-
అంచనాలను అందుకోలేకపోయాను: రోహిత్ శర్మ
ఐపీఎల్ తాజా సీజన్లో తాను అనుకున్న విధంగా రాణించలేకపోయానని, అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యానని ముంబై ఇండియన్స్ బ్యాటర్, భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. అయితే దాని గురించి ఇప్పుడు అతిగా ఆలోచించడం అనవసరమని అతను అభిప్రాయపడ్డాడు.‘ఒక బ్యాటర్గా నేను స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదనేది వాస్తవం. ఇప్పుడు దానిని విశ్లేíÙంచి లాభం లేదని ఇన్నేళ్ల అనుభవం ద్వారా తెలుసుకున్నాను. ఇప్పుడు మానసికంగా కాస్త ప్రశాంతంగా ఉండటం అవసరం. ప్రాక్టీస్ కొనసాగిస్తూ ఆటను మెరుగుపర్చుకోవడమే నేను చేయగలిగింది’ అని రోహిత్ స్పష్టం చేశాడు. ఐపీఎల్ సీజన్ తమ జట్టు ప్రణాళికల ప్రకారం సాగలేదని, ఎన్నో తప్పులు చేశామన్న రోహిత్ శర్మ...తాము గెలవాల్సిన మ్యాచ్లను స్వల్ప తేడాతో చేజార్చుకున