-
చరిత్రలో మిగిలిపోవాలంతే...
‘మనుషులు మూడు రకాలురా.. నాసి రకం.. రెండోది బోసి రకం.. మూడోది నాణ్యమైన రకం..’ అనే డైలాగ్తో మొదలవుతుంది ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా ట్రైలర్. విశ్వక్ సేన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా, అంజలి ఓ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు కృష్ణచైతన్య దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది.ఈ సందర్భంగా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం హైదరాబాద్లోని దేవి 70 ఎంఎం థియేటర్లో జరిగింది. ‘‘యువ నాయకుడు రత్నాకర్’, ‘నా ఊళ్లో నాకేంట్రా భయం’, ‘ఇది చరిత్రలో మిగిలిపోవాలంతే..’ అనే డైలాగ్స్ ఈ ట్రైలర్లో ఉన్నాయి. -
కాన్స్లో అనసూయకు ఉత్తమ నటి అవార్డు
భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా కాన్స్ చిత్రోత్సవాల్లో చరిత్ర సృష్టించారు. 77వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోని ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలో ‘ది షేమ్లెస్’ (2024) చిత్రంలోని నటనకు గాను ఆమె ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ఈ విభాగంలో ఉత్తమ నటి అవార్డు అందుకున్న తొలి భారతీయ నటిగా అనసూయ సేన్ గుప్తా చరిత్రలో నిలిచిపోయారు. ఈ విభాగంలో దాదాపు పదిహేను మంది నటీమణులతో పోటీ పడి ఆమె అవార్డు దక్కించుకోవడం విశేషం.బల్గేరియన్ దర్శకుడు కాన్ట్సాంటిన్ బోజనవ్ ‘ది షేమ్లెస్’ సినిమాకు దర్శకత్వం వహించారు. ‘అన్సర్టైన్ రిగార్డ్’ విభాగంలోనే ‘ది స్టోరీ ఆఫ్ సోలమన్’ చిత్రంలోని నటనకుగాను బ్రూనో నాహోన్ ఉత్తమ నటుడిగా నిలిచారు. ఉత్తమ చిత్రంగా ‘బ్లాక్ డాగ్’ ఎంపికైంది. ఉత్తమ దర్శకులుగా రాబర్టో మినర్విని (ది డ్యామ్డ్), రంగనో న్యాని (ఆన్ బికమింగ్ ఎ గినీ ఫౌల్) అవార్డు అందుకున్నారు.కొత్త జీవితం... ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న అట్టడుగు వర్గాలవారు, వలసదారులు సమానత్వం కోసం పోరాటం చేసే పరిస్థితుల్లో ఉన్నందువల్ల పోరాటం చేస్తున్నారు. నిజానికి సమానత్వం కోసం పోరాడాలంటే వలసదారులు, అట్టడుగు వర్గాలవారే కానక్కర్లేదు. మనం మంచి మనుషులు అయితే చాలు’’ అంటూ అవార్డు స్వీకరించిన అనంతరం పేర్కొన్నారు అనసూయ సేన్ గుప్తా. అలాగే ‘‘నాకు కొత్త జీవితాన్నిచ్చిన కాన్స్కు ప్రస్తుతానికి గుడ్ బై... కృతజ్ఞతలు’’ అని తన ఇన్స్టా స్టోరీలోనూ ఆమె షేర్ చేశారు. ‘ది షేమ్లెస్’ కథేంటంటే... ఢిల్లీలోని ఒక వ్యభిచార గృహంలో పోలీసును హత్య చేస్తుంది వేశ్య రేణుక. ఆ తర్వాత మరో రాష్ట్రంలోని సెక్స్ వర్కర్ల కమ్యూనిటీలో ఆశ్రయం ΄÷ందుతుంది. అక్కడ పదిహేడేళ్ల వయసులో ఉన్న దేవిక అనే అమ్మాయితో రేణుక ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత రేణుక, దేవికల జీవితాలు ఎలా మారాయి? ఇద్దరూ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు? అన్నదే ‘ది షేమ్లెస్’ కథాంశం. ఈ చిత్రంలో రేణుక పాత్రలో అనసూయ సేన్, దేవికగా ఒమరా శెట్టి నటించారు. జర్నలిస్ట్ అవ్వాలనుకుని నటిగా... అనసూయ సేన్ గుప్తా స్వస్థలం కోల్కతా. జాదవ్పూర్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్లో డిగ్రీ పూర్తి చేశారామె. జర్నలిజంను వృత్తిగా ఎంచుకోవాలనుకున్నారు. కానీ ఆమె యాక్టర్ అయ్యేలా పరిస్థితులు మారాయి. 2009లో విడుదలైన బెంగాలీ మ్యూజికల్ ఫిల్మ్ ‘మ్యాడ్లీ బెంగాలీ’ అనసూయ సేన్ గుప్తాకు నటిగా తొలి చిత్రం. అంజన్ దత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదల తర్వాత 2013లో అనసూయ ముంబైకి చేరుకున్నారు.ఆమె సోదరుడు అభిషేక్ సేన్ గుప్తా బాలీవుడ్లో దర్శకత్వ విభాగంలో ఉన్నారు. ఎంతో ప్రయత్నించినప్పటికీ నటిగా సరైన అవకాశాలు రాకపోవడంతో ‘సాట్ ఉచక్కీ, రే, మసాబా మసాబా’ వెబ్ వంటి సిరీస్లకు ్ర΄÷డక్షన్ డిజైన్, సెట్ డిజైనింగ్ విభాగాల్లో పని చేశారామె. ఆ తర్వాత కరోనా టైమ్లో 2020 జూన్లో ‘ది షేమ్లెస్’ సినిమాకు ఆడిషన్స్ ఇచ్చారు అనసూయ. అది నచ్చి, దర్శకుడు కాన్ట్సాంటిన్ బోజనవ్ ఆమెను లీడ్ రోల్కి ఎంచుకున్నారు. సంతోష్ శివన్కు ప్రతిష్టాత్మక పియర్ అవార్డు...రెట్రో ఫోకస్, మోడ్రన్ లెన్స్ను కనుగొన్న ఫ్రెంచ్ శాస్త్రవేత్త పియర్ ఏంజెనీకి నివాళిగా 2013 నుంచి ఆయన పేరిట ఓ అవార్డును నెలకొల్పి సినిమాటోగ్రాఫర్లకు అందిస్తున్నారు కాన్స్ చిత్రోత్సవాల నిర్వాహకులు. ఈ ఏడాది ఈ అవార్డును భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుడు సంతోష్ శివన్ అందుకున్నారు. ఈ చిత్రోత్సవాల్లో పాల్గొన్న ప్రముఖ నటి ప్రీతీ జింతా ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న తొలి ఏషియన్ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్నే కావడం విశేషం. ఈ సందర్భంగా కాన్స్కు ధన్యవాదాలు తెలిపారు సంతోష్. దర్శక–నిర్మాతగా..మలయాళ ‘నిధియుడె కథ’ (1986) ఛాయాగ్రాహకుడిగా సంతోష్ శివన్కి తొలి చిత్రం. ఆ తర్వాత పలు మలయాళ చిత్రాలకు కెమెరామేన్గా చేసిన ఆయన ‘దళపతి, రోజా, తుపాకీ’ వంటి తమిళ చిత్రాలకు, హిందీ ‘దిల్ సే’, తెలుగు ‘స్పైడర్’ తదితర చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేశారు. దర్శకుడిగా సంతోష్ తెరకెక్కించిన చిత్రాల్లో హిందీలో ‘ముంబైకర్, తహాన్, మలయాళంలో ‘ఉరుమి’ వంటివి ఉన్నాయి. 35ఏళ్లకు పై బడిన కెరీర్లో ఛాయాగ్రాహకుడిగా, దర్శక– నిర్మాతగా సంతోష్ శివన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. -
పీచు మిఠాయ్...
