-
‘నన్ను పాస్ అవమంటారు.. మరి నాన్నేం చేశారు?’
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఎవరి రహస్యాలూ దాగడం లేదు. ఓ కుర్రాడు తన తండ్రికి సంబంధించిన ఓ రహస్యాన్ని బయటపెట్టాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ కుర్రాడు తండ్రి భద్రంగా దాచుకున్న అతని 10వ తరగతి మార్కు షీట్ను సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఇందులో అన్ని సబ్జెక్టుల్లో తండ్రి ఫెయిల్ అయ్యాడు. ఆ మార్క్ షీట్ ఫోటోకు క్యాప్షన్గా ‘తన తండ్రి మార్క్ షీట్ దొరికింది’ రాశాడు.ఆ కుర్రాడు వీడియోలో ‘మా నాన్న నాతో తరచూ పాస్ కావాలని చెబుతుంటారని, అయితే ఇప్పుడు చూడండి మా నాన్న మార్క్స్షీట్.. అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు. ఈ వీడియోను చూసినవారంతా నవ్వకుండా ఉండలేకపోతున్నారు.ఈ మార్క్షీట్ను @desi_bhayo88 పేరిట సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఈ పోస్టును ఇప్పటివరకూ ఐదు లక్షల మంది చూడగా, ఐదు వేల మంది లైక్ చేశారు. ఈ పోస్ట్పై పలువురు కామెంట్లు కూడా చేశారు. ఒక యూజర్ ఇప్పటితో పోల్చిచూస్తే సీబీఎస్ఈ బోర్డులో తండ్రి ఫెయిల్ అయిన మార్కులు 90 శాతానికి సమానం అని రాశారు. మరొకరు ఫెయిల్ అయితే ఏమవుతుందో తెలుసు కనుకనే పాస్ కావాలని చెప్పారని రాశారు. Pitaji ki marksheet mil gayi 😂 pic.twitter.com/3dXn0yKJh1— Desi Bhayo (@desi_bhayo88) April 19, 2024 -
మార్కులు చూసి మూర్చబోయిన విద్యార్థి.. ఐసీయూలో చేరిక
మీరట్: పదో తరగతి పరీక్షల్లో తనకు వచ్చిన మార్కులు చూసి మూర్చపోయి ఐసీయూలో చేరాడో విద్యార్థి. ఉత్తర ప్రదేశ్లోని మీరట్కు చెందిన 10వ తరగతి విద్యార్థి తనకు బోర్డు పరీక్షల్లో చెప్పుకోదగ్గ 93.5 శాతం మార్కులు రావడంతో ఉప్పొంగిపోయాడు. రిజల్ట్స్ చూసి కుప్పకూలిపోవడంతో ఐసీయూలో చేర్చవలసి వచ్చింది.ఉత్తర ప్రదేశ్ బోర్డ్ హైస్కూల్ లేదా 10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఫలితాలను శనివారం ప్రకటించింది. 10వ తరగతి విద్యార్థులు 89.55 శాతం ఉత్తీర్ణత సాధించగా, 12వ తరగతి విద్యార్థులు 82.60 శాతం ఉత్తీర్ణత సాధించారు.మీరట్లోని మోడిపురం మహర్షి దయానంద్ ఇంటర్ కాలేజ్కు చెందిన అన్షుల్ కుమార్ తన పరీక్షలలో 93.5 శాతం మార్కులు సాధించాడు. అయితే, ఫలితాలను చూడగానే అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయాడు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు అన్షుల్ తండ్రి, పోస్టాఫీసులో కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేసే సునీల్ కుమార్ తెలిపారు. కాగా అన్షుల్ పరిస్థితి ప్రస్తుతం కుదటపడినట్లు తెలిసింది. -
ఫలితాల్లో సర్కార్ కాలేజీల సత్తా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో ప్రైవేటు కాలేజీలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ కాలేజీలు సత్తా చాటాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం తగ్గినా అత్యధిక మార్కులు కైవసం చేసుకున్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ గురుకులాలు, కేజీబీవీలు ప్రైవేటు కాలేజీలను మించి ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల నుంచి 77,022 మంది పరీక్ష రాస్తే 37,842 (49.13%) పాసయ్యారు.గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల నుంచి 80,331 మంది విద్యార్థులు ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయగా 59,530 (74.11%) మంది పాసయ్యారు. ప్రైవేటు కాలేజీల నుంచి 3,44,724 మంది పరీక్షలు రాస్తే వారిలో 2,23,911 (65.24%) మందే పాసవడం గమనార్హం. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థుల్లో కొందరు రాష్ట్రంలోనే అత్యధిక మార్కులు సాధించారు. -
పరీక్షల్లో మ్యాజిక్ చేసిన ట్విన్స్ : ఇలా కూడా ఉంటారా?
కర్ణాటకలోని హాసన్ ప్రాంతానికి చెందిన కవల అక్కాచెల్లెళ్లు మరోసారి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. రెండు నిమిషాల తేడాతో పుట్టిన ట్విన్స్ చుక్కి, ఇబ్బని ఒకే పోలికలతో ఉంటారు. అంతేకాదు పరీక్షా ఫలితాల్లో కూడా ఒకేలా మార్కులు తెచ్చుకోవడం విశేషంగా నిలిచింది. కర్ణాటకలో విడుదలైన 12వ తరగతి పరీక్షలలో ఇద్దరికీ సమానంగా మార్కులు వచ్చాయి. 600 మార్కులకు గాను ఇద్దరూ 571 మార్కులు సాధించారు. అంతే కాదు గతంలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఇలాంటి మ్యాజిక్కే జరిగింది.ఇద్దరూ 625 మార్కులకు 620 మార్కులు తెచ్చు కున్నారు. దీంతే భలే అదృష్టం అంటూ నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. సాధారణంగా కవలలు ఒకేలాగా ఆలోచించడం, ఒకేసారి శారీరక సమస్యలు రావడం చూస్తాం. కానీ పరీక్షల్లో కూడా ఒకేలా మార్కులు రావడం అదృష్టం అంటూ వ్యాఖ్యానించారు. ఇద్దరికీ 97 శాతం మార్కులొస్తాయని ఆశించాం. కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించ లేదని పెద్ద అమ్మాయి అయినా చుక్కి సంతోషం ప్రకటించింది. తమకూ ఇది ఆశ్చర్యకరంగా ఉందని తెలిపింది. రెండేళ్ల క్రితం పదో తరగతిలో కూడా ఇలానే సమాన మార్కులు సాధించా మని చెప్పుకొచ్చింది. చుక్కి, ఇబ్బని కర్ణాటకలోని హసన్ నగరంలో ఎన్డిఆర్కె పియు కాలేజీలో 12వ తరగతిపూర్తి చేశారు. ప్రస్తుతం నీట్కోసం సిద్ధమవుతున్నారు. నీట్ పరీక్షలో వచ్చిన ఫలితాన్ని ఇంజనీరింగ్, మెడిసిన్ అనేది నిర్ణయించుకుంటారట. మీరిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడు తున్నారా..? అని ప్రశ్నించగా నా కంటే అక్క ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే నేను ఎలా సంతోషిస్తానో అక్క కూడా అంతే.. ఇద్దరికీ పోటీ ఏమీ లేదు అని చెప్పింది. కేవలం చదువులు మాత్రమే కాకుండా సంగీతం, నృత్యం, అలాగే ఆటల్లో కూడా ముందుంటాం అని చెప్పారు. ఇద్దరిదీ ఒకే ఆశయమట. అటు తండ్రి వినోద్ చంద్ర తన బిడ్డలు సాధించిన ఘనతపై ఆశ్చర్యాన్ని ప్రటకించారు. ఇది తనకు గర్వకారణమని చెప్పారు ఇబ్బానీ తన సోదరి కంటే భాషలలో మెరుగ్గా స్కోర్ చేసిందనీ, సైన్స్, మిగిలిన సబ్జెక్టులలో ఒకటి నుండి రెండు మార్కులే తేడా అని చెప్పారు. వాళ్ళు కలిసే పనులు చేసుకుంటారు స్నేహంగా ఉంటారు. కలిసే చదువుకుంటారు. ఒకవిధంగా చెప్పాలంటే ఇద్దరూ పుస్తకాల పురుగులు అని తెలిపారు చంద్ర ఒకింత గర్వంగా. -
ఉద్యోగులకు బాబు మార్క్ దగా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులు, ఇంక్రిమెంట్ల కోసం రాసే డిపార్ట్మెంటల్ టెస్టుల్లో వారు పాసవకుండా గత చంద్రబాబు సర్కారు అడ్డుకుంది. అందుకోసం ప్రత్యేకంగా జీవోను సైతం జారీ చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చే దాకా ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించిన అన్ని డిపార్ట్మెంటల్ టెస్టుల్లోనూ గరిష్టంగా 4 నుంచి 6 శాతం మాత్రమే పాసయ్యారంటే ప్రభుత్వ ఉద్యోగులపై చంద్రబాబుకున్న ప్రేమ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఏపీపీఎస్సీ ఏటా రెండుసార్లు డిపార్ట్మెంటల్ టెస్టులు నిర్వహిస్తుంది. సరీ్వస్ కమిషన్ ద్వారా భర్తీ చేసిన పోస్టుల్లో చేరిన అభ్యర్థులు ప్రొబేషన్లో ఉంటారు. వారి ప్రొబేషన్ పూర్తవ్వాలంటే సరీ్వస్ టెస్ట్ పాసవ్వాలి. ఫెయిలైతే వారు ప్రొబేషన్లోనే కొనసాగుతారు. టెస్ట్ పాసైనవారు మాత్రం సీనియారిటీలోకి వెళ్లిపోతారు. అలాగే ఇతర డిపార్ట్మెంట్లలో పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందేందుకు కూడా డిపార్ట్మెంటల్ టెస్టు పాసవ్వాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు సరీ్వసులో సీనియారిటీలోనూ ముందుంటారు. జీవో నం.101తో ఉద్యోగులకు మేలు ప్రభుత్వ ఉద్యోగుల వయసు రీత్యా గతంలో డిపార్ట్మెంటల్ టెస్టులను ఆఫ్లైన్లో డ్రి స్కిప్టివ్ విధానంలో నిర్వహించేవారు. ఉద్యోగులు నిబంధనల ప్రకారం పుస్తకాలను చదివి, సరైన జవాబులను రాసేవారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం డిపార్ట్మెంట్ టెస్టును మల్టీపుల్ చాయిస్ విధానంలో మార్చి ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టింది. మైనస్ మార్కు విధానాన్ని తీసుకొచ్చి ప్రతి తప్పు సమాధానానికి 1/3 (0.33 శాతం) మార్కులు కోత విధించారు. దీంతో పెద్ద వయసులో ఉన్న ఉద్యోగులు ఆన్లైన్, మల్టీపుల్ చాయిస్ విధానంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని ఈ విధానంతో 2017–19 సంవత్సరాల మధ్య తాము ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు కోల్పోతున్నామని, నెగిటివ్ మార్కుల విధానం రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. అయినా నాటి ప్రభుత్వం పట్టించుకున్నది లేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక డిపార్ట్మెంటల్ పరీక్షల్లో మైనస్ మార్కులను తొలగించాలని అభ్యరి్థస్తూ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు సర్వీస్ కమిషన్కు అనేక విజ్ఞప్తులు అందజేశాయి. దీనిపై సమగ్రంగా అధ్యయనం చేసిన అనంతరం ఉద్యోగులకు మేలు చేసేందుకు మైనస్ మార్కుల విధానం రద్దు చేస్తూ జీవో నం.101 జారీ చేసింది. దీంతో ఇప్పుడు డిపార్ట్మెంటల్ టెస్టుల్లో 85 శాతం పైగా ఉత్తీర్ణత సాధించి, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా.. ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానాన్ని ప్రోత్సహించేందుకు చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారు. వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రాకుండా అడ్డుకునేందుకు 2017లో జీవో నం.55ను విడుదల చేసి డిపార్ట్మెంటల్ టెస్టుల్లో ‘మైనస్ మార్కు’లను అమల్లోకి తెచ్చారు. దాంతో గతంలో ఏటా సర్వీస్ కమిషన్ నిర్వహించే ఈ పరీక్షల్లో 60 శాతం మంది ఉత్తీర్ణులైతే.. జీవో నం.55 వచ్చాక ఆ సంఖ్య 4–6 శాతం మించలేదు. కొన్ని విభాగాల డిపార్ట్మెంటల్ టెస్టుల్లో ఒక్క శాతం కూడా పాసవలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ జీవోతో దాదాపు ఉద్యోగులు మూడేళ్లపాటు తమ పదోన్నతులు, ఇంక్రిమెంట్ అవకాశాలను కోల్పోయారంటే ఆశ్చర్యం కలుగుతుంది. -
మార్కుల డివిజన్ ప్రకటించం
సాక్షి, న్యూఢిల్లీ: 10, 12 తరగతుల మార్కుల ఫలితాల్లో ఇకపై డివిజన్, డిస్టింక్షన్ను ప్రకటించబోమని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) పేర్కొంది. మెరిట్ లిస్టును ప్రకటించే విధానానికి గతంలోనే స్వస్తి చెప్పిన బోర్డు తాజాగా డివిజన్, డిస్టింక్షన్పై నిర్ణయాన్ని వెలువరించింది. ఈమేరకు సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ భరద్వాజ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మార్కుల శాతాన్ని లెక్కించడం, ప్రకటించడం వంటివి బోర్డు ఇకపై చేయదని స్పష్టం చేశారు. ఉన్నత చదువులకు మార్కుల శాతం అవసరమనిపిస్తే సదరు సంస్థ వాటిని గణించుకోవచ్చని వివరించింది. ఒకవేళ విద్యార్థి అయిదుకు మించి సబ్జెక్టులను ఎంచుకున్నట్లయితే..వాటిలో అయిదు ఉత్తమ సబ్జెక్టులను గుర్తించడంపై సంబంధిత ఉన్నత విద్యా సంస్థ లేదా యజమాని నిర్ణయం తీసుకోవచ్చని భరద్వాజ్ తెలిపారు. 10, 12వ తరగతి సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు 2024 ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మొదలవుతాయని తెలిపారు. -
హాజరుకూ మార్కులు!
