-
మగాడిలా మారిపోవాలని ఉంది.. త్రిష
కోరికలే గుర్రాలైతే ఎలా ఉంటుంది? కుడి ఎడమైతే ఎలా ఉంటుంది? చాలా తమాషాగా ఉంటుంది కదూ. చైన్నె బ్యూటీ త్రిష కోరిక కూడా అలాంటి విచిత్రమైనదే. నటిగా రెండు దశాబ్దాల అనుభవం. మధ్యలో ఎత్తుపల్లాలు ఎదురైనా, నేటికీ ఎవర్గ్రీన్ హీరోయినే. ఇప్పపటీకి మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలరే. ఇదీ త్రిష రికార్డ్. గ్లామర్ పాత్రలకై నా, ఉమెన్ సెంట్రిక్ కథా పాత్రలకై నా, ఏ భాషలోనైనా రెడీ అంటూ తన సత్తాను చాటుతున్న ఈ సంచలన బహుభాషా నటి త్రిష.ప్రస్తుతం తమిళంలోనే అజిత్ సరసన విడాముయర్చి, కమలహాసన్తో కలిసి థగ్లైఫ్ చిత్రాల్లో నటిస్తున్న ఈమె మలయాళంలో మోహన్లాల్ సరసన రామ్, టోవినో థామస్కు జంటగా ఐడెంటిటి, తెలుగులో చిరంజీవికి జంటగా విశ్వంభర చిత్రాల్లో నటిస్తున్నారు. ఇలా ఏక కాలంలో ఐదు భారీ చిత్రాల్లో నటిస్తున్న ఏకై క నటి త్రిషనే అయ్యుంటారు. ఈమె ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్న వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.అందులో తనకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉందన్నారు. అదేమిటంటే తాను ఒక్క రోజు పురుషుడిగా ఉండాలన్నారు. ఒక కుర్రాడిలా ఉండడం ఎలా ఉంటుంది. అతని శరీర రూపకల్పన, అతని మానసిక స్థితి గురించి తెలుసుకోవాలని ఆశగా ఉంటుందన్నారు. ఈ విషయం గురించి తన తల్లితో పదే పదే చెబుతుంటానని అన్నారు. ఆమె కోరిక నిజంగా విచిత్రంగానూ, విడ్డూరంగానూ ఉంది కదూ! -
తెలుగు సినిమా హీరోయిన్.. ముచ్చటగా మూడో పెళ్లి
హీరోయిన్ మీరా వాసుదేవన్ పెళ్లిపీటలెక్కింది. ముచ్చటగా మూడోసారి తన మెడలో మూడు ముళ్లు వేయించుకుంది. కెమెరామెన్ విపిన్ పుత్యాంగంతో ఏడడుగులు వేసింది. ఈ శుభవార్తను మీరా సోషల్ మీడియా వేదికగా ఆలస్యంగా వెల్లడించింది. ఏప్రిల్ 21న కోయంబత్తూరులో పెళ్లయిందని, రిజిస్టర్ ప్రక్రియ ఈరోజు పూర్తయిందంటూ శుక్రవారం నాడు వివాహ ఫోటోలు షేర్ చేసింది. అలాగే తన భర్త గురించి వివరాలను సైతం పొందుపరిచింది.సింపుల్గా పెళ్లివిపిన్ కేరళలోని పాలక్కడ్ ప్రాంతానికి చెందినవాడు. ఈయన ఒక సినిమాటోగ్రాఫర్. అప్పట్లో అంతర్జాతీయ అవార్డు సైతం గెలుచుకున్నాడు. విపిన్, నేను ఒక ప్రాజెక్టు కోసం 2019 మే నుంచి కలిసి పని చేస్తున్నాం. గతేడాదే కలిసి జీవించాలని నిర్ణయానికి వచ్చాం. అలా ఈ ఏడాది ఒక్కటయ్యాం. ఇరు కుటుంబాలు సహా ఇద్దరు ముగ్గురు బంధుమిత్రుల సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సీరియల్ నుంచి సినిమాల్లోకి..కాగా మీరా వసుదేవన్ 2001లో సీరియల్ ద్వారా నటిగా పరిచయమైంది. రెండు మూడు ధారావాహికల్లో కనిపించిన ఆమె గోల్మాల్ అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా మారింది. అంజలి ఐ లవ్ యూ అనే చిత్రంలోనూ నటించింది. తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ హీరోయిన్గా యాక్ట్ చేసింది. ప్రస్తుతం నాలుగు మలయాళ సినిమాలు చేస్తోంది.రెండు పెళ్లిళ్లుతన వ్యక్తిగత విషయానికి వస్తే.. మీరా వాసుదేవన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ తనయుడు విశాల్ అగర్వాల్ను 2005లో వివాహం చేసుకుంది. పెళ్లయిన ఐదేళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. 2012లో మలయాళ నటుడు జాన్ కొక్కెన్ను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ బాబు కూడా జన్మించాడు. సీరియల్ షూటింగ్లో లవ్..తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ బంధం కూడా ముక్కలైంది. 2016లో భార్యాభర్తలిద్దరూ విడిపోయారు. అప్పటినుంచి సింగిల్ మదర్గా ఉంటున్న ఈమె కుడుంబవిలక్కు అనే సీరియల్ షూటింగ్లో ఆ ధారావాహిక కెమెరామన్ విపిన్తో ప్రేమలో పడింది. ఆ ప్రేమను ఇప్పుడు పెళ్లి బంధంతో పదిలపర్చుకున్నారు. View this post on Instagram A post shared by Meera Vasudevan (@officialmeeravasudevan)చదవండి: చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి -
మిగతా హీరోయిన్లకు నయనతారకు తేడా అదే.. అందుకే ఇన్నేళ్ల పాటు!
నయనతార వయసు 39 ఏళ్లు. ఇద్దరు పిల్లల తల్లి. కానీ ఇప్పటికీ వరసపెట్టి సినిమాలు చేస్తోంది. కాదు కాదు ఛాన్సులు వస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే చాలామంది హీరోయిన్లు.. తమకు స్టార్ హోదా రాగానే భూమ్మీద నిలబడరు. ఎక్కడికో వెళ్లిపోతారు. ఇలాంటి టైంలోనూ నయనతారకు అసలు ఇన్ని ఛాన్సులు ఎలా వస్తున్నాయి? అసలు ఆమె ఏం ఫాలో అవుతోంది?(ఇదీ చదవండి: Love Me If You Dare: ‘లవ్ మీ’మూవీ రివ్యూ)టాలీవుడ్ హీరోయిన్లనే తీసుకోండి. ఒక్కసారి స్టార్ హీరోయిన్ అయిపోతే ఇక చిన్న సినిమాలు చేయడానికి అస్సలు ఆసక్తి చూపించరు. మ్యునరేషన్ అమాంతం పెంచేస్తారు. నయన్ మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. 'జవాన్' లాంటి మూవీతో పాన్ ఇండియా వైడ్ హిట్ కొట్టినా సరే తమిళంలో లోకల్ మూవీస్, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. హిట్, ఫ్లాప్ అనేది పక్కనబెడితే లోకల్ నిర్మాతలకు అందుబాటులో ఉంటుంది.కొన్నాళ్ల క్రితం అథర్వ అనే చిన్న హీరోతో కలిసి సినిమా చేసింది. ఇప్పుడు కవిన్ అని మరో యంగ్ హీరోతో కలిసి ఇప్పుడు నటించబోతుందట. లోకేశ్ కనగరాజ్ శిష్యుడు విష్ణు ఎడవన్.. ఈ ప్రాజెక్టుతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రాబోతుంది. అయితే మిగతా హీరోయిన్లతో పోలిస్తే అన్ని రకాల సినిమాలు చేస్తుండటమే ఈమె సక్సెస్ సీక్రెట్ అయ్యిండొచ్చు.(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ) -
ఆ హీరో కోసం కియారా, జాన్వీ కపూర్!