సైకిలు మీద ప్రేమ షికారుకు వెళ్లారు సందీప్ కిషన్, అపర్ణా బాలమురళి. ఈ జాలీ రైడ్లో ‘పీచు మిఠాయ్...’ అంటూ పాట పాడుకున్నారు. ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘రాయన్’లో సందీప్ కిషన్, అపర్ణా బాలమురళి ఓ జంటగా నటించారు. సినిమాలో ఈ ఇద్దరి మధ్య ‘పీచు మిఠాయ్..’ అంటూ సాగే రొమాంటిక్, మెలోడీ సాంగ్ను విడుదల చేశారు.ఏఆర్ రెహమాన్ స్వరపరచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా విజయ్ ప్రకాశ్, హరిప్రియ పాడారు. తెలుగు, తమిళ భాషల్లో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 13న రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్ని ఏషియన్–సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి విడుదల చేయనుంది. -
ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మరో హిట్ సినిమా ఓటీటీ రిలీజ్కి రెడీ అయిపోయింది. గత నెలల థియేటర్లలోకి వచ్చిన 'వర్షంగల్కు శేషం' అనే మలయాళ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. కానీ మలయాళంలో మాత్రం మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకుంది.(ఇదీ చదవండి: 'బాహుబలి' నిర్మాతల హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)'హృదయం' మూవీతో హిట్ కొట్టిన ప్రణవ్ మోహన్ లాల్- వినీత్ శ్రీనివాసన్ కాంబో మరోసారి 'వర్షంగల్కు శేషం' అనే పీరియాడిక్ డ్రామా సినిమా కోసం కలిసి పనిచేశారు. ఏప్రిల్ 11న థియేటర్లలో రిలీజైన దీన్ని 80ల్లో సినిమా బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కించారు. ఇప్పుడు ఈ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. మూవీస్కి రిలేట్ అయ్యే కథలంటే ఇష్టపడే వాళ్లకు ఇది కచ్చితంగా నచ్చేస్తుంది!'వర్షంగల్కు శేషం' కథ విషయానికొస్తే.. 80-90ల్లో కేరళ. వేణు(ధ్యాన్ శ్రీనివాసన్)కి చిన్నప్పటి నుంచి నాటకాలపై ఆసక్తి. వీటి ద్వారానే సంగీత విద్వాంసుడు మురళి (ప్రణవ్ మోహన్ లాల్)తో పరిచయమవుతాడు. ఇతడి టాలెంట్ చూసి మద్రాస్ వెళ్తే బాగుంటుంగదని వేణు సలహా ఇస్తాడు. కొన్ని రోజుల తర్వాత వీళ్లిద్దరూ కలిసి చెన్నై (ఒకప్పటి మద్రాసు) వెళ్తారు. మురళి ప్రయత్నంతో వేణు దర్శకుడు అవుతాడు. కొన్ని కారణాల వల్ల స్నేహితుల మధ్య దూరం పెరుగుతుంది. అలాంటి వీళ్లిద్దరూ మళ్లీ కలిసి సినిమా ఎలా చేశారు? చివరకు ఏమైంది? అనేదే మెయిన్ స్టోరీ.(ఇదీ చదవండి: సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
స్కూల్ పిల్లల చేతుల మీదుగా 'సంకెళ్లు' పాట విడుదల
యువ హీరో వరుణ్ సందేశ్ 'నింద' సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. రాజేష్ జగన్నాథం దర్శకత్వం వహించారు. కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్తో యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని నిర్మించారు. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్, టీజర్ సినిమా ఆకట్టుకోగా.. ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్ ప్రారంభించారు.(ఇదీ చదవండి: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్ ఊరమాస్.. ఏకంగా!)ఈ క్రమంలోనే గానామాస్ స్పెషల్ స్కూల్కి చెందిన పిల్లలు ఈ పాటను విడుదల చేశారు. ఇది ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. శ్రేయారాణి, ఆనీ, క్యూ మధు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని త్వరలో ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: 20 ఏళ్లకే సీక్రెట్గా పెళ్లి చేసుకున్న 'స్ట్రేంజర్ థింగ్స్' నటి) -
హార్ట్ టచింగ్ సబ్జెక్ట్తో 'నాన్నంటే' సినిమా
మనసుని తాకే ఎమోషనల్ కంటెంట్తో తీసిన సినిమా 'నాన్నంటే'. నంది వెంకట్ రెడ్డి దర్శకత్వం వహించగా.. అశోక్ రెడ్డి లెంకల నిర్మించారు. వైఎస్కె, నిహరిక చౌదరి, వరేణ్య ఆగ్రా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఫిలించాంబర్లో ప్రీమియర్ షో వేశారు. పలువురు సినీ ప్రముఖులు సినిమా చూసి ప్రశంసించారు. ప్రతి ఒక్కరికీ నాన్న అంటే ఎంతో ఎమోషన్ ఉంటుందో ఈ సినిమాలో దర్శకుడు చక్కగా చూపించారని అన్నారు. ఈ సినిమాలోని సందేశం యువతకి కనెక్ట్ అవుతుందని అన్నారు. (ఇదీ చదవండి: 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్ ఊరమాస్.. ఏకంగా బూతులు!)నిర్మాత అశోక్ రెడ్డి లెంకల మాట్లాడుతూ.. 'నాన్న కష్టాన్ని, త్యాగాన్ని ఈ సినిమాలో ఆవిష్కరించాం. ప్రతి ఒక్కరు ఈ సినిమాను ఆదరించాలి. అతి త్వరలోనే సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నాం' అని అన్నారు.(ఇదీ చదవండి: 20 ఏళ్లకే సీక్రెట్గా పెళ్లి చేసుకున్న 'స్ట్రేంజర్ థింగ్స్' నటి) -
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్ ఊరమాస్.. ఏకంగా!
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్రైలర్ వచ్చేసింది. 2 నిమిషాల 18 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ని ఊరమాస్ సీన్స్తో నింపేశారు. విశ్వక్ సేన్ యాటిట్యూడ్ దగ్గర నుంచి విలేజ్ బ్యాక్ డ్రాప్తో జరిగే రాజకీయాలు, యాక్షన్, రొమాన్స్.. ఇలా అన్ని అంశాల్ని మిక్స్ చేసిన ట్రైలర్ చూస్తుంటేనే ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దీనితో పాటు బూతులు కూడా బాగానే దట్టించినట్లు తెలుస్తోంది. ట్రైలర్లో కూడా రెండు చోట్ల ఈ పదాలు వినిపించాయి.(ఇదీ చదవండి: 20 ఏళ్లకే సీక్రెట్గా పెళ్లి చేసుకున్న 'స్ట్రేంజర్ థింగ్స్' నటి)ట్రైలర్ చూస్తే పూర్తిగా రస్టిక్ విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' తీసినట్లు క్లారిటీ వచ్చేసింది. రత్నాకర్ అనే కుర్రాడు.. ఊరి రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడం, ఆ తర్వాత జరిగే డ్రామా, ఎత్తుకు పై ఎత్తులు ఇలా ట్రైలర్ అంతా రేసీగా కనిపించింది. మరి సినిమా ఎలా ఉంటుందో మే 31న తెలిసిపోతుంది. ఈ మూవీలో నేహాశెట్టి హీరోయిన్ కాగా, అంజలి కీలక పాత్ర పోషించింది. యువన్ శంకర్ రాజా సంగీతమందించాడు. (ఇదీ చదవండి: చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి) -
గాంధీ-అంబేడ్కర్ అప్పుడేం మాట్లాడుకున్నారో వినాలనుకుంటున్నా : జాన్వీ కపూర్