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థులను కళాశాలకు రప్పించే విధానానికి ఉన్నత విద్యా మండలి శ్రీకారం చుట్టబోతోంది. సమగ్ర నిరంతర మూల్యాంకన విధానంలో భాగంగా వారి హాజరుకూ మార్కులివ్వనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ఈ ఏడాది దీన్ని ప్రయోగాత్మకంగా చేపట్టగా, మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిసింది. ఈ నేపథ్యంలోనే డిగ్రీ స్థాయిలోనూ దీన్ని అమలులోకి తేవాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించారు. అకడమిక్ మార్కులే కాకుండా, వాస్తవ ప్రతిభను వెలికి తీయడం దీని ముఖ్యోద్దేశమని మండలి అధికారులు చెబుతున్నారు. మూల్యాంకన విధానంపై అధ్యయనానంతరం ఇండియన్ బిజినెస్ స్కూల్ (ఐఎస్బీ)చేసిన సిఫారసులకు విశ్వవిద్యాలయాల వీసీలూ ఆమోదం తెలిపారు. ఐఎస్బీ అభిప్రాయ సేకరణ అధ్యయనంలో భాగంగా ఐఎస్బీ రాష్ట్రవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ చేసింది. 258 కాలేజీల అధ్యాపకుల మనోగతాన్ని పరిశీలించింది. 692 మంది విద్యార్థులతో మూల్యాంకన విధానంపై చర్చించింది. విద్యార్థి ప్రతిభను అంచనా వేయాలని 41 శాతం మంది అభిప్రాయపడ్డారు. థియరీ ద్వారా మార్కులు నిర్ణయించే ప్రస్తుత విధానం కన్నా సమర్థవంతమైంది కావాలని 82 శాతం తెలిపారు. ఉపాధి కోర్సుల అవసరం ఉందని 24 శాతం మంది పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం డిగ్రీ స్థాయిలో నైపుణ్యం పెంచాలని 38 శాతం తెలిపారు. డిగ్రీ క్లాసులకు హాజరయ్యేలా విద్యార్థులను ప్రోత్సహించాలని 76 శాతం అధ్యాపకులు పేర్కొన్నారు. కొత్త అంశాల అన్వేషణకు క్లాస్ రూం వేదిక కావాలని 84 శాతం మంది ఆకాంక్షించారు. ఈ అభిప్రాయాల ఆధారంగానే ఐఎస్బీ కొన్ని సిఫార్సులు చేసింది. ముఖ్యంగా హాజరు తప్పనిసరి చేయడమే కాకుండా, క్లాసు రూంలో వివిధ బోధన పద్ధతులను సూచించింది. ప్రతి 20 రోజులకు విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా పరీక్షలుండాలని స్పష్టం చేసింది. ప్రతి అంశానికీ మార్కులు సంవత్సరం మొత్తంలో 75 శాతానికి పైగా హాజరు ఉన్న వారికి 10 మార్కులు ఇవ్వాల్సిన అవసరాన్ని ఐఎస్బీ ప్రస్తావించింది. యాక్టివ్గా ఉండే విద్యార్థులను వెలికితీయడం, వారు ఏ అంశాల్లో ఆసక్తిగా ఉన్నారనేది అధ్యాపకుడు గుర్తించాలి. దీనికీ కొన్ని మార్కులు నిర్దేశించారు. మంచి సంస్థలను గుర్తించి, అక్కడే ప్రాజెక్టు వర్క్ చేయాలి. ప్రాజెక్టు వర్క్లో నైపుణ్యానికి మార్కులుంటాయి. నెలకు కనీసం నాలుగు క్విజ్లు, వివిధ అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, మార్కులివ్వాలి. ఈ విధానం ఎలా ఉండాలనేది ఆయా యూనివర్సిటీలు నిర్ణయిస్తాయి. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అనుసంధానం పెంచడం, ఇంటర్న్షిప్, ప్రాంగణ నియామకాల కల్పనకు ఒక వెబ్ పోర్టల్ ఏర్పాటును వర్సిటీలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి వారం విద్యార్థి ప్రతిభకు మార్కులు నిర్ణయించి, వాటిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరుస్తారు. ప్రతి యూనివర్సిటీలోనూ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ ఎవాల్యుయేషన్ అండ్ అసెస్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. డిగ్రీ స్థాయిలోనూ పరిశోధన సంస్కృతికి ఊతం ఇవ్వడం కొత్త విధాన లక్ష్యం. కృత్రిమ మేధ కోర్సులు, డేటాసైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్స్ కోర్సులను పెద్ద ఎత్తున డిగ్రీలో చేపట్టాలని ఐఎస్బీ సిఫారసు చేసింది. గుణాత్మక మార్పుకు దోహదం దేశంలోనే తొలిసారి నిరంతర మూల్యాంకన విధానం ఈ ఏడాది ప్రవేశపెట్టాం. పీజీ (నాన్– ఇంజనీరింగ్) కోర్సుల్లో దీన్ని అమలు చేస్తున్నారు. దీనికోసం సాఫ్ట్వేర్ కూడా రూపొందించాం. ప్రశ్నపత్రాల రూపకల్పనపై అన్ని వర్గాల ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. ఇబ్బందులుంటే చర్యలు చేపడుతున్నాం. గుణాత్మక మార్పునకు ఇది దోహదపడుతుందని ఆశిస్తున్నాం. దీన్ని డిగ్రీ స్థాయికీ విస్తరించాలనే కృతనిశ్చయంతో ఉన్నాం. – ప్రొఫెసర్ డి.రవీందర్ (వీసీ, ఉస్మానియా యూనివర్సిటీ) -
‘నారాయణ’ కళాశాలలో ఇంటర్ విద్యార్థి బలవన్మరణం
మీర్పేట: ‘సారీ అమ్మానాన్న.. ఇదే నా చివరి రోజు. మార్కులు ఎక్కు వగా తెచ్చుకోవాలని కళాశాల యాజమాన్యం చేస్తున్న ఒత్తిడి తట్టుకోలేక చనిపోతున్నా’ అంటూ సూసైడ్ లెటర్ రాసి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. మీర్పేటలోని గౌతంనగర్కు చెందిన పాల వ్యాపారి మంచన ఆనంద్, కృష్ణవేణి దంపతుల పెద్ద కుమారుడు వైభవ్ (16) చైతన్యపురిలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ (ఎంపీసీ) చదువుతున్నాడు. అప్పుడప్పుడూ వ్యాపారంలో తండ్రికి చేదోడువాదోడుగా ఉండే వైభవ్ మంగళవారం తెల్లవారుజామున పని ముగించుకొని కళాశాలకు వెళ్తానని ఇంటికి వచ్చాడు. అనంతరం బెడ్రూంలోకి వెళ్లి ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని సమీపంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇంట్లో లభించిన సూసైడ్ నోట్లో ‘మంచి మార్కులు తెచ్చుకోవాలని టీచర్లు, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ ఒత్తిడి, టార్చర్ చేస్తున్నారు. సారీ అమ్మానాన్న, తమ్ముడు.. దయచేసి ఎవరూ నారాయణ కళాశాలలో చేరొద్దు. ఇదే నా జీవితంలో చివరి రోజు. దయచేసి విద్యార్థులపై ఒత్తిడి చేయొద్దు. నా తమ్ముడిని మంచి కళాశాలలో చేర్పించండి. అతని భవిష్యత్తు బావుండాలని కోరుకుంటున్నా. చివరగా ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్కు క్షమాపణలు’ అని లేఖలో రాశాడు. దీంతో నారాయణ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ మృతుడి బంధువులు, స్థానికులు, ఏబీవీపీ నాయకులు పోలీస్స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్పై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ కిరణ్కుమార్ తెలిపారు. -
69 మంది పదో తరగతి విద్యార్థుల సర్టిఫికేట్లలో ఒకే ఫొటో..