బాలీవుడ్ హీరోయిన్లు ఈ మధ్య దక్షిణాదిపై ఆసక్తి చూపుతున్నారు. ఇలియానా, తమన్నా, కాజల్, తాప్సీ, హన్సిక వంటి పలువురు బాలీవుడ్ భామలు దక్షిణాదిలో ఎదిగిన వారే. ఇప్పుడు కూడా కియారా, దిశాపటాని వంటి క్రేజీ హీరోయిన్లు దక్షిణాది చిత్రాల్లో నటిస్తూ పాన్ ఇండియా నటీమణులుగా రాణిస్తున్నారు. తాజాగా జాన్వీ కపూర్ ఈ పట్టికలో చేరారు. ప్రస్తుతం తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ రామ్చరణ్తో జత కట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఇద్దరూ ఒకే సినిమాలో!ఇకపోతే కియారా అద్వానీ తెలుగులో ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం రామ్చరణ్కు జంటగా గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కలిసి ఒక చిత్రంలో నటిస్తే.. అదీ తమిళ సినిమా అయితే, అందులో శింబు కథానాయకుడు అయితే, ఆ చిత్రం వేరే లెవల్గా ఉంటుంది కదూ! అలాంటి క్రేజీ చిత్రం త్వరలోనే తెరకెక్కబోతోందన్నది తాజా సమాచారం. ద్విపాత్రాభినయంశింబు ప్రస్తుతం కమలహాసన్ హీరోగా నటిస్తున్న థగ్లైఫ్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. దీని తరువాత శింబు తన 48వ చిత్రంలో నటించనున్నారు. దీన్ని నటుడు కమలహాసన్ తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనుంది. దీనికి దేశింగు పెరియస్వామి దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్లుక్ పోస్టర్ను ఇటీవల విడుదల చేయగా అందులో ఇద్దరు శింబులు తలపడుతున్నట్లుగా ఉంది.కియారాతో పాటు..శింబు ద్విపాత్రాభినయం చేయనున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో ఒక కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారంలో ఉంది. అలాగే జాన్వీ కపూర్ను సైతం ఎంపిక చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. ఇదే నిజమైతే ఈ క్రేజీ చిత్రం ద్వారా కియారా, జాన్వీకపూర్ ఇద్దరూ కోలీవుడ్కు ఎంట్రీ ఇవ్వనున్నారన్న మాట!చదవండి: ట్రెండింగ్లో విజయ్ చెల్లెలు ఫోటో.. కారణం ఇదే -
ట్రెండింగ్లో విజయ్ చెల్లెలు ఫోటో.. కారణం ఇదే
సౌత్ ఇండియాలో టాప్ హీరోల లిస్ట్లో విజయ్ పేరు ఉంటుంది. గతేడాది 'లియో'తో భారీ విజయాన్ని అందుకున్న విజయ్ ప్రస్తుతం 'గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఆయన అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే, హీరో విజయ్ సోదరి విద్య ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఆయన అభిమానులు కూడా కోలీవుడ్లో గత ఐదు రోజులుగా తెగ షేర్ చేస్తున్నారు.తెలుగులోనూ విజయ్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ తల్లిదండ్రులు కూడా ఇండస్ట్రీకి చెందినవారే. తండ్రి ప్రముఖ డైరెక్టర్ ఎస్ఏ చంద్రశేఖర్ కాగా తల్లి శోభ గాయనిగా, రచయిత్రిగా గుర్తింపు సంపాదించుకుంది. అయితే, విజయ్కి ఒక సోదరి కూడా ఉంది. ఆమె పేరు 'విద్య'. ఆమె మరణించి ఇప్పటికి సరిగ్గా 40ఏళ్లు అవుతుంది. దీంతో విజయ్ అభిమానులు విద్య సమాధి ఫోటోను నెట్టింట షేర్ చేస్తున్నారు.1980లో జన్మించిన విద్య 1984 మే 20న ఆనారోగ్యంతో చిన్న వయసులోనే మరణించింది. ఆ సమయంలో వైద్యులను సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది. అలా నాలుగేళ్ల వయసులోనే విద్య చనిపోయింది. చెల్లి మరణంతో విజయ్ బాగా కుంగిపోయాడని ఆయన తల్లి ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. స్కూలు నుంచి వచ్చాక విజయ్ ఎక్కువగా విద్యతోనే ఆడుకునేవాడని తెలిపింది. అమ్మతోపాటూ ఆ పాపకు తనూ స్నానం చేయించేవాడు, అన్నం తినిపించేవాడు.అలాంటిది ఒక్కసారిగా విద్య దూరం కావడంతో విజయ్ ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఓ కార్యక్రమంలో విద్య గురించి మాట్లాడిన విజయ్.. 'నా జీవితంలో పెద్ద ప్రభావం మా చెల్లెలు విద్యా మరణం.. దాన్నుంచి కోలుకోవడం చాలా కష్టమైంది.. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను ఆమెను దూరం చేసిన దేవుడు.. నాకు చాలామంది చెల్లెలను అభిమానుల రూపంలో తిరిగిచ్చాడు. వారందరిలో నా చెల్లెలు రూపాన్ని ఇప్పటికీ చూసుకుంటాను.' అని చెప్పడం గమనార్హం. చెల్లెలు విద్య అకాల మరణంతో తీవ్ర మనో వేదనకు గురైన విజయ్.. తన కూతురికి చెల్లెలు విద్య పేరుని గుర్తుకు తెచ్చేలా దివ్య అని పేరుపెట్టాడు. ఆ పాప ఇప్పుడు బ్యాడ్మింటన్లో రాణిస్తోంది. చెల్లెలుపై అంతప్రేమను చూపించే తమ అభిమాన హీరో కోసం తాజాగా విద్య మెమోరియల్ ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులు భారీగా షేర్ చేస్తున్నారు. మెమోరియల్లో ఇన్ లవింగ్ మెమరీ ఆఫ్ డార్లింగ్ విద్య అనే పదాలు ట్రెండింగ్లో ఉన్నాయి. -
నీట్ పరీక్షా విధానంపై వస్తున్న మొదటి సినిమా ఇదే
వైద్యవిద్యలో నీట్ పరీక్షల విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా నీట్ పరీక్షల కారణంగా ఎదురవుతున్న సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కారణంగా నీట్ వద్దని తమిళనాడుసహా పలు రాష్ట్రాలు పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అలాంటిది నీట్ పరీక్షల నేపథ్యంలో ఇప్పటివరకూ ఎలాంటి చిత్రం రూపొందలేదు. కాగా తొలిసారిగా అలాంటి కథతో 'అంజామై' అనే చిత్రం కోలీవుడ్లో రూపొందింది. ఈ చిత్రం ద్వారా దర్శకుడు మోహæన్రాజా, లింగుసామి వద్ద పలు చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేసిన సుబ్బురామన్ దర్శకుడిగా పరిచయం అవు తున్నారు. నటుడు విదార్థ్, వాణిభోజన్, రఘుమాన్, క్రితిక్ మోహన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని తిరుచ్చిత్రం పతాకంపై డాక్టర్ ఎన్.తిరునావుక్కరసు నిర్మించారు. మనోతత్త్వ వైద్యుడు, ఉపాధ్యాయుడు అయిన ఈయన మంచి కథా చిత్రాలను నిర్మించాలన్న ఆశయంతో నిత్ర నిర్మాణం చేపట్టి నిర్మించిన తొలి చిత్రం అంజామై. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయిన ఈ చిత్రం విడుదల హక్కులను పూర్తిగా డ్రీమ్ వారియర్స్ సంస్థ పొందడం విశేషం. ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ 'అంజామై' చిత్రాన్ని కొనుగోలు చేయడం విశేషం. దీంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కానున్నట్లు సమాచారం. -
ఆయన సలహాతో ఇద్దరి హీరోల సినిమాలు ఫ్లాప్.. అందుకే..