ఒక టైమ్ మెషీన్లో మీకు చరిత్రలోకి వెళ్లే అవకాశం కల్పిస్తే మీరేం చేస్తారు? చరిత్రలో ఎక్కడికి వెళ్లాలనుకుంటారు? ఎవరిని చూడాలనుకుంటారు? ఎలాంటి చారిత్రక ఘట్టాన్ని వీక్షించాలనుకుంటారు? ఇదే ప్రశ్న ప్రముఖ హీరోయిన్ జాన్వీ కపూర్ని ఓ రిపోర్టర్ అడిగాడు. ఆమె సమాధానం విన్న తరువాత ప్రతి ఒక్కరూ షాకయ్యారు. అంతేకాదు ఆలోచనలో పడ్డారు. ఓ మనిషి ముఖం చూసి ఎప్పుడూ వారిని అంచా వేయొద్దని అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: 20 ఏళ్లకే సీక్రెట్గా పెళ్లి చేసుకున్న 'స్ట్రేంజర్ థింగ్స్' నటి)ప్రముఖ హిందీ యూట్యూబ్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ పలు ఆసక్తికర విషయాల్ని చెప్పుకొచ్చింది. ఆమె కొత్త సినిమా 'మిస్టర్ అండ్ మిసెస్ మాహి' ప్రమోషన్లో భాగంగానే ఈ ఇంటర్వ్యూ ఇచ్చింది. టైమ్ మెషీన్లో ప్రయాణం చేసే ఛాన్స్ వస్తే ఎక్కడకు వెళ్తారని యాంకర్ అడగ్గా... తన తల్లి శ్రీదేవిని చూడటానికి వెళ్తాననే సమాధానం ఇస్తుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ జాన్వీ మాత్రం డిఫరెంట్ ఆన్సర్ ఇచ్చింది. తాను చరిత్రలో గాంధీ, అంబేద్కర్ పూనా ఒడంబడికకి ముందు మాట్లాడుకున్న సంభాషణ వినాలనుకుంటున్నట్లు జాన్వీ కపూర్ చెప్పింది. చరిత్రలో ముఖ్యంగా రిజర్వేషన్ల విషయంలో గాంధీ-అంబేద్కర్లు రెండు విభిన్న అభిప్రాయాలతో చేసిన చర్చ తనకు ఎంతో ఇష్టమని.. ఎన్నో చర్చల తర్వాత ఇద్దరు ఓ నిర్ణయానికి రావడం, అది దేశ భవిష్యత్తులో కీలకంగా మారడం తనను ఎంతగానో ప్రభావం చేసిందని జాహ్నవి చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి)నిజంగానే ఒక హీరోయిన్ అదీ స్టార్ హీరోయిన్ కూతురు, చరిత్రకు సంబంధించి ఇంతటి జ్ఞానం కలిగి ఉంటుందా అని ఎవరూ ఊహించి ఉండరు. అంతేకాదు రిజర్వేషన్లు, భారత సమాజం మీద జాన్వీకి ఉన్న అవగాహన చాలామందిని ఆలోచింపజేసింది. ముంబైలాంటి కాస్మోపాలిటన్ సిటీలో పెరిగిన జాన్వీ.. దేశ సామాజిక పరిస్థితుల గురించి ఈ ఇంటర్వ్యూలో చాలా లోతుగా మాట్లాడింది. తాను హిస్టరీ క్లాసులు బంక్ కొట్టి, యుద్ధ సినిమాలు చూసి పరీక్షలు రాసిందో కూడా చెప్పుకొచ్చింది.నెపోటిజమ్ గురించి కూడా జాహ్నవి కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడింది. తాను శ్రీదేవీ, బోనీకపూర్ కూతురు అయినందుకే చాలా ఈజీగా అవకాశాలు వచ్చాయని అయితే వాటిని నిలబెట్టుకునేందుకు అందరికంటే ఎక్కువగా కష్టపడ్డానని చెప్పింది. తన తండ్రి బోనీకపూర్ శ్రీదేవీని ఎంతలా ప్రేమించారో జాన్వీ చాలా అందంగా వివరించింది. పెళ్లికి ముందు శ్రీదేవీతో బోనీకపూర్ గంటల కొద్దీ ఫోన్లో మాట్లాడేవారని, చాలాసార్లు శ్రీదేవిని దొంగచాటుగా కలిసేందుకు బాల్కనీ ఎక్కి మరీ వెళ్లేవారని చెప్పుకొచ్చింది.-ఇస్మాయిల్, ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ(ఇదీ చదవండి: మిగతా హీరోయిన్లకు నయనతారకు తేడా అదే.. అందుకే ఇన్నేళ్ల పాటు!) -
20 ఏళ్లకే సీక్రెట్గా పెళ్లి చేసుకున్న 'స్ట్రేంజర్ థింగ్స్' నటి
సినిమా హీరోయిన్లు చాలామంది లేటుగానే పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఈ బ్యూటీ 20 ఏళ్లకే తొందరపడింది. తన 22 ఏళ్ల ప్రియుడితో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు ఈ విషయం తెలిసి ఆమె ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. మరోవైపు హ్యాపీగానూ ఫీలవుతున్నారు. వీళ్ల పెళ్లికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి)'స్ట్రేంజర్ థింగ్స్' అనే వెబ్ సిరీస్తో మన దగ్గర కూడా పాపులారిటీ సంపాదించిన హాలీవుడ్ నటి మిల్లీ బాబీ బ్రౌన్. దీనితో పాటు పలు సినిమాలు, ఇతర సిరీసులు కూడా ఈమె చేసింది. అయితే టీనేజీలోనే స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఈ భామ.. గత కొన్నేళ్ల నుంచి మోడల్ జేక్ బొంగివోయ్తో రిలేషన్లో ఉంది. సోషల్ మీడియాలో పలు ఫొటోలు వైరల్ కావడంతో ఈ విషయం బయటకొచ్చింది.అయితే సడన్గా వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారనే న్యూస్ చర్చనీయాంశంగా మారింది. ఇది నిజమేనని, గతవారం ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక చాలా సీక్రెట్గా జరిగింది. ఇలా చిన్న వయసులోనే 'స్ట్రేంజర్ థింగ్స్' నటి మిల్లీ బాబీ బ్రౌన్ పెళ్లి చేసుకోవడం ఆసక్తికరంగా మారిపోయింది.(ఇదీ చదవండి: Love Me Movie Review: ‘లవ్ మీ’మూవీ రివ్యూ) -
తెలుగు సినిమా హీరోయిన్.. ముచ్చటగా మూడో పెళ్లి
హీరోయిన్ మీరా వాసుదేవన్ పెళ్లిపీటలెక్కింది. ముచ్చటగా మూడోసారి తన మెడలో మూడు ముళ్లు వేయించుకుంది. కెమెరామెన్ విపిన్ పుత్యాంగంతో ఏడడుగులు వేసింది. ఈ శుభవార్తను మీరా సోషల్ మీడియా వేదికగా ఆలస్యంగా వెల్లడించింది. ఏప్రిల్ 21న కోయంబత్తూరులో పెళ్లయిందని, రిజిస్టర్ ప్రక్రియ ఈరోజు పూర్తయిందంటూ శుక్రవారం నాడు వివాహ ఫోటోలు షేర్ చేసింది. అలాగే తన భర్త గురించి వివరాలను సైతం పొందుపరిచింది.సింపుల్గా పెళ్లివిపిన్ కేరళలోని పాలక్కడ్ ప్రాంతానికి చెందినవాడు. ఈయన ఒక సినిమాటోగ్రాఫర్. అప్పట్లో అంతర్జాతీయ అవార్డు సైతం గెలుచుకున్నాడు. విపిన్, నేను ఒక ప్రాజెక్టు కోసం 2019 మే నుంచి కలిసి పని చేస్తున్నాం. గతేడాదే కలిసి జీవించాలని నిర్ణయానికి వచ్చాం. అలా ఈ ఏడాది ఒక్కటయ్యాం. ఇరు కుటుంబాలు సహా ఇద్దరు ముగ్గురు బంధుమిత్రుల సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.సీరియల్ నుంచి సినిమాల్లోకి..కాగా మీరా వసుదేవన్ 2001లో సీరియల్ ద్వారా నటిగా పరిచయమైంది. రెండు మూడు ధారావాహికల్లో కనిపించిన ఆమె గోల్మాల్ అనే తెలుగు సినిమాతో హీరోయిన్గా మారింది. అంజలి ఐ లవ్ యూ అనే చిత్రంలోనూ నటించింది. తమిళ, హిందీ, మలయాళ భాషల్లోనూ హీరోయిన్గా యాక్ట్ చేసింది. ప్రస్తుతం నాలుగు మలయాళ సినిమాలు చేస్తోంది.రెండు పెళ్లిళ్లుతన వ్యక్తిగత విషయానికి వస్తే.. మీరా వాసుదేవన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ తనయుడు విశాల్ అగర్వాల్ను 2005లో వివాహం చేసుకుంది. పెళ్లయిన ఐదేళ్లకే వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. 2012లో మలయాళ నటుడు జాన్ కొక్కెన్ను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ బాబు కూడా జన్మించాడు. సీరియల్ షూటింగ్లో లవ్..తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ బంధం కూడా ముక్కలైంది. 2016లో భార్యాభర్తలిద్దరూ విడిపోయారు. అప్పటినుంచి సింగిల్ మదర్గా ఉంటున్న ఈమె కుడుంబవిలక్కు అనే సీరియల్ షూటింగ్లో ఆ ధారావాహిక కెమెరామన్ విపిన్తో ప్రేమలో పడింది. ఆ ప్రేమను ఇప్పుడు పెళ్లి బంధంతో పదిలపర్చుకున్నారు. View this post on Instagram A post shared by Meera Vasudevan (@officialmeeravasudevan)చదవండి: చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి -
ఎమోషనల్ డ్రామాగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ..రిలీజ్ ఎప్పుడంటే?
అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ప్రముఖ పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. శివ పాలడుగు ఈ మూవీకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన టీజర్, పాటలు ఆడియెన్స్లో మంచి బజ్ను క్రియేట్ చేశాయి.ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ సినిమాను జూన్ 14న విడుదల చేయబోతోన్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఇంకో మూడు వారాల్లో ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన ఎమోషనల్ ట్రీట్ను ఇచ్చేందుకు రాబోతోంది. మ్యూజిక్ షాప్ మూర్తి కుటుంబ సమేతంగా చూడదగ్గ ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, బేబీ, డిజె టిల్లు వంటి బ్లాక్ బస్టర్లను విజయవంతంగా పంపిణీ చేసిన ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ ద్వారా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుండటంతో మరింతగా అంచనాలు పెంచేసినట్టు అయింది.ఈ చిత్రంలో అజయ్ ఘోష్ డీజే కావాలనుకునే మ్యూజిక్ షాప్ యజమానిగా కనిపించనున్నారు. చాందిని చౌదరి తన లక్ష్యాన్ని సాధించడానికి అతనికి సహాయం చేసే ఇన్స్పైరింగ్ రోల్లో కనిపించనున్నారు. ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
తమిళ డైరెక్టర్ కొడుకు హీరోగా ‘ హిట్ లిస్ట్’
తమిళ స్టార్ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా నటించిన చిత్రం ‘హిట్ లిస్ట్’. సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రలు పోషించారు. సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వంలో ఆర్. కె. సెల్యులాయిడ్స్ పై డైరెక్టర్ కె. ఎస్. రవికుమార్ గారు నిర్మిస్తున్న సినిమా. గతంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమా పైన అంచనాలను పెంచగా. నేడు ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వెర్సటైల్ హీరో సూర్య చేతుల మీదగా లాంచ్ చేశారు.యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జోనర్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. కాగా నేడు ఈ సినిమా సంబంధించిన ట్రైలర్ లాంచ్ మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా శ్రీ మురళీమోహన్ గారు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు విచ్చేశారు. వీరితోపాటు నిర్మాత, దర్శకుడు కె. ఎస్. రవికుమార్ గారు, హీరో విజయ్ కనిష్క, దర్శకులు సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్, తెలుగు రిలీజ్ నిర్మాతలు శ్రీనివాస్ గౌడ్ గారు మరియు బెక్కం రవీంద్ర గారు పాల్గొన్నారు.శ్రీ మురళీమోహన్ గారు మాట్లాడుతూ : హీరో విజయ్ కనిష్క నాన్నగారు విక్రమన్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండి మొదటి సినిమా అయినా చాలా అద్భుతంగా నటించాడు. నాకు బాగా సన్నిహితుడు కె. ఎస్. రవికుమార్ గారు ఈ సినిమాకి నిర్మాతక వ్యవహరించడం మంచి విషయం. ట్రైలర్ చాలా బాగుంది సినిమా ఖచ్చితంగా మన సక్సెస్ అవ్వాలని అవుతుందని కోరుకుంటున్నాను అన్నారు.తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు మాట్లాడుతూ : నన్ను ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కె. ఎస్. రవికుమార్ గారికి టీం కి నా అభినందనలు తెలుపుతున్నాను. మంచి నిర్మాత దర్శకులు కె. ఎస్. రవికుమార్ గారు. విజయ్ కనిష్కకి ఈ సినిమా మంచి విజయం అవుతుందని టీమ్ అందరికీ మంచి సక్సెస్ అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. మే 31న ఈ చిత్రం విడుదల కానుంది. -
చీటింగ్ చేసిన రెండో భర్త.. విడాకులు తీసుకున్న ప్రముఖ నటి
మరో నటి విడాకులు తీసుకుంది. మూడు నెలల క్రితం ఈమె గురించి వచ్చిన వార్తలు నిజమని ఇప్పుడు తేలిపోయింది. స్వయంగా సదరు నటి పోస్ట్ పెట్టడంతో అందరికీ దీని గురించి క్లారిటీ వచ్చేసింది. రెండో భర్త తనని చీటింగ్ చేస్తున్నాడని ఆధారాలతో సహా బయటపెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంతకీ ఎవరా నటి? ఏం జరిగింది?'చూపులు కలిసిన శుభవేళ' అనే డబ్బింగ్ సీరియల్తో గుర్తింపు తెచ్చుకున్న నటి దల్జీత్ కౌర్.. 2009లో షాలిన్ బానోత్ అనే నటుడిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు జైడన్ అనే కొడుకు ఉన్నాడు. మనస్పర్థలు కారణంగా 2015లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. కొడుకుతో కలిసి ఉంటున్న ఈమె ఓసారి దుబాయిలో జరిగిన ఓ పార్టీకి వెళ్లగా అక్కడ నిఖిల్ పటేల్ అనే వ్యక్తి ఈమెకు పరిచయమయ్యాడు.(ఇదీ చదవండి: Love Me Movie Review: ‘లవ్ మీ’మూవీ రివ్యూ)దల్జీత్ పరిచయం అయ్యేటప్పటికే నిఖిల్ విడాకులు తీసుకుని జీవిస్తున్నాడు. ఓ కూతురు ఇతడి దగ్గర పెరుగుతోంది. అలా పిల్లల గురించి మాట్లాడుకున్న వీళ్లిద్దరూ కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. గతేడాది మార్చిలో లండన్లో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కానీ ఏమైందో ఏమో ఈ ఏడాది ఫిబ్రవరిలో దల్జీత్, కొడుకుని తీసుకుని తిరిగి ఇండియాకు వచ్చేసింది. దీంతో విడాకుల రూమర్స్ వచ్చాయి. అయితే వాటిపై దల్జీత్ అప్పుడేం స్పందించలేదు. ఇప్పుడు క్లారిటీ ఇచ్చేసింది.భర్త నిఖిల్ పటేల్ తనని మోసగించాడని, వేరొకరితో రిలేషన్లో ఉన్నాడని ఈమె ఆరోపించింది. స్క్రీన్ షాట్ కూడా తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. దీనిబట్టి చూస్తే వీళ్లిద్దరి విడాకులు తీసుకున్నారని తేలింది. (ఇదీ చదవండి: మిగతా హీరోయిన్లకు నయనతారకు తేడా అదే.. అందుకే ఇన్నేళ్ల పాటు!) -
పెళ్లి చేసుకున్నా బాగుండేది.. ఇవన్నీ తప్పేవి: నటి
ఇద్దరు సెలబ్రిటీలు ఒకచోట కనిపిస్తే చాలు లవ్ అని పేరు పెట్టేస్తున్నారు. డేటింగ్ అంటూ పుకార్లు సృష్టిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఓసారి ఈ రూమర్స్ బారిన పడినవారే! ఆ మధ్య బాద్షా హీరోయిన్ మృణాల్ ఠాకూర్తో కనిపించగా సమ్థింగ్..సమ్థింగ్.. ఏదో జరుగుతోందని వెంటపడ్డారు. అలాంటిదేమీ లేదండీ బాబు అని బాద్షా స్వయంగా చెప్పడంతో సైలెంట్ అయిపోయారు. పాకిస్తాన్ నటి హనియా ఆమిర్తోనూ బాద్షాను లింక్ చేశారు. వీరిద్దరూ ఒకరి పోస్టుకు మరొకరు రిప్లై ఇస్తుంటారు. దుబాయ్లోనూ కలుసుకోవడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్లైంది.పార్టీ చేసుకున్నాం..తాజాగా తన డేటింగ్ రూమర్పై హనియా స్పందించింది. బాద్షా పాటలంటే నాకు ఇష్టం. అతడు నా ఫ్రెండ్. తనతో కలిసి పార్టీ చేసుకున్నదానికి రిలేషన్షిప్లో ఉన్నామని అతిగా ఊహించుకున్నారు. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు. నేను పెళ్లి చేసుకోకపోవడమే పెద్ద సమస్య అనుకుంటా.. వైవాహిక జీవితం మొదలుపెట్టి ఉంటే ఇలాంటి రూమర్లకు దూరంగా ఉండేదాన్ని.ఆన్లైన్ ఫ్రెండ్షిప్బాద్షాతో నా స్నేహం ఎలా మొదలైందంటే.. ఇన్స్టాగ్రామ్లో నేను చేసిన రీల్కు అతడు కామెంట్ పెట్టాడు. అది నా ఫ్రెండ్ చూసి బాద్షా కామెంట్ చేశాడంది. ఏంటి, నిజమా? అని ఆశ్చర్యపోయాను. తను నాకు డైరెక్ట్గా కూడా మెసేజ్ చేశాడు. అలా ఇద్దరం మాట్లాడుకున్నాం. తను చాలా మంచి వ్యక్తి. నేనెప్పుడైనా బాధలో ఉండి సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోతే.. ఏమైంది? అంతా ఓకేనా? ఏం జరుగుతోంది? అని ఆరా తీస్తుంటాడు. బాద్షా నాకు దొరికిన గొప్ప మిత్రుడు అని హనియా చెప్పుకొచ్చింది.చదవండి: Love Me Movie Review: ‘లవ్ మీ’మూవీ రివ్యూ -
మిగతా హీరోయిన్లకు నయనతారకు తేడా అదే.. అందుకే ఇన్నేళ్ల పాటు!