ఒడిశా: సెకంటరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన పదో తరగతి సర్టిఫికేట్లలో 69 మంది విద్యార్థులకు ఒకే ఫొటో వచ్చింది. దీంతో చిన్నారులు ఆందోళనకు గురయ్యారు. కటక్ జిల్లాలోని నిశింతకోహిలీ మండలంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సర్టిఫికేట్లలపై వేరొకరి ఫొటో ఉన్న కారణంగా ఉన్నత విద్య కోసం కాలేజీల్లో అడ్మిషన్లు రద్దవుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 69 మంది విద్యార్థుల సర్టిఫికేట్లలో వేరొకరి ఫొటో వచ్చింది. అందరి మెమోలపై ఒకరి ఫొటోనే రిపీట్ అయింది. సమ్మేటివ్ అసెస్మెంట్లో తప్పుగా ఉన్న అడ్మిట్ కార్డులు వచ్చినప్పుడే విషయాన్ని పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లామని బాధిత విద్యార్థులు తెలిపారు. ఆ తప్పును రెండో సమ్మేటివ్ అసెస్మెంట్లో సరిదిద్దుతామని పాఠశాల యాజమాన్యం హామీ ఇచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. కానీ రెండో సమ్మేటివ్ అసెస్మెంట్లోనూ అడ్మిట్ కార్డ్లో అదే లోపం కనిపించినట్లు విద్యార్థులు తెలిపారు. అడ్మిట్ కార్డులపై తమ ఫొటోలు అతికిస్తే పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతించారని విద్యార్థులు తెలిపారు. మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్లు తీసుకోవడానికి వెళ్లినప్పుడు అందరి మెమోల్లోనూ అదే తప్పు దొర్లినట్లు విద్యార్థులు చెప్పారు. అందరి సర్టిఫికెట్పై ఒకటే ఫొటో ముద్రించినట్లు పేర్కొన్నారు. కొన్ని సాంకేతిక సమస్యల కారణంగానే ఈ తప్పు దొర్లినట్లు ఒడిశా బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ వైస్ ప్రెసిడెంట్ నిహార్ రంజన్ మొహంతి స్పష్టం చేశారు. త్వరలోనే తప్పును సవరించి బాధిత విద్యార్థులకు కొత్త సర్టిఫికేట్లను విడుదల చేస్తామని తెలిపారు. ఇదీ చదవండి: ఏమైందో తెలియదు.. యువకుని చెంప చెల్లుమనిపించింది.. వీడియో వైరల్ -
పదో తరగతి పరీక్షల్లో మా అమ్మాయికి 582 మార్కులు వచ్చాయి.. తల్లిగా నాకు చాలా గర్వంగా ఉంది
-
ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పదో తరగతి ఫలితాల్లో 582 మార్కులు సాధించాను..!
-
ఒకటి, ఒకటి, రెండు, రెండు.. ‘చై-నా’ ర్యాంకులు కాదు.. జగనన్న ఆణిముత్యాలు
ఒకటి.. ఒకటి.. ఒకటి.. రెండు.. రెండు.. రెండు.. అన్నీ చైనా (చైతన్య, నారాయణ) ర్యాంకులు.. అయితే అది ఒకప్పటి మాట. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులు సాధించిన ర్యాంకులివి... ఇటీవల ప్రకటించిన పదో తరగతి ఫలితాలలో ప్రభుత్వ స్కూళ్లు విజయదుందుభి మోగించాయి. వాటిలో చదువుతున్న నిరుపేద విద్యార్థులు మునుపెన్నడూ ఎరుగని రీతిలో సత్తా చాటారు... రాష్ట్రప్రభుత్వం తల్లిదండ్రులకు అందిస్తున్న ప్రోత్సాహకాలు.. సంక్షేమ పథకాలు ఒకవైపు.. మౌలిక సదుపాయాలతో సహా స్కూళ్లను సమూలంగా మార్చేస్తున్న నాడు నేడు వంటి కార్యక్రమాలు మరోవైపు.. దారితప్పిన విద్యావ్యవస్థను పట్టాలపైకి ఎక్కించాయి.విద్యార్థులలో పెల్లుబికిన ఉత్సాహం చదువుల విప్లవాన్ని సృష్టించింది. అందుకు పది ఫలితాలు ప్రత్యక్ష నిదర్శనం.. అద్భుతమైన ప్రతిభ చూపించిన ఈ ప్రతిభామూర్తులను ‘జగనన్న ఆణిముత్యాలు’గా ఎంపిక చేసి రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాలతో సత్కరించనుంది. వారిలో కొంతమందితో సాక్షి ముచ్చటించింది. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే... ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది.. పేరు:మిట్టు మహాపాత్రో పాఠశాల: పాతపట్నంప్రభుత్వ స్కూల్ శ్రీకాకుళం జిల్లా మాది పేద కుటుంబం. మా నాన్న వాహనాల టైర్లకు పంచర్లు వేస్తుంటారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివాను. ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ ఒడియా పాఠశాలలోనూ, 6 నుంచి 10వ తరగతి వరకు పాతపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాను. చిన్నతనం నుంచి మా చిన్నాన్న రవి మహాపాత్రో ఎక్కువగా చదువుకోవాలని ప్రోత్సాహం అందించారు. ♦ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం బాగుంది. జగనన్న విద్యా కానుక కింద నాకు, అక్కకు పుస్తకాలు, బ్యాగ్, షూ, డ్రస్లు అందించారు. ♦ పదో తరగతిలో 600కు 570 వస్తాయని అనుకున్నాను. 594 మార్కులు వస్తాయని ఊహించలేదు. ప్రశ్నలవారీగా కాకుండా పాఠ్యాంశాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకునేవాడిని. పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా అర్థం చేసుకునేలా పాఠ్యాంశాలను బోధించారు. దీనివల్ల పాఠ్యాంశంలో ఏ ప్రశ్న ఇచ్చినా రాయగలిగాను. సకాలంలో సిలబస్ను పూర్తి చేయడంతో రివిజన్కు ఎక్కువ సమయం కేటాయించేందుకు అవకాశం ఏర్పడింది. రివిజన్లో వెనుకబడిన సబ్జెక్టులకు ఎక్కువ సమయం వెచ్చించాను. ♦ మంచి మార్కులు రావడం పట్ల సంతోషంగా ఉంది. ట్రిపుల్ ఐటీలో చదివి ఇంజనీర్ను కావడమే నా లక్ష్యం. తొలి రోజే విద్యా కానుక అందింది.. పేరు: గోవుల గోకుల కృష్ణారెడ్డి పాఠశాల: కేఎన్నార్ మున్సిపల్ స్కూల్, నెల్లూరు పాఠశాల ప్రారంభం రోజే జగనన్న విద్యాకానుక కింద అన్ని పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫాం, బూట్లు, తదితర వస్తువులు ఇచ్చారు. అలాగే నాడు – నేడు కింద పాఠశాలలో అన్ని వసతులు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. బెంచీలు, బ్లాక్బోర్డు, సరిపడా గదులు ఉండటం వల్ల ఎలాంటి అసౌకర్యం కలగలేదు. మినిరల్ వాటర్తో పాటు నాణ్యమైన భోజనం అందించారు. అమ్మఒడి కింద రూ.15 వేల నగదును ప్రభుత్వం అందించింది. ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 593 మార్కులు సాధించడానికి పాఠశాల హెడ్మాస్టరు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారు. ప్రతి సబ్జెక్టుకు టైమ్ టేబుల్ వేసుకుని దాని ప్రకారం చదివాను. సబ్జెక్టులకు వాటి ప్రాధాన్యత ప్రకారం సమయం కేటాయించా. ముందు ఇంటర్లో మంచి మార్కులు సాధించడమే నా లక్ష్యం. ఆ తర్వాత బెస్ట్ ఐఐటీలో ఇంజనీరింగ్ చదువుతా. నాడు–నేడుతోఅన్ని వసతులు పేరు: పి.శ్రీనివాసరావు పాఠశాల: బీఎన్ఆర్ మున్సిపల్ స్కూల్, గుంటూరు ఒకటో తరగతి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నాను. అయితే అప్పట్లో పాఠ్యపుస్తకాలు మినహా మాకు ఏమీ ఇవ్వలేదు. అదికూడా స్కూళ్లు తెరిచిన రెండు నెలల కానీ చేతికి ఇచ్చేవారు కారు. పాత కాలం బెంచీలు, బల్లలపై కూర్చోవాల్సి వచ్చేది. అయితే గత నాలుగేళ్లుగా ప్రతి ఏటా జగనన్న విద్యాకానుక కింద కిట్ అందుకున్నాను. పైసా ఖర్చు లేకుండా ఉచితంగా చదువు చెప్పడంతో పాటు టెక్ట్స్బుక్స్, యూనిఫామ్, నోట్బుక్స్, బ్యాగు, బూట్లు వంటివన్నీ ఉచితంగా ఇచ్చారు. జగనన్న గోరుముద్దతో నాణ్యమైన భోజనాన్ని అందించారు. అధిక మార్కులు తెచ్చుకునేందుకు జగనన్న విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ కూడా ఫ్రీగా ఇచ్చారు. నాడు–నేడు ద్వారా పాఠశాల రూపురేఖలను ప్రభుత్వం మార్చేసింది. కూర్చునేందుకు డ్యూయల్ డెస్క్లు ఏర్పాటు చేసింది.క్లాస్ రూమ్లో ఫ్యాన్లు, లైట్లతో ప్రశాంతంగా చదువుకునే వాతావరణాన్ని కల్పించింది. ఎక్కువ మార్కులు సాధించడానికి ఈ వసతులు అన్నీ ఉపయోగపడ్డాయి. కార్పొరేట్ స్కూళ్లతో పోల్చితే ఎక్కడా తగ్గకుండా అన్ని సదుపాయాలు కల్పించారు. మా స్కూల్లో వసతులు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఉన్నాయి. ఇంటర్లో ఎంపీసీ తీసుకుంటా. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం. ‘కార్పొరేట్’లో చదివినఅనుభూతి.. పేరు: ఎ.వైష్ణవి పాఠశాల: జెడ్పీహెచ్ స్కూల్, పొదలకూరు, నెల్లూరు జిల్లా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పాఠశాలలో అన్ని సబ్జెక్టులకు సరిపడా ఉపాధ్యాయులు ఉన్నారు. అలాగే అన్ని సబ్జెక్టులకు క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు. వారు అర్థమయ్యే రీతిలో మెరుగ్గా బోధించారు. నాడు – నేడు కింద మా పాఠశాలలో ప్రభుత్వం అన్ని మౌలిక వసతులు కల్పించింది. బెంచీలు, ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు ఇలా అన్ని సదుపాయాలు ఉన్నాయి. దీంతో నాకు కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్న అనుభూతి ఉండేది.