేట్స్ తప్ప అందులో మరేమీ ఉండడం లేదు. ఇంతకీ కేజ్రీవాల్ ఏం చేస్తున్నారు? దేశవ్యాప్తంగా ‘మార్పు’ తీసుకొస్తానన్న ఆయన ఆ దిశగానే పయనిస్తున్నారా!? లేక తానే మారుతున్నారా!? రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఎటు? అధికార, ప్రతిపక్షాలు ఏవైనా ఆయనను సంప్రదించాయా!? ఇటీవలి కాలంలో వెల్లువెత్తుతున్న ప్రశ్నలివి. పంజాబ్ ఎన్నికల తర్వాత కేజ్రీవాల్ రాజకీయ విమర్శలు, కార్యకలాపాలు ఏమీ లేవు. కనీసం కేజ్రీవాల్ మీడియాతో కూడా ఎక్కడా మాట్లాడటం లేదు. ఇప్పుడు ఢిల్లీ కాలనీల్లో తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతున్నారు. ఆయన పూర్తిగా ఢిల్లీ పాలనకే పరిమితమయ్యారని, ప్రజలతో వచ్చిన గ్యాప్ను పూరిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు చిన్న చిన్న పార్టీలను కూడా సంప్రదిస్తున్నాయి. కానీ, ఆయా నేతలు కేజ్రీవాల్ను మాత్రం సంప్రదించలేదని అంటున్నారు. ఈ దశలో రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ బలపరిచిన రామ్నాథ్ కోవింద్కు మద్దతు ఇచ్చేది లేదని, కచ్చితంగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మీరాకుమార్కు మద్దతు ఇచ్చే అంశాన్ని పార్టీ అధిస్టానం ఆలోచన చేస్తున్నట్లు ఆప్ కీలక నేత ఒకరు వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఎమ్సీడీ ఎన్నికల ఫలితానంతరం కేజ్రీవాల్ మీడియాతో కూడా మాట్లాడటం తగ్గించేశారు. ఇటీవల జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇక నుంచి తాను ఢిల్లీ పాలనపైనే దృష్టి పెడతానని, రాజకీయ విమర్శలు చేయబోనని, తన పనితనాన్ని కేవలం చేతలతోనే చూపిస్తానంటూ వ్యాఖ్యానించారు. ఆయన చెప్పినట్లుగానే అప్పటనుంచి ప్రధాని మోదీపై ఆయన విమర్శలు తగ్గించి కేవలం ఢిల్లీ పాలనపైనే దృష్టి సారించడం గమనార్హం. ఢిల్లీలో ప్రతీ గల్లీలోని ఆయన పర్యటిస్తూ ప్రజలతో ఎక్కడిక్కకడ మమేకం అవుతున్నారు. దీన్ని ఢిల్లీ ప్రజలు గమనిస్తున్నారని..ఎన్నికల్లో భిన్నమైన తీర్పునిచ్చే ఢిల్లీ ఓటర్ల మద్దతు ఆప్వైపే ఉంటుందని సదరు నేత తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సీఎం కేజ్రీవాల్ వ్యవహారశైలిలో మార్పుపై ఆప్లో విస్తృతమైన చర్చ నడుస్తోంది. -
‘ఒకసారి అంతా మా ఇంటికి రండి’
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ నేతలందరికీ సమన్లు జారీచేశారు. తన ఇంటికి రమ్మని అందరినీ చాలా గట్టిగా ఆదేశించారు. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ దెబ్బతినడంతోపాటు పార్టీ వ్యవహారంతో పార్టీకి ఉన్న పాపులారిటీ ప్రతి రోజు కొద్దికొద్దిగా పడిపోతున్న నేపథ్యంలో ఆత్మరక్షణలో పడ్డ కేజ్రీవాల్ పార్టీ నేతలందరినీ ఒకసారి ఇంటికి రావాలని ఆదేశించారు. ఆదివారం జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ఆప్ రెండో స్థానానికి పడిపోయిన విషయం తెలిసిందే. అంతకుముందు భారీ మొత్తంలో విజయం కట్టబెట్టిన ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్కు ఇలాంటి తీర్పునివ్వడం పార్టీ మనుగడకే దాదాపు ప్రశ్నార్థక పరిస్ధితి. ఆప్ నీటిమీద గాలిబుడగేనా అంటూ రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోపక్క, ఆప్లో రాజీనామాల పరంపర మొదలైంది. ఇటీవలె దిలీప్ పాండే ఢిల్లీ ఇంచార్జీ బాధ్యతల నుంచి తప్పుకోవడం, పంజాబ్లో పార్టీ బాధ్యతల నుంచి సంజయ్ సింగ్ ఇంకొంతమంది తప్పుకోవడం వంటి పరిణామాలు పార్టీలో భిన్నస్వరాలు వినిపించడంతోపాటు ధిక్కారాలు కూడా బహిరంగం అవుతుండటంతో మరోసారి కేజ్రీవాల్ పెద్ద మొత్తంలో పార్టీ నేతలను కలిసి ప్రస్తుత పరిస్థితులపై చర్చించనున్నారు. -
కేజ్రీవాల్కు రేపు నలుగురితో ముప్పు!
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కొందరు టార్గెట్ చేసినట్లు తెలిసింది. ఈ మేరకు ఓ ఈ మెయిల్ కేజ్రీవాల్ కార్యాలయానికి పంపించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల అధికారి ఒకరు చెప్పారు. కనీసం నలుగురు వ్యక్తులు అతడిని లక్ష్యంగా చేసుకొని దాడి చేసే అవకాశం ఉందని కేజ్రీవాల్కు చెప్పినట్లు తెలిపారు. చదవండి.. (రిపబ్లిక్ డేకు ఢిల్లీ అంతటా గప్చుప్) లష్కరే తోయిబాలాంటి ఉగ్రవాద సంస్థలు హెలికాప్టర్ చార్టర్లాంటి సర్వీసులు, చార్టర్ విమానాలతో గణతంత్ర దినోత్సవం రోజున దాడి చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో దాదాపు 50 వేల బలగాల్ని మోహరించిన విషయం తెలిసిందే.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- Rahul Gandhi: మోదీ నాతో చర్చకు రారు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- Lok Sabha elections 2024: ఐదో దశకు ముగిసిన ప్రచారం
- బిభవ్ కుమార్ అరెస్ట్
- డిగ్రీకి డిగ్నిటీ...పీజీకి ఫుల్ పవర్
- Delhi Chief Minister Arvind Kejriwal: బీజేపీ ఆఫీస్కొస్తాం
- కదులుతున్న బస్సులో మంటలు.. 9 మంది సజీవ దహనం
Advertisement