-
కేఎల్ రాహుల్ను ఇంటికి పిలిచిన గోయెంక: అతియా శెట్టి పోస్ట్ వైరల్
లక్నో సూపర్ జెయింట్స్ యజమాని, బడా వ్యాపారవేత్త సంజీవ్ గోయెంక నష్ట నివారణ చర్యలు చేపట్టారు. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ను తన ఇంటికి ఆహ్వానించి.. తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రాహుల్ను ఆయన ఆత్మీయంగా హత్తుకున్న ఫొటో నెట్టింట వైరల్గా మారింది.ఐపీఎల్-2022లో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అడుగుపెట్టిన లక్నో ఫ్రాంఛైజీ తమ సారథిగా టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ను నియమించింది. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కెప్టెన్సీలో లక్నో అరంగేట్రంలోనే ప్లే ఆఫ్స్ చేరింది. గతేడాది సైతం టాప్-4తో ముగించింది.ఈ క్రమంలో పదిహేడో ఎడిషన్లోనూ సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. అయితే, ప్లే ఆఫ్స్ రేసులో ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలంటే సన్రైజర్స్ హైదరాబాద్తో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో లక్నో ఓడిపోయింది.అందరూ చూస్తుండగానే చీవాట్లుఈ మ్యాచ్లో ప్యాట్ కమిన్స్ టీమ్ కేఎల్ రాహుల్ సేనను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించి.. బ్యాటింగ్ విధ్వంసంతో పలు రికార్డులు ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంక కెప్టెన్ రాహుల్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.మైదానంలో అందరూ చూస్తుండగానే చీవాట్లు పెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో సంజీవ్ గోయెంక తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. కెప్టెన్ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్ వంటి వాళ్లు గోయెంక వ్యవహారశైలిని తప్పుబట్టారు.డిన్నర్ కోసం తన ఇంటికి ఆహ్వానించిఇక ఫ్యాన్స్ అయితే, రాహుల్ ఆత్మగౌరవం నిలబడాలంటే వెంటనే లక్నోకు గుడ్బై చెప్పాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాజా ఫొటో తెర మీదకు వచ్చింది. కేఎల్ రాహుల్ను డిన్నర్ కోసం తన ఇంటికి ఆహ్వానించిన సంజీవ్ గోయెంక అతడిని ఆలింగనం చేసుకున్నాడు. Sanjiv Goenka invited KL Rahul for dinner at his home last night and both hugged each other.- Everything is okay now in LSG. ❤️ pic.twitter.com/RY9KsiNre3— Tanuj Singh (@ImTanujSingh) May 14, 2024తుపాన్ వెలిసిన తర్వాతఈ నేపథ్యంలో గోయెంక- రాహుల్ మధ్య సఖ్యత కుదిరిందని.. జట్టులో ప్రస్తుతం అంతా బాగానే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కేఎల్ రాహుల్ భార్య, నటి అతియా శెట్టి చేసిన పోస్ట్ ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. తుపాన్ వెలిసిన తర్వాత ప్రశాంతంగా ఇలా అంటూ ఆమె మబ్బులు వీడిన సూర్యుడి ఫొటో పంచుకుంది.కాగా ఐపీఎల్-2024లో భాగంగా లక్నో మంగళవారం ఢిల్లీతో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే లక్నో ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. అయితే, మిగిలి ఉన్న మరో మ్యాచ్ గెలవడంతో పాటు ఇందుకోసం ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. Athiya Shetty Instagram story.Cryptic post 🤔🤔 pic.twitter.com/HTKdJ95G9d— DREAM11s STATS (@fantasy1Cricket) May 14, 2024 -
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఐపీఎల్ ఫ్రాంఛైజీ పంజాబ్ కింగ్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఇటీవల సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. తమ జట్టుకు సంబంధించి అభిమానులు వేస్తున్న ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇస్తూ వారిని ఖుషీ చేస్తున్నారు.ఈ క్రమంలో ఓ నెటిజన్.. ‘‘పంజాబ్ కింగ్స్లో మీకిష్టమైన ఆటగాడు ఎవరు?’’ అని ప్రశ్నించారు. ఇందుకు సమాధానంగా.. ప్రీతి జింటా వీరేంద్ర సెహ్వాగ్, ఆడం గిల్క్రిస్ట్ పేర్లను చెప్పారు.ఈ మేరకు.. ‘‘డేంజరస్ వీరూగా ఉన్నందుకు వీరేంద్ర సెహ్వాగ్’’ అంటూ హార్ట్ సింబల్ జత చేసిన ప్రీతి జింటా.. ఆడం గిల్క్రిస్ట్ అంటే కూడా తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. నాయకుడిగా, ఆటగాడిగా అతడు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.కాగా 2014, 2015 సీజన్లలో పంజాబ్ జట్టు తరఫున టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ దుమ్ములేపాడు. 30 మ్యాచ్లలో కలిపి 660 పరుగులు సాధించాడు. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్తో క్వాలిఫయర్ మ్యాచ్లో అతడు 122 పరుగులు సాధించడం హైలైట్గా నిలిచింది.ఇక ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఆడం గిల్క్రిస్ట్ సైతం 2011- 2103 మధ్య పంజాబ్కు ప్రాతినిథ్యం వహించాడు. 34 మ్యాచ్లలో కలిపి 849 రన్స్ చేశాడు. నిలకడైన ఫామ్తో జట్టుకు విజయాలు అందించాడు. కెప్టెన్గానూ రాణించాడు.గిల్క్రిస్ట్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ 2011లో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. 2012, 2013లో ఆరో స్థానం సంపాదించింది.ఇక ఫేవరెట్ ప్లేయర్ ప్రశ్న తర్వాత.. ‘‘పంజాబ్ కింగ్స్ జట్టు కోసం మీరింకా ఆలూ పరాఠాలు చేస్తున్నారా?’’ అని ఓ నెటిజన్ అడిగారు. ఇందుకు బదులిస్తూ.. ‘‘లేదు.. అప్పట్లో సౌతాఫ్రికాలో ఓసారి మా జట్టు గెలిచిన తర్వాత పరాఠాలు చేసిచ్చాను. ఆ తర్వాత అలాంటివేమీ చేయలేదు’’ అని ప్రీతి జింటా పేర్కొన్నారు.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ మరోసారి పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరుస్తోంది. ఇప్పటి వరకు ఆడిన పదకొండు మ్యాచ్లలో కేవలం నాలుగు గెలిచి పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో తాను జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా లేనంటూ ప్రీతి జింటా ఇటీవల పేర్కొన్నారు. ఇక పంజాబ్ కింగ్స్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదన్న విషయం తెలిసిందే. కాగా టీమిండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ గతంలో పంజాబ్ జట్టుకు ఆడాడు. అదే విధంగా.. శిఖర్ ధావన్ ప్రస్తుతం కెప్టెన్గా ఉన్నాడు. అయితే, గాయం కారణంగా అతడు మ్యాచ్లకు దూరం కాగా సామ్ కరన్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. -
Saina Nehwal: రాజస్తాన్ రాయల్స్ జట్టుతో సైనా నెహ్వాల్.. ఫొటోలు వైరల్
-
Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
-
HBD Rohit Sharma: హిట్మ్యాన్ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్ ఇదే!
-
టీమిండియా క్రికెటర్ భార్య.. మోడల్ కూడా! ఇటీవలే రెండో బిడ్డకు జన్మ(ఫొటోలు)
-
ఆమె అసలు ఓనర్లా ఉండదు.. ఓడినా కూడా..
‘‘ఆమె ఒక అద్భుతమైన మహిళ. జట్టుతో మమేకమై పోతుంది. టీమ్ ఓడిపోయినపుడు నిరాశకు గురైనా.. తన భావోద్వేగాలను నియంత్రించుకోగల శక్తి ఆమెకు ఉంది. ఆమె గొప్ప నటి. ఎంతో అనుభవం ఉన్న, విజయవంతమైన ఆర్టిస్ట్.ప్రతి సినిమా హిట్ కాదనే విషయం ఆమెకు తెలుసు. అలాగే.. ప్రతి మ్యాచ్లోనూ గెలవలేమనే విషయాన్ని అర్థం చేసుకోగలుగుతుంది. మ్యాచ్లో ఓటమిపాలైన తర్వాత మాతో మాట్లాడుతున్నపుడు చాలా వరకు ప్రశాంతంగానే ఉంటుంది. నేను ఆ జట్టుకు మూడేళ్ల పాటు ఆడాను. నలభై కంటే ఎక్కువ మ్యాచ్లలో భాగమయ్యాను.అయినా.. ఓడిన సందర్భాల్లో కేవలం రెండు- మూడుసార్లు మాత్రమే ఆమె మా మీద కోపం చూపించింది. మిగతా సందర్బాల్లో అసలు ఏమీ అనలేదు’’ అని టీమిండియా మాజీ ఆల్రౌండర్, పంజాబ్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహించిన ఇర్ఫాన్ పఠాన్ గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.పంజాబ్ ఫ్రాంఛైజీ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ అంటే ఆమెకు ఎంతో ఇష్టమని.. ఓటమిపాలైనప్పుడు కూడా జట్టుకు ఆమె మద్దతుగానే ఉంటుందని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు.తన చేత్తో పరాఠాలు చేసి పెట్టిందిఅదే విధంగా కీలక మ్యాచ్లో గెలిస్తే గనుక ప్రీతి సంతోషానికి అవధులు ఉండవని.. అలాంటి సమయంలో తానే స్వయంగా వంట చేసి అందరికీ వడ్డిస్తుందని పేర్కొన్నాడు. సౌతాఫ్రికాలో తాము చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించినపుడు ప్రీతి జింటా స్వయంగా తన చేత్తో 40 పరాఠాలు చేసి తమకు అందించిందని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు.ఫ్రాంఛైజీ జట్ల యజమానుల్లో ప్రీతి జింటా వేరే లెవల్ అంటూ ప్రశంసించాడు. ఐపీఎల్-2024లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ దుమ్ములేపిన విషయం తెలిసిందే. ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ విధించిన 261 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి చరిత్ర సృష్టించింది.దుమ్ములేపిన బెయిర్స్టో, శశాంక్జానీ బెయిర్స్టో విధ్వంసకర శతకానికి తోడు శశాంక్ సింగ్ కూడా దంచి కొట్టడంతో ఎనిమిది వికెట్ల తేడాతో కేకేఆర్ను చిత్తు చేసింది. దీంతో పంజాబ్ కింగ్స్ శిబిరంలో ఆనందాలు వెల్లివిరిశాయి. ఈ నేపథ్యంలో ప్రీతి జింటా గురించి గుర్తు చేసుకుంటూ ఇర్ఫాన్ పఠాన్ స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.🎥 Ruthless Hitting 💥Will #PBKS get this over the line? 🤔83 runs required from 42 deliveries‼️Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #KKRvPBKS pic.twitter.com/MvCvQQxmoe— IndianPremierLeague (@IPL) April 26, 2024చదవండి: రోహిత్, స్కై కాదు!.. వరల్డ్కప్లో ఒకే ఓవర్లో 6 సిక్స్లు కొట్టేది ఇతడే: యువీ -
ఆ బాధ ఎప్పటికీ...
ఆఫ్ ద ఫీల్డ్ న్యూఢిల్లీ: ఫేర్వెల్ మ్యాచ్ ఆడే అవకాశం రాకపోవడం అనేది తనని జీవితకాలం బాధిస్తూనే ఉంటుందని ఇటీవల రిటైరైన డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ చెప్పాడు. జట్టుకు తన సేవలు అవసరం లేదని ఒక్క మాట చెప్పి ఉంటే, ఢిల్లీలో చివరిసారి టెస్టు ఆడి వీడ్కోలు పలికేవాడినని... కానీ నాటి సెలక్టర్లు తనకు అలాంటి అవకాశం ఇవ్వలేదని మరోసారి బాధపడ్డాడు. ‘దేశం తరఫున 12 సంవత్సరాలు ఆడిన క్రికెటర్కు కనీసం వీడ్కోలు మ్యాచ్ ఆడే అర్హత ఉండదా’ అని వీరూ ప్రశ్నించాడు. తన విషయంలోనే కాదని, దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఏ క్రికెటర్కైనా ఒక వీడ్కోలు మ్యాచ్ ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఢిల్లీలో జరిగే చివరి టెస్టు సందర్భంగా సెహ్వాగ్ను బీసీసీఐ సన్మానిస్తుందనే వార్త వినిపిస్తోంది. ‘అలా జరిగితే మంచిదే. ఒకవేళ బీసీసీఐ పట్టించుకోకపోతే ఢిల్లీ క్రికెట్ సంఘమైనా ఆ పని చేస్తుందని భవిస్తున్నాను’ అని వీరూ అన్నాడు. అలాగే జట్టును ఎంపిక చేసే సమయంలో సీనియర్, జూనియర్ అనే బేధం లేకుండా వరసగా ఐదు మ్యాచ్లలో విఫలమైన వారిని జట్టులోంచి తీసేయాలని అభిప్రాయపడ్డాడు. మిగిలిన జట్లతో పోలిస్తే పాకిస్తాన్పై తాను ఎక్కువ నిలకడగా ఆడేవాడినని, ఆ జట్టుతో మరో రెండు సిరీస్లు ఆడి ఉంటే తన కెరీర్ పరుగులు 10 వేలు (వీరూ చేసింది 8,586) దాటేవని అన్నాడు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
బద్ధిపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వేసవిలో ‘చల్లని’ సేవ
గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివించండి
వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బుద్ధ జయంతిని విజయవంతం చేయాలి
ఎప్సెట్ ఫలితాల్లో ‘శ్రీచైతన్య’ విజయకేతనం
ఏషియన్ పవర్ లిఫ్టింగ్లో బంగారు పతకం
నేటి నుంచి జీల్గుల మల్లికార్జునస్వామి ఉత్సవాలు
వ్యానును ఢీకొన్న కారు
తప్పక చదవండి
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
- తెలంగాణ ఈఏపీసెట్లో ఏపీ ప్రభంజనం
Advertisement