పేద విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మ ఒడి పథకాలను అందజేస్తోంది. ప్రభుత్వ పథకాలే ఆదుకున్నాయి పేరు: పేడాడ షణ్ముఖ వికాస్ పాఠశాల: లక్ష్మీనగర్ మున్సిపల్ హైసూ్కల్, ఆమదాలవలస, శ్రీకాకుళం జిల్లా జగనన్న విద్యాకానుక కింద నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలతోపాటు అమ్మఒడి, మధ్యాహ్న భోజన పథకం వంటివి పేద విద్యార్థినైన నన్ను ఆదుకున్నాయి. దీంతో ఎలాంటి ఒత్తిడి, ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా చదువుకోవడానికి అవకాశం కలిగింది. నా తల్లిదండ్రుల పైన ఎలాంటి ఆర్థిక భారం పడకపోవడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇందుకు సీఎం వైఎస్ జగన్కు నా కృతజ్ఞతలు. మా పాఠశాలలో ఉపాధ్యాయులు.. విద్యార్థులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. సందేహాలు ఉంటే ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తూ సందేహాలు నివృత్తి చేసుకునేవాళ్లం. పాఠశాలలో మొదటి నాలుగు నెలల్లోనే సిలబస్ పూర్తి చేశారు. తర్వాత రివిజన్ చేస్తూ ప్రతిరోజూ పరీక్షలు నిర్వహించేవారు. ‘ఆక్స్ఫర్డ్’తోనే అధిక మార్కులు పేరు: సోముల వెంకట రామ శరణ్య పాఠశాల: వైవీఎస్ మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్, ప్రొద్దుటూరు,వైఎస్సార్ జిల్లా ప్రభుత్వం జగనన్న విద్యా కానుకలో భాగంగా అందించిన ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఎంతగానో ఉపయోగపడింది. దీంతో ఇంగ్లి‹Ù సబ్జెక్టులో వందకు 99 మార్కులు సాధించగలిగాను. నాడు–నేడు కింద ప్రభుత్వం మా పాఠశాలను సమగ్రంగా అభివృద్ధి చేసింది. అలాగే జగనన్న గోరుముద్ద కింద మంచి పౌష్టికాహారాన్ని అందించారు. ప్రభుత్వ పథకాలతో మా తల్లిదండ్రులపై రూపాయి భారం కూడా పడలేదు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినడంతోపాటు తెల్లవారుజామున 2 గంటలు, రాత్రి 2 గంటలు, పాఠశాలలో స్టడీ అవర్స్లో బాగా చదివాను. ఇంగ్లి‹Ù, మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. ట్రిపుల్ ఐటీలో బీటెక్ సీఎస్ఈ చదువుతా. భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా. ప్రభుత్వమేఅన్ని సౌకర్యాలు కల్పిస్తోంది.. పేరు: నాగరాజుగారి ఐశ్వర్య పాఠశాల: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రొళ్ల, శ్రీసత్యసాయి జిల్లా ‘అనంత సంకల్పం’ పేరుతో అధికారులు 100 రోజుల ప్రణాళిక అమలు చేశారు. పరీక్షల్లో అధిక మార్కులు సాధించడానికి అధికారులు ప్రత్యేకంగా అందించిన బుక్లెట్ ఎంతగానో ఉపయోగపడింది. ఇంటి దగ్గర తల్లిదండ్రులు బాగా చదువుకోవాలని ఎంతో ప్రోత్సహించారు. దీంతో 590 మార్కులు సాధించగలిగాను. గతంలో మా పాఠశాలలో అరకొర సౌకర్యాలు ఉండేవి. ఇటీవల ప్రభుత్వం ‘మనబడి నాడు–నేడు’ కింద అన్ని వసతులు కల్పించింది. దీంతో మంచి వాతావరణంలో చదువుకునే అవకాశం ఏర్పడింది. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలతో మాలాంటి పేద పిల్లలకు ఎంతో మేలు జరుగుతోంది. ప్రభుత్వ బడుల్లో ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పుస్తకాలు కూడా ఇస్తున్నారు. అలాగే జగనన్న విద్యాకానుక కింద స్కూల్ బ్యాగు, నోటు పుస్తకాలు, షూ..ఇలా అన్నీ అందిస్తున్నారు. ఇప్పుడు చదువుకోవాలనే తపన ఉంటే చాలు ప్రభుత్వమే అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలోనే బాగా చెప్పే ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వ బడి బాగుండదని అనుకున్నా పేరు: షేక్ మహ్మద్ సమీర్ పాఠశాల: మోడల్ స్కూల్, అవుకు,నంద్యాల జిల్లా మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులతో నన్ను ఆరో తరగతి నుంచి ఆదర్శ పాఠశాలలో చేరి్పంచారు. అయితే ప్రభుత్వ పాఠశాలలో వసతులు ఉండవేమో, మంచిగా చెప్పరేమోనని ఆందోళనపడ్డాను. అయితే నేను ఊహించినట్టు ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితులు లేవు. ప్రభుత్వం నాడు–నేడు కింద మా పాఠశాలలో అన్ని వసతులు కల్పించింది. ప్రభుత్వ చర్యలతో ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలే ఎంతో బాగున్నాయి. ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన పుస్తకాలను, దుస్తులను, షూ, బెల్ట్, టై లాంటివి ఉచితంగా అందించింది. అంతేకాకుండా ప్రతిరోజు మధ్యాహ్నం ఒక మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందజేసింది. అంతేకాకుండా అమ్మఒడి పథకం ద్వారా మా చదువులకు ఉన్న ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగించింది. భవిష్యత్తులో ఐఏఎస్ సాధించడమే నా లక్ష్యం. ప్రభుత్వ మెటీరియల్ బాగుంది పేరు: ఎస్.హరిణి పాఠశాల: ఎస్పీసీఎన్ మునిసిపల్ హైసూ్కల్, ప్రొద్దుటూరు రామేశ్వరం,వైఎస్సార్ జిల్లా పదో తరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వం డీసీఈబీ మెటీరియల్ అందించింది. ఇది మాకు ఎంతో ఉపయోగపడింది. అలాగే ప్రభుత్వం జగనన్న విద్యా కానుకతో అందించిన ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీతో ఇంగ్లిష్ సబ్జెక్టులో అధిక మార్కులు సాధించగలిగాను. ప్రభుత్వ పథకాలతో ఎంతో లబ్ధి కలిగింది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మా పాఠశాలలో విద్యాబోధన చేయడం వల్లే 590 మార్కులు వచ్చాయి. రోజూ తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10.30 గంటల వరకు చదివాను. స్టడీ టైమ్ టేబుల్ను అనుసరించడంతోపాటు పాఠ్యాంశాల్లో వచ్చిన సందేహాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను అడిగి నివృతి చేసుకున్నాను. ప్రతి పాఠ్యాంశాన్ని రివైజ్ చేశాను. ప్రభుత్వ ఆదేశాలతో ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించారు. స్టడీ అవర్స్ నిర్వహించి పాఠ్యాంశాల్లో పట్టు సాధించేలా శిక్షణ ఇచ్చారు. దీంతో మ్యాథ్స్లో 100కు 100 మార్కులు సాధించాను. ట్రిపుల్ ఐటీలో చేరి భవిష్యత్తులో ఐఏఎస్ కావడమే నా లక్ష్యం. -
టెన్త్ విద్యార్థులకు గుడ్న్యూస్! పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు మేలు జరిగేలా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా విద్యార్థి పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నిర్ణీత ప్రశ్నల సంఖ్య కన్నా ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాసి ఉంటే.. వాటిలో ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ విద్యార్థి మొత్తం మార్కులను నిర్ణయించనున్నారు. తక్కువ మార్కులు వచ్చిన ప్రశ్నల జవాబులను తీసివేయనున్నారు. ఈ మేరకు తాజాగా పాఠశాల విద్యాశాఖ ప్రొసీడింగ్స్ విడుదల చేసింది. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈ నెల 3నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నెల 18వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. 19 నుంచి మూల్యాంకనం ఈ నెల 19నుంచి 26వ తేదీ వరకు విద్యార్థుల సమాధాన పత్రాల మూల్యాంకన చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూల్యాంకన ప్రక్రియలో తీసుకోవాలి్సన జాగ్రత్తలపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్కుమార్ పలు మార్గదర్శకాలతో కూడిన ప్రొసీడింగ్స్ జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లా కేంద్రాల్లో (పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, నంద్యాల జిల్లా కేంద్రాలు మినహా) మూల్యాంకనకు విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం అన్ని జిల్లాల విద్యా శాఖాధికారులకు మార్గదర్శకాలతో కూడిన బుక్లెట్లను కూడా పాఠశాల విద్యాశాఖ అందించింది. ఆయా జిల్లాల్లో మూల్యాంకన కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలన్నిటినీ ఏర్పాటు చేసే బాధ్యతను ఆయా జిల్లాల విద్యా శాఖాధికారులకు అప్పగించింది. మూల్యాంకనం సందర్భంగా అందులో పాల్గొనే సిబ్బంది నిర్వర్తించాల్సిన విధులను తాజా ప్రొసీడింగ్స్లో కమిషనర్ వివరించారు. వాటిని తప్పనిసరిగా అమలు చేయాల్సిన బాధ్యత డీఈవోలదేనని స్పష్టం చేశారు. మార్గదర్శకాలు ఇవీ ♦ మూల్యాంకనంలో పాల్గొనే అసిస్టెంట్ ఎగ్జామినర్లు రోజుకు 40 సమాధానాల పత్రాలను మాత్రమే మూల్యాంకన చేయాలి ♦ అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకన చేసే సమాధాన పత్రాలన్నిటినీ స్పెషల్ అసిస్టెంట్లు పూర్తిగా పరిశీలన చేసి మార్కులను లెక్కించాలి. ♦ పరీక్ష రాసిన అభ్యర్థి నిర్ణీత సంఖ్యకు మించి ప్రశ్నలకు సమాధానాలు రాశాడా అన్న అంశాన్ని స్పెషల్ అసిస్టెంట్లు గమనించాలి. ♦ ఒకవేళ నిర్ణీత సంఖ్యకు మించి ప్రశ్నలకు సమాధానం రాసి ఉంటే.. వాటిని మూల్యాంకనం చేసి మార్కులు వేశారా? లేదా అన్న విషయాన్ని కూడా పరిశీలన చేయాలి. ♦ అదనంగా రాసిన ప్రశ్నల సమాధానాలను అసిస్టెంట్ ఎగ్జామినర్ మూల్యాంకన చేసి మార్కులు ఇచ్చినట్టయితే ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని విద్యార్థికి నిర్ణీత ప్రశ్నల సంఖ్య మేర మార్కులను కేటాయించాలి. తక్కువ మార్కులు వచ్చిన ప్రశ్నల సమాధానాలను పరిహరించాలి. ♦ అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకన చేసిన సమాధాన పత్రాల్లోని కనీసం 20 ఆన్సర్ స్క్రిప్టులను ఆయా కేంద్రాల్లోని చీఫ్ ఎగ్జామినర్లు పరిశీలించాలి. రోజులో మొత్తంగా 60 వరకు ఆన్సర్ స్క్రిప్టులను పరిశీలన చేయాలి. ♦ అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్లు మూల్యాంకన పూర్తయిన రెండు సమాధానాల పత్రాలను పరిశీలించాలి. ♦ అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకన చేసిన సమాధాన పత్రాల్లో డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్ ప్రతి రోజూ కనిష్టంగా 45 పత్రాలను పరిశీలన చేయాలి. ♦ అసిస్టెంట్ ఎగ్జామినర్లు మూల్యాంకనం చేసిన సమాధాన పత్రాల్లో క్యాంప్ ఆఫీసర్ ప్రతి రోజూ కనిష్టంగా 20 పత్రాలను పరిశీలించాలి. పొరపాట్లు జరిగితే చర్యలే ♦ పరీక్ష ఫలితాల వెల్లడి అనంతరం అభ్యర్థులకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు అవకాశం, ఫొటోస్టాట్ కాపీలను అందించడం వంటివి ఉన్నందున మూల్యాంకనంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. ♦ రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ల సమయంలో ఏ విధమైన మార్పులు చేయాల్సి వచ్చినా అందుకు వరుసగా స్పెషల్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ♦ పొరపాట్లు చేసిన వారిపై నిబంధనల ప్రకారం పెనాల్టీ సహా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటారు. ♦ మూల్యాంకనాన్ని ఎలాంటి పొరపాట్లు, ఇతర అవాంఛిత అంశాలకు తావులేని విధంగా ప్రశాంతంగా ముగించేందుకు డీఈవోలు చర్యలు తీసుకోవాలి. ♦ జిల్లాస్థాయి పరిశీలకులు మూల్యాంకన కేంద్రాలను తొలి రెండు రోజులు తప్పనిసరిగా సందర్శించి తగిన జాగ్రత్తలు తీసుకునేలా చూడాలి. -
‘పోలీస్’ పరీక్షలో 7 మార్కులు కలపడంపై హర్షం