నేనుగా వెళ్లి ఎవరిని అవకాశాలు అడగలేదంటున్నారు నటుడు రామరాజన్. 1980 ప్రాంతంలో టాప్ హీరోగా వెలిగారు. ముఖ్యంగా గ్రామీణ కథా పాత్రల్లో అధికంగా నటించారు. అంతే కాకుండా 44 చిత్రాల్లో సింగిల్ హీరోగా నటించిందీ రామరాజనే. అప్పట్లో రజనీకాంత్, కమల్ హాసన్కు ధీటుగా రాణించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత వీరాభిమాని అయిన రామరాజన్ రాజకీయ రంగప్రవేశం కూడా చేశారు. ఆ తరువాత కొంత కాలం సినిమాలు, రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన రామరాజన్ సుమారు 14 ఏళ్ల తరువాత సామాన్యన్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు.నటనకు దూరం కానుఎంఎస్.భాస్కర్, రాధారవి, దర్శకుడు కేఎస్.రవికుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని రాకేశ్ దర్శకత్వంలో ఎక్స్ట్రా ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై మదియళగన్ నిర్మించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చెన్నైలో చిత్రం యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. అందులో పాల్గొన్న నటుడు రామరాజన్ మాట్లాడుతూ తాను నటనకు దూరం కాదలచుకోలేదన్నారు. చాలా కథలు వింటున్నప్పటికీ ఏవీ సెట్ కాలేదన్నారు. ఫలానా హీరోలా నటించమని..తాను నటించిన గరగాట్టక్కారన్ చిత్రాన్ని చూస్తే శివాజీగణేశన్ నటించిన తిల్లానా మోహనాంబాళ్ చిత్రమే గుర్తుకు వస్తుందన్నారు. ఆ చిత్రంలో శివాజీగణేశన్కు బదులు ఎంజీఆర్ నటిస్తే ఎలా సెట్ అవుతుందని ప్రశ్నించారు. అప్పట్లో ఒక డిస్ట్రిబ్యూటర్ శివాజీ గణేశన్తో ఎంజీఆర్లా నటించాలని, ఎంజీఆర్తో శివాజీగణేశన్ మాదిరి నటించాలని కోరారన్నారు. అలా ప్రయత్నించి చూద్దామని ఎంజీఆర్ నటించిన పాశం, శివాజీగణేశన్ నటించిన తంగ సురంగం చిత్రాలు రెండూ ప్లాప్ అయ్యాయన్నారు. రెండూ ఫ్లాపయ్యాయిదీంతో ఆ రెండు చిత్రాల దర్శకుడు రామన్న ఆ ఇద్దరు హీరోలతో మీరు మీరుగానే నటించండి అని చెప్పారన్నారు. కాబట్టి ఎలాంటి పాత్ర చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారో అలాంటి పాత్రల్లోనే తాను నటిస్తున్నానని చెప్పారు. ప్రారంభం నుంచి తాను కథ నచ్చితేనే నటిస్తున్నానని చెప్పారు. తానిప్పటి వరకూ అవకాశాల కోసం ఎవరిని అడగలేదన్నారు. మరో విషయం ఏమిటంటే తాను నటించింది 1986 నుంచీ 1990 వరకేనని, అయితే ఇప్పటి వరకూ ప్రేక్షకుల మనసులో నిలిచిపోవడానికి కారణం సంగీత దర్శకుడు ఇళయరాజా పాటలేనని రామరాజన్ పేర్కొన్నారు.చదవండి: షారూఖ్ ఖాన్ ఆరోగ్యంపై మేనేజర్ దద్లానీ చేసిన పోస్ట్ వైరల్ -
అదరగొడుతున్న హారర్ మూవీ.. ఏకంగా వంద కోట్లు..
హారర్ థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. ఏకంగా వంద కోట్లు రాబట్టింది. ఆ సినిమా మరేదో కాదు అరణ్మనై 4. సుందర్, తమన్నా, రాశీ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ మే 3న తమిళనాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో బాక్ పేరిట విడుదలైంది. 20 రోజుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టింది. ఈ ఏడాది సెంచరీ కొట్టిన తొలి తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది.సెంచరీ..ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. అరణ్మనై వంద కోట్లు వసూలు చేసిందంటూ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసింది. అరణ్మనై ఫ్రాంచైజీలో ఇప్పటివరకు మూడు సినిమాలు వచ్చాయి. అవన్నీ విజయం సాధించగా ఈసారి నాలుగో పార్ట్ తీశారు. గత చిత్రాలన్నింటికంటే అరణ్మనై 4 అద్భుత విజయం సాధించింది. నాలుగో పార్ట్లో మెయిన్ లీడ్..ఇక గత మూడు చిత్రాల్లో సహాయక పాత్రల్లో కనిపించిన ఈ సినిమా డైరెక్టర్ సుందర్ నాలుగో పార్ట్లో మాత్రం ప్రధాన పాత్రలో నటించడం విశేషం. కుష్బూకు చెందిన అవ్నీ సినీ మ్యాక్, ఏసీఎస్ అరుణ్కుమార్కు చెందిన బెంజ్ మీడియా సంస్థ కలిసి నిర్మించిన ఈ మూవీలో యోగిబాబు, కోవై సరళ, రామచంద్ర రాజు, సంతోష్ ప్రతాప్ సహాయక పాత్రల్లో నటించారు. హిప్హాప్ ఆది సంగీతం అందించాడు. A celebration in theaters 🥳 A phenomenon at the box office 🔥 The 1st Tamil movie of 2024 to gross 100 crores worldwide 😍❤🔥And it's all from the love you've given us ✨ #Aranmanai4BlockbusterHitA #SundarC unstoppable blockbuster entertainer🥳A @hiphoptamizha… pic.twitter.com/VvrcKGT63g— KhushbuSundar (Modi ka Parivaar) (@khushsundar) May 22, 2024 చదవండి: పవిత్ర-చందు మరణం.. నటుడు నరేశ్ కీలక వ్యాఖ్యలు -
గుడ్ బ్యాడ్ అగ్లీ.. ఆ ఓటీటీ అన్ని కోట్లు పెట్టిందా?
అన్నం ఉడికిందో లేదో తెలియడానికి ఒక్క మెతుకు చూస్తే చాలంటారు. అలాగే కొన్ని చిత్రాల జాతకం ఒక్క పోస్టర్తోనే తెలిసిపోతుంది. ఈ విషయాన్ని అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రం నిరూపించింది. అజిత్ ప్రస్తుతం విడాయుయర్చి చిత్రంలో నటిస్తున్నారు. మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. పలు సమస్యలను అధిగమిస్తూ ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గుడ్ బ్యాడ్ అగ్లీఇకపోతే అజిత్ తన తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. అదే గుడ్ బ్యాడ్ అగ్లీ. మార్క్ ఆంటోని వంటి సూపర్హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో అజిత్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. పోస్టర్కు పాజిటివ్ రెస్పాన్స్ఆయనకు జంటగా శ్రీలీల, మీనా, సిమ్రాన్లు నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా చిత్ర షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం అవుతుందని సమాచారం. గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్కు సూపర్ రెస్పాన్స్ రాగా ఫస్ట్లుక్ పోస్టర్ కూడా అదిరిపోయింది. అజిత్ మూడు ముఖాలతో కూడిన ఆ పోస్టర్ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచేసింది. ఓటీటీ రైట్స్ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ రూ.95 కోట్లు పెట్టి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం ప్రారంభానికి ముందే సంచలనం సృష్టిస్తోందన్నమాట. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో రానుంది.చదవండి: బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 3 అప్డేట్ వచ్చేసింది.. మారనున్న హోస్ట్ -
Vishal Marriage: పెళ్లెప్పుడు? విశాల్ సమాధానమిదే! ఇంక చేసుకున్నట్లే!
సినిమా ఇండస్ట్రీలో పెళ్లి కాని ప్రసాదులు చాలామందే ఉన్నారు. కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన హీరోలు పెళ్లి వైపు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. అదేమంటే.. ఆ హీరో పెళ్లయ్యాక చేసుకుంటా, ఈ హీరో జోడీని వెతుక్కున్నాక చేసుకుంటా అని సాకులు చెప్తుంటారు. హీరో విశాల్ కూడా ఇదే రూటులో వెళ్తున్నాడు.పెళ్లి ఊసే లేదు!తను గతంలో ప్రేమించిన ఓ బ్యూటీ కూడా పెళ్లి చేసుకోబోతుంది. 46 ఏళ్లొచ్చినా ఈయన మాత్రం వివాహానికి తొందరేముంది అన్నట్లుగా నిమ్మకు నీరెత్తకుండా ఉండిపోయాడు. కానీ జనాలు ఊరుకుంటారా? మెడ మీద కత్తిపెట్టి అడిగినట్లుగా పెళ్లెప్పుడో చెప్పు అని ప్రశ్నిస్తూనే ఉన్నారు.తెలివైన సమాధానందీనికి విశాల్ చాలా తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. సల్మాన్ ఖాన్, శింబు, ప్రభాస్.. ఈ ముగ్గురు పెళ్లి చేసుకున్నాకే నేను కూడా లైఫ్లో సెటిలవుతాను అని చెప్పాడు. శింబుకు మంచి అమ్మాయిని చూసి మూడు ముళ్లు వేయించాలని వేట మొదలుపెట్టారట అతడి పేరెంట్స్. ప్రభాస్ అంటారా? సినిమాల మీద తప్ప పర్సనల్ లైఫ్ గురించి పట్టించుకుందే లేదు.సల్మాన్ పేరు చెప్పాడంటే..ఇక సల్మాన్ విషయానికి వస్తే.. ఆయనకసలు మ్యారేజ్ చేసుకునే ఉద్దేశమే లేదు. మరి విశాల్ ఈ ముగ్గురి తర్వాతే అంటున్నాడంటే తనకసలు పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? లేదా బ్రహ్మచారిగా మిగిలిపోతాడా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.చదవండి: విడాకుల రూమర్స్.. ఈ ప్రపంచం గురించి పట్టించుకోనంటున్న నటుడు -
రిలేషన్షిప్లో అది దాటొద్దు.. నేను నేర్చుకున్న గుణపాఠమిదే: గౌతమి
హీరోయిన్గానే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్గానూ చిత్రపరిశ్రమలో పని చేసింది గౌతమి. కానీ తన జీవితాన్ని మాత్రం సరిగ్గా డిజైన్ చేసుకోలేకపోయింది. తెలుగు, తమిళంలో స్టార్స్తో కలిసి నటించిన ఈమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. మొదట్లో బిజినెస్మెన్ సందీప్ భాటియాను పెళ్లాడిన ఈమెకు కూతురు సుబ్బలక్ష్మి జన్మించింది. పాప పుట్టిన ఏడాదే అతడికి విడాకులిచ్చేసింది. 13 ఏళ్ల ప్రేమతర్వాతి కాలంటో కమల్ హాసన్తో ప్రేమలో పడింది. వీరిద్దరూ సహజీవనం చేశారు. కాలం కన్ను కుట్టిందో ఏమో కానీ 2016లో విడిపోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రిలేషన్షిప్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నీ బలం నువ్వే.. బాధేసినప్పుడు నచ్చిన వ్యక్తి వీడియోలు చూడటమో లేదా నీలో ధైర్యాన్ని నింపే వ్యక్తి మాటలు వినడమో చేస్తుంటాం. ఒక్కొక్కరు ఒక్కో దారి అనుసరిస్తుంటారు. అలా ప్రతి ఒక్కరినీ ఏదో ఒక అంశం ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. దానికి అట్రాక్ట్ అవుతారు.ఆ పాయింట్ దాటొద్దుకానీ నిజమైన బలం వేరెవరూ కాదు.. నాకు నేను, నీకు నువ్వే అసలైన బలం. ఒక రిలేషన్షిప్ వర్కవుట్ కాలేదంటే దానికి పూర్తి బాధ్యత నీదేనని నీ నెత్తిన వేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఏ రిలేషన్ అయినా సరే.. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక కేంద్ర బిందువు ఉంటుంది. ఇద్దరు సమానంగా అక్కడికి చేరుకోవాలి. కొన్ని కారణాల వల్ల కొందరు ఆ బిందువుకు దూరంగా ఉంటారు. పైగా మనకోసం చాలాదూరం వచ్చినట్లు ఫీలవుతారు. ఇలా ఒక్కసారి మోసం చేశారంటే మళ్లీ మళ్లీ మోసగిస్తూనే ఉంటారు. వారికి అదొక అలవాటుగా మారిపోతుంది.లైఫ్ లెస్సన్అప్పుడు నేనెందుకు నీకోసం అంత దూరం రావాలని మనల్నే తిరిగి ప్రశ్నిస్తారు. కావాలంటే నువ్వే వచ్చేయ్ అంటారు. ఇది నేను జీవితంలో నేర్చుకున్న ఓ గుణపాఠం. మనమెప్పుడూ ఆ బిందువును దాటి ముందుకు వెళ్లకూడదు. లవ్, కమిట్మెంట్ అనేది రెండువైపులా సమానంగా ఉండాలి. అప్పుడే ఆ బంధం ఎక్కువకాలం నిలుస్తుంది' అని గౌతమి చెప్పుకొచ్చింది. కాగా ఈమె కమల్తో కలిసి అపూర్వసహోదరగళ్, దేవర్ మగన్, పాపనాశం వంటి చిత్రాల్లో నటించింది.చదవండి: స్టార్ హీరో కొడుకు సెకండ్ హ్యాండ్ బట్టలు వాడతాడు! -
నిర్మాత మోసం.. నిజాలు బయటపెట్టిన హీరోయిన్ నమిత
హీరోయిన్ల జీవితం బయటకు చూడటానికి బాగానే ఉంటుంది. కానీ లోపల మాత్రం వేరేగా ఉంటుంది. ఎంత కష్టమొచ్చినా సరే చాలామంది బ్యూటీస్ తమ బాధల్ని బయటకు చెప్పుకోరు. ఎందుకంటే కొత్త సినిమాలు రావేమోనని భయం. సందర్భం వచ్చినప్పుడు వాటిని బయటపెడుతుంటారు. ఇప్పుడు అలానే హీరోయిన్ నమిత.. తనకు కెరీర్లో ఎదురైన దారుణమైన మోసాల్ని రివీల్ చేసింది.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన 'మైదాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)'మూవీ పేరు చెప్పను కానీ ధనుష్ హీరోగా ప్రాజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి ఓ నిర్మాత నా కాల్షీట్ తీసుకున్నారు. కానీ చివరకొచ్చేసరికి ఆయన కజిన్ హీరోగా నటించాడు. ఆ విషయం నాకు తెలియగానే చాలా బాధపడి సగంలోనే ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేశా. ఆపై ఎలాగోలా సినిమా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేశారు. దీని గురించి అప్పట్లో నిర్మాతల మండలి, నటీనటుల మండలిలో ఫిర్యాదు కూడా చేశాను. అలానే మలయాళంలో పేరున్న నిర్మాత ఉన్నారు కదా అని ఓ ప్రాజెక్ట్ సైన్ చేశా. కానీ దాన్ని వేరే నిర్మాత తీసుకోవడంతో చాలా ఇబ్బందులు పడుతూనే ఆ మూవీ పూర్తి చేశాను' అని నమిత తనకెదురైన చేదు అనుభవాల్ని బయటపెట్టింది.గుజరాత్లో పుట్టి పెరిగిన నమిత.. 'సొంతం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటించింది. 2020లో చివరగా ఓ చిత్రంలో నటించిన ఈమె.. కొన్నాళ్ల క్రితం బీజేపీ పార్టీలో చేరింది. ఈ క్రమంలోనే తాజాగా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన గురించి పలు విషయాల్ని బయటపెడుతోంది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్తో ఉన్న ఈమెని గుర్తుపట్టారా? పాన్ ఇండియా డైరెక్టర్ భార్య) -
సింపుల్గా పెళ్లి చేసుకున్న యంగ్ డైరెక్టర్.. అమ్మాయి ఎవరంటే?
మరో డైరెక్టర్ పెళ్లి చేసుకున్నాడు. వివాహ వేడుక చాలా సింపుల్గా జరిగిపోయింది. రిసెప్షన్ మాత్రం చాలా గ్రాండ్గా నిర్వహించాడు. దీనికి పలువురు తమిళ సెలబ్రిటీలు హాజరయ్యారు. నూతన వధూవరుల్ని దీవించారు. అయితే ఈ డైరెక్టర్ పెళ్లి వెనక ఓ స్పెషాలిటీ ఉంది. ఇంతకీ అదేంటంటే?(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన 'మైదాన్' సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)కొన్నాళ్ల క్రితం 'సైరన్' సినిమా రిలీజైంది. జయం రవి, కీర్తి సురేశ్, అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ మూవీ సరిగా ఆడలేదు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమాతో దర్శకుడిగా మారిన ఆంథోని భాగ్యరాజ్.. మే 19న రమ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సోమవారం రాత్రి రిసెప్షన్ ఏర్పాటు చేయగా పలువురు ప్రముఖులు వేడుకకు హాజరయ్యారు.అయితే గత కొన్నేళ్ల నుంచి తమిళ ఇండస్ట్రీలో ఉన్న ఇతడు.. దర్శకుడు అయ్యాకే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి కూర్చున్నాడు. 'సైరన్' మూవీతో తన కల నెరవేరినందున ఇప్పుడు పెళ్లితో కొత్త జీవితం ప్రారంభించాడు.(ఇదీ చదవండి: స్టార్ హీరో కొడుకు సెకండ్ హ్యాండ్ బట్టలు వాడతాడు!) -
గ్లామర్తో రెమ్యునరేషన్ పెంచేసిన తమన్నా
ప్రపంచమంతా డబ్బుతోనే, అది లేకపోతే జీవితమేలేదు అన్నది అక్షరాల నిజం. ఇక విజయంతో ఎంతటివాడికైనా రెక్కలు మొలుస్తాయన్నది వాస్తవం. అవకాశం వచ్చే వరకూ ఒక లెక్క, విజయం వచ్చిన తరువాత ఒక లెక్క ఇదీ లోకం. ఈ నగ్న సత్యానికి ఎవరూ అతీతం కాదు. నటి తమన్న విషయానికే వస్తే తొలుత హిందీలో నటిగా పరిచయం అయినా, ఆ తరువాత శ్రీ అనే తెలుగు చిత్రంలో నాయకిగా ఎంట్రీ ఇచ్చారు. 2005లో విడుదలైన ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత తమిళంలోకి కేడీ చిత్రంతో దిగుమతి అయ్యారు. ఆ చిత్రం నిరాశ పరచింది. అలాంటిది కల్లూరి చిత్రంతో తొలి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత తెలుగు, తమిళం భాషల్లో వరసగా అవకాశాలను అందుకున్నారు. అయితే ఎక్కువగా ఈమె అందాలారబోతకే పరిమితం అయ్యారు. నిజం చెప్పాలంటే అదే తమన్నను పాపులర్ చేసింది. మధ్యలో కొన్ని నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించినా ఇప్పటి వరకూ గ్లామర్నే మెయిన్టైన్ చేస్తున్నారు. ఇటీవల రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన చిత్రంలోనూ తమన్న అందాల ప్రదర్శన ఆ చిత్రానికీ, ఆమెకు ప్లస్ అయ్యిందని చెప్పక తప్పదు. జైలర్ చిత్రంలో నువ్వు కావాలయ్యా అనే పాట యువతను ఉర్రూతలూగించింది. ఇకపోతే ఈ చిత్రంతో వచ్చిన క్రేజ్ను తమన్న పారితోషికం రూపంలో బాగానే వాడుకున్నారనే టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. జైలర్ చిత్రం కోసం ఈ బ్యూటీ రూ.3 కోట్లు పారితోషికం పుచ్చుకున్నట్లు సమాచారం. ఆ తరువాత తమన్న తమిళంలో నటించిన చిత్రం అరణ్మణై 4. నటి రాశీఖన్నా మరో నాయకిగా నటించిన ఈ చిత్రాన్ని సుందర్.సీ తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టాక్కు అతీతంగా మంచి వసూళ్లను సాధిస్తోంది. ఇకపోతే జైలర్ చిత్రం తరువాత తమన్న తన రెమ్యునరేషన్ను 30 శాతం పెంచినట్లు సమాచారం. అరణ్మణై 4 (తెలుగులో బాక్) చిత్రానికి రూ. 4 నుంచి రూ.5 కోట్ల మధ్యలో పుచ్చుకున్నట్లు ఇప్పుడు టాక్ స్ప్రెడ్ అవుతోంది. అలా విజయంతో తమన్నా రెమ్యునరేషన్కు రెక్కలోచ్చాయన్న మాట. నిజం చెప్పాలంటే తమన్నకు ప్రస్తుతం దక్షిణాదిలో అవకాశాలు లేవు. హిందీలో ఒకటి రెండు చిత్రాలు చేతిలో ఉన్నట్లుంది. ఏమైనా తమన్న లెక్కే వేరప్పా అంటున్నారు నెటిజన్లు. -
మనవడి బర్త్డే.. దగ్గరుండి కేక్ కట్ చేయించిన రజనీకాంత్
సూపర్స్టార్ రజనీకాంత్ ఏడు పదుల వయసు దాటినా ఎంతో హుషారుగా సినిమాలు చేస్తున్నాడు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, బెంగాలీ, హిందీ భాషల్లో కలిపి 170 చిత్రాలు చేశాడు. ప్రస్తుతం వేట్టైయాన్ సినిమా చేస్తున్నాడు. అలాగే మరో రెండు ప్రాజెక్టులు విన్నాడు. ఇకపోతే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే కుటుంబానికి పెద్ద పీట వేస్తుంటాడు.కూతురి కోసమే ఆ సినిమాలో..తన కుమార్తెలంటే రజనీకి ఎనలేని ప్రేమ. వారికోసం ఏదైనా చేస్తాడు. అందులో భాగంగానే ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన లాల్ సలామ్ సినిమాలో అతిథి పాత్రలో కనిపించేందుకు ఓకే చెప్పాడు. కానీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. కథ, పాత్ర గురించి ఆలోచించకుండా కేవలం కూతురి కోసమే ఆయన ఈ సినిమా చేశాడని అభిమానులు భావించారు.రజనీ పంచప్రాణాలురజనీ పంచప్రాణాలైన ఇద్దరు కూతుర్ల వైవాహిక జీవితం సజావుగా సాగలేదు. ఐశ్వర్య.. ధనుష్ను పెళ్లి చేసుకోగా రెండేళ్ల క్రితమే అతడితో విడిపోయింది. చిన్నకూతురు సౌందర్య 2010లో అశ్విన్ రామ్కుమార్ను పెళ్లాడింది. వీరికి 2015లో వేద్ కృష్ణ జన్మించాడు. ఆ మరుసటి ఏడాదే భార్యాభర్తలిద్దరూ విడాకులకు దరఖాస్తు చేశారు. 2017లో విడాకులు మంజూరయ్యాయి. తర్వాత ఆమె 2019లో నటుడు, బిజినెస్మెన్ విషగన్ను పెళ్లాడింది. వీరికి 2022లో వీర్ అనే కుమారుడు జన్మించాడు.వేద్ బర్త్డేతాజాగా సౌందర్య మొదటి కుమారుడు వేద్ బర్త్డే సెలబ్రేషన్స్ చెన్నైలో ఘనంగా జరిగాయి. క్రికెట్ థీమ్తో పుట్టినరోజు వేడుకలు జరిపారు. ఈ బర్త్డే ఈవెంట్కు రజనీ భార్య లతతో హాజరై మనవడితో కేక్ కట్ చేయించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.#Thalaivar at his grandson Ved birthday celebration ❤️❤️#Rajinikanth | #SuperstarRajinikanth | #superstar @rajinikanth | #Coolie | #Vettaiyan | #Jailer pic.twitter.com/tKvGGWrfjo— Suresh Balaji (@surbalu) May 19, 2024చదవండి: కమెడియన్తో రెండో పెళ్లి.. ఈ వయసులో అవసరమా? అని విమర్శలు.. స్పందించిన నటి -
'డబ్బు కోసమే 46 ఏళ్ల కమెడియన్తో పెళ్లి'.. నటి ఏమందంటే?
