-
మోదీ, బీజేపీని ఇరుకున పెట్టే వాళ్లు అయినందుకేనా?
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ మే 25 (శనివారం) ముగిసింది. నిన్న జరిగిన పోలింగ్లో గాంధీ కుటుంబం, సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబం ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే దేశంలో బలమైన ప్రతిపక్ష గొంతును వినిపిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్పై ప్రధాని మోదీ, బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై అంతర్జాతీయ సంస్థలు, ఐక్యరాజ్య సమతి హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ ఆందోళన వ్యక్తం చేశారు.రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ను ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వం.. అన్యాయమైన కేసుల్లో ఇరికించి నేర దర్యాప్తు పేరుతో టార్గెట్ చేసిందని తెలిపారు. దశాబ్దాలుగా ఏలిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై గతేడాది బీజేపీ పరువు నష్టం కేసు వేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో సూరత్ కోర్టు దోషి తేల్చి.. రాహుల్కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. అనంతరం ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించగా.. రెండేళ్ల జైలు శిక్షపై అత్యున్నత న్యాయ స్థానం స్టే విధించింది.మరోవైపు.. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్పై ఉన్నారు. తిరిగి జూన్లో తీహర్ జైలుకు వెళ్లాల్సి ఉంది. ఫిబ్రవరిలో కాంగ్రెస్ పార్టీ ఖాతాలను ఇన్కం టాక్స్ విభాగం స్తంభింపచేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఖాతాలను స్తంభింపచేయటం వల్ల రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి ఇబ్బందులు కలుగుతాయని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.ఇలా.. దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకోని ప్రధాని మోదీ, బీజేపీ.. ప్రతిపక్ష పార్టీలు, నేతలను బలహీనపరుస్తున్నాయని తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని మోదీ, బీజేపీ వ్యవహరిస్తున్న తీరుతో దేశంలోని ప్రజాస్వామ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్లో అధికార బీజేపీ ప్రతిపక్షాలను బలహీన పర్చడానికి ప్రభుత్వ సంస్థలను వాడుకుంటోందని ఐక్యరాజ్య సమతి హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ ఆందోళన వ్యక్తం చేశారు. -
Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
సిమ్లా: చైనా భారత భూబాగాన్ని ఆక్రమించి ఇళ్లు, రోడ్డు నిర్మిస్తోందని, అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నా రు. హిమాచల్ప్రదేశ్లోని రొహ్రులో శనివారం ఎన్నికల సభలో మాట్లాడుతూ ‘56 అంగుళాల ఛాతి ఎటుపోయింద’ని ఎద్దేవా చేశారు. దేశ ప్రజలను, రాజ్యాంగాన్ని కాపాడటానికి కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందన్నా రు. రాజ్యాంగాన్ని రక్షించకపోతే దాని ద్వారా అందిన ప్రజాస్వామ్యం, హక్కులను లాగేసుకుంటారని అన్నారు. మోదీ ప్రభుత్వం ధనవంతుల కొమ్ముకాస్తుందని, కాంగ్రెస్ పేదల పక్షాన నిలబడుతుందని పేర్కొన్నారు. -
ఇంత దారుణంగా మాట్లాడిన ప్రధాని దేశ చరిత్రలోనే లేరు: ప్రియాంక
న్యూఢిల్లీ/గోరఖ్పూర్(యూపీ): ప్రతిపక్ష ఇండియా కూటమినుద్దేశించి ‘ముజ్రా’అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా తీవ్రంగా మండిపడ్డారు. ఇంత దారుణంగా మాట్లాడిన ప్రధానమంత్రి దేశ చరిత్రలోనే లేరని పేర్కొన్నారు. ‘ప్రధానమంత్రి పదవిని దేశం యావత్తూ గౌరవిస్తుంది. అటువంటి పదవికున్న ఔన్నత్యాన్ని కాపాడండి’అని మోదీకి హితవు పలికారు. యూపీలోని గోరఖ్పూర్లో శనివారం ఆమె మాట్లాడారు. ‘బిహార్లో ప్రధాని మోదీ ఏమన్నారో విన్నారా? దేశ చరిత్రలోనే అటువంటి భాష ను వాడిన ప్రధాని మరొకరు లేరు. అటువంటి మాటలు ప్రధాని నోట రాకూడదు. సహనం కోల్పోయిన మోదీ దేశానికి, దేశ ప్రజలకు ప్రతినిధిననే విషయం మర్చిపోతున్నారు. ఆయన అసలు రూపం బట్టబయలైంది’అని ప్రియాంక అన్నారు. ‘దేశమే తన కుటుంబమని చెప్పుకుంటున్న వ్యక్తి అనాల్సిన మాటలు కావవి. కుటుంబసభ్యులు పరస్పరం గౌరవించుకోవాలి. ఎప్పటికీ అది అలాగే కొనసాగాలి’ అని ప్రియాంక అన్నారు. -
Lok Sabha Election 2024: ముస్లింల ఓట్ల కోసం ‘ముజ్రా’
పాటలీపుత్ర/ఘాజీపూర్: విపక్ష ‘ఇండియా’ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి విమర్శనా్రస్తాలు సంధించారు. విపక్ష కూటమి బానిసగా మిగిలిపోయిందని, ముస్లిం ఓటు బ్యాంక్ను సంతృప్తిపర్చడానికి ముజ్రా(వేడుకల్లో అతిథులను అలరించడానికి చేసే నృత్యం) చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు లాక్కోవడానికి ప్రతిపక్షాలు సాగిస్తున్న కుట్రలను కచ్చితంగా అడ్డుకుంటానని తేలి్చచెప్పారు. రిజర్వేషన్ల జోలికి వస్తే సహించబోనని హెచ్చరించారు. శనివారం బిహార్లోని పాటలీపుత్ర, కారాకాట్, బక్సర్, ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రతిపక్షాలు పొరుగు దేశాన్ని చూపించి మనల్ని బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. తాను ఎవరికీ భయపడడం లేదని, పాకిస్తాన్ ప్రయోజిత ఉగ్రవాదాన్ని, అవినీతిని, నక్సలైట్ల హింసాకాండ అంతం చేయడానికి కృషి చేస్తున్నానని చెప్పారు. సామాజిక న్యాయం కోసం జరిగిన పోరాటానికి బిహార్ కొత్త దిశను ఇచి్చందని గుర్తుచేశారు. నరేంద్ర మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవు ‘‘పంజాబ్, తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు, తమిళనాడులో డీఎంకే నేతలు, పశి్చమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు బిహార్ వలస కూలీలను దూషిస్తూ మాట్లాడారు. తద్వారా బిహారీలను కించపర్చారు. బిహారీలను అవమానిస్తే కనీసం నిరసన తెలిపే ధైర్యం ఆర్జేడీకి లేకుండాపోయింది. ఆర్జేడీ నాయకులకు లాంతర్ పట్టుకొని ముజ్రా డ్యాన్స్ చేయడం తప్ప ఇంకేమీ తెలియదు. ఓటు జిహాద్కు పాల్పడుతున్నవారిపై విపక్షాలు ఆధారపడుతున్నాయి, వారి మద్దతు పొందుతున్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత చొక్కాలు చించేసుకుంటారు మన సైనికులు ‘వన్ ర్యాంక్, వన్ పెన్షన్’ పొందకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుపడింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాతే సైనికులకు మేలు జరిగింది. పనులు ఆలస్యం చేయడంతో, హక్కులు లాక్కోవడంలో కాంగ్రెస్ ఆరితేరింది. ‘ఇండియా’ కూటమి ఓటమి దిశగా పయనిస్తోంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత విపక్ష నాయకులు పరస్పరం చొక్కాలు చించేసుకుంటారు. ఎన్నికల్లో ఓటమికి రాజకుటుంబం(సోనియా గాంధీ కుటుంబం) కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్గున ఖర్గేను బాధ్యుడిని చేస్తుంది. అనంతరం విదేశాలకు విహారానికి వెళ్లిపోతుంది. విపక్ష కూటమి ఒక గాలిబుడగ. అది ఇప్పటికే పేలిపోయింది’’ అని ప్రధాని మోదీ తేలి్చచెప్పారు. -
Lok Sabha Election 2024: కాశీ చుట్టూ ప్రదక్షిణం!
దక్షిణాది రాష్ట్రాల బీజేపీ నేతలు పొలోమని కాశీ బాట పడుతున్నారు. ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానంలో మూడోసారి పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అక్కడ అధికంగా ఉండే దక్షిణాది ప్రజల ఓట్లే లక్ష్యంగా కలియదిరుగుతున్నారు. తెలుగు, తమిళ సంఘాలతో సమావేశమవుతున్నారు. నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న దక్షిణాది ఆశ్రమాల పెద్దలతో ఉదయం, సాయంత్రం బైఠక్లు నిర్వహిస్తున్నారు. దక్షిణాది వారే కీలకం.. వారణాసి నియోజకవర్గంలో 18.50 లక్షల ఓట్లున్నాయి. వీరిలో దక్షిణాది ఓటర్లు కనీసం 3 లక్షల పై చిలుకే ఉంటారు. తెలుగు, తమిళ ఓటర్లు 2 లక్షల దాకా ఉంటారు. కన్నడ, మలయాళీలు లక్ష మంది ఉన్నారు. కాశీలోనే దక్షిణాది రాష్ట్రాల నిర్వహణలో కనీసం 200 వరకు ఆశ్రమాలున్నాయి. ఇలా వారణాసిలో దక్షిణాది ఓటర్లు కీలకంగా మారారు. 2019 ఎన్నికల్లో మోదీ 6.74 లక్షల ఓట్లు (63.62 శాతం) సాధించారు. ఈసారి ఏకంగా 80 శాతం ఓట్లను బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా దక్షిణాది వారి ఓట్లు అత్యధికంగా మోదీకే వచ్చేలా చూడాలని అధిష్టానం భావిస్తోంది. దాంతో ఆయా రాష్ట్రాల కీలక నేతలు ఇప్పటికే రంగంలోకి దిగి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి 50 మంది ఓటర్లకు ముగ్గురు, నలుగురితో కూడిన బృందం చొప్పున పని చేస్తోంది! అంతేగాక ఒక్కో బృందం రోజుకు 4 నుంచి 5 సమూహాలతో భేటీలు నిర్వహిస్తోంది. వారణాసిలో ఇలాంటి బృందాలు ఏకంగా 2,000 దాకా పనిచేస్తున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు! ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత డిసెంబర్ నుంచే తెలుగు, తమిళ సంగమం పేరుతో వారణాసిలో బీజేపీ పలు కార్యక్రమాలు నిర్వహించింది. మోదీ వర్చువల్గా వాటిలో పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేర్కొనే వేములవాడకు కాశీతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తూ తెలుగు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాశీలో నివసించే దక్షిణాది వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు తీసుకున్న చర్యల గురించి వివరించారు. వారణాసి రైల్వే స్టేషన్తో పాటు ప్రధాన దారులు, కూడళ్లలో దక్షిణాది పర్యాటకుల సౌలభ్యం కోసం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రకటనలు తదితరాలు ఏర్పాటు చేయించడాన్నీ గుర్తు చేశారు. కీలక నేతలంతా అక్కడే.. వారణాసిలో చివరిదైన ఏడో విడతలో భాగంగా జూన్ 1న పోలింగ్ జరగనుంది. అక్కడి దక్షిణాది ఓటర్లతో సమన్వయ బాధ్యతలను తెలంగాణ బీజేపీ ఇన్చార్జి సునీల్ బన్సల్కు అధిష్టానం అప్పగించింది. ఆయన వారం రోజులుగా అక్కడే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బి.బి.పాటిల్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్; ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి, తమిళనాడు నేతలు గాయత్రీ దేవి, ఆర్.రాజలక్షి్మ, సి.టి.పళనిస్వామి, తిరునల్వేలి బీజేపీ అభ్యర్థి నయనార్ నాగేంద్రన్, కె.గోపాలస్వామి, కేరళకు చెందిన పీకే కృష్ణదాస్, కుమ్మనం రాజశేఖర్ తదితరులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆదివారం నుంచి బీజేపీ తమిళనాడు, కర్ణాటక అధ్యక్షులు అన్నామలై, బి.వై.విజయేంద్ర కూడా వారణాసిలోనే వారం పాటు మకాం వేసి ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘‘మోదీ కూడా ఆదివారం నుంచి వారణాసిలో సభలు, ర్యాలీల్లో పాల్గొంటారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలతోనూ ఆయన మమేకమయ్యేలా కార్యక్రమం ఏర్పాటు చేసే యోచన ఉంది’’ అని బీజేపీ కీలక నేత ఒకరు వెల్లడించారు.– సాక్షి, న్యూఢిల్లీ -
ముగిసిన ఆరవ విడత పోలింగ్... ప్రధాని మోదీ కీలక ట్వీట్
న్యూఢిల్లీ: ఆరో విడత పోలింగ్లో ఓటు వేసిన వారందరికీ ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు శనివారం(మే25) సాయంత్రం ఎక్స్(ట్విటర్)లో మోదీ ఒక పోస్టు చేశారు. ఆరో విడత పోలింగ్ తర్వాత ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం పెరిగిందన్నారు.ఇండియా కూటమి ఎలాగూ అధికారంలోకి రాదని ప్రజలు తెలుసుకున్నారని, అందుకే వారికి ఓటు వేయడం వృథా అని భావిస్తున్నారు. ఇదిలాఉంటే తమకు ఈ ఎన్నికల్లో రానున్న 352 సీట్లలో ఇప్పటికే 272 సీట్లు తమ ఖాతాలో వేసుకున్నామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాగా, శనివారం ముగిసిన ఆరో విడత పోలింగ్తో దేశంలో ఇప్పటివరకు 486 ఎంపీ సీట్లకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఏడవ, తుది విడత పోలింగ్ జూన్1న జరగనుంది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. -
ఓటు బ్యాంకు కోసం డ్యాన్సులు కూడా చేస్తారు: ప్రధాని మోదీ
పాట్నా: ఓటుబ్యాంకు ముందు ఇండియా కూటమి నేతలు అవసరమైతే డ్యాన్సులు వేస్తారని ప్రధాని నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంకు కోసం ఎస్సీ,ఎస్టీ,బీసీలకు భారత రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్లు లాక్కుంటానంటే తాను మాత్రం చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు. శనివారం(మే25) బిహార్లోని పాటలీపుత్రలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ఇండియా కూటమి నేతలు వారి ఓటు బ్యాంకు కోసమే పనిచేస్తారని, తనకు మాత్రం రాజ్యాంగమే సుప్రీం అని స్పష్టం చేశారు. ‘బిహార్ ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాలకు నేను హామీ ఇస్తున్నా. మోదీ బతికున్నంతవరకు మీ హక్కులు ఎక్కడికి పోనివ్వను.ఓటుబ్యాంకు రాజకీయాలు మాత్రమే చేస్తామంటే ఇండియా కూటమి నేతలను చేయనివ్వండి. నాకు మాత్రం రాజ్యాంగమే ముఖ్యం. ఆర్జేడీ,కాంగ్రెస్ కూటమి మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని చూస్తున్నారు’అని మోదీ మండిపడ్డారు. -
ఇండియా కూటమి ఎఫెక్ట్..! కన్ప్యూజన్లో ఎగ్జిట్ పోల్స్
సార్వత్రిక ఎన్నికల్లో ఆరు విడుతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. అసలు పోటీలో లేదనుకున్న ఇండియా కూటమి కొన్ని రాష్ట్రాల్లో గట్టిపోటీ ఇస్తోందనే వార్తలొస్తున్నాయి. దీంతో జూన్ ఒకటిన జోస్యం చెప్పబోయే ఎగ్జిట్ పోల్ సంస్థలు కన్ప్యూజన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ‘అబ్కీ బార్ చార్సౌ పార్’ నినాదంతో.. ఈసారి బీజేపీ ప్రచారంలో అందరికంటే ముందు నిలిచింది. మోదీ చరిష్మాతో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలనే పక్కా ప్రణాళికతో బీజేపీ ఎన్నికల ప్రచారం కొనసాగించింది. ఓ వైపు మోదీ మరోవైపు అమిత్ షా దేశాన్ని చుట్టేశారు. నాలుగు వందల సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే మొదటి రెండు విడతల పోలింగ్ ముగిసిన తరువాత ఇండియా కూటమి సైతం కాస్త పోటీపడినట్లు కనిపించింది. బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూటమి బలం పుంజుకుందనే వార్తలు వచ్చాయి. దీంతో ఎన్నికలు ఏకపక్షం కాదనే వాదనలు ప్రారంభమయ్యాయి. యూపీలో సైతం తాము చాలా సీట్లు గెలుస్తామని ఇండియా కూటమి ప్రకటించడంతో.. ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. ఎలక్షన్ చివరి అంకానికి చేరుకున్న నేపధ్యంలో ఎన్నికలు నువ్వా.. నేనా.. అన్నట్లు జరిగాయనే అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. దీంతో అసలు దేశంలో ఏం జరగబోతుందనే కొత్త చర్చ ప్రారంభం అయింది. చాలామంది ఎలక్షన్ పండితులు బీజేపీ సీట్లు తగ్గుతాయనే అభిప్రాయం చెబుతున్నా.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా అనే విషయంపై మాత్రం ఏ ఒక్కరూ కాన్ఫిడెంట్గా లేరు.400సీట్ల టార్గెట్తో రంగంలోకి దిగిన బీజేపీ.. నిజంగా తన లక్ష్యాన్ని సాధిస్తుందా అనే చర్చతో ఈ సారి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 2019లో సింగిల్గా 303సీట్లు సాధించిన బీజేపీ చరిత్రను తిరగరాసింది. ఇందిరాగాంధి మరణానంతంరం వచ్చిన సానుభూతితో 1984లో కాంగ్రెస్ పార్టీ 300 మార్కును దాటింది. ఆ తరువాత మళ్లీ ఏ పార్టీ కూడా సింగిల్గా 300మార్కు దాటలేదు. కూటమిగా ఎన్డీయే 2019లో ఏకంగా 353 స్థానాలు సాధించింది. ఇది నిజంగా భారీ రికార్డు. తన రికార్డునే తానే తిరగరాస్తానంటూ మోదీ 400 సీట్లు సాధిస్తామని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ కూటమి ప్రచారం కంటే ముందే కుదేలైపోయింది. బీజేపీ ట్రాప్లో పడిపోయిన ఇండియా కూటమి నాయకులు.. బీజేపీ 400 సాధించలేదంటూ ప్రకటనలు చేసేశారు. కాని బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి 272 సీట్లు చాలన్న చిన్న లాజిక్ను కాంగ్రెస్ కూటమి మరిచిపోయింది. తప్పును ఆలస్యంగా తెలుసుకున్న ఇండియా కూటమి నాయకులు తరువాతి కాలంలో అసలు బీజేపి అధికారంలోకి రాలేదంటూ ప్రకటనలు చేయడం ప్రారంభించారు. అయితే అప్పటికే కీలకమైన రెండు విడతల పోలింగ్ పూర్తైపోయింది. ఈ రెండు విడతల్లో జాతీయ స్థాయిలో మోదీ ఉండాలా వద్దా అనే విషయంపై రెఫరెండంగా ఎన్నికలు జరిగినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందుకే మొదటి రెండు విడతల్లో.. పోలింగ్ జరిగిన 190 స్థానాల్లో బీజేపీ హవా కొనసాగినట్లు పోల్ పండిట్లు అంచనా వేస్తున్నారు. మోదీ హాట్రిక్ నినాదంతో ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందే బీజేపీ గెలిచేసిందనే వాదనలు ప్రారంభమయ్యాయి. అయితే మూడు, నాలుగు విడతల పోలింగ్ జరిగే సరికి లోక్సభ ఎన్నికల్లో లోకల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ప్రభావితం చూపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 40 స్థానాలున్న బీహార్లో తేజస్వీ యాదవ్ తన ప్రచారంలో ఎక్కువగా నిరుద్యోగం అంశాన్ని హైలైట్ చేశారు. 2019లో బీహార్లో ఎన్డీయే కూటమి 39 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ కూటమి కొన్ని స్థానాలు గెలుస్తుందనే వార్తలు వస్తున్నాయి. యూపీలో అఖిలేష్ మీటింగ్లకు సైతం భారీగా జనం హాజరవడం ఎన్నికల సరళిపై కొత్త చర్చకు తెరలేపింది. 80 లోక్సభ స్థానాలున్న యూపీలో బీఎస్పీ ఈసారి తన ప్రాభవాన్ని కోల్పోతుందని.. దీనివల్ల లాభపడేది ఎవరనే దానిపై యూపీ రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయనేది విశ్లేషకుల అంచనా. ఇక యూపీ తరువాత అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో మరాఠా అస్మితా పేరుతో ఉద్ధవ్ ఠాక్రే తీసుకొచ్చిన ఆత్మగౌరవం నినాదంపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అటు కర్ణాటకలోనూ ప్రజ్వల్ రేవన్న అంశం బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పనిచేసినట్లు తెలుస్తోంది. దీంతో మూడునాలుగు విడతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఇండి కూటమి పోటీలోకి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ 400 సీట్ల నినాదం కేవలం ప్రతిపక్షాలను ట్రాప్ చేయడానికే అనేది స్పష్టమైపోయింది. అయితే బీజేపీ మాత్రం ఇప్పటికీ 400 సీట్లు సాధ్యమనే అంటోంది. 2019లో 353 సీట్లు సాధించిన ఎన్డీయే మరో 40 సీట్లు సాధించడం కష్టమేమి కాదని కొంతమంది ఎన్నికల విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షం బలహీనంగా ఉండటం వల్ల బీజేపీకి పోటీలేకుండా పోయిందని.. కొంతమంది పోల్స్టర్స్ విశ్లేషిస్తున్నారు. మోదీకి ప్రత్యామ్నాయం లేకపోవడం… విదేశీవిధానం, ఆర్ధిక పురోగతిలాంటి అంశాలు బీజేపీకి కలిసివచ్చే అంశాలనే వీరు వాదిస్తున్నారు. నాలుగు వందల సీట్లు సాధ్యమే అని… ఒకవేళ 400సాధ్యం కాకపోయినా… గతం కంటే బీజేపీ సీట్లు పెరుగుతాయని వీరు వాదిస్తున్నారు. ఇక బీజేపీ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని… బీజేపీ సొంతంగా 300 సీట్లు గెలుస్తుందని సీఎస్డీఎస్ సంస్థకు చెందిన సంజీవ్ కుమార్ అంటున్నారు.అయితే బీజేపీ మిత్రపక్షాలు మాత్రం చాలా ఘోరంగా ఓడిపోతారని దీంతో నాలుగు వందల సీట్లు సాధ్యం కాదని సంజీవ్ అంచనా వేస్తున్నారు. రాక్ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ రుచిర్ శర్మ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ… ఈసారి పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉందని.. అయితే ఇప్పటికీ బీజేపీకే ఎక్కువ అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. అమెరికాలో స్థిరపడ్డ రుచిర్ శర్మ గత పాతికేళ్లుగా భారత ఎన్నికల సరళిపై అధ్యయనం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి కాస్త అనుకూలంగా వ్యవహరించే యోగేంద్రయాదవ్ లాంటి సెఫాలజిస్టులు కాస్త డిఫరెంట్ వాదన ముందుకు తెస్తున్నారు. ముఖ్యంగా యూపీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీదాని మిత్రపక్షాలు గతంతో పోలిస్తే 60 నుంచి 70స్థానాలు కోల్పోతారని యాదవ్ అంటున్నారు. బీజేపీ సొంతంగా 250 సీట్లకు పరిమిత అవుతుందని యోగేంద్రయాదవ్ బాంబు పేలుస్తున్నారు. ఇదే నిజం అయితే బీజేపీ కూటమి మద్దతు లేకుండా ప్రభుత్వం నడపలేదని స్పష్టం అవుతోంది. ఎన్నికల చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు.. ఎగ్జిట్ పోల్స్పై చాలా సర్వే సంస్థలు గుంభనంగా ఉన్నాయి. డేటాను విశ్లేషించడంలో తలమునకలైన కీలక సంస్థలన్నీ ఈ సారి ఎన్నికల సరళిపై ఎగ్జిగ్ పోల్స్ ఇవ్వడం అంత ఆశామాషీ కాదనే అభిప్రాయానికి వచ్చాయి. 2019లో కొంత ఈజీగా అనిపించిన ఎగ్జిట్ పోల్స్ ఈసారి మాత్రం కత్తిమీద సాము అని పొలిటికల్ పండిట్లు అంటున్నారు.:::: ఇస్మాయిల్, ఇన్పుట్ ఎడిటర్, సాక్షి -
మోదీజీ మాటలకు అర్థాలు వేరులే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న వ్యాఖ్యలు ఎందుకో ఆయన స్థాయికి తగినట్లు ఉండడం లేదు. తాజాగా ఇండియా టివీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఆయన కాన్ఫిడెన్స్కు నిదర్శనమా? లేక అత్యాశకు ప్రతిబింబమా? అనే ప్రశ్నలకు ఆస్కారం ఇస్తోంది. 2047 వరకు ఆయన వికసిత్ భారత్ కోసం పాటుపడుతూ.. ఆ కల సాకారం కోసం 2047 వరకు నిరంతరం శ్రమించే బాధ్యతను దేవుడు తన మీద పెట్టాడని ప్రధాని మోదీ అన్నారు. దేవుడు తననో ప్రత్యేక కార్యం మీద పంపాడని తనకు అనిపిస్తోందని ఆయన అన్నారు. దేవుడు తనకు దారిచూపించడమే కాకుండా శక్తినిచ్చాడని, 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యం నెరవేర్చే వరకు దేవుడు తనను పైకి పిలవడని విశ్వాసం ఉందని మోదీ పేర్కొన్నారు.⇒ ఇది వినడానికి బాగానే ఉంది. కానీ ప్రజాస్వామ్య దేశంలో ఆయన మాట్లాడినట్లు అనిపించదు. నియంతల రాజ్యంలోనో, చక్రవర్గుల పాలనలోనో, లేక మతపరమైన నమ్మకాలు అధికంగా ఉన్న దేశాలలోనో ఇలాంటి ప్రసంగాలు చేస్తే తప్పక జనం వినాల్సి ఉంటుంది. కానీ భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలలో అలా సాధ్యపడకపోవచ్చు. ఆయన వందేళ్లు పైబడి జీవించవచ్చు. 2047 సంవత్సరం అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చి వందేళ్లు పూర్తి అయ్యే ఏడాది అన్నమాట. తప్పు లేదు. దేశం అభివృద్ది కోసం ఆయన అలా వ్యాఖ్యానించి ఉండవచ్చు. కానీ తొంభై ఏళ్లు దాటిన తర్వాత కూడా అంత శక్తితో ఉంటారా? అనే సంశయం వస్తుంది.⇒ భారతీయ జనతా పార్టీలో అనుసరిస్తున్న ఒక విధానం ప్రకారం డెబ్బై ఐదేళ్లు దాటితే క్రియాశీలక పదవులలో ఉండరాదని చెబుతారు. అందువల్లే ఎల్.కె. అద్వాని, మురళీ మనోహర్ జోషి వంటివారు పదవుల నుంచి తప్పుకోవలసి వచ్చింది. కేవలం మర్యాదపూర్వక నేతలుగానే ఉన్నారు. ప్రస్తుతం మోదీ వయసు డెబ్బైనాలుగేళ్లు. ఈసారి గెలిస్తే టరమ్ పూర్తి అయ్యేసరికి ఆయన వయసు డెబ్బైతొమ్మిదేళ్లు అవుతుంది. ఒకపక్క ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ డెబ్బైఏడు ఏళ్ల వయసు వచ్చిందని విమర్శలు చేస్తున్న బీజేపీ పెద్దలు అదే మోదీ విషయంలో భిన్నంగా ఎలా మాట్లాడతారో తెలియదు. ఆయన ఆశిస్తున్నట్లు 2047 వరకు పదవులలో ఉంటే అప్పటికీ తొంభై ఏడేళ్ల వయసు వస్తుందన్నమాట. అప్పటివరకు ఆయన అధికారంలో ఉండడం సాధ్యమా అంటే ఏమి చెబుదాం. అలా జరిగితే అద్బుతమే అని అనాలి.⇒ కొంతమంది బాగా వయసు వచ్చేవరకు పదవులలో ఉన్న సందర్భాలు లేకపోలేదు. సీనియర్ నేత మొరార్జీ దేశాయ్ 81 ఏళ్ల వయసులో జనతా పార్టీ పక్షాన దేశ ప్రధాని అయ్యారు. మూడేళ్లపాటు ఆయన పదవి నిర్వహించిన తర్వాత రాజకీయాలకు దాదాపు దూరం అయ్యారని చెప్పాలి. ఎల్.కె. అద్వాని ప్రస్తుతం 90 ఏళ్ల పైబడి జీవిస్తున్నారు. కానీ ఆయన పదేళ్ల క్రితమే యాక్టివ్ పాలిటిక్స్కు దూరం అయ్యారని చెప్పవచ్చు. అమెరికా దేశ అధ్యక్షుడు బిడైన్ ప్రస్తుత వయసు 82 ఏళ్లు. మరో సారి ఆయన పోటీలో ఉండవచ్చని చెబుతున్నారు. అలాగే ఆయన ప్రత్యర్ధి డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుత వయసు 78 ఏళ్లు. ఆయన కూడా పోటీ పడుతున్నారు. ఒకవేళ గెలిస్తే 82 ఏళ్ల వరకు అధికారంలో ఉండవచ్చు. అమెరికాలో అధ్యక్ష పదవి రెండు టరమ్లకే పరిమితం. మన దేశంలో అలాంటి నిబంధన ఏమీ లేదు. అందువల్ల ఒకసారి అత్యున్నత పదవిలోకి వచ్చినవారు దానిని వదలిపెట్టడానికి అంతగా ఇష్టపడరని జనం భావన.⇒ ప్రధాని మోదీ కూడా అదే తరహాలో ఉన్నారా అనే భావన వస్తుంది. ఆయన 2047 వరకు ప్రధానిగా ఉంటానని నేరుగా చెప్పకపోయినా, వికసిత్ భారత్ లక్ష్యం కోసం తనను దేవుడు పంపించాడని ఆయన ఫీల్ అవుతున్న తీరు చూస్తే అదే అనిపిస్తుంది. సాధ్యాసాధ్యాలను పక్కనబెడితే, నిజంగా ఆయన ఆ వయసు వరకు జీవించి ఉండి, దేశ ప్రధానిగా కొనసాగి, అభివృద్దికి దోహదపడితే అభ్యంతరం లేదు. కానీ ఈ మధ్యకాలంలో మోదీ చేస్తున్న ప్రకటనలు కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఆయనలో తడబాటుతోపాటు పొరబడుతున్నారా అనే డౌటు వస్తుంది.⇒ ఉదాహరణకు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామాలయంపై బుల్ డోజర్ నడుపుతారని అనడం అత్యంత వివాదాస్పదం అయింది. మోదీ స్థాయికి అలా మాట్లాడకూడదని చెప్పాలి. అలాగే అవినీతి పరులను పార్టీలో చేర్చుకుంటూ, అవినీతిపరులని తానే ప్రకటించి మళ్లీ వారితో తానే పొత్తు పెట్టుకున్న తీరు గమనించిన తర్వాత మోదీ చెప్పేవాటికి, చేసేవాటికి చాలా తేడా ఉందన్న అభిప్రాయం కలుగుతుంది. అలాగే ముస్లింలకు సంబంధించి ఆయన ఒక్కోసారి ఒక్కో మాట చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ లోక్ సభ ఎన్నికలలలో ఆశించినన్ని సీట్లు రావని మోదీ భయపడుతున్నారని, అందుకే హోదాకు తగ్గట్లు మాట్లాడడం లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.⇒ మోదీ చెప్పినవాటిలో ఒక్కటి మాత్రం పూర్తి నిజం. ఈ భూమ్మీద ఇంకా తాను ఎక్కాల్సిన మెట్లేవీ లేవని ఆయన చెప్పారు. భారత దేశంలో ప్రధానమంత్రి పదవిని మించి మరొకటి లేదన్నది తెలిసిందే. మోదీ చరిత్ర చూస్తే ఇది ఒకరకంగా అనూహ్యమైన రీతిలో అసాధారణమైన తీరుగా ఎదిగారని చెప్పవచ్చు. కేవలం ఒక సాధారణ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఈ విధంగా ఎదుగుతారని అనుకోలేం. కానీ మోదీ చేసి చూపించారు. ఇంత ఘనత సాధించిన మోదీ అంటే గౌరవమే కానీ, ఈసారి ఆయన ప్రసంగాలలో అభ్యంతర విషయాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి 400 సీట్లు వస్తాయని పదే, పదే చెబుతున్నా, అది ఎంతవరకు సాధ్యమన్నది సంశయంగా ఉంది.⇒ యూపీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, కర్నాటక, బీహారు వంటి రాష్ట్రాలలో ఆశించిన స్థాయిలో బీజేపీ సీట్లు వస్తాయా అనేదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు జాతీయ స్థాయి సెఫాలిజిస్టులు బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీకి కాస్త అటు, ఇటుగా సీట్లు సంపాదించవచ్చేమో కానీ, 400 సీట్లు వస్తాయని అంచనాలు వేయడం లేదు. నిజానికి మోదీకి కాంగ్రెస్ కూటమిలో సరైన ప్రత్యర్ధి లేకపోవడం ఆయనకు కలిసి వస్తున్న అంశం. రాహుల్ గాంధీ ఉన్నంతలో పోటీ ఇస్తున్నా, ఆయనలో మెచ్యూరిటీపై అనుమానాలు ఉన్నాయి. రాజకీయ వ్యూహాలలో కూడా వెనకబడి ఉంటున్నారు. కొన్నిసార్లు తెలివితక్కువగా కూడా ఉంటున్నారు. ఉదాహరణకు ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కాస్త సఖ్యత కోసం ప్రయత్నించవలసిన రాహుల్ పనికట్టుకుని ఆయనకు వ్యతిరేకంగా పావులు కదపడం విస్తుపరుస్తోంది.⇒ తెలంగాణ రాజకీయాలలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిలను ఏపీకి తీసుకువచ్చి పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా ఇంకా కుట్రలు చేస్తున్నారన్న భావన కల్పించారు. అలాగే కర్నాటక, తెలంగాణలలో అధికారం కోసం ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వడంలో కూడా పాత్ర పోషించారు. జాతీయ స్థాయి మానిపెస్టోలో ప్రతి మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పడం వంటి అంశాలవల్ల వారిపై నమ్మకం కుదరడం లేదు. ఇవన్ని మోదీకి కలిసివచ్చే పాయింట్లుగా ఉన్నాయి. మోదీ ప్రభుత్వం కొన్ని తప్పులు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ వాటిని అందిపుచ్చుకోలేకపోతోందని చెప్పాలి. ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీని ప్రయోగించి జైలుకు పంపించిన వైనం ప్రజలలో విమర్శలకు దారి తీసిందని చెప్పాలి.⇒ యూపీఏ పదేళ్ల పాలనలో ఈడీ 34 లక్షల రూపాయలు పట్టుకుందని, అవి పిల్లాడి స్కూల్ బ్యాగులోకి కూడా రావని అన్నారు. అదే, తన పదేళ్ల పాలనలో ఈడీ 2200 కోట్ల రూపాయలు పట్టుకుందని, వాటిని తరలించడానికి 70 టెంపోలు కావాలని అన్నారు. 2014 ఎన్నికల సమయంలో లక్షల కోట్ల భారత సొమ్ము స్విస్ బ్యాంక్ ఖాతాలలో ఉన్నాయని, దానిని తెస్తే ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు ఇవ్వవచ్చని మోదీ అన్నారు. ఆ సంగతి పక్కనబెట్టి మోదీ కొత్తరాగం అందుకున్నట్లుగా ఉంది. పైగా బ్యాంకులలో వేల కోట్లు ఎగవేసినవారికి పార్టీ టిక్కెట్లు ఇస్తూ, తాను అవినీతి పార్టీ అని చెప్పిన తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వంటివి చూస్తే మోదీ మాటలకు అర్థాలు వేరులే అనే అభిప్రాయం కలుగుతుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
మోదీ కొత్త రాగం.. బీజేపీలో బిగ్ ట్విస్ట్!
ఢిల్లీ: భారత్ భవిష్యత్ కోసం ఎప్పుడో 18వ శతాబ్దంలో రూపొందించిన చట్టాలు, పద్దతులను తాను ఉపయోగించలేనన్నారు ప్రధాని మోదీ. కొత్త సంస్కరణలు, చట్టాలు తీసుకురావాలనే ఆలోచనలో తాను ఉన్నట్టు మనసులోకి మాటను కుండబద్దలు కొట్టారు. అలాగే, ఒక ముఖ్యమైన పని కోసం దేవుడు ఆయనను భూమి మీదకు పంపినట్టు చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి.కాగా, ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ ఎన్డీటీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..‘వికసిత్ భారత్’ కల నెరవేర్చడం కోసం 2047 వరకు నిరంతరాయంగా పనిచేయాలనే బాధ్యతను దేవుడు నా మీద పెట్టాడు. ఆ పనిని పూర్తిచేయడానికే నన్ను భూమి మీదకు పంపించాడని నాకు అనిపిస్తున్నది. దీని కోసం దేవుడు నాకు దారిచూపించి, శక్తిని ఇచ్చాడు. ఇక, 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని నేను నెరవేరుస్తానన్న నమ్మకం నాకుంది. అది నెరవేర్చే వరకు దేవుడు నన్ను పైకి పిలువడు’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.అయితే, బీజేపీ పార్టీ విషయానికి వస్తే కాషాయ పార్టీలో 75ఏళ్లకే రిటైర్మెంట్ అనే నిబంధన ఉంది. ఈ నిబంధన పార్టీలో ఉన్న ప్రతీ ఒక్కరికీ వర్తిస్తుంది. ఇక, ప్రస్తుతం మోదీ వయసు 74ఏళ్లు. మరో ఏడాదిలో మోదీ రిటైర్మెంట్ తీసుకోవాల్సి ఉంది. ఇలాంటి సమయంలో మోదీ.. వికసిత్ భారత్ నినాదం ఎత్తుకోవడంపై రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్ష నేతలు స్పందిస్తున్నారు.మోదీ మరికొన్నేళ్ల పాటు క్రియాశీల రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఇలా కామెంట్స్ చేశారని చెబుతున్నారు. 75 ఏళ్లకే రిటైర్మెంట్ నిబంధన అనేది తనకు వర్తించబోదని మోదీ చెప్పారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తన మనసులో దాచిపెట్టుకొన్న పదవీ ఆకాంక్షను ప్రధాని నరేంద్ర మోదీ ఎట్టకేలకు బయటపెట్టారని అంటున్నారు. ఇక, బీజేపీలో 75 ఏళ్లు దాటిన కారణంగానే సీనియర్లను పక్క పెట్టిన విషయం తెలిసిందే. -
యూపీ కుర్రాడికి ప్రధాని మోదీ ఎందుకు లేఖ రాశారు?
ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేస్తుంటారు. అలాగే అవసరమైనప్పుడు కొందరికి లేఖలు కూడా రాస్తుంటారు. తాజాగా యూపీలోని ఒక యువకునికి ప్రధాని మోదీ లేఖరాశారు.ఉత్తరప్రదేశ్లోని బారాబంకిలోని మొహల్లా పిర్బతవాన్లో నివసిస్తున్న అభయ్ చంద్వాసియాకు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన అభయ్ను ప్రశంసించారు. అభయ్ గత 20 ఏళ్లుగా మోటార్ న్యూరాన్ డిజార్డర్ అనే నయం చేయలేని వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం 95 శాతం మేర శారీరక వైకల్యంతో జీవిస్తున్నాడు.ప్రధాని మోదీ తన లేఖలో అభయ్ చంద్వాసియాను ప్రశంసించారు. ‘ప్రేమతో కూడిన మీ మాటలు దేశం కోసం మనస్పూర్తిగా పని చేసేవారికి కొత్త శక్తిని ఇస్తాయని మోదీ పేర్కొన్నారు. అభయ్ తన స్వీయ రచనలోని ప్రతి పదాన్ని ప్రధాని మోదీకి అంకితం చేశారు. శారీరక వైకల్యంతో మంచం మీదనే ఉంటున్నప్పటికీ అభయ్ పలు స్ఫూర్తిదాయకమైన రచనలు సాగించాడు. అవి చదివినవారు వీటిని రాసిన వ్యక్తి శారీరక వైకల్యంతో బాధపడుతూ, కొన్నేళ్లుగా మంచానికే పరిమితమైనవాడంటే ఎవరూ నమ్మలేరు.ప్రధాని నరేంద్ర మోదీపై అభయ్కు ఎనలేని అభిమానం. ఈ కారణంగానే ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిత్వం, దేశ ప్రయోజనాల కోసం ఆయన చేసిన కృషి, నాయకత్వ సామర్థ్యాలను వర్ణిస్తూ కవిత్వం రాశాడు. దీనికి స్పందించిన ప్రధాని మోదీ అభయ్కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రధాని నుంచి లేఖ రావడంపై అభయ్ ఆనందం వ్యక్తం చేశారు. -
దేశ అభివృద్ధి కోసమే మూడోసారి బీజేపీ ప్రభుత్వం, ఈ ఎన్నికల్లో గెలుపు నా కోసం, నా కుటుంబం కోసం కాదు.. ప్రధాని మోదీ స్పష్టీకరణ.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Mamata Banerjee: అబద్ధాల వ్యాప్తికి దేవుడు దూతను పంపుతాడా?
కోల్కతా: దేవుడు తనను పంపాడని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా ధ్వజమెత్తారు. మథురాపూర్లో శుక్రవారం ఎన్నికల సభలో మాట్లాడుతూ ‘ఓటమి తప్పదనే భయంతో.. ఆ ఫోబియాలో బీజేపీ నాయకులు అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ‘ఇప్పుడాయన తనను తాను దేవుడి బిడ్డగా, మనలాగా ఆయనకు తల్లిదండ్రులు లేరని, భగవంతుడు ఆయన్ను పంపాడని చెప్పుకుంటున్నారు. అల్లర్లను ప్రేరేపించడానికి, ప్రకటనల ద్వా రా అబద్ధాలు వ్యాప్తి చేయడానికి, జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) ద్వారా జనాన్ని జైళ్లో వేయడానికి దేవుడు ఎవరినైనా పంపుతాడా అని నేనడుగుతున్నాను. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ద్వారా హింసను ప్రోత్సహించడానికి, ఉపాధి హామీ పథకానికి నిధులు ఆపడానికి, పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి దేవుడు తన దూతను పంపుతాడా?’ అని మమత వ్యంగ్యంగా అన్నారు. పేదల ఖాతాల్లో రూ. 15 లక్షల చొప్పున జమచేస్తాననే హామీపై భగవంతుడు వెనక్కు తగ్గుతాడా అని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ ఒక జాతీయ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ.. మా అమ్మ బతికున్నంతవరకు నేను సాధారణంగా అందరిలాగే జని్మంచానని అనుకునేవాడిని. ఆమె మరణించాక నా అనుభవాలను పరికించి చూసుకుంటే.. నన్ను దేవుడు పంపాడని నేను నిశి్చతాభిప్రాయానికి వచ్చాను’ అని పే ర్కొన్నారు. ప్రధాని పేరెత్తకుండానే మమత ఆయన వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు. -
దేశాభివృద్ధి కోసమే మూడోసారి
సిమ్లా: బీజేపీని వరుసగా మూడోసారి గెలిపించాలని, దేశ అభివృద్ధి కోసమే తప్ప ఈ గెలుపు తన కోసం, తన కుటుంబం కోసం కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కోసం అన్ని గ్రామాల్లో దేవాలయాలకు వెళ్లి, దేవుళ్లను ప్రారి్థంచి ఆశీస్సులు పొందాలని కోరారు. కాంగ్రెస్ పారీ్టకి అధికారం అప్పగిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు బలవంతంగా లాక్కొని ఓటు బ్యాంక్కు కట్టబెడతారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరానికి తాళం పడుతుందని అన్నారు. శుక్రవారం హిమాచల్ ప్రదేశ్లోని నాహన్, మండీ, పంజాబ్లోని గురుదాస్పూర్, జలంధర్లో సార్వత్రిక ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించిందని ఆరోపించారు. మందిర నిర్మాణానికి తాము పూనుకుంటే తేదీ చెప్పండి అంటూ ఎగతాళి చేశారని అన్నారు. తేదీ ప్రకటించడమే కాకుండా ఆలయ నిర్మాణం పూర్తిచేసి ప్రాణప్రతిష్ట సైతం జరిపించామని గుర్తుచేశారు. ఓటు బ్యాంక్ను బుజ్జగించడానికి కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని బహిష్కరించిందని మండిపడ్డారు. హిమాచల్ ప్రదేశ్లో 2.50 లక్షల జనాభా ఉన్న హట్టీ సామాజికవర్గానికి ఎస్టీ హోదా కలి్పస్తామని హామీ ఇచ్చారు. ఓడిపోయే కాంగ్రెస్కు ఓటు వేసి ఓటు వృథా చేసుకోవద్దని ప్రజలకు సూచించారు. -
ఆ మూలసూత్రాలను అందుకుంటేనే...
భారతదేశం పునర్నిర్మాణంలో ప్రతి సందర్భంలోను డా‘‘ బి.ఆర్.అంబేడ్కర్ సూత్రాలే నిజమైన ప్రత్యామ్నాయాన్ని అందించగలుగుతున్నాయి. అంబేడ్కర్ నిర్మించిన రాజ్యాంగ సౌధాన్ని ఆయన సూత్రాలతోనే పునర్నిర్మించాలి అనే నూతన భావన మన నాయకులకు ఉంటే అంబేడ్కర్ కుల నిర్మూలన భావాన్ని, సామ్యవాద భావాల్ని తప్పక ఆచరించవలసిన చారిత్రక సందర్భం ఇది. నిజానికి దేశాన్ని రక్షించాల్సిన వారు దేశంలో నేడు మత వైరుద్ధ్యాలు పెంచడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అశోకుడు, అక్బరు వంటి మహా చక్రవర్తులే మత సామరస్యం కోసం ప్రయత్నం చేస్తే, ఇప్పటి నాయకులు మతాధిపత్యం కోసం ప్రచారం చేసి మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారని సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నెల 13న జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో మహిళలు పోటెత్తి ఓటెయ్యడం ఒక సామాజిక, సాంస్కృతిక పరిణామం. మహిళకు రాజకీయ అస్తిత్వం పెరిగింది అనడానికి ఇది ఒక నిదర్శనం. మహిళలు ఎక్కడ చైతన్యవంతం అవుతారో అక్కడ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ పరిణామాలు త్వరితం అవుతాయని అంబేడ్కర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 81.86 శాతం ఓట్లు పోయ్యాయి. నడి ఎండలో కూడ ప్రజలు నిలబడి తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. మరోప్రక్క కుల, మతం, మద్యం, డబ్బు ప్రభావం కూడా బలంగానే ఎన్నికల మీద ఉంది. ఎన్నికల సంగ్రామంలో ఈసారి సోషల్ మీడియా కీలకపాత్ర పోషించింది. ఒక రకంగా సామాజిక వేదికలపై పెద్ద యుద్ధమే నడిచింది. పార్టీలు, అభ్యర్థుల వారీగా ఏర్పడ్డ గ్రూపుల్లో ఓటింగ్ సందర్భంగా రాతలతో కత్తులు దూశారు. ఫేక్ ఫోటోలు, ఫేక్ ఆడియోలతో పాటు ఫేక్ వార్తలను క్షేత్రస్థాయిలో వైరల్ చేశారు. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారు అయోయయానికి గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల పరిస్థితులు ఇలా వుంటే మొత్తం భారతదేశం వ్యాప్తంగా పెను వృక్షాలు కూలుతున్న చప్పుళ్లు వినబడుతున్నాయి. కొన్ని అధికార పీఠాలు బీటలు వారుతున్నాయి. మే 15న భువనేశ్వర్లోని భువనంగిరిలో ఇండియా కూటమి నాయకుడు రాహుల్గాంధీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో భాజపా నెగ్గితే ప్రభుత్వరంగ సంస్థలన్నీ ప్రైవేటుపరం అవుతాయని, దేశాన్ని 22 మంది బిలియనీర్లు పాలిస్తారని, రాజ్యాంగ పుస్తకాన్ని భాజపా చించి అవతల పారేస్తుందని అన్నారు. బడుగు వర్గాలకు ప్రయోజనాలు లభించటానికి కారణమే రాజ్యాంగం అని తమ చేతిలోని రాజ్యాంగ ప్రతిని చూపిస్తూ చెప్పారు. 22 మంది బిలియనీర్లు తీసుకున్న రూ. 16 లక్షల కోట్ల రుణాలను కేంద్ర సర్కారు మాఫీ చేసిందని, ఉపాధి హామీ పథకం కింద కూలీలకు 24 ఏళ్ల పాటు వేతనాలు చెల్లించేందుకు అయ్యే మొత్తంతో ఇది సమానమని వివరించారు. ‘‘రైతుల, విద్యార్థుల రుణాలను మాఫీ చేయలేదు. చిరు వ్యాపారులకు రుణాలే ఇవ్వలేదు. జీయస్టీ మొత్తమంతా ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు వెళ్లిపోతోంది. మేం వచ్చాక కులగణనతో విప్లవాత్మక ప్రజాస్వామ్యాన్ని, ప్రజాపాలనను తీసుకువస్తాం. దేశంలో దేశంలో 50 శాతం మంది ఓబిసీలు, 15 శాతం దళితులు, 8 శాతం గిరిజనులు, 15 శాతం మైనార్టీలు, 5 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారున్నారు. ఈ 90 శాతం మందికిపైగా ప్రజలు మోదీ పాలనలో వంచితులయ్యారు. ఎన్ని రకాల అబద్ధాలను భాజపా చెప్పినా జూన్ 4 తర్వాత ప్రధాని పదవిలో మోదీ ఉండరు’’ అని రాహుల్ ఉద్ఘాటించారు.మోడీ ప్రభుత్వంలో రాజ్యం కంటే కూడా కార్పోరేట్ శక్తులు బలపడ్డాయి. విశ్వవిద్యాలయాలు అన్నింటిలో మతోన్మాద భావాలను ప్రచారం చేస్తూ శాస్త్ర జ్ఞానాన్ని వక్రీకరిస్తున్నాయి. అందుకే శ్రీనగర్లో మే 15న మాట్లాడుతూ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎస్పీ)అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ఇలా విమర్శించారు. భవిష్యత్తులో తాను పదవిలో లేకపోయినా దేశం మనుగడ సాగిస్తుందన్న విషయాన్ని ప్రధాని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. దక్షిణ కాశ్మీర్ అనంత్నాగ్లోని షాంగుస్ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘మనం కలిసి జీవించాలి. దేశాన్ని రక్షించాలి. పదవి ఎల్లకాలం ఉండదు. కానీ దేశం శాశ్వతం. ఆయన (మోడీ) ఏ దేశాన్ని తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారో అది వినాశకరమైనది’’ అన్నారు.నిజానికి దేశాన్ని రక్షించాల్సిన ప్రధానమంత్రి దేశంలో మత వైరుధ్యాలు పెంచడం ఆశ్చర్యకరం. అశోకుడు, అక్బరు వంటి మహా చక్రవర్తులే మతసామరస్యం కోసం ప్రయత్నం చేస్తే, మోడీ ప్రభుత్వం మతాధిపత్యం కోసం ప్రచారం చేసి మత సామరస్యాన్ని దెబ్బతీసిందని సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ విశ్లేషకులందరూ భావిస్తున్నారు. మోడీ ఆవేశపూరితమైన ప్రసంగాల్లో 400 సీట్లు వస్తున్నాయని చెప్పుకుంటున్నా 150 నుంచి 200కే పరిమితం అవుతారని కమ్యూనిస్టు నాయకులు చెబుతున్నారు. బీజేపీకి బలమైన ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఈ ఎన్నికల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, బిహార్, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లోనే బీజేపీకి ఎదురు గాలి వీస్తున్నది. పైకి డాంబికంగా 370–400 సీట్లు వస్తాయని గొప్పలు చెప్పుకుంటున్నా ఏ సర్వేలోనూ ఆఖరికి బీజేపీని బలపరిచే విశ్లేషకులు సైతం 250కి మించి రావని చెప్పాల్సిన పరిస్థితి. బీజేపీ ప్రభుత్వం ఈ దశాబ్దంలో ఏ సోషల్ మీడియాలోనైతే దళిత బహుజన మైనార్టీ స్త్రీల మీద, రాజ్యాంగం మీద, మానవ హక్కుల మీద, విద్యార్థుల ప్రతిభ మీద, దళితుల జీవన సంస్కృతి మీద, ముస్లింలు జీవించే హక్కు మీద దాడి చేసిందో అదే సామాజిక మాధ్యమాన్ని ఉపయుక్తం చేసుకొని ఈ సామాజిక శ్రేణుల అన్నింటిలో వున్న మే«ధావర్గం ఎదురుదాడి ప్రారంభించింది. నిజానికి మోడీ ద్వంద్వ భావజాల ఘర్షణలో ఇరుక్కుపోయారా అనిపిస్తుంది. ఏ ప్రజలైతే ఏ బడుగువర్గాలైతే అధిక ఓట్ల శక్తిగా ఉన్నాయో, ఆ వర్గాల జీవన వ్యవస్థలను ధ్వంసం చేస్తూ చేస్తూ, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ఈ వర్గాలను మతం పేరుతో ఓట్లు అడుగుతున్న సందర్భంగా, తమ కాళ్ల కింద పునాదులు తొలగిపోతున్న స్థితిలో కేవలం మతోన్మాద నినాదం ఫలిస్తుందా? అనేది ఇప్పుడు మోడీ ముందు నిలబడిన పెద్ద ప్రశ్నలా కనిపిస్తోంది.ఉత్తర ప్రదేశ్ కేంద్రంగా మొత్తం భారతదేశం గురించి మనం ఆలోచించినప్పుడు అన్ని మతాల్లో బానిసలుగా బతుకుతున్న వారికి సమాన గౌరవ జీవన వ్యవస్థ లేకపోవటం కనిపిస్తోంది. మతోన్మాద నినాదం గౌరవం ఇవ్వదు. ఆచరణ గౌరవం ఇస్తుంది. భారతదేశంలో కుల గణన చేయిస్తామని కాంగ్రెస్ పేర్కొన్నాక ఓబిసీలు ఆలోచనలో పడినట్లే ఉంది. తమకు రిజర్వేషన్ హక్కు వస్తుందని, రిజర్వేషన్ వల్ల విద్య, ఉద్యోగ హక్కులు విస్తృతం అవుతాయని ఓబిసీలు భావించడం ద్వారా భారతదేశంలో అతి పెద్ద సామాజిక తరగతి ‘ఇండియా’ కూటమి వైపు మొగ్గుతుందనక తప్పదు. ‘ఇండియా’ కూటమికి నూతన దశ వస్తున్న ఈ తరుణంలో అంబేడ్కర్ నిర్మించిన రాజ్యాంగ సౌధాన్ని ఆయన సూత్రాలతోనే పునర్నిర్మించాలి అనే నూతన భావన ఆ కూటమికి ఉంటే అంబేడ్కర్ కుల నిర్మూలన భావాన్ని, సామ్యవాద భావాల్ని తప్పక ఆచరించవలసిన చారిత్రక సందర్భం ఇది. ఆ పరిణతి మాత్రం ‘ఇండియా’ కూటమికి వచ్చినట్టు లేదు. అంబేడ్కర్ పరిశ్రమలను జాతీయం చేయండి, భూములను జాతీయం చేయండి అనే ప్రధాన సూత్రాన్ని ముందుకు తెచ్చారు. ఆయా రాష్ట్రాల ఆధిపత్య కులాల పార్టీ నుంచి వస్తున్న ‘ఇండియా’ కూటమి ఇంకా సామాజిక, సామ్యవాద భావాలను పరిపుష్టం చేయవలసిన అవసరం ఉంది. విశ్వవిద్యాలయాల్లో చారిత్రక, సాంస్కృతిక శాస్త్ర జ్ఞాన పునరుజ్జీవనానికి కూడా వీరు హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మండల కమిషన్ రిపోర్ట్స్ను, సచార్ కమిటీ రిపోర్ట్స్ను, రిపబ్లికన్ పార్టీలోని మూల సూత్రాలను ‘ఇండియా’ కూటమి తీసుకోగలిగితే నిజమైన ప్రత్యామ్నాయంగా నిలబడుతుంది. భారతదేశం పునర్నిర్మాణంలో ప్రతి సందర్భంలోను డా‘‘ బి.ఆర్.అంబేడ్కర్ సూత్రాలే నిజమైన ప్రత్యామ్నాయాన్ని అందించగలుగుతున్నాయి. ఈసారైనా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ఒక దళిత ప్రధానమంత్రిని ప్రకటించగలిగిన విశాలతను సంతరించుకోవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా భారతదేశంలోని రాజకీయ నాయకుల వ్యక్తిత్వ నిర్మాణంలో నైతికత, అవినీతి రహిత, రుజువర్తన జీవన విధానం, మానవతా స్పృహ, సామాజిక విప్లవ భావన, ఆర్థిక స్వావలంబనా దృష్టి అనుసరణీయం అవ్వవలసి ఉంది. రాజకీయ నీతిశాస్త్ర అధ్యయనం ఈనాటి చారిత్రక కర్తవ్యం. అంబేడ్కర్ రాజకీయ జీవన మార్గమే దేశానికి దిక్సూచి.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు -
Arvind Kejriwal: మోదీజీ.. దేవుడు మిమ్మల్ని క్షమించడు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కనీ్వనర్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ హద్దు మీరుతున్నారని, అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిదండ్రులను సైతం లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. కేజ్రీవాల్ గురువారం వర్చువల్గా మీడియాతో మాట్లాడారు. పద్ధతి మార్చుకోవాలని ప్రధానికి హితవు పలికారు. ‘‘నా ఎమ్మెల్యేలను, మంత్రిని అరెస్టు చేశారు. నన్ను జైలులో పెట్టి వేధించారు. ఈరోజు మీరు హద్దులు దాటారు. నన్ను లక్ష్యంగా చేసుకుని నా తల్లిదండ్రులను వేధిస్తున్నారు. ఆ దేవుడు మిమ్మల్ని క్షమించడు’’ అని మోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. -
ప్రధాని మోదీని చంపేస్తాం!.. ఎన్ఐఏకి బెదిరింపు కాల్
సాక్షి, చెన్నై: ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామంటూ అందిన బెదిరింపు కాల్తో చెన్నైలోని జాతీయ దర్యాప్తు విభాగం అప్రమత్తమైంది. చెన్నై పురసైవాక్కంలో ఎన్ఐఏ కార్యాలయం ఉంది. బుధవారం రాత్రి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఈ కార్యాలయానికి ఫోన్ చేసి...ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీని హతమా రుస్తామంటూ హిందీలో హెచ్చరించాడు. వెంటనే ఎన్ఐఏ అధికారులు చెన్నై సైబర్క్రైం బ్రాంచిని అప్రమత్తం చేశారు. మధ్యప్రదేశ్ నుంచి ఆ కాల్ వచ్చిన ట్టుగా తేలడంతో గురువారం ఉదయం ఎన్ఐఏ, సైబర్ క్రైం బృందాలు భోపాల్కు వెళ్లాయి. అదేవిధంగా, చివరి విడత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ప్రధానికి భద్రతను మరింతగా పెంచాలని కూడా యోచిస్తున్నట్లు సమాచారం. -
PM Narendra Modi: ఇటు నేను.. అటు ఎవరు?
మహేంద్రగఢ్/పటియాలా: ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నాయకులు అధికారంలోకి రాకముందే ప్రధానమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారని, ఆవు పాలు ఇవ్వకముందే నెయ్యి కోసం రగడ మొదలైందని ప్రధాని నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో ఐదుగురు ప్రధానమంత్రులు మారితే దేశం ఎలా ముందుకు సాగుతుందని ప్రశ్నించారు. తాను బతికి ఉన్నంతకాలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను ఎవరూ లాక్కోలేరని పునరుద్ఘాటించారు. ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావని చెప్పారు. దేశ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయని స్పష్టంచేశారు. ఈ పోరాటంలో ఒకవైపు ప్రజల సేవకుడు మోదీ ఉన్నారని, మరోవైపు ఎవరున్నారో తెలియదని వ్యాఖ్యానించారు. విపక్ష కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి లేడని పరోక్షంగా వ్యంగ్యా్రస్తాలు విసిరారు. కరడుగట్టిన కులతత్వం, మతతత్వం, బంధుప్రీతితో కూడిన ఇండియా కూటమిని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం హరియాణాలోని మహేంద్రగఢ్, పంజాబ్లోని పటియాలాలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ మాట్లాడారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి విపక్షాల కుట్రలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ‘రామ్ రామ్’ అని జపించినవారిని అరెస్టు చేస్తారని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పార్టీ మన దేశాన్ని ముక్కలు చేసిందని, ఓటు బ్యాంక్ను సంతృప్తిపర్చడానికి రెండు ముస్లిం దేశాలను సృష్టించిందని విమర్శించారు. ఈసారి అధికారంలోకి వస్తే అయోధ్య రామమందిరానికి తాళం వేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని గుర్తచేశారు. మన ఆరాధన, విశ్వాసాన్ని కాంగ్రెస్ కించపరుస్తోందని దుయ్యబట్టారు. విభజించగా మిగిలిపోయిన భారతదేశంలోని వనరులపై మొదటి హక్కు ముస్లింలకే ఉందని విపక్ష నాయకులు అంటున్నారని, బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాజ్యాంగం ఇచి్చన రిజర్వేషన్లను సైతం కాజేయాలని చూస్తున్నారని తప్పుపట్టారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పాలనలో ముస్లింలకు రాత్రికి రాత్రే ఓబీసీ సరి్టఫికెట్లు ఇచ్చేశారని పేర్కొన్నారు. గత పన్నెండేళ్లలో ఇచి్చన ఆ సర్టిఫికెట్లను కలకత్తా హైకోర్టు రద్దు చేసిందని తెలిపారు. ఒకవేళ కోర్టు అడ్డుకోకపోతే ఓబీసీ అన్యాయం జరిగే మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. ముస్లింలకు రిజర్వేషన్లకు కలి్పంచాలని కుట్ర పన్నుతున్న ప్రతిపక్షాల నిజస్వరూపం ప్రజలు తెలుసుకోవాలని కోరారు. ఈ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమికి ఓటమి తప్పదన్నారు. ఓటమికి బాధ్యులను చేసేందుకు ఒక బకరా కోసం ఆ కూటమిలో ఇప్పటినుంచే అన్వేషణ మొదలైందని పేర్కొన్నారు.పంజాబ్లో అరాచక పాలన పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల దందా విచ్చలవిడిగా సాగుతోందని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్వాకంతో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. పరిశ్రమలు పంజాబ్ను వదిలి వెళ్లిపోతున్నాయని, ప్రజలు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక, డ్రగ్స్ మాఫియా, షూటర్ గ్యాంగ్లు చెలరేగిపోతున్నాయని ధ్వజమెత్తారు. పంజాబ్ మంత్రులు ఎంజాయ్ చేస్తున్నారని, ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఢిల్లీ దర్బార్లో హాజరు వేయించుకోవడంతోనే సమయం గడిపేస్తున్నారని ఆక్షేపించారు. అలాంటి వ్యక్తులు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పారీ్టలు పంజాబ్లో మాత్రం పరస్పరం పోటీ పడుతున్నాయని చెప్పారు. ఇది డ్రామా కాదా? అని మోదీ నిలదీశారు. -
‘ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టు రద్దు చేయండి’
బెంగళూరు: లైంగిక దాడి కేసు నమోదైన హసనా ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టు రద్దు చేయమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి బుధవారం లేఖ రాశారు. ‘‘ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అసభ్య వీడియోలు వైరల్ అయిన తర్వాత ఏప్రిల్ 27న ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టుతో దేశం వదిలి వెళ్లిపోయారు. ఇది చాలా సిగ్గు చేటు. ప్రజ్వల్ దేశం వదిలి వెళ్లిన తర్వాత కొన్ని గంటల్లోనే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. క్రిమినల్ ప్రోసిడింగ్స్ నుంచి తప్పించుకోవడానికి ప్రజ్వల్ దౌత్య పాస్పోర్టును దుర్వినియోగం చేస్తున్నారు. దయచేసి ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నా. ప్రజ్వల్ దౌత్య పాస్పోర్టు రద్దు చేయడానికి తగిన చర్యలు తీసుకోండి’’ అని సీఎం సిద్ధారామయ్యలో తన లేఖలో పేర్కొన్నారు. ఇక.. సిద్ధరామయ్య రాసిన లేఖపై కేంద్ర విదేశి వ్యవహారాల మంత్రి శాఖ ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్పోర్టు రద్దు చేసే ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. లైంగిక దాడి, అసభ్య వీడియోల కేసులో కర్ణాటక ప్రభుత్వ సమగ్రమైన దర్యాప్తు కోసం సిట్ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రజ్వల్ రేవణ్ణపై సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. ప్రజ్వల్పై సిట్ విచారణ అధికారులు లుక్ అవుట్, బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.అంతకుముందు ఈ కేసు విషయంలో ప్రజ్వల్పై అరెస్ట్ వారెంట్ ఆధారంగా దౌత్య పాస్పోర్ట్ రద్దు చేయాలన్న తమ అభ్యర్థనపై కేంద్రం స్పందించటల లేదని కార్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర తెలిపారు. కోర్టు అరెస్ట్ వారెంట్నపు జారీ చేసినా.. దౌత్య పాస్పోర్టు రద్దు విషయంలో కేంద్రం ఇంకా స్పందిచటం లేదని తెలిపారు. -
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు... ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఛాన్స్ వచ్చినా మోదీ బయోపిక్లో నటించను: సత్యరాజ్
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది ప్రముఖులపై బయోపిక్స్ ఇప్పటికే వచ్చాయి. వాటిలో ఎక్కువగానే భారీ విజయాన్ని అందుకున్నాయి. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై బయోపిక్ రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందులో ప్రముఖ నటుడు సత్యరాజ్ నటించనున్నారని కోలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. ఈ విషయంపై ఆయనే క్లారిటీ ఇచ్చారు.ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయోపిక్ గురించి ఆయన ఇలా మాట్లాడారు. 'నేను నరేంద్ర మోదీ బయోపిక్లో నటించనున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదు. ఆ ప్రాజక్ట్ కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. నేను మోదీ పాత్రలో నటిస్తున్నట్లు వచ్చిన వార్తలు చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. సోషల్ మీడియాలో ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి. భవిష్యత్లో మోదీ బయోపిక్ కోసం ఎవరైనా నన్ను సంప్రదించినా నేను చేయననే చెప్తాను. ఎందుకంటే ఇది నా సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండే అవాకాశం ఉంటుంది. ఇప్పటికే చాలాసార్లు ఇలాంటి రూమర్స్ వచ్చాయి. ఇంతటితో ఆపేయండి' అని క్లారిటీ ఇచ్చారుమోదీ జీవితంపై గతంలో ఓ సినిమా తెరకెక్కింది. 'పీఎం నరేంద్ర మోదీ'పేరుతో 2019లో ఈ సినిమా విడుదలైంది. ఇందులో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించారు. బాలీవుడ్లో ఈ సినిమాను ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. -
Lok Sabha Election 2024: కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు
బస్తీ/శ్రావస్తి: కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు అని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయంటూ ఆ రెండు పార్టీలు మన దేశాన్ని బెదిరింపులకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ నాయకుడు అఖిలేష్ యాదవ్ కలిసి ప్రచారం చేసి బొక్కబోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు. ఆ ఇద్దరు యువరాజుల ఫ్లాప్ సినిమా రీరిలీజ్ అవుతుండడం ఆశ్చర్యంగా ఉందన్నారు. బుధవారం ఉత్తరప్రదేశ్లోని బస్తీ, శ్రావస్తిలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలపై విరుచుకుపడ్డారు. ఒకప్పుడు ఉగ్రవాదంతో మనల్ని భయపెట్టాలని చూసిన పాకిస్తాన్ ఇప్పుడు తిండి లేక అల్లాడుతోందని చెప్పారు. పాకిస్తాన్ పని అయిపోయిందని తేల్చిచెప్పారు. అయినప్పటికీ పాకిస్తాన్ సానుభూతిపరులైన కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు మనల్ని బెదిరించడంలో బిజీగా ఉన్నాయని ధ్వజమెత్తారు. పాకిస్తాన్ వద్ద అణుబాంబులు ఉంటే, ఇండియాలో 56 అంగుళాల ఛాతీ ఉందని వ్యాఖ్యానించారు. పొరుగు దేశాలను చూసి బెదిరిపోవడానికి ఇక్కడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, బలమైన మోదీ ప్రభుత్వమని స్పష్టంచేశారు. -
లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామంటున్న గజల్ అలఘ్.. ఎవరీమె?
రాబోయే 10 సంవత్సరాలలో తమ కంపెనీ లక్షలాది ఉద్యోగావకాశాలను సృష్టిస్తుందని మామాఎర్త్ (mamaearth) సహ వ్యవస్థాపకురాలు గజల్ అలఘ్ చెబుతున్నారు. తమను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు.కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తన నివాసంలో నిర్వహించిన విశేష సంపర్క్ కార్యక్రమంలో మామాఎర్త్ సహ వ్యవస్థాపకుడు వరుణ్ అలఘ్ ప్రసంగించారు. దీన్ని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఎక్స్లో పోస్ట్ చేయగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ వరుణ్ అలఘ్ను అభినందించారు. స్టార్టప్లను, సంపద సృష్టిని తమ ప్రభుత్వం చురుకుగా ప్రోత్సహిస్తోందన్నారు. ముఖ్యంగా టైర్-2, 3 నగరాల్లో యువశక్తిని చూసి గర్విస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు.వరుణ్ అలఘ్ సతీమణి కంపెనీ సహ వ్యవస్థాపకురాలు గజల్ అలఘ్ దీన్ని రీ ట్వీట్ చేస్తూ “ధన్యవాదాలు నరేంద్ర మోదీజీ. మీ ఆశీర్వాదం, ప్రభుత్వ మద్దతుతో రాబోయే 10 సంవత్సరాలలో లక్షల ఉద్యోగాలను సృష్టిస్తాం’’ అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలపై స్పందిస్తూ గజల్ అలఘ్ పేర్కొన్నారు. మోదీ అందించిన ప్రోత్సాహం తమలో మరింత అంకిత భావాన్ని పెంపొందిస్తుందన్నారు. భారతీయ అందాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తామని, ప్రతిచోటా భారత జెండా ఎగరేస్తామంటూ రాసుకొచ్చారు. Thank you @narendramodi ji 🙏Aapke aashirvaad aur Modi sarkaar ke support ke sath lakhon jobs create karenge agle 10 saal mein.This truly fuels our passion and makes us even more determined to succeed. We will take Indian beauty to the world and place the Bharat flag… pic.twitter.com/GzuEU6Qrfc— Ghazal Alagh (@GhazalAlagh) May 22, 2024 -
‘ఇంటి పేరు’తో పనిలేదు దీపిందర్ గోయల్.. ప్రధాని మోదీ ట్వీట్ వైరల్
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ స్టార్టప్ జర్నీపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. నేటి భారతంలో ఇంటిపేరుకు ఎలాంటి ప్రాధాన్యం లేదంటూనే.. గోయల్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందించారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ‘విశేష్ సంపర్క్’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ఈవెంట్లో దీపిందర్ గోయల్ స్టార్టప్ను ప్రారంభించే విషయంలో తనకు తన తండ్రికి మధ్య జరిగిన చర్చ గురించి గుర్తు చేశారు.నీ తండ్రి స్థాయి ఏంటో తెలుసా?‘16 ఏళ్ల క్రితం నా తండ్రికి నా స్టార్టప్ ఆలోచన గురించి వివరించా. అప్పుడాయన.. నీ తండ్రి స్థాయి ఏంటో తెలుసా? పంజాబ్లోని ఇంత చిన్న ఊరిలో నువ్వేం చేయలేవు అని అన్నారు. కానీ నేను సుసాధ్యం చేశాను. జొమాటో అనే సామ్రజ్యాన్ని నిర్మించి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. విజయం ఇంటిపేర్లతో కట్టుబడి ఉండదనివిశేష్ సంపర్క్ కార్యక్రమంలో దీపిందర్ గోయల్ ప్రసంగంపై ప్రధాని మోదీ స్పందించారు. విజయం ఇంటిపేర్లతో కట్టుబడి ఉండదని, గోయల్ సాధించిన విజయాలు ఎంతో మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రేరణగా నిలుస్తోందన్నారు.మీ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం‘నేటి భారతంలో ఒకరి ఇంటిపేరు పట్టింపు లేదు. కష్టపడి పనిచేయడమే ముఖ్యం. మీ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం దీపిందర్ గోయల్! ఇది అసంఖ్యాక యువకులను వారి వ్యవస్థాపక కలలను కొనసాగించడానికి ప్రేరేపిస్తుంది. స్టార్టప్లు అభివృద్ధి చెందడానికి సరైన వాతావరణాన్ని అందించడానికి మేం కట్టుబడి ఉన్నాము’ అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.In today’s India, one’s surname doesn’t matter. What matters is hardwork. Your journey is truly inspiring, @deepigoyal! It motivates countless youngsters to pursue their entrepreneurial dreams. We are committed to providing the right environment for the startups to flourish. https://t.co/E9ccqYyVzv— Narendra Modi (@narendramodi) May 22, 2024 -
మోదీ గ్యారంటీలా? కేజ్రీ పథకాలా?.. ఢిల్లీ జనం మదిలో ఏముంది?
ఢిల్లీ ఎన్నికల పోరు ఎంతో ఆసక్తికరంగా మారింది. ఒకవైపు బీజేపీ తరపున ప్రధాని మోదీ గ్యారంటీల హామీలనిస్తుండగా, మరోవైపు సీఎం కేజ్రీవాల్ పలు పథకాల అమలుకు హామీలు గుప్పిస్తున్నారు. ప్రజా సంక్షేమం, దేశ ప్రయోజనాలతో కూడిన ఈ హామీలతో వారు ఓటర్ల మనసు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.గత ఏడాది జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లపై మోదీ గ్యారంటీ హామీల ప్రభావం కనిపించింది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరపున ప్రధాని మోదీ చేస్తున్న హామీలు ప్రజలకు ఆకట్టుకునేలా ఉన్నాయి.న్యూఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి బన్సూరి స్వరాజ్ మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమె తన ప్రచారంలో మోదీ హామీలను అధికంగా ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రాంత ప్రజలు తనను ప్రజా ప్రతినిధిగా ఎన్నుకుంటే మోదీ హామీలను నెరవేరుస్తారని చెబుతున్నారు. ఇక గతంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హామీ పథకాలు ఆ పార్టీకి అసెంబ్లీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మెజారిటీ సాధించిపెట్టాయి. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ కేజ్రీవాల్ హామీలను ఢిల్లీ ఓటర్లు విశ్వసిస్తారనే నమ్మకంలో ఆ పార్టీ ఉంది.ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్పై జైలు నుండి బయటకు వచ్చాక నిర్వహిస్తున్న బహిరంగ సభలు, రోడ్ షోలలో తాము అమలు చేస్తున్న ఉచిత పథకాలను పదేపదే ప్రస్తావిస్తున్నారు. తాను అధికారంలో ఉన్నంత వరకు ఉచిత విద్యుత్, మంచినీరు, ఆరోగ్య సౌకర్యాల హామీని కొనసాగిస్తానని చెబుతున్నారు.ఆ మధ్య ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో జరిగిన భారత కూటమి ర్యాలీలో కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ తన ప్రసంగంలో సీఎం తెలిపిన ఆరు హామీలను ప్రస్తావించారు. దాదాపు 50 రోజుల పాటు జైలులో ఉండి బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఢిల్లీవాసులకు పది హామీలు ఇచ్చారు. వీటిలో ఉచిత విద్యుత్, ఆరోగ్య పథకాలతో పాటు చైనా ఆక్రమించిన భారత భూ భాగాన్ని స్వాధీనం చేసుకోవడంపై కూడా హామీనిచ్చారు. గతంలో జేడీయూ అధినేత నితీశ్ కుమార్ కూడా బీహార్లో ఇటువంటి హామీలతోనే విజయం సాధించారు. మరి ఇప్పుడు జరుగుతున్న ఢిల్లీ పోరులో అక్కడి జనం అటు మోడీ గ్యారంటీలను నమ్ముతారో లేక ఇటు కేజ్రీవాల్ పథకాలను విశ్వస్తారో మే 25న జరిగే ఎన్నికల్లో నిర్ణయించనున్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
కనీసం మాట మాట్లాడటానికి ఇష్టపడటం లేదు: కేటీఆర్
BH రిజిస్ట్రేషన్.. బయటపడ్డ డీలర్ల మోసాలు
Children's Story: సహన రెండవ తరగతి చదువుతోంది.. ఒకరోజూ..!
ఆగ్రాలో మరో అద్భుతం: భర్త జ్ఞాపకార్థం ఎర్ర తాజ్మహల్
టీడీపీ వీడియో ట్వీట్ చేస్తే ఈసీ విచారణకు ఆదేశిస్తుందా?: పేర్ని నాని
ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ విపత్తు ఆస్పత్రి!ఎక్కడంటే..
మిస్టరీ.. 'ఆ వస్తువుల్ని ఎవరైనా తీసుకెళ్తే.. ఎందుకలా జరుగుతుంది'?
'96' దర్శకుడితో కార్తీ మూవీ.. మళ్లీ అలాంటి కాన్సెప్ట్
Sister Death Review: అక్కడ పేరు కనిపిస్తే మరణమే!
IPL 2024 ఫైనల్ జోరుగా బెట్టింగ్..
తప్పక చదవండి
- చరిత్ర సృష్టించిన షకీబ్.. ప్రపంచ క్రికెట్లో తొలి ఆటగాడిగా..!
- విధ్వంసం సృష్టించిన విండీస్ బ్యాటర్లు.. సౌతాఫ్రికాకు సిరీస్ పరాభవం
- బ్యాన్ చేసిన వారే ఆమె టాలెంట్కు నివ్వెరపోయారు
- సెలక్ట్ చేసి చివరి నిమిషంలో హ్యాండిచ్చేవారు: హీరోయిన్
- ఇన్సూరెన్స్ లైసెన్స్ అప్లికేషన్ను విత్ డ్రా.. పేటీఎం మరో కీలక నిర్ణయం
- బ్యాంక్ల్లో ఇబ్బందులా?, ఆర్బీఐకి ఫిర్యాదు చేయండిలా..
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి అఖిలేష్?
- మరో ఎంపీ లండన్లో ఉన్నా.. నన్ను టార్గెట్ చేశారు: స్వాతి మలివాల్
- Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
- క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావా
Advertisement