నయనతార వయసు 39 ఏళ్లు. ఇద్దరు పిల్లల తల్లి. కానీ ఇప్పటికీ వరసపెట్టి సినిమాలు చేస్తోంది. కాదు కాదు ఛాన్సులు వస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే చాలామంది హీరోయిన్లు.. తమకు స్టార్ హోదా రాగానే భూమ్మీద నిలబడరు. ఎక్కడికో వెళ్లిపోతారు. ఇలాంటి టైంలోనూ నయనతారకు అసలు ఇన్ని ఛాన్సులు ఎలా వస్తున్నాయి? అసలు ఆమె ఏం ఫాలో అవుతోంది?(ఇదీ చదవండి: Love Me If You Dare: ‘లవ్ మీ’మూవీ రివ్యూ)టాలీవుడ్ హీరోయిన్లనే తీసుకోండి. ఒక్కసారి స్టార్ హీరోయిన్ అయిపోతే ఇక చిన్న సినిమాలు చేయడానికి అస్సలు ఆసక్తి చూపించరు. మ్యునరేషన్ అమాంతం పెంచేస్తారు. నయన్ మాత్రం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. 'జవాన్' లాంటి మూవీతో పాన్ ఇండియా వైడ్ హిట్ కొట్టినా సరే తమిళంలో లోకల్ మూవీస్, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తుంది. హిట్, ఫ్లాప్ అనేది పక్కనబెడితే లోకల్ నిర్మాతలకు అందుబాటులో ఉంటుంది.కొన్నాళ్ల క్రితం అథర్వ అనే చిన్న హీరోతో కలిసి సినిమా చేసింది. ఇప్పుడు కవిన్ అని మరో యంగ్ హీరోతో కలిసి ఇప్పుడు నటించబోతుందట. లోకేశ్ కనగరాజ్ శిష్యుడు విష్ణు ఎడవన్.. ఈ ప్రాజెక్టుతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడట. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రాబోతుంది. అయితే మిగతా హీరోయిన్లతో పోలిస్తే అన్ని రకాల సినిమాలు చేస్తుండటమే ఈమె సక్సెస్ సీక్రెట్ అయ్యిండొచ్చు.(ఇదీ చదవండి: డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ) -
నెట్ఫ్లిక్స్లో అదరగొట్టిన ఇండియన్ సినిమాలు.. టాప్ మూవీస్ ఇవే!
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్, సినిమాల వ్యూస్ విషయంలో సరికొత్త రికార్డ్లను నమోదు చేస్తోంది. 2023లో ఒక్క భారత్ నుంచి నెట్ఫ్లిక్స్ 1 బిలియన్ వ్యూస్ వచ్చాయని, వెబ్సిరీస్, మూవీస్ వల్లే ఈ ఘనతను సాధించినట్లు ఓ నివేదికను విడుదల చేసింది. వాట్ వి వాచ్డ్ : నెట్ఫ్లిక్స్ ఎంగేజ్మెంట్ రిపోర్ట్ అనే పేరుతో జూలై నుండి డిసెంబర్ 2023 కాలానికి స్ట్రీమింగ్ సర్వీస్ వ్యూస్ డేటాను బహిర్ఘతం చేసింది. ఆ రిపోర్ట్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సబ్స్క్రైబర్లు 2023 ద్వితీయార్థంలో నెట్ఫ్లిక్స్లో దాదాపు 90 బిలియన్ గంటల కంటెంట్ను వీక్షించారు.తొలి స్థానంలో జానే జాన్భారత్ నుంచి వ్యూస్ విషయంలో సుజోయ్ ఘోష్ డైరెక్ట్ చేసిన జానే జాన్ 20.2 మిలియన్ల వీక్షణలతో నెట్ఫ్లిక్స్లో అత్యధికంగా వీక్షించిన తొలి చిత్రంగా పేరు సంపాదించింది. ఆ తర్వాత ‘జవాన్’ 16.2 మిలియన్ల వీక్షణలతో, ‘ఖుఫియా’ 12.1 మిలియన్ల వీక్షణలతో రెండవ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఓఎంజీ 2 (11.5 మిలియన్ వ్యూస్), లస్ట్ స్టోరీస్ 2 (9.2 మిలియన్ వ్యూస్), డ్రీమ్ గర్ల్ 2 (8.2 మిలియన్ వ్యూస్), కర్రీ అండ్ సైనైడ్ (8.2 మిలియన్ వ్యూస్) వచ్చాయి. భోపాల్ గ్యాస్ లీక్ నేపథ్యంతోనెట్ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ 1984 భోపాల్ గ్యాస్ లీక్ నేపథ్యంతో విడుదలైన ‘ది రైల్వే మెన్’ తొలిస్థానంలో నిలిచింది. ఈ వెబ్ సిరీస్కి 10.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత కోహ్రాకు (6.4 మిలియన్ వ్యూస్), గన్ అండ్ గులాబ్స్ (6.4 మిలియన్ వ్యూస్), కాలా పానీకి (5.8 మిలియన్ వ్యూస్) వచ్చాయి.కొరియన్ సిరీస్లు సైతంప్రపంచ వ్యాప్తంగా నాన్ ఇంగ్లీష్ షోలు, వెబ్ సిరీస్ సైతం నెట్ఫ్లిక్స్ సబ్స్క్రైబర్ వీక్షించారు. మొత్తం వ్యూస్లో దాదాపు మూడింట ఒక వంతు మంది ఉన్నారు. నివేదిక ప్రకారం ఇందులో కొరియన్ (9 శాతం), స్పానిష్ (7 శాతం), జపనీస్ (5 శాతం) ఉన్నాయి.జర్మనీ నుండి డియర్ చైల్డ్ (53 మిలియన్ వ్యూస్), పోలాండ్ నుండి ఫర్గాటెన్ లవ్ (43 మిలియన్ వీక్షణలు), మెక్సికో నుండి ఫ్యాక్ట్ ఆఫ్ సైలెన్స్ (21 మిలియన్ వ్యూస్), కొరియా నుంచి మాస్క్ గర్ల్ (21 మిలియన్ వ్యూస్) వచ్చినట్లు నివేదిక హైలెట్ చేసింది. జపాన్ నుండి యు యు హకుషో (19 మిలియన్ వ్యూస్), స్పెయిన్ నుండి బెర్లిన్ (11 మిలియన్ వ్యూస్) వచ్చాయి.నెట్ఫ్లిక్స్లో అత్యధికంగా వీక్షించబడిన సినిమా లీవ్ ది వరల్డ్ బిహైండ్. ఈ సినిమాకు 121 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత ఆడమ్ శాండ్లర్ యానిమేషన్ చిత్రం లియోకి (96 మిలియన్ వ్యూస్) వచ్చాయని పేర్కొంది. వెబ్ సిరీస్లో యాక్షన్ సిరీస్ వన్ పీస్కి 72 మిలియన్ వ్యూస్తో ఆకట్టుకుంది. అభిమానుల ఇష్టమైన ఒరిజినల్ వెడ్నెస్డే, రెడ్ నోటీస్,స్క్విడ్ గేమ్ నెట్ఫ్లిక్స్లో మిలియన్ల వ్యూస్ సంపాదించిందని నెట్ఫ్లిక్స్ రిపోర్ట్లో వెల్లడించింది. -
Love Me Movie Review: ‘లవ్ మీ’మూవీ రివ్యూ
టైటిల్: లవ్ మీనటీనటులు: ఆశీష్ రెడ్డి, వైష్ణవి చైతన్య, సిమ్రాన్ చౌదరి, రాజీవ్ కనకాల, రవి కృష్ణ తదితరులునిర్మాతలు : హర్షిత్ రెడ్డి, నాగ మల్లిడి, హర్షిత రెడ్డిదర్శకుడు: అరుణ్ భీమవరపుసంగీతం: ఎంఎం కీరవాణిసినిమాటోగ్రఫీ: పీసీ శ్రీరామ్విడుదల తేది: మే 25, 2024దెయ్యం తో లవ్...అని చెప్పగానే అందరికీ ‘లవ్ మీ’ సినిమా పై ఆసక్తి పెరిగింది. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆ ఆసక్తిని మరింత పెంచాయి. ఇలా భారీ అంచనాలతో నేడు(మే 25) ప్రేక్షకుల ముందకు వచ్చిన ‘లవ్ మీ’ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. అర్జున్ (ఆశిష్ రెడ్డి), ప్రతాప్(రవికృష్ణ) ఇద్దరు యూట్యూబర్స్. మూఢనమ్మకాలపై జనాల్లో ఉన్న అపోహాలను పోగొట్టేలా వీడియోలు చేస్తూ వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు. ప్రతాప్ ప్రియురాలు ప్రియ(వైష్ణవి చైతన్య) అప్పుడప్పుడు వీరికి సహాయం చేస్తుంటుంది. ఓ సారి ప్రతాప్ తమ ఊర్లో జరిగిన మిస్టరీని ఛేదించాలని దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. కొన్నాళ్ల క్రితం ఆ ఊర్లో నుంచి దివ్యవతి(సంయుక్త మీనన్)అనే చిన్నారి మిస్ అవుతుంది. కొన్నాళ్ల తర్వాత ఆమె ఆంధ్రా కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఆ తర్వాత ఆ అపార్ట్మెంట్ నుంచి కొన్ని శబ్దాలు వినిపించడంతో దివ్యవతి దెయ్యం అయిందని ఎవరూ అటువైపు వెళ్లరు. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఆ అపార్ట్మెంట్లోకి వెళ్లి ప్రతి ఒక్కరు చనిపోతుంటారు. ప్రియ ఈ సమాచారం అంతా సేకరించి ప్రతాప్కి చెబుతుండగా.. అర్జున్ వింటాడు. ఎవరైనా ఏదైనా చేయవద్దు అంటే ఆ పని చేయాలనుకునే స్వభావం ఉన్న అర్జున్.. ఆ దివ్యవతి గురించి తెలుసుకోవాలనుకుంటాడు. ఈ మిస్టరీని ఛేందించేందుకు ఒక్కడే ఆ అపార్ట్మెంట్లోకి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు దివ్యవతి ఎవరు? ఆ అపార్ట్మెంట్లో నిజంగానే దెయ్యం ఉందా? ఉంటే అర్జున్ని ఎందుకు చంపలేదు? వేరు వేరు ఊర్లల్లో మిస్సింగ్ అయిన వెన్నెల, నూర్, పల్లవిలకు దివ్యవతికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఈ మిస్టరీ అర్జున్ ఎలా ఛేదించాడు? అనేది మిగతా కథ.ఎలా ఉందంటే.. బేస్మెంట్ సరిగా లేకుంటే.. ఆ ఇంటిని ఎంత అందంగా తీర్చిదిద్దిన సరే ప్రయోజనం ఉండదు. అలాగే ఓ సినిమాకి కథ-కథనం కూడా బేస్మెంట్ లాంటిదే. కథలోని మెయిన్ పాయింట్ బలంగా ఉంటే..సాదారణంగా తెరకెక్కించినా ప్రేక్షకులు ఆదరిస్తారు. అంతేకానీ కథలోని అసలు పాయింటే బలహీనంగా.. అర్థవంతంగా లేకుంటే ఎంత రిచ్గా తీర్చిదిద్దినా..ఆడియన్స్ కనెక్ట్ కాలేరు. లవ్ మీ విషయంలో దర్శకుడు అదే పొరపాటే చేశాడు. ఇంతవరకు ఎవరూ ఎంచుకొని ఓ యూనిక్ పాయింట్ని ఎంచుకొని దాని చుట్టు మంచి సన్నివేశాలను అల్లుకున్నాడు. కానీ అసలు పాయింట్ దగ్గరే కన్ఫ్యూజన్ క్రియేట్ చేశాడు. అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో కూడా అర్థం కాదు. హారర్ సన్నివేశాలతో సినిమాను ప్రారంభించి లవ్ స్టోరీ, మర్డర్ మిస్టరీగా కథనాన్ని సాగించాడు.ప్రధాన పాత్రని తీర్చిదిద్దిన విధానం.. ప్లాష్ బ్యాక్ స్టోరీ అస్సలు రుచించదు. ఆ పాత్ర ఎందుకు అలా ప్రవర్తించిందో చెప్పిన కారణం మరింత సిల్లీగా అనిపిస్తుంది. అలాగే ఒకరితో ప్రేమలో ఉంటూనే మరొకరితో ప్రేమలో పడడం.. దానికి బలమైన కారణం కూడా లేకపోవడంతో ఆ లవ్స్టోరీకి ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు. ఇక దెయ్యంతో హీరో ప్రేమలో పడడం కూడా ఆసక్తికరంగా చూపించలేకపోయాడు. భయంతోనే దెయ్యంతో ప్రేమలో పడ్డానని హీరో చెప్పడం లాజిక్లెస్గా అనిపిస్తుంది. సినిమాలో హీరో చెప్పులు వేసుకోడు..దానికేదో బలమైన కారణం ఉంటుందని సగటు ప్రేక్షకుడు కచ్చితంగా ఊహిస్తాడు. కానీ దర్శకుడు ఓకే ఒక షాట్లో దానికి కారణం ఏంటో చూపించాడు. అయితే ఆ రీజన్ చూసిన తర్వాత నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. అలాంటి సీన్లు సినిమాలో చాలానే ఉంటాయి. హీరో అపార్ట్మెంట్లోకి వెళ్లిన తర్వాత వచ్చే సన్నివేశాలు ఇటు ఎంటర్టైన్మెంట్ అదించలేదు.. అలా అని అటు పూర్తిగా భయపెట్టలేవు. గతంలో చూసిన సాధారణ లవ్స్టోరీ మాదిరి కథనం సాగుతుంది. హీరో చేసే ఇన్వెస్టిగేషన్ కూడా రొటీన్గా ఉండడమే కాకుండా..గందరగోళానికి గురి చేస్తాయి. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ముందుగానే ఊహించొచ్చు. ఎవరెలా చేశారంటే.. అశీష్ రెడ్డికి ఇది రెండో సినిమా. అయినా కూడా నటన పరంగా ఇంకాస్త శిక్షణ అవసరమేమో అనిపిస్తుంది. సినిమా మొత్తం ఒకే రకమైన ఎక్స్ప్రెషన్తో కనిపిస్తాడు. సీన్కి తగ్గట్లుగా తన ఎక్స్ప్రెషన్స్ మార్చుకోలేకపోయాడు. అలాగే ఇందులో ఆయన పాత్రని ఎలివేట్ చేసే సన్నివేశాలు కూడా లేవు. ఇక బేబి తర్వాత వైష్ణవి చైతన్య నటించిన చిత్రమిది. ఆమె పాత్ర పరిధిమేర బాగానే నటించింది. అయితే ఆమె పాత్రను తీర్చిదిద్దిన విధానమే మళ్లీ ‘బేబీ’సినిమాను గుర్తు చేస్తుంది. ప్రతాప్గా రవికృష్ణ బాగానే నటించాడు. ఫుల్ లెన్త్ రోల్ తనది. సంయుక్త మీనన్ ఒకే ఒక్క షాట్లో కనిపిస్తుంది. సిమ్రాన్ చౌదరితో పాటు మిగిలిన నటీనటుటు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక పరంగా ఈ సినిమా బాగుంది. ఎంఎం కీరవాణీ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్ -
కేన్స్ 2024: బాలీవుడ్ హీరోయిన్ చేసిన పనికి ఫ్యాన్స్ ఫిదా!
భారతీయులు సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తుంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. కలలు నెరవేరినప్పుడు ఎంత సంతోషపడతారో అందుకు తోడ్పడినవారికి కృతజ్ఞతలు చెప్పేందుకు అంతే ముందుంటారు. ఆ ఆశయాన్ని సాధించడం ఎంతో గౌరవంగా భావిస్తారు. తాజాగా అవనీత్ కూడా ఒకింత సంతోషంగా మరింత గర్వంగా ఉంది.ఎర్ర తివాచీపై వయ్యారంగా..తొలిసారి ఆమె కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొంది. ఫ్రాన్స్లో జరుగుతున్న 77వ కేన్స్ చలనచిత్రోత్సవాలలో రెడ్ కార్పెట్పై నడిచింది. మే 23న ఎర్ర తివాచీపై వయ్యారంగా నడిచింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మ తనకు ఇంత గొప్ప అవకాశం వచ్చినందుకుగానూ నేలకు నమస్కరించి తర్వాత అక్కడ రెడ్ కార్పెట్పై హొయలు పోయింది. అచ్చమైన భారతీయురాలుఇది చూసిన జనాలు ఆమెను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. తన కలలు నెరవేరాయి. ఆమె కష్టాన్ని మనం తప్పకుండా గుర్తించి తీరాల్సిందే.. నేలకు నమస్కరించి తను ఒక అచ్చమైన భారతీయురాలు అని నిరూపించింది అని కామెంట్లు చేస్తున్నారు. కాగా మర్దాని సినిమాతో వెండితెరపై ప్రయాణం మొదలుపెట్టిన అవనీత్ బ్రూనీ, ఏక్తా, చిడియాఖన్నా, టికు వెడ్స్ షెరు వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఆమె లవ్ కీ అరేంజ్ మ్యారేజ్, లవ్ ఇన్ వియత్నాం సినిమాలు చేస్తోంది. View this post on Instagram A post shared by Avneet Kaur (@avneetkaur_13) చదవండి: కేన్స్లో రికార్డ్ క్రియేట్ చేసిన ఇండియన్ నటి.. తొలిసారి దక్కిన అవార్డ్ -
డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ
బెంగళూరు రేవ్ పార్టీలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని సీసీబీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. నగర శివారులో గత ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసి సుమారు 106 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి చెందిన రక్త నమూన పరీక్షలో డ్రగ్ పాజిటివ్ వచ్చిందని పోలీసులు గుర్తించారు. తాజాగా వారందరికీ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.టాలీవుడ్కు చెందిన సినీ నటి హేమ, ఆశూ రాయ్లకు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. వీరితో పాటు అరుణ్ చౌదరి, చిరంజీవి, క్రాంతి, రాజశేఖర్,సుజాత, రిషి చౌదరి, ప్రసన్న, శివాని జైశ్వాల్లకు కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరందరూ కూడా మే 27న విచారణకు హాజరు కావాలని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆదేశించారు. వీరికి డ్రగ్స్ ఎవరు ఇచ్చారు..? ఇంకా ఎవరెవరితో డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయోనని విచారించనున్నారు. ఈ రేవ్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఐదుగురుని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
'భజే వాయు వేగం' ట్రైలర్ విడుదల
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భజే వాయు వేగం’. ఈ చిత్రానికి ప్రశాంత్ రెడ్డి దర్శకుడు. ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీలో ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. యువీ క్రియేషన్స్ సమర్పణలో యువీ కాన్సెప్ట్స్ బ్యానర్పై ‘భజే వాయు వేగం’ రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.'బెదురులంక 2012' చిత్రం విజయం తర్వాత మరో విభిన్నమైన కథతో ఆయన ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘భావోద్వేగాలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. తండ్రీ తనయుల బంధం చుట్టూ మలిచిన సన్నివేశాలు చిత్రానికి ప్రధానబలంగా ఉండనున్నాయి. ట్రైలర్లో కూడా ఆ ఎమోషన్స్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ సినిమా మే 31న విడుదల కానుంది. -
ప్రభాస్ తర్వాత బుజ్జిని నడిపిన నాగచైతన్య.. వీడియో వైరల్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా 'కల్కి 2898'. దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్హాసన్, దిశా పటానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలయ్యాయి.కల్కి సినిమాలో భాగంగా బుజ్జిని ఎప్పుడైతే ప్రభాస్ పరిచయం చేశాడో ఆ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో నిలిచింది. బుజ్జి, భైరవ పాత్రల్ని పరిచయం చేస్తూ తాజాగా ఒక కార్యక్రమాన్నే మేకర్స్ నిర్వహించారు. బుజ్జి అనే పేరుతో కూడిన వాహనం కూడా కథలో కీలకం. ఆ వాహానాన్ని నడుపుకుంటూ ప్రభాస్ మొదటిసారి కనిపించి సందడి చేశాడు. అయితే, తాజాగా బుజ్జి వాహనాన్ని అక్కినేని నాగచైతన్య కూడా నడిపాడు. వాహనాన్ని చూసిన నాగచైతన్య ఆశ్చర్యపోయాడు. ఇంజనీరింగ్లో ఉన్న రూల్స్ అన్నీ బ్రేక్ చేస్తూ దీనిని తయారు చేశారా అని ఫన్నీగా కామెంట్ చేశాడు. బుజ్జిని డ్రైవ్ చేసిన నాగచైతన్య వీడియోను మేకర్స్ షేర్ చేశారు. సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కిన కల్కి జూన్ 27న విడుదల కానుంది.Look who's met #Bujji... @chay_akkineni, hope you had a fantastic time.#Kalki2898AD #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @BelikeBujji @saregamaglobal @saregamasouth #Kalki2898ADonJune27 pic.twitter.com/8odhpYDqMz— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 25, 2024 -
డబ్బు కోసం ఏదిపడితే అది చేశా.. తర్వాతేమో దేవుడిని ప్రార్థించేదాన్ని: నటి
సినిమాల్లో కనిపించాలని కలలు కనడం బాగుంటుంది కానీ దాన్ని నిజం చేసుకునే క్రమంలో ఎన్నో కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పైగా అలవాటు లేని ప్రదేశానికి వెళ్లి.. అక్కడ అడ్జస్ట్ అవడానికి టైం పడుతుంది. తాను కూడా కొత్తలో ముంబై నుంచి వెళ్లిపోవాలని అనుకున్నానని చెప్తోంది బాలీవుడ్ నటి నీనా గుప్తా.వెళ్లిపోదామనుకున్నా..తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాది ఢిల్లీ. సినిమా కోసం అక్కడి నుంచి ముంబైకి వచ్చాను. కానీ ఈ వాతావరణానికి అలవాటు పడలేక ఎన్నోసార్లు వెళ్లిపోవాలనుకున్నాను. ప్రతి మూడు నెలలకోసారి బ్యాగు సర్దుకునేదాన్ని. ముందు పీహెచ్డీ చేసి ఆ తర్వాత వచ్చేద్దాం అనుకునేదాన్ని. కానీ ఈ సిటీ మనల్ని వెళ్లనివ్వదు.దేవుడిని మొక్కేదాన్నిఅయితే మొదట్లో నాకు డబ్బు అవసరం చాలా ఉండేది. అందుకోసం నాకు నచ్చని పాత్రలు కూడా చేసేదాన్ని. తర్వాత ఆ సినిమాలు రిలీజవకూడదని దేవుడిని ప్రార్థించేదాన్ని. అప్పుడు దేనికీ నో చెప్పకపోయేదాన్ని. ఇప్పుడు ధైర్యంగా తిరస్కరిస్తాను. నాకు నచ్చిన స్క్రిప్టునే ఎంచుకుంటాను. నచ్చనివాటిని ఒప్పుకునే ప్రసక్తే లేదు అని చెప్పుకొచ్చింది. గ్లామర్ రోల్స్ చేయనుతనను రెబల్ స్టార్ అని పిలవడంపై స్పందిస్తూ.. ఎందుకు నన్ను రెబల్ అని పిలుస్తారో అర్థం కాదు. పైగా నేను చాలా అమాయక పాత్రలు పోషించాను. పెద్దగా గ్లామర్ పాత్రలు, శక్తివంతమైన రోల్స్ కూడా చేయలేదు. నేను సింగిల్ మదర్ అని మీడియానే నాకు రెబల్ అన్న ట్యాగ్ ఇచ్చింది. నేను పోయినప్పుడు కూడా బోల్డ్ నీనా గుప్తా ఇక లేరు అనే రాస్తారు. నేను చనిపోయినా కూడా అలాంటి ట్యాగులు అంటగట్టడం ఆపరు. సరే, ఇంక దాన్ని నేను ఏం చేయలేను అని నీనా గుప్తా తెలిపింది. కాగా ఈమె ముఖ్య పాత్రలో నటిస్తున్న పంచాయత్ వెబ్ సిరీస్ మూడో సీజన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మే 28 నుంచి ప్రసారం కానుంది. -
ఆ హీరో కోసం కియారా, జాన్వీ కపూర్!
బాలీవుడ్ హీరోయిన్లు ఈ మధ్య దక్షిణాదిపై ఆసక్తి చూపుతున్నారు. ఇలియానా, తమన్నా, కాజల్, తాప్సీ, హన్సిక వంటి పలువురు బాలీవుడ్ భామలు దక్షిణాదిలో ఎదిగిన వారే. ఇప్పుడు కూడా కియారా, దిశాపటాని వంటి క్రేజీ హీరోయిన్లు దక్షిణాది చిత్రాల్లో నటిస్తూ పాన్ ఇండియా నటీమణులుగా రాణిస్తున్నారు. తాజాగా జాన్వీ కపూర్ ఈ పట్టికలో చేరారు. ప్రస్తుతం తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ రామ్చరణ్తో జత కట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఇద్దరూ ఒకే సినిమాలో!ఇకపోతే కియారా అద్వానీ తెలుగులో ఇప్పటికే రెండు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం రామ్చరణ్కు జంటగా గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు కలిసి ఒక చిత్రంలో నటిస్తే.. అదీ తమిళ సినిమా అయితే, అందులో శింబు కథానాయకుడు అయితే, ఆ చిత్రం వేరే లెవల్గా ఉంటుంది కదూ! అలాంటి క్రేజీ చిత్రం త్వరలోనే తెరకెక్కబోతోందన్నది తాజా సమాచారం. ద్విపాత్రాభినయంశింబు ప్రస్తుతం కమలహాసన్ హీరోగా నటిస్తున్న థగ్లైఫ్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. దీని తరువాత శింబు తన 48వ చిత్రంలో నటించనున్నారు. దీన్ని నటుడు కమలహాసన్ తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనుంది. దీనికి దేశింగు పెరియస్వామి దర్శకత్వం వహించనున్నారు. దీనికి సంబంధించిన ఫ్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్లుక్ పోస్టర్ను ఇటీవల విడుదల చేయగా అందులో ఇద్దరు శింబులు తలపడుతున్నట్లుగా ఉంది.కియారాతో పాటు..శింబు ద్విపాత్రాభినయం చేయనున్న ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో ఒక కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారంలో ఉంది. అలాగే జాన్వీ కపూర్ను సైతం ఎంపిక చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది. ఇదే నిజమైతే ఈ క్రేజీ చిత్రం ద్వారా కియారా, జాన్వీకపూర్ ఇద్దరూ కోలీవుడ్కు ఎంట్రీ ఇవ్వనున్నారన్న మాట!చదవండి: ట్రెండింగ్లో విజయ్ చెల్లెలు ఫోటో.. కారణం ఇదే -
కేన్స్లో రికార్డ్ క్రియేట్ చేసిన ఇండియన్ నటి.. తొలిసారి దక్కిన అవార్డ్
ఫ్రాన్స్లో జరుగుతున్న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ నటి అనసూయ సేన్గుప్తా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డును అందుకునున్న తొలి భారతీయ నటిగా ఆమె రికార్డ్ క్రియేట్ చేసింది. 'అన్ సర్టెయిన్ రిగార్డ్' విభాగంలో ఉత్తమ నటి అవార్డును ఆమె సొంతం చేసుకుంది.బల్గేరియన్ చిత్రనిర్మాత కాన్స్టాంటిన్ బోజనోవ్ దర్శకత్వం వహించిన 'షేమ్లెస్' చిత్రంలో ఆమె పాత్రకు గాను ఈ అవార్డు లభించింది. ఢిల్లీలోని ఓ వేశ్యాగృహం నుంచి పోలీసులను కత్తితో పొడిచి పారిపోయిన 'రేణుక' అనే ఒక వేశ్య జీవిత ప్రయాణాన్ని ఇందులో చిత్రీకరించారు. కోల్కతాకు చెందిన అనసూయ సేన్గుప్తా వేశ్య పాత్రలో తన నటనతో మెప్పించింది. తాజాగా జరుగుతున్న కేన్స్ వేడుకల్లో 'షేమ్లెస్' చిత్రాన్ని ప్రదర్శించగా ఉత్తమ నటిగా ఆమె అవార్డు దక్కింది.అనసూయ సినిమా రంగంలో ఉన్నప్పటికీ వెండితెరపై కనిపించలేదు. ముంబైలో ప్రొడక్షన్ డిజైనర్గా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం గోవాలో అనసూయ సేన్గుప్తా నివసిస్తోంది. నెట్ఫ్లిక్స్ షో 'మసబా మసబా' చిత్రాన్ని నిర్మించడంలో ఆమె కీలకపాత్ర పోషించింది. బెంగాలీ దర్శకుడు అంజన్ దత్ నిర్మించిన రాక్ మ్యూజికల్ మ్యాడ్లీ బెంగాలీ (2009)లో ఆమె తొలిసారిగా నటించింది. ఆ తర్వాత ఆమె నటనకు దూరమైంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ అంజన్ దత్ సాయంతోనే షేమ్లెస్ చిత్రంలో కనిపించి ఉత్తమ నటిగా అవార్డ్ను సొంతం చేసుకోవడం విశేషం. ఈ సినిమాలో వేశ్యగా 'రేణుక' పాత్రలో అనసూయ సేన్గుప్తా మెప్పించింది. వేశ్యగా జీవిస్తున్న ఆమెకు సమాజంలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొందో ఈ చిత్రం చూపుతుంది. -
రేవ్ పార్టీపై మంచు లక్ష్మీ కామెంట్
హారర్ బ్యాక్డ్రాప్తో తెలుగులో మరో క్రేజీ వెబ్ సిరీస్ రాబోతుంది. మంచు లక్ష్మీ, వేదిక, రాహుల్ విజయ్, అజయ్ కీలక పాత్రలలో నటించిన 'యక్షిణి' వెబ్ సిరీస్ త్వరలో విడుదల కానుంది. బాహుబలి నిర్మాతలు రూపొందిస్తున్న ఈ సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్పై ప్రేక్షకులలో కూడా ఆసక్తి ఉంది. జూన్ 14 నుంచి హాట్స్టార్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి రానుండటం విశేషం. అయితే తాజాగా ప్రమోషన్స్లో భాగంగా మంచు లక్ష్మీ పలు విషయాల గురించి మాట్లాడింది.తాను ముంబైకి షిఫ్ట్ కావడంతో అందరూ బాలీవుడ్కు వెళ్లానని భావించారు. అందులో ఎలాంటి నిజం లేదని ఆమె తెలిపింది. నేను ముంబై మాత్రమే వెళ్లాను. హైదరబాద్ నా ఇల్లుతో సమానం. నేను ఏ భాషలో అయినా నటిస్తాను. హాలీవుడ్లో నటించిన తర్వాత టాలీవుడ్,కోలీవుడ్లో చేశాను. అందులో తప్పేముంది. నా కూతురుతో పాటు నా భవిష్యత్ కోసమే ముంబై వెళ్లాను. అని మంచు లక్ష్మీ చెప్పింది.బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఏం జరిగిందో తనకు తెలియదని మంచు లక్ష్మీ తెలిపింది. ఆ పార్టీకి వెళ్లిన వాళ్లు ఎవరో తనకు తెలియదని ఆమె చెప్పింది. పార్టీకి వెళ్లిన వారితో తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. సమస్య పార్టీకి వెళ్లిన వ్యక్తులది మాత్రమేనని ఆమె తెలిపింది. దానిలో అందరికీ ఏం సంబంధం ఉంటుందని ఆమె ప్రశ్నించింది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
స్ట్రాంగ్ రూమ్ల తనిఖీ
ఏయూ డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
అడ్డగోలుగా పార్కింగ్ చేస్తే.. అంతే
సరకు రవాణాలో సరికొత్త వ్యూహాలు
బాలికపై కేజీహెచ్ ఉద్యోగి లైంగిక వేధింపులు
India Meteorological Department: రాజస్తాన్లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత
కేకే లైన్లో డీఆర్ఎం తనిఖీలు
జంతు సంరక్షణ చట్టం నోడల్ అధికారిగా ఏసీపీ శ్యామలరావు
కెమికల్ ఇంజినీరింగ్లో విస్తృత అవకాశాలు
తప్పక చదవండి
- Malaysia Masters 2024: ఫైనల్లో పీవీ సింధు
- Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
- మీ ఇంటిని చక్కదిద్దుకోండి..!
- Lok Sabha Election 2024: ఆరో విడతలో 61.11 శాతం
- కలిసికట్టుగా ముందుకు..
- Lok Sabha Election 2024: ముస్లింల ఓట్ల కోసం ‘ముజ్రా’
- India Meteorological Department: రాజస్తాన్లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత
- ఏసీబీ వలలో రావులపాలెం సీఐ
- సిరుల విరులు..కొండ చీపుర్లు
- వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నం
Advertisement