జైలర్ నటుడు, కమెడియన్ రెడిన్ కింగ్స్లీ గతేడాది పెళ్లి చేసుకున్నాడు. 46 ఏళ్ల వయసులో ప్రియురాలు, నటి సంగీత మెడలో మూడుముళ్లు వేశాడు. వివాహం తర్వాత తన ఫస్ట్ బర్త్డేను భార్యతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. అంత పెద్ద వయసులో ఉన్నవాడిని సంగీత పెళ్లి చేసుకోవడానికి కారణం డబ్బేనని చాలామంది విమర్శించారు. ఇకపోతే సంగీతకు ఇదేమీ ఫస్ట్ మ్యారేజ్ కాదు. రెండో పెళ్లిగతంలో ఆమె క్రిష్ను పెళ్లాడగా వీరికి ఒక పాప కూడా ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం సంగీత రెడిన్తో ప్రేమలో పడగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తన పెళ్లిపై వస్తున్న ట్రోల్స్పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందించింది. సంగీత మాట్లాడుతూ.. ఈ వయసులో పెళ్లి అవసరమా? అంటున్నారు. మా వయసు పెరగలేదుమానసికంగా నా వయసు 18, తన వయసు 22! మేము ఆ ఏజ్లోనే ఉన్నట్లు ఫీలవుతున్నాం. అది మీకు చెప్పినా అర్థం కాదు. ఇంకేమన్నారు.. డబ్బు కోసం పెళ్లి చేసుకున్నానా? అదెలాగో కాస్త వివరించి చెప్తారా? మీ వల్ల కాదు! అతడిలో నాకు నచ్చింది సింప్లిసిటీ! చాలా నిరాడంబరంగా ఉంటాడు. అది చూసే తనను పెళ్లి చేసుకున్నాను అని పేర్కొంది.కమెడియన్గా గుర్తింపుకాగా రెడిన్ కింగ్స్లీ.. కోలమావు కోకిల అనే తమిళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. నెల్సన్ డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లోనూ రెడిన్ యాక్ట్ చేశాడు. డాక్టర్ మూవీలో ఈయన పోషించిన భగత్ పాత్ర అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.సీరియల్స్- సినిమాలుఎల్కేజీ, అన్నాత్తె, బీస్ట్, కాతువాకుల రెండు కాదల్, మార్క్ ఆంటోని, మట్టి కుస్తీ, జైలర్ వంటి పలు సినిమాల్లో నవ్వులు పూయించాడు. సంగీత విషయానికి వస్తే అరన్మనైక్కిలి, తిరుమల్ వంటి సినిమాలు చేయగా సీరియల్స్లోనే ఎక్కువగా నటించింది. -
రష్మికకు ఆఫర్ల వరద.. చేతిలో ఇన్ని సినిమాలున్నాయా?
కన్నడలో కిరాక్ పార్టీ అనే చిత్రంతో నట జీవితాన్ని ప్రారంభించిన రష్మిక మందన్నా తర్వాత నేషనల్ క్రష్గా మారారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రముఖ నటుల సరసన నటిస్తూ క్రేజీ కథానాయికగా రాణిస్తున్నారు. చేతినిండా చిత్రాలు ఉన్నా మరిన్ని అవకాశాలు ఈమె వైపే చూస్తుండడం విశేషం. రష్మిక చేతినిండా సినిమాలు..ప్రస్తుతం పుష్ప 2, గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో, కుబేర చిత్రాల్లో నటిస్తున్నారు. హిందీలో చావ, సికిందర్ చిత్రాలు చేస్తున్నారు. అదే విధంగా తెలుగులోనూ విజయ్దేవరకొండతో మరోసారి కొత్త చిత్రంలో రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఇకపోతే తమిళంలో ఈమె నటించిన రెండు చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించలేదు. దీంతో ఇక్కడ ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్న రష్మిక మందన్నకు అవకాశాలు తలుపు తడుతున్నాయి. కోలీవుడ్లో మరో ఛాన్స్అలా త్వరలో సూర్యకు జంటగా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆమెను మరో అవకాశం వరించినట్లు తెలిసింది. శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించనున్న నూతన చిత్రంలో రష్మికను హీరోయిన్గా ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఫిల్మీదునియాలో టాక్. శివ కార్తికేయన్ ప్రస్తుతం కమల్ హాసన్ నిర్మిస్తున్న అమరన్ చిత్రం పూర్తి చేసి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. శివకార్తికేయన్ నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో డాన్ ఒకటి. ఈ మూవీ ద్వారా సిబి చక్రవర్తి దర్శకుడిగా పరిచయమయ్యారు. శివకార్తికేయన్తో వన్స్మోర్ఆ తర్వాత ఆయన రజనీకాంత్కు కథను సిద్ధం చేశారు. ఆ చిత్రంలో రజనీకాంత్ నటిస్తారని ప్రచారం జరిగినా, అది కార్య రూపం దాల్చలేదు. ఆ తర్వాత టాలీవుడ్ హీరో నానికి కథ చెప్పారు, అదీ వర్కౌట్ కాలేదు. దీంతో సిబి చక్రవర్తి తన తొలి చిత్ర కథానాయకుడు శివకార్తికేయన్ తోనే మరో చిత్రం చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో రష్మికను భాగం చేయాలనుకుంటున్నారట!చదవండి: 'మ్యాన్ ఆఫ్ మాసెస్'గా ఎన్టీఆర్ ఎలా ఎదిగాడు..? -
విజయ్ సినిమాలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్
కోలీవుడ్లో విజయ్ పేరు వింటేనే బాక్సాఫీస్ మారు మోగుతుంది. బయ్యర్ల గల్లాపెట్టెలు కళకళలాడతాయి. అందుకే ఈయన చిత్రాలు జయాపజయాలకు అతీతం అంటారు ట్రేడ్ వర్గాలు. ఆయన నటించిన లియో చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకున్నా బయ్యర్లను మాత్రం ఖుషీ చేసింది. ప్రస్తుతం విజయ్ 'ది గోట్' (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రంలో నటిస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఇది విజయ్ నటిస్తున్న 68వ చిత్రం. నటి మీనాక్షి చౌదరి నాయకిగా నటిస్తున్న ఇందులో స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్ ,ప్రేమ్జీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. విజయకాంత్ను ఇందులో కీలక పాత్రలో గ్రాఫిక్స్లో చూపించబోతున్నట్లు సమాచారం. నటి త్రిష, శివకార్తికేయన్ కూడా అతిథిపాత్రలో మెరవబోతున్నట్లు టాక్ వైరల్ అవుతుంది. లేకపోతే విజయ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న గోట్ చిత్రం షూటింగును పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి విజయ్ డబ్బింగ్ కూడా 50 శాతం పూర్తి చేసినట్లు తాజా సమాచారం. లేకుంటే ఈ చిత్రం తర్వాత విజయ్ హెచ్ వినోద్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇది విజయ్ నటించిన 69వ చిత్రం మాత్రమే కాకుండా ఇదే చివరి చిత్రం అనే ప్రచారం హోరెత్తుతోంది. కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కథానాయకిగా నటించేది ఎవరన్న విషయమే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇందులో కీర్తిసురేష్, సమంత నటిస్తారని ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది. పూజాహెగ్డే నటించే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. తాజాగా మరో హీరోయిన్ పేరు కూడా తెరపైకి వచ్చింది ఆమెనే నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ అపర్ణ బాలమురళి. అయితే వీరిలో ఎవరికి విజయ్ సరసన నటించే అదృష్టం లభిస్తుందన్నది త్వరలోనే తేలిపోతుంది. ఈ చిత్రాన్ని హెచ్ వినోద్ మాస్ ఎలిమెంట్స్ జోడించి పొలిటికల్ నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు సమాచారం. -
సింగర్ సుచిత్రకు లీగల్ నోటీసులు జారీ
సుచీ లీక్స్తో సింగర్ సుచిత్ర కోలీవుడ్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మాజీ భర్త కార్తీక్ గే అంటూ షాకింగ్ కామెంట్ చేసింది. ఆ విషయం తెలిసిన తర్వాతే ఆయనతో విడాకులు తీసుకున్నానని ఆమె బాంబ్ పేల్చింది. అంతటితో ఆగని సుచిత్ర ఈ వివాదంలోకి హీరో ధనుష్ను కూడా లాగింది. పూటుగా మద్యం సేవించి హీరో ధనుష్, కార్తీక్ ఒకే గదిలో ఉండేవారని తెలిపింది. ఆమె వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.తాజాగా సుచిత్రకు తన మాజీ భర్త కార్తీక్ లీగల్ నోటీసులు జారీ చేశాడు. తనపైనే కాకుండా హీరో ధనుష్పై కూడా పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు సుచిత్ర చేసిందంటూ ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును ఆశ్రయించాడు. ఇంటర్వ్యూ సమయంలో తన పట్ల పరువు నష్టం కలిగించేలా చేసిన వ్యాఖ్యలను వెంటనే తొలగించాలని, ఆపై అలాంటి వ్యాఖ్యలు మరోసారి ఆమె చేయకుండా చూడాలని తన లీగల్ టీమ్ ద్వారా ప్రత్యేకంగా డిమాండ్ చేశాడు.సుచిత్రతో పాటు ఇంటర్వ్యూ హోస్ట్ చేస్తున్న రెండు యూట్యూబ్ ఛానెల్స్కు కూడా కార్తిక్ లీగల్ నోటీసులు పంపాడు. సదరు యూట్యూబ్ ఛానెల్లు విడుదలచేసిన వీడియోలు పూర్తిగా తమ పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయని, వెంటనే ఆ ఛానెల్లను రద్దు చేయాలని నోటీసులో పేర్కొన్నాడు. సుచిత్ర ఇప్పటికే త్రిష, కమల్ హాసన్, వనిత విజయ్ కుమార్ వంటి వారందరిపై ఆమె తీవ్రమైన విమర్శలు చేస్తూ వచ్చింది. -
రజనీ 172వ సినిమా లైన్లో..! గ్రీన్ సిగ్నల్ పడితే..!
సూపర్స్టార్ రజనీకాంత్ ఇటీవలే తన 170వ చిత్రం వేట్టైయాన్ను పూర్తిచేశారు. ఇందులో ఈయన మాజీ పోలీస్ ఎన్కౌంటర్గా నటించినట్లు సమాచారం. అమితాబ్బచ్చన్, రానా వంటి ప్రముఖ నటులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని జై భీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో లైకా సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే రజనీ 172 మూవీ!ప్రస్తుతం రజనీకాంత్ తన 171వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కూలీ అనే టైటిల్ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం వచ్చే నెలలో సెట్పైకి వెళ్లనుంది. తాజాగా రజనీకాంత్ 172వ చిత్రానికి సంబంధించిన వార్త తెరపైకి వచ్చింది. దీన్ని వేల్స్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి కే.గణేశ్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. శింబు గురించి ఏమన్నారంటే?ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఈయన ప్రస్తుతం హిప్హాప్ ఆది హీరోగా పీటీసార్ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. చెన్నైలో నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో శింబుపై నిర్మాతల మండలిలో ఫిర్యాదు గురించి అడిగిన ప్రశ్నకు ఐసరి గణేశ్ బదులిస్తూ శింబు తన చిత్రం 'కరోనాకుమార్'లో నటిస్తే ఎలాంటి సమస్య ఉండదన్నారు.గ్రీన్సిగ్నల్ ఇవ్వగానే షురూఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇకపోతే త్వరలో రజనీకాంత్ హీరోగా చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఆయన గ్రీన్సిగ్నల్ ఇవ్వగానే తలైవా 172వ చిత్రం ప్రారంభం అవుతుందని ఐసరి గణేశ్ పేర్కొన్నారు. -
ఎందుకిలా చేస్తున్నారు.. ఎవరికీ ఇంటర్వ్యూలు ఇచ్చేది లేదు!: సుచిత్ర
సింగర్ సుచిత్ర గతంలో సుచీలీక్స్ పేరిట హీరోల పర్సనల్ ఫోటోలను లీక్ చేసి సెన్సేషన్ అయింది. చాలాకాలం తర్వాత ఈ మధ్యే ఓ యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వగా మరోసారి పలువురు సెలబ్రిటీల బండారాన్ని బయటపెట్టింది. ధనుష్- ఐశ్వర్య ఇద్దరూ పెళ్లయినప్పటి నుంచే ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారంది. షారుక్ఖాన్ గే అంది. వాటిపైనే ఆసక్తితన భర్త కార్తీక్ కూడా గే అని, ఈ విషయం ఎంతో ఆలస్యంగా తెలుసుకున్నట్లు చెప్పింది. కమల్ హాసన్ పార్టీలో డ్రగ్స్ వాడతారంది. సినీ విశ్లేషకుడు బైల్వాన్ రంగనాథన్పైనా విమర్శలు గుప్పించింది. అయితే తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తూ తన గురించి తప్పుడు వార్తలు రాస్తున్నారని మండిపడింది సుచిత్ర. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో షేర్ చేసింది. యూట్యూబ్ ఛానల్స్ నా వ్యక్తిగత విషయాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. అనిరుధ్తో..వారికి నచ్చింది రాసుకుంటూ, ఇష్టారీతిన థంబ్నైల్స్ పెడుతూ వ్యూస్ తెచ్చుకుంటున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. సుచిత్ర ధనుష్తో ఉంది.. అనిరుధ్తో కూడా గదిలోకి వెళ్లింది.. ఇలాంటి చెత్త థంబ్నైల్స్ పెడుతున్నారు. అందుకే ఇక మీదట యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాను. కేవలం టీవీ ఛానల్స్కు మాత్రమే ఇంటర్వ్యూ ఇస్తాను అని సుచిత్ర చెప్పుకొచ్చింది.చదవండి: తాగొచ్చి భార్యను కొట్టేవాడు.. చందు మారతాడనుకుంటే.. -
స్టార్ హీరో సినిమాలో సునీల్కు ఛాన్స్.. అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు
టాలీవుడ్లో తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకుల్లో గిలిగింతలు పెట్టించే నటుడు సునీల్. తెలుగులో హీరోగాను పలు సినిమాల్లో మెప్పించిన ఆయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి పుష్పతో మళ్లీ స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సౌత్ ఇండియాలో బిజీగా ఉన్నారు. కోలీవుడ్లోనూ వరుస అవకాశాలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో రజనీకాంత్ 'జైలర్', కార్తి 'జపాన్', విశాల్ 'మార్క్ అంథోని' చిత్రాల్లో విభిన్న పాత్రల్లో ఆయన మెప్పించాడు.తాజాగా సునీల్ మలయాళ పరిశ్రమలో కూడా ఎంట్రీ ఇచ్చేశారు. అయితే, హాస్యనటుడిగా కాకుండా విలన్గా అతడు మాలీవుడ్లోకి అడుగుపెట్టబోతున్నాడు. 'భ్రమయుగం' తర్వాత మమ్ముట్టి లేటెస్ట్ మూవీ టర్బోలో సునీల్ విలన్గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన సునీల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.సీరియస్ లుక్లో ఉన్న సునీల్.. టర్బో సినిమాలో ఆటో బిల్లా అనే క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు వెల్లడించాడు. ఇప్పటికే కోలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సునీల్.. మాలీవుడ్లో కూడా తన సత్తా ఎంటో చూపించబోతున్నాడు. మే 23న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో మమ్ముట్టినే నిర్మించాడు. తన సొంత బ్యానర్లో టర్బో సినిమా రానున్నడంతో అభిమానుల్లో అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుంది.Sunil as Auto Billa#Turbo in Cinemas Worldwide on May 23 , 2024 pic.twitter.com/DA4tjNUQbI— Mammootty (@mammukka) May 17, 2024 -
విజయ్ సేతుపతి కొత్త సినిమా.. టీజర్ చూశారా?
అభిమానుల గుండెల్లో మక్కల్ సెల్వన్గా నిలిచిపోయిన విజయ్ సేతుపతి పాన్ ఇండియా నటుడిగానూ సత్తా చాటుతున్నారు. ఆ మధ్య హిందీలో షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ చిత్రంలో విలన్గా అదరగొట్టారు. ప్రస్తుతం ఆయన నటించిన తమిళ చిత్రం మహారాజ త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇది ఆయన నటించిన 50వ చిత్రం కావడం గమనార్హం.హీరోయిన్ ఎవరంటే?తన 51వ చిత్రానికి ఏస్ అనే టైటిల్ను ఖరారు చేశారు. రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుండగా యోగిబాబు, పీఎస్. అవినాష్, దివ్యా పిళ్లై, బబ్లు, రాజ్కుమార్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆర్ముగకుమార్ దర్శకత్వంలో 7సీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని, కరణ్ బహదూర్ చాయాగ్రహణాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్లుక్ పోస్టర్ను శుక్రవారం విడుదల చేశారు. కలర్ఫుల్ పోస్టర్ఇందులో విజయ్ చేతిలో సిగార్, వెనుక భాగంలో స్మిమ్మింగ్ టబ్, చుట్టూ చదరంగం డైస్తో పోస్టర్ కలర్ఫుల్గా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో యోగిబాబు చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది. Presenting the quirky Title Teaser of #ACE🔥Not just a card but a Game Changer!😎#MakkalSelvan #VijaySethupathi51 @VijaySethuOffl @7CsPvtPte @Aaru_Dir @justin_tunes @rukminitweets @iYogiBabu #BablooPrithiveeraj #KaranBRawat #Avinashbs @R_Govindaraj @rajNKPK pic.twitter.com/F2O6A0RDo1— 7Cs Entertaintment (@7CsPvtPte) May 18, 2024 చదవండి: ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది -
అలాంటి సీన్స్ నా వల్ల కాదు.. కొందరు దర్శకులు కావాలనే..
ఇండస్ట్రీలోకి వచ్చి చాన్నాళ్ల అవుతున్నప్పటికీ తమిళ యువ హీరోయిన్ ధన్సికకు సరైన బ్రేక్ రాలేదు. దీంతో తన పేరుని సాయి ధన్సికగా మార్చుకుంది. త్వరలో 'ది ప్రూఫ్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించబోతున్న ఈమె.. ఈ చిత్ర ప్రమోషన్ల భాగంగా ముద్దు, బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.(ఇదీ చదవండి: హీరోయిన్ పూజా హెగ్డేకి బంపరాఫర్.. ఏకంగా 10 ఏళ్ల తర్వాత!)'మనదోడు మళైక్కాలం' సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ధన్సిక.. పలు చిత్రాల్లో నటించింది. కానీ రజినీకాంత్ 'కబాలి'లో ఆయనకు కూతురిగా చేసిన తర్వాత పాపులారిటీ దక్కించుకుంది. ఆ తర్వాత సినిమాలు చేస్తోంది గానీ సక్సెస్ మాత్రం రావడం లేదు. దీంతో తన పేరుని ధన్సిక నుంచి సాయి ధన్సికగా మార్చుకుంది. మరి ఈసారైనా ఆమె కోరుకున్న హిట్ వస్తుందేమో చూడాలి.ఇకపోతే తాను గ్లామర్ పాత్రల్లో నటించలేనని, ఎందుకంటే అలాంటి పాత్రలకు తాను సెట్ అవ్వనని సాయి ధన్సిక చెప్పింది. కావాలనే కొందరు దర్శకులు తనపై గ్లామర్ ముద్రని బలవంతంగా రుద్దుతారు. గ్లామర్గా నటించడం అనేది కథని బట్టి ఉంటుందని ధన్సిక చెప్పింది. తనకు బెడ్రూమ్, ముద్దు సన్నివేశాల్లో నటించడం ఇష్టం ఉండదని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: సీరియల్ నటి పవిత్రా జయరాం కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!) -
సూర్య 'కంగువా'.. ఆ సీన్ కోసం ఏకంగా పదివేలమందిని!
కోలీవుడ్ స్టార్ సూర్య నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం కంగువా. శివ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకుంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వార్ సీన్ ఏకంగా 10 వేల మందితో తీసినట్లు తెలుస్తోంది. సూర్య, బాబీ డియోల్ మధ్య ఓ భారీ యుద్ధ సీక్వెన్స్ షూట్ చేసినట్లు సమాచారం. దీంతో ఆడియన్స్కు కళ్లు చెదిరే యాక్షన్ ఎంటర్టైనర్గా కంగువా ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.ఈ సినిమాలో సూర్య డ్యుయల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. కాగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ సినిమా ద్వారానే తమిళ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. మరో బాలీవుడ్ నటి దిశా పటానీ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా.. జగపతి బాబు, యోగి బాబు, నటరాజన్ సుబ్రమణ్యం, కేఎస్ రవికుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ఈ కొత్తరకం స్నాక్స్ వంటకాలు.. ట్రై చేయండిలా..!
డ్రగ్స్ కేసులో ప్రముఖ సింగర్ అరెస్ట్
టీ20 ప్రపంచకప్ కోసం న్యూయార్క్కు బయల్దేరిన టీమిండియా
పెళ్లి కోసం అబ్బాయిని తీసుకెళ్లినా.. ఇంట్లో వాళ్లు నమ్మేలా లేరు: అంజలి
ఈ మినీ మెషిన్తో.. స్కిన్ సమస్యలకు చెక్!
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
'సలార్ 2' పక్కన పెట్టేశారని రూమర్స్.. ఒక్క ఫొటోతో క్లారిటీ
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్ధం
Viral Video: నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. కార్లు, కత్తులతో ఫైటింగ్
ఓటీటీ లవర్స్కు జియో సినిమా బంపరాఫర్
తప్పక చదవండి
- టీ20 ప్రపంచకప్ కోసం న్యూయార్క్కు బయల్దేరిన టీమిండియా
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి?.. ఖర్గే చమత్కారం
- Viral Video: నడిరోడ్డుపై గ్యాంగ్ వార్.. కార్లు, కత్తులతో ఫైటింగ్
- ఓటీటీ లవర్స్కు జియో సినిమా బంపరాఫర్
- చరిత్ర సృష్టించిన షకీబ్.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడిగా..!
- Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'!
- బ్యాన్ చేసిన వారే ఆమె టాలెంట్కు నివ్వెరపోయారు
- సెలక్ట్ చేసి చివరి నిమిషంలో హ్యాండిచ్చేవారు: హీరోయిన్
- ఇన్సూరెన్స్ లైసెన్స్ అప్లికేషన్ను విత్ డ్రా.. పేటీఎం మరో కీలక నిర్ణయం
- క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావా
Advertisement