ముషీరాబాద్ (హైదరాబాద్): ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ప్రిలిమ్స్ పరీక్షలో అభ్యర్థులకు 7 మార్కులు కలపాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హర్షం వ్యక్తంచేశారు. ఇది పోలీస్ కానిస్టేబుళ్ల, ఎస్సై అభ్యర్థుల పోరాట ఫలితమేనని స్పష్టంచేశారు. మల్టిపుల్లోని 7 తప్పుడు ప్రశ్నలకు 7 మార్కులు కలపాలని హైకోర్టు జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో పలు కానిస్టేబుల్, ఎస్సై అభ్యర్థులు విద్యానగర్లోని బీసీ భవన్ వద్ద సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ 6 లక్షల మంది రాసిన ఈ పరీక్షలో కేవలం 1,84,000 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారని, 4 లక్షల మందికి పైగా అర్హత సాధించలేకపోయారని తెలిపారు. కార్యక్రమంలో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, మాసం ప్రదీప్, రాజ్కుమార్, నీలం వెంకటేశ్, చందన, రాజా, సునీత, దివ్య, రాజమల్లేశ్, శివ, కల్యాణ్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కారణాలేంటో తెలియజేయండి
సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్)–2022కు హాజరైన విద్యార్థి జోత్స్నకు తొలుత ఓ మార్కులు(482), తర్వాత మరో మార్కుల(294)ను వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి గల కారణాలను తెలిపాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 11వ తేదీలోపు కారణాల నివేదికను కోర్టు ముందుంచాలని స్పష్టం చేసింది. కారణం చూపించకుండా ఎన్టీఏ తన మార్కులను 482 నుంచి 294కు తగ్గించడాన్ని సవాల్ చేస్తూ జీఎస్ జోత్స్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ సీహెచ్ సుమలతతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎన్.ఎస్.అర్జున్ కుమార్ వాదనలు వినిపించారు. నీట్(యూజీ)కు హాజరైన జోత్స ్నకు తొలుత 482 మార్కులు వచ్చాయన్నారు. ఆలిండియాస్థాయిలో 1,00,456 ర్యాంక్, ఓబీసీ కేటగిరీలో 50,567 ర్యాంక్ వచ్చిందన్నారు. ఈ మేరకు ఫలితాలు వచ్చిన సెప్టెంబర్ 7న ఎన్టీఏ ఫలితాన్ని వెబ్సైట్లో అప్లోడ్ చేసిందన్నారు. తర్వాత కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అప్లోడ్ చేసిన జాబితా చూసి పిటిషనర్ షాక్కు గురయ్యారని చెప్పారు. మార్కులను 294కు తగ్గించారని, ఎన్టీఏ వెబ్సైట్ను తెరిచి చూడగా.. ఇదే మార్కులను చూపించిందన్నారు. దీంతో ర్యాంక్ ఆలిండియా స్థాయిలో 3,32,143కి, ఓబీసీ స్థాయిలో 1,44,313కి పెరిగిందన్నారు. దీనిపై ఎన్టీఏకు ఎన్నిసార్లు ఈ–మెయిల్ పంపినా స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. ఎన్టీఏ తరఫున న్యాయవాది బి.కవిత యాదవ్, కాళోజీ వర్సిటీ తరఫున న్యాయవాది ఎ. ప్రభాకర్రావు హాజరయ్యారు. వాదనలు విన్న ధర్మానసం తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. -
‘డాడీ నన్ను క్షమించు.. నా చావుకు ఎవరూ కారణం కాదు’
సాక్షి, శ్రీకాకుళం: ఆత్మహత్యలు ఆగడం లేదు. పరీక్ష బాగా రాయలేకపోయినందుకు ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువక ముందే పాతపట్నంలో మళ్లీ అలాంటి సంఘటన జరిగింది. ‘డాడీ నన్ను క్షమించు.. నా చావుకు ఎవరూ కారణం కాదు’ అంటూ సూసైడ్ నోట్ రాసి పాతపట్నం బాలాజీ నగర్కు చెందిన యువతి సారా నేపాలి (27) గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం కోర్టు కూడలి ఎదురుగా ఉన్న బాలాజీ నగర్లో నివాసం ఉంటున్న సారా నేపాలి గురువారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపింది. కాస్త తలనొప్పిగా ఉందంటూ తల్లితో చెప్పి తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. గదిలోకి వెళ్లిన అమ్మాయి ఎంతకూ తిరిగి రాకపోవడంతో తల్లి ఆ గదికి వెళ్లి చూడగా.. ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసి వారు హతాశులైపోయారు. వెంటనే ఆమెను కిందకు దించి కారులో పాతపట్నం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సారా నేపాలి మృతి చెందినట్లు వైద్యుడు సందీప్ ధ్రువీకరించారు. పోలీసులకు కూడా సమాచారం అందించడంతో ఎస్ఐ టి.కామేశ్వరరావు, పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని గదిని పరిశీలించారు. చదవండి: World Suicide Prevention Day 2022: ఆందోళన పరుస్తున్న ఆత్మహత్యలు అక్కడ సూసైడ్ నోట్తో పాటు సెల్ ఫోన్, డైరీని స్వాదీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్లో డాడీ నన్ను క్షమించు..నా చావుకు ఎవరు కారణం కాదు అంటూ రాసి ఉంది. నేపాలి ఎంఎస్సీ, బీఈడీ చదివింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టెట్ పరీక్షల కీ విడుదల చేసింది. సారా ఓసీ కాబట్టి 150కి 90 మార్కులు రావాలి, కానీ 87 మార్కులు రావడంతో మనస్తాపం చెందిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గతంలో సారా నేపాలి పాతపట్నం ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్ గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసింది. సారాకు ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు ఉన్నాడు. అక్కలకు వివాహాలయ్యాయి. తమ్ముడు డిగ్రీ వరకు చదువుకున్నారు. తండ్రి దమ్మర్ బహదూర్ పాతపట్నం గురుకుల పాఠశాలలో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తుంటారు. తల్లి సరస్వతీ దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
విష ప్రయోగానికి గురైన బాలుడి మృతి
సాక్షి, చెన్నై: ఓ కిరాతక తల్లి చేసిన విష ప్రయోగంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శనివారం రాత్రి మృతి చెందాడు. సరైన వైద్యం అందక పోవడంతోనే ఆ బాలుడు మరణించాడని బంధువులు ఆస్పత్రిపై దాడి చేశారు. వివరాలు.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి పరిధిలోని కారైక్కాల్లో తన కూతురు కంటే ఎక్కువ మార్కులు సాధిస్తున్నాడనే అసూయతో 8వ తరగతి విద్యార్థి బాల మణిగండన్పై ఓ విద్యార్థిని తల్లి శీతల పానీయంతో శుక్రవారం విష ప్రయోగం చేసిన విషయం తెలిసిందే. ఆ బాలుడికి పుదుచ్చేరిలో అత్యవసర చికిత్స అందించారు. ఆ బాలుడు తన తల్లిదండ్రులు రాజేంద్రన్, మాలతి ఇచ్చిన ఫిర్యాదుతో ఆ పాఠశాల సెక్యూరిటీ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో విద్యార్థిని తల్లి సహాయ రాణి విక్టోరియా చేసిన కుట్ర వెలుగులోకి వచ్చింది. సరైన చికిత్స అందలేదా..? పోలీసులు కేసు దర్యాప్తుపై ప్రత్యేక దృష్టి సారించినా, వైద్యులు మాత్రం ఆ బాలుడికి సరైన చికిత్స అందించ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తొలుత కోలుకున్నాడని భావించిన బాల మణిగండన్ ఆరోగ్యం శనివారం రాత్రి ఒక్కసారిగా క్షీణించింది. విషం శరీరంలోకి కొన్ని అవయవాలపై తీవ్ర ప్రభావం చూపడంతో ఆ బాలుడు మరణించాడు. దీంతో అతడి కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగింది. అదే సమయంలో ఆస్పత్రిలో సరైన వైద్యం అందించ లేదని, నిర్లక్ష్యంగా వైద్యులు వ్యవహరించారని ఆరోపిస్తూ కుటుంబీకులు, బంధువులు దాడి చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ విద్యార్థిపై విష ప్రయోగం చేసి హతమార్చిన సహాయ రాణి విక్టోరియాపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
ఎంత పని చేశావు తల్లీ! తన కొడుకుకంటే ఎక్కువ మార్కులు వచ్చాయని..
సాక్షి, చెన్నై: తన కుమారుడి కంటే ఎక్కువ మార్కులు సాధిస్తున్నాడని ఓ విద్యార్థిపై ఆ తల్లి అసూయ పెంచుకుంది. చివరికి ఆ విద్యార్థిని మట్టు మెట్టేందుకు సిద్ధమైంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. పుదుచ్చేరి పరిధిలోని కారైక్కాల్లో ఓ ప్రైవేటు పాఠశాల ఉంది. ఇందులో రాజేంద్రన్, మాలతి దంపతుల కుమారుడు 8వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఈ విద్యార్థి హఠాత్తుగా స్పహ తప్పి పడిపోయాడు. చివరికి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అక్కడి సిబ్బంది ఆస్పత్రికి సకాలంలో తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే, ఆ బాలుడు విషం తాగినట్లు వైద్యుల పరిశీలన తేలింది. సెక్యూరిటీ ఇచ్చిన శీతలపానీయంతో.. ఆ పాఠశాల సెక్యూరిటీ ఇచ్చిన శీతల పానీయం తాగడంతోనే తాను అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు కోలుకున్న తరువాత తల్లిదండ్రుల దృష్టికి ఆ విద్యార్థి తీసుకెళ్లాడు. దీంతో బాధిత విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. సెక్యూరిటీ సిబ్బందిని ప్రశ్నించగా, ఓ మహిళ తనకు కూల్డ్రింక్ ఇచ్చి ఆ విద్యార్థికి ఇవ్వాలని సూచించినట్లు వాంగ్ములం ఇచ్చాడు. డబ్బులకు కక్కుర్తిపడి తాను ఆమె చెప్పినట్లు చేశానని తెలిపాడు. దీంతో పోలీసులు ఆ పరిసరాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించారు. ఓ మహిళ రెండు కూల్ డ్రింక్ బాటిళ్లను సెక్యూరిటీ సిబ్బందికి ఇవ్వడాన్ని గుర్తించారు. ఆ దృశ్యాల ఆధారంగా సహాయరాణి విక్టోరియా అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఎప్పుడూ తరగతిలో ఫస్ట్ వచ్చే తన కుమారుడిని అధిగమించి రాజేంద్రన్, మాలతి కుమారుడు తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నాడని పోలీసులకు ఆమె వివరించింది. తన కుమారుడి కంటే అధికంగా మార్కులు సాధిస్తున్న ఈ విద్యార్థిపై తనకు ఈర్ష్య, కోపం పెరిగిందని, అందుకే విషం ఇచ్చి మట్టుబెట్టే ప్రయత్నం చేశానని అంగీకరించింది. ఇది విని పోలీసులు కూడా నివ్వెరపోయారు. చదవండి: సినీ అవకాశాల పేరుతో అశ్లీల వీడియోలు.. 30కి పైగా హార్డ్డిస్క్లు -
CBSE Results:టెన్త్లో కుమార్తెకు 100శాతం మార్కులు.. బాధపడుతున్న తల్లి!
చండీగఢ్: తమ పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాసైతేనే తల్లిదండ్రులు సంతోషంలో అందరికీ చెప్పుకుంటారు. అలాంటిది 100 శాతం మార్కులు సాధిస్తే ఎగిరి గంతేస్తారు. తమ పిల్లల గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. కానీ, ఓ తల్లి తన కూతురికి పదో తరగతిలో 100 శాతం మార్కులు వచ్చాయని బాధపడుతున్నారు. ఆమె బాధకు గల కారణాలేంటి? హర్యానాకు చెందిన అంజలి యాదవ్ అనే విద్యార్థిని ఇటీవల సీబీఎస్ఈ ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100 శాతం మార్కులు సాధించింది. కానీ, ఆమె తల్లి మాత్రం ఓ పక్క సంతోషంగా ఉన్నా.. మరోవైపు బాధపడుతున్నారు. తన కుమారఢ్ను పైచదువులకు ఏ విధంగా పంపించాలో తెలియటం లేదని తనలోతానే మదనపుడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కడాని కుటుంబం వారిది. దీంతో పైచదువులకు అయ్యే ఖర్చుపై ఆందోళన చెందుతున్నారు. విద్యార్థినికి డాక్టర్ కావాలనేది కల. ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్లో చదవాలనుకుంటోంది. కానీ, వారి కుటుంబంలో తల్లి పని చేస్తేనే పూట గడిచే పరిస్థితులు ఉన్నాయి. వారికి కొద్ది పాటి వ్యవసాయ భూమి ఉన్నా.. అందులో పండేవి ఇంటికే సరిపోవు. విద్యార్థిని తండ్రి పారామిలిటరీలో చేరిన క్రమంలో 2010లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అనారోగ్య సమస్యలతో 2017లో తన విధుల నుంచి వైదొలిగారు. ఆ సమయంలో పీఎఫ్ ద్వారా రూ.10 లక్షలు అందాయి. కానీ, అవి అప్పులు, ఇతర ఖర్చులకే అయిపోయాయని వాపోయారు విద్యార్థిని తల్లి ఊర్మిళ. విద్యార్థిని సోదరుడు ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాడు. సిలార్పుర్లో నివాసం ఉంటున్న విద్యార్థిని అంజలి.. మహోందర్గఢ్లోని ఇండస్ వాలీ పబ్లిక్ స్కూల్లో చదవుతోంది. ‘ఆమె కష్టపడి చదువుతుంది. తాను అనుకున్నది సాధిస్తే మన కష్టాలు తొలగిపోతాయని చెబుతుంటుంది. ఆమెకు ఎప్పుడూ మద్దతు ఇస్తూ చదువుపై దృష్టి పెట్టాలని చెప్పేదాన్ని. ’ అని పేర్కొన్నారు ఊర్మిళ. నెలకి రూ.20వేల స్కాలర్షిప్.. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ ఆదివారం ఫోన్ చేసి విద్యార్థినిని అభినందించారు. ఈ క్రమంలో తన కుటుంబ పరిస్థితుల గురించి సీఎంకు వివరించింది విద్యార్థిని. దీంతో ఆమెకు నెలకు రూ.20వేల స్కాలర్షిప్ ప్రకటించారు ముఖ్యమంత్రి. అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ‘ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించటమే గగనంగా మారింది. అందుకే మా పరిస్థితులపై ముఖ్యమంత్రికి తెలియజేశాను. స్కాలర్షిప్ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ’ అని విద్యార్థిని తల్లి ఊర్మిళ పేర్కొన్నారు. ఇదీ చదవండి: Ukraine Students: ‘మా పిల్లల భవిష్యత్తుకు కేంద్రమే భరోసా కల్పించాలి’ -
రాత మారితే తలరాత మారుతుంది.. సులువైన ఈ టిప్స్ పాటిస్తే చాలు!
బాలానగర్/హైదరాబాద్: అందమైన చేతిరాతతో ఏ పబ్లిక్ పరీక్ష అయినా మంచి మెరుగైన మార్కులు సాధించడానికి ఉపమోగపడుతుందని చేతి రాత నిపుణులు అంటున్నారు. అక్షరాలను ముత్యాల్లాగా రాసేవారికి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెబుతున్నారు. పరీక్ష ఏదైనా విద్యార్థులు మంచి మార్కులు సాధించాలంటే చేతిరాత ఓ ఆయుధం అని ఉపాధ్యాయులు సైతం పేర్కొంటున్నారు. విద్యార్థులకు రాతతో పాటు పరీక్ష రాసే విధానంపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. పాటించాల్సిన మెలకువలు... చదవండి👉🏻 300 మందికి పైగా ఔట్సోర్సింగ్ జేపీఎస్లకు ఉద్వాసన ► ప్రశ్నకు జవాబు రాసే తీరు పరీక్ష పేపర్ దిద్దడానికి ఇబ్బంది పెట్టే విధంగా ఉండరాదు. విద్యార్థులు రాసే సమాధానాలు ఉపాధ్యాయుడికి తెలుసన్న సంగతి గుర్తుంచుకోవాలి. ► జవాబు పత్రాలు ఆకట్టుకోవాలంటే పేజీకి 18 నుంచి 19 లైన్ల వరకు మించి రాయకూడదు. ► మెదటి లైను రాసే సమయంలో మార్జిన్ చేస్తూ సమాంతరంగా రాయకపోతే మిగతా లైన్లు క్రమపద్ధతిలో రావు. ► వరుస ముగింపులోని పదం పూర్తిగా ఉండేలా చూసుకోవాలి. అలా కాకుండా ఒక అక్షరం ఒక వరుసలో వచ్చి మిగిలిన అక్షరాలు మరో వరుసలో రాయకూడదు. అలా రాస్తే పరీక్ష పత్రాన్ని దిద్దేవారికి పూర్తి పదం త్వరగా అర్ధం కాకపోవచ్చు. ► అంకెలు రాసేటప్పుడు స్పష్టత లేకపోతే ఉపాధ్యాయుడు అర్ధం చేసుకోలేక మార్కులు వేయకపొవచ్చు. ► సైన్స్ (సామాన్య శాస్త్రం)లో బొమ్మలు గీస్తే ఆ బొమ్మల్లోని భాగాలు గుర్తించడంలో ఒక క్రమ పద్ధతిని పాటించాలి. ► కొన్ని పాఠశాల్లో విద్యార్థులు గీతల పేజీల నోట్బుక్లో జవాబులు రాస్తుంటారు. అటువంటి విద్యార్థులు తప్పనిసరిగా తెల్ల కాగితాలపై సాధన చేయాలి. ► జవాబు పత్రం పైభాగంలో అంగుళం స్థలం వదలాలి. ఎడమ వైపు అదే స్థాయిలో మార్జిన్ విడిచిపెట్టాలి. కుడివైపున అర అంగుళం ఖాళీ విడిచి రాయాలి. ► గణితంకు సంబంధించి అంకెలు సక్రమంగా రాయాలి. ► వ్యాకరణ దోషాలు లేకుండా జాగ్రత్తపడాలి. జవాబులు రాయడం మెదలు పెట్టిన స్థలం నుంచి చివరి వరకు సమాంతరంగా రాయాలి. అక్షరాలు పైకి లేదా కిందికి రాయకూడదు. ఒక వరుస ఎలా రాస్తే మిగిలిన వరుసలు కూడా అలానే రావడంతో పాటు జవాబు పత్రం కూడా చూడ ముచ్చటగా చాలా ఆకర్షణీయంగా కనపడుతుంది. పదం పదం మధ్యలో తగిన ఖాళీ ఉండాలి. చదవండి👉 మనీషా సాబూ ఉన్నత పదవి ఉపాధ్యాయుడి సూచనతో చదువు, చేతి రాతపై దృష్టి సారించా.. అక్షరాలు నీటిగా రాస్తే మీ చేతిరాత మార్కులను తెచ్చిపెడుతుందని మా ఉపాధ్యాయులు శ్రీశైలం అంటూండే వారు. ఆయన మాటలు నమ్మిన నేను పదో తరగతిలో కాస్లు ప్రారంభం నుంచే చేతిరాత మీద దృష్టి సారించా. ప్రతి రోజు హిందీ, తెలుగు, ఇంగ్లిష్ ఒక్కో పేపర్ చొప్పున రాస్తుండే వాడిని. ఇప్పుడు నా చేతి రాత నాకే చాలా అందంగా కనిపిస్తోంది. ఇది వరకు నాకే అర్థమయ్యేది కాదు. నా రాతను చూసి మా ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు మెచ్చుకుంటున్నారు. పదో తరగతి పరీక్షల్లో మంచిగా చదవడంతో పాటు నా చేతి రాతతో మంచి మార్కులు సాధిస్తా. – రవిశంకర్, విద్యార్థి, బాలానగర్ చేతి రాతతోనే ఎన్నో అంశాలు గుర్తుండిపోతాయి ఎవరైనా ఏదైనా అంశాన్ని పదిసార్లు చదివిన దానికంటే ఒకసారి రాస్తే చాలు గుర్తుండిపోతుంది. అందుకే నేను ప్రతి రోజూ చేతి రాతను ప్రాక్టీస్ చేస్తున్నా. ఉపాధ్యాయులు పెట్టే పరీక్షల్లో మంచి మార్కులు వస్తుండేవి. అంతే కాకుండా వేగంగా రాయడం అలవాటైంది. మా ఉపాధ్యాయులు నా కృషికి తగ్గ విధంగా గతంలో కంటే ఇప్పుడే మంచి మార్కులు వేస్తున్నారు. నా చేతి రాత బాగుంటుందని మెచ్చుకుంటున్నారు. – గౌతమి, బాలానగర్ చదువుతో పాటు చేతి రాత కూడా ముఖ్యమే.. ప్రతి విద్యార్థికి చదువుతో పాటు అందమైన చేతి రాత కూడా ముఖ్యమే. అందుకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలు పాటించాలి. చేతి రాతే భవిష్యత్లో ప్రభావం చూపుతుంది. మంచి మార్కులు రావటానికి దోహదపడుతుంది. అందుకే నేను నా విద్యార్థులకు ముందుగా చదువుకంటే మీరు పరీక్షల్లో రాసే జవాబులు అర్థమయినప్పుడే ఉపాధ్యాయులకు మన మీద మంచి భావం ఏర్పడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ చేతి రాతను మంచిగా నేర్చుకొనేందుకు చేయూత అందిస్తున్నా. – ఎం.శ్రీశైలం, చేతి రాత నిపుణులు, బాలానగర్ -
వివక్ష, వివాదం ఉంటేనే జోక్యం
న్యూఢిల్లీ: ప్రభుత్వ పాలనా విధానాల్లో స్పష్టంగా వివక్ష, వివాదకర అంశాలు ఉన్న సందర్భాల్లోనే కోర్టులు కలగజేసుకోవాలని, విధానాలు సవ్యంగా ఉన్నపుడు జోక్యం అనవసరమని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. బోనస్ మార్కుల విషయంలో హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఎన్హెచ్ఎం, ఎన్ఆర్హెచ్ఎం సిబ్బంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను గురువారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నాగేశ్వర రావు, జస్టిస్ బీఆర్ గవాయ్ల ధర్మాసనం విచారించింది. ‘ రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ అవసరాలకు తగ్గట్లుగా శిక్షణ పూర్తిచేసుకుని రాజస్తాన్ గ్రామీణ, ఎడారి ప్రాంతాల్లో పనిచేసిన ఆ సిబ్బందికి అదనపు పరిజ్ఞానం, అనుభవం ఉంటుంది. అందుకే వారికి అదనంగా బోనస్ మార్కులు ఇవ్వడం సబబే. ఇలాంటి పరిపాలనా విధానాల్లో కలగజేసుకోవడంలో కోర్టులు తొందరపాటు పనికిరాదు. వివాదాలు ఉంటేనే న్యాయం అందించేందుకు నెమ్మదిగా జోక్యం చేసుకోవాలి’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అనవసర వ్యాఖ్యలొద్దు న్యూఢిల్లీ: ఏదైనా కేసుపై విచారణ జరిపేటప్పుడు దానితో సంబంధం లేని అనవసర వ్యాఖ్యలు చేయద్దని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచించింది. హైకోర్టులు పరిధులను అతిక్రమించరాదని, వాద, ప్రతివాదుల మధ్య వివాదాలకు తలెత్తేలా వ్యవహరించరాదని, అనవసర వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ బి.వి.నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఓ టెండర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారత్ ఫ్రిట్జ్ వెర్నర్ లిమిటెడ్ అనే సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో హైకోర్టు వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఢిల్లీ హైకోర్టు కనీసం రిట్ పిటిషన్ అర్హతను కూడా నిర్ణయించలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆక్షేపించింది. కేసుతో సంబంధం లేని అనవసర వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని హితవు పలికింది. -
AP: టెన్త్ పరీక్షల్లో గ్రేడ్లతో పాటు మార్కులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఇకపై విద్యార్థులకు గ్రేడ్లతో పాటు మార్కులు కేటాయించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ శుక్రవారం జీవో 55 విడుదల చేశారు. 2019–20 విద్యాసంవత్సరం నుంచి ఇది వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో 6 నుంచి 10వ తరగతి వరకు గ్రేడింగ్ విధానం అమల్లో ఉంది. 2018–19 వరకు టెన్త్ పబ్లిక్ పరీక్షలలో గ్రేడింగ్ విధానం అమలు చేశారు. కరోనా కారణంగా 2019–20, 2020–21 సంవత్సరాల విద్యార్థులకు టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగలేదు. దీంతో విద్యార్థులు ఆయా తరగతుల్లో ఏడాదిపాటు నిర్వహించిన పరీక్షల్లో అంతర్గత మార్కుల ఆధారంగా టెన్త్ ఫలితాలు ప్రకటించారు. చదవండి: అధిక ఫీజులు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు హైపవర్ కమిటీ సూచనల మేరకు ఈ ఫలితాలను ఇచ్చారు. హైపవర్ కమిటీ సూచన మేరకు విద్యార్థులకు గ్రేడ్లతో పాటు మార్కులను కూడా అవార్డు చేయనున్నారు. పై చదువులకు, ఉపాధి అవకాశాలకు మెరిట్ నిర్ణయించేటప్పుడు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 2019–20 బ్యాచ్ నుంచి టెన్త్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల్లో గ్రేడ్లతో పాటు మార్కులు కూడా ఇస్తారు. చదవండి: ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ బీమా -
ఓవరాక్షన్లో మెడల్ను గట్టిగా కొరికేశాడు, ఆపై..
సాధారణంగా ఒలింపిక్స్ మెడల్స్ సాధించి.. ఫొటోగ్రాఫర్ల ఫోజుల కోసం పంటిగాట్లు పెట్టినట్లు అథ్లెట్లు నటించడం చూస్తున్నదే. కానీ, ఓ మేయర్ అతి వల్ల జపాన్లో రాజకీయ దుమారం చెలరేగింది. అథ్లెట్ నుంచి మెడల్ అందుకుని.. కసితీరా పంటితో గాట్లు పెట్టాడు ఆయన. ఈ చర్యకతో ఆయనకి వ్యతిరేకంగా ఏడు వేల ఫిర్యాదులు రావడం విశేషం. సాఫ్ట్ బాల్ ప్లేయర్ మియూ గోటో టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం కైవసం చేసుకుంది. సంబురాల్లో భాగంగా సొంత వూరు జపాన్ సెంట్రల్ సిటీ నయోగాలో జరిగిన ఓ ఈవెంట్కి ఆమె హాజరైంది. అక్కడే ఆ నగర మేయర్ టకాషి కవామురా అత్యుత్సహం ప్రదర్శించాడు. ఆమె నుంచి గోల్డ్ మెడల్ను అందుకుని మెడలో వేసుకున్న కవామురా.. తన ముఖానికి ఉన్న మాస్క్ కిందకి లాగేసి మరీ ఆ గోల్డ్ మెడల్ను గట్టిగా కొరికేశాడు. మెడల్పై పంటిగాట్లు బలంగా పడ్డాయి. ఈవెంట్ తర్వాత ఆ డ్యామేజ్ చూసి ఆందోళన చెందిన మియూ వెంటనే టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకుల్ని సంప్రదించింది. చదవండి: గ్రేటెస్ట్ జాబితాలో బల్లెం వీరుడి ప్రదర్శన ఇక టోక్యో నిర్వాహకుల విజ్ఞప్తి మేరకు ఆ మెడల్ను మార్చేందుకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ మార్చడానికి సుముఖత వ్యక్తం చేసింది. అంతేకాదు ఆ మెడల్ మార్పిడికి అయ్యే ఖర్చును ఐవోసీనే భరించబోతోంది. మరోవైపు కరోనా టైంలో మాస్క్ తీసేసి నిర్లక్క్ష్యంగా వ్యవహరించడం, పైగా ఆమె విజయాన్ని అగౌరవపర్చడం తీవ్ర నేరాలంటూ మేయర్పై తీవ్ర విమర్శలు వెల్లువెతున్నాయి. ఈ తరుణంలో తన స్థాయిని మరిచి ప్రవర్తించిన తీరుకు టకాషి కవామురా క్షమాపణలు తెలియజేశాడు. ఆమెకు కృతజ్ఞతలు ఒక టోక్యో ఒలింపిక్స్ వేదికగా మరో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. జమైకా హర్డ్లింగ్ అథ్లెట్ హన్స్లే పర్చమెంట్ 110 మీటర్ల రేసులో స్వర్ణం సాధించాడు. అయితే రేసుకి ముందు పొరపాటున వేరే వేదిక దగ్గరికి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న వలంటీర్ ఒకామె.. జరిగిన పొరపాటును గుర్తించి సరైన వేదిక దగ్గరికి వెళ్లడం కోసం హన్స్లేకి డబ్బులిచ్చి మరీ సాయం చేసింది. View this post on Instagram A post shared by Hansle Parchment, OLY (@parchment_hansle) దీంతో డిస్క్వాలిఫైయింగ్ను తప్పించుకుని అతను అర్హత సాధించడం, ఆపై ఫైనల్ రేసులో గోల్డ్ సాధించాడు. ఇక తన విజయానికి మూల కారణమైన ఆ వలంటీర్ను వెతుక్కుంటూ వెళ్లి మరీ కృతజ్ఞతలు తెలియజేశాడు ఈ జమైకన్ అథ్లెట్. -
నీట్(యూజీ) 2021: ఇలా ప్రిపేరయితే విజయం ఖాయం
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) –యూజీ–2021.. ఎంబీబీఎస్, బీడీఎస్తోపాటు ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్ష! గత కొన్ని నెలలుగా.. నీట్ ఎప్పుడు జరుగుతుందా? అని ఎదురు చూస్తున్న విద్యార్థులకు.. ఎట్టకేలకు ఎన్టీఏ స్పష్టత ఇచ్చింది. సెప్టెంబర్ 12న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా పరీక్ష విధానంలో కొన్ని కీలక మార్పులు ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో.. నీట్–యూజీ–2021లో మార్పులు.. పరీక్ష విధానం, ప్రిపరేషన్ గైడెన్స్.. నీట్–యూజీ–2021 నిర్వహణ తేదీపై సందేహాలకు ఫుల్స్టాప్ పెడుతూ.. ఎన్టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్స్) తాజాగా పరీక్ష తేదీని అధికారికంగా ప్రకటించింది.దీంతో గత కొన్ని నెలలుగా నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. సెప్టెంబర్ 12వ తేదీన నీట్ పరీక్షను పెన్–పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. మరోవైపు నీట్లో కొత్తగా ప్రవేశపెట్టిన మార్పులను గుర్తించి.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఛాయిస్ విధానం నీట్ పరీక్షలో ఈ ఏడాది ఛాయిస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి సబ్జెక్టులో సెక్షన్బీలోని 15 ప్రశ్నల్లో పదింటికి సమాధానం ఇస్తే సరిపోతుంది. నీట్లో గతేడాది వరకు బోటనీ, జువాలజీ రెండు సబ్జెక్ట్లను కలిపి బయాలజీ విభాగం పేరుతో 90 ప్రశ్నలు అడిగేవారు. కాని ఈ ఏడాది బోటనీ, జువాలజీలను రెండు వేర్వేరు సబ్జెక్టులుగా పేర్కొన్నారు. ఒక్కోదాన్ని నుంచి 45 ప్రశ్నలు అడగనున్నారు. రెండు సెక్షన్లు ► మొత్తం నాలుగు సబ్జెక్ట్ల్లో(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ) పరీక్ష జరుగుతుంది. ► ప్రతి సబ్జెక్టులో సెక్షన్–ఏ, సెక్షన్–బీ పేరుతో రెండు విభాగాలు ఉంటాయి. ► ప్రతి సబ్జెక్టులోనూ సెక్షన్–ఏ నుంచి 35 ప్రశ్నలు, సెక్షన్–బీ నుంచి 15 ప్రశ్నలు అడుగుతారు. ► సెక్షన్–బీలోని 15 ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలు ఛాయిస్గా వదిలేసి.. 10 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ► ప్రతి సబ్జెక్ట్ నుంచి మొత్తం 50 ప్రశ్నలు అడిగినా.. సెక్షన్–బీలో కల్పించిన ఛాయిస్ విధానం వల్ల 45 ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే సరిపోతుంది. ► అంటే.. ప్రతి సబ్జెక్ట్ నుంచి 45 ప్రశ్నలు చొప్పున.. నాలుగు సబ్జెక్టుల నుంచి మొత్తం 180 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 720 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ► నెగెటివ్ మార్కింగ్ నిబంధన ప్రకారం– ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. పదమూడు భాషలు నీట్ను ఇంగ్లిష్, హిందీ సహా మొత్తం 13 భాషల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తాము ఏ మాధ్యమంలో పరీక్ష రాయాలనుకుంటున్నారో తెలియజేయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ కోరుకుంటే.. కేవలం ఇంగ్లిష్ ప్రశ్న పత్రం అందిస్తారు. హిందీ కోరుకుంటే.. ఇంగ్లిష్/హిందీ ఇలా రెండు భాషల్లో.. అంటే బైలింగ్వల్ టెస్ట్ బుక్లెట్ను ఇస్తారు. అలాగే ఏదైనా ప్రాంతీయ భాషను ఎంచుకుంటే.. సదరు ప్రాంతీయ భాష/ఇంగ్లిష్ బుక్లెట్ అందిస్తారు. ఉదాహరణకు తెలుగును కోరుకున్న విద్యార్థులకు తెలుగు/ఇంగ్లిష్.. ఇలా రెండు భాషల్లో ప్రశ్న పత్రం ఉంటుంది. ఛాయిస్ కల్పించినా.. పెరగని సమయం ఈ ఏడాది నీట్లో ప్రశ్నల సంఖ్య పెంచి ఛాయిస్ విధానాన్ని కల్పించినా.. పరీక్ష సమయాన్ని పెంచలేదు. గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది విద్యార్థులు అదనంగా 20 ప్రశ్నలు చదివి, వాటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పరీక్షలో సమయాభావానికి దారితీసే ఆస్కారముందంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. సెక్షన్ బీలో 10 ప్రశ్నలు అటెంప్ట్ చేయాల్సి ఉన్నా.. మొత్తం 15 ప్రశ్నలు చదివి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఛాయిస్గా వదిలేయాల్సిన ప్రశ్నలపై స్పష్టత తెచ్చుకునేందుకు సమయం పడుతుంది. బోటనీ, జువాలజీ వేర్వేరుగా ► బయాలజీ విషయానికొస్తే.. ఈ ఏడాది కొత్తగా బోటనీ, జువాలజీ పేరుతో రెండు ప్రత్యేక సబ్జెక్టులుగా పరీక్ష నిర్వహించనున్నారు. ► బోటనీలో ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మార్ఫాలజీ, జెనిటిక్స్ అండ్ ఎవల్యూషన్, సెల్ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్లను ముఖ్య చాప్టర్లుగా భావించి చదవాలి. అన్ని అంశాలకు సంబంధించి కాన్సెప్ట్ట్లపై పట్టు సాధించాలి. ఎకాలజీలో ఆర్గనైజేషన్స్ అండ్ పాపులేషన్, ఎకోసిస్టమ్పై ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పాఠ్యాంశాలపై దృష్టిపెట్టడం లాభిస్తుంది. ప్లాంట్ ఫిజియాలజీలో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మొక్కల హార్మోనులు, ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్లో కణ విభజన(సమ విభజన, క్షయకరణ విభజన)లోని వివిధ దశల్లో జరిగే మార్పులు,కణచక్రం తదితరాలను అధ్యయనం చేయాలి. బయోమాలిక్యూల్స్ నుంచి కంటెంట్ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. రీప్రొడక్షన్ నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను బాగా అధ్యయనం చేయాలి. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటన్స్లో రెప్లికేషన్, ట్రాన్స్స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, రెగ్యులేషన్లపై దృష్టిపెట్టాలి. నీట్లో ఇంటర్ సిలబస్లో లేని అంశాలను గుర్తించి.. వాటికోసం ప్రత్యేక సమయం కేటాయించాలి. ► జువాలజీకి సంబంధించి హ్యూమన్ ఫిజియాలజీ, ఎకాలజీ, జెనిటిక్స్, ఎవల్యూషన్ టాపిక్స్పై విద్యార్థులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్సీఈఆర్టీతోపాటు ఇంటర్ పుస్తకాల నుంచీ ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి గత ప్రశ్న పత్రాలను, ఇంటర్లో ఆయా చాప్టర్స్ చివరలో అడిగే ప్రశ్నలను సాధన చేయాలి. ఎన్సీఈఆర్టీ, ఇంటర్ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. ► ఫిజిక్స్లో.. ఆప్టిక్స్, మెకానిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడరన్ ఫిజిక్స్ చాప్టర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో అధ్యాయానికి చివర ఇచ్చిన ప్రశ్నలను సాధించాలి. అవకలనం, సమాకలనం అనువర్తనాలపై పట్టు సాధించాలి. ఇంటర్ రెండేళ్ల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. రొటేషనల్ డైనమిక్స్, సిగ్మా పార్టికల్స్పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. అదేవిధంగా ఎలక్ట్రోమ్యాగ్నటిజం, ఇండక్షన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ వంటి చాప్టర్లను చదవడంతోపాటు ప్రాక్టీస్కు ప్రాధాన్యం ఇవ్వాలి. ► కెమిస్ట్రీలో.. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్, ఈక్విలిబ్రియమ్, పాలిమర్లు, బయో మాలిక్యూల్స్, పరమాణు నిర్మాణం, సాలిడ్ స్టేట్, ద్రావణాలు, సర్ఫేస్ కెమిస్ట్రీ; ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐసోమెరిసమ్, సమ్మేళనాల తయారీ, ధర్మాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. కెమిస్ట్రీలో విద్యార్థులు చర్యలు, సమీకరణాలను మర్చిపోతుంటారు. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు పునఃశ్చరణ చేయాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలను అధ్యయనం చేయాలి. కెమిస్ట్రీలో ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలను వాటి వాటి స్వభావాల ఆధారంగా ప్రిపేరవ్వాలి. ఫిజికల్ కెమిస్ట్రీలో ఫార్ములాలతో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. పీరియాడిక్ టేబుల్పై పట్టు సాధిస్తే.. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు. రివిజన్కు ప్రాధాన్యం ► నీట్లో మంచి స్కోర్ సాధించేందుకు విద్యార్థులు సిలబస్పై గట్టి పట్టు బిగించాలి. ► ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్కు నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకొని.. ఆయా సబ్జెక్ట్ల అభ్యసనం చేయాలి. ► ప్రస్తుత సమయంలో స్వీయ సామర్థ్యాలపై స్పష్టతతో వ్యవహరించాలి. ► నిర్దిష్ట సమయంలో అవగాహన పొందేలా ముందుకు కదలాలి. ► ప్రతి సబ్జెక్టుకూ సమానంగా సమయం కేటాయించుకోవాలి. ► ప్రతి రోజు చదవాల్సిన టాపిక్స్ను ముందుగానే విభజించుకుని దానికి అనుగుణంగా అధ్యయనం చేయాలి. ► ప్రతి రోజు మాక్ టెస్టులకు హాజరవ్వాలి. ► ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో రివిజన్కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ► మోడల్ కొశ్చన్స్ను బాగా ప్రాక్టీస్ చేయాలి. ► డైరెక్ట్ కొశ్చన్స్ కంటే ఇన్డైరెక్ట్ కొశ్చన్స్నే ఎక్కువ అడుగుతున్న విషయాన్ని గుర్తించాలి. దీనికి అనుగుణంగా మోడల్ టెస్ట్లను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ► ప్రిపరేషన్ సమయంలోనే షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి. ఇది పరీక్షకు ముందు ర్యాపిడ్ రివిజన్కు ఉపయోగపడుతుంది. నీట్–యూజీ(2021) సమాచారం ► పరీక్ష తేదీ: సెప్టెంబర్ 12, 2021 (మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు) ► పరీక్ష వ్యవధి: మూడు గంటలు(పెన్, పేపర్ విధానంలో) ► అర్హత: బైపీసీ గ్రూప్తో ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సుల ఉత్తీర్ణత. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► వయో పరిమితి: డిసెంబర్ 31 నాటికి కనిష్ట వయోపరిమితి 17ఏళ్లు, గరిష్ట వయో పరిమితి 25ఏళ్లు ఉండాలి. ► ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: జూలై 13 నుంచి ఆగస్ట్ 6 వరకు. ► ఆన్లైన్లో దరఖాస్తులో సవరణ అవకాశం: ఆగస్ట్ 8 నుంచి ఆగస్ట్ 12 వరకు. ► పరీక్ష కేంద్రం కేటాయింపు ప్రకటన: ఆగస్ట్ 20, 2021. ► అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ సదుపాయం: పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు. ► పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తుకు వెబ్సైట్స్: https://ntaneet.nic.in ఈజీ టు డిఫికల్ట్ పరీక్ష రోజున అభ్యర్థులు తొలుత ప్రశ్న పత్రం చదివేందుకు పది, పదిహేను నిమిషాలు కేటాయించాలి. ఛాయిస్ సెక్షన్ విషయంలో వీలైనంత వేగంగా ప్రశ్నలను అర్థం చేసుకొని.. తమకు కచ్చితంగా సమాధానాలు తెలిసిన ప్రశ్నలపై స్పష్టత తెచ్చుకోవాలి. ముందుగా సులభమైన ప్రశ్నలతో సమాధానాలు గుర్తించడం ప్రారంభించాలి. ప్రిపరేషన్ పరంగా.. ఎక్కువ సమయం రివిజన్కు కేటాయించాలి. అదే విధంగా మాక్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లకు హాజరై తమ సామర్థ్యం స్థాయి తెలుసుకొని.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలి. – బి.రాజేంద్ర, బోటనీ సబ్జెక్ట్ నిపుణులు -
బంపర్ ఆఫర్: మొక్కలు నాటితే ఎక్స్ట్రా మార్కులు..
చండీగఢ్: చదువులో భాగంగా మొక్కలు నాటిన విద్యార్థులకు ఎక్స్ట్రా మార్కులు ఇవ్వనున్నట్లు హరియాణ ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్ తెలిపారు. 8-12 తరగతుల విద్యార్థులకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన చేశారు. పంచకుల జిల్లాలోని నేచర్ క్యాంప్ తప్లి అండ్ నేచర్ ట్రయల్స్ ఆఫ్ మోర్నిహిల్స్ ప్రాంతంలో పంచకర్మ వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మనోహర్లాల్ ఖట్టర్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ సందర్భంగా మనోహర్లాల్ ఖట్టర్ మాట్లాడుతూ.. ‘‘పర్యావరణ పరిరక్షణలో చెట్లు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో విద్యార్థులను ప్రకృతితో కలిపేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. రాష్ట్రపరిధిలోని పాఠశాలలకు ఈ నియమం వర్తిస్తుంది. 8-12వ తరగతి విద్యార్థులు తమ పాఠశాల పరిధిలో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలి. దీని ప్రకారం ఆఖరి పరీక్షలో వారికి మార్కులు కేటాయిస్తాం. త్వరలోనే ఇందుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటిస్తాం’’ అని తెలిపారు. చదవండి: ఆమె అడవిగా విస్తరించింది
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు
యాదాద్రికి పోటెత్తిన భక్త జనం (ఫోటోలు)
నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
'బేబి' హీరో ఇంతలా మారిపోయాడేంటి? ఏకంగా అలా..
యశ్ దయాల్పై కోహ్లి ఫైర్.. దెబ్బకు ధోని ఖేల్ ఖతం!
భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా?
మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
టీడీపీపై బొత్స సెటైర్లు
తప్పక చదవండి
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- RCB Vs CSK: అతడి వల్లే గెలిచాం.. డుప్లిసెస్ ఎమోషనల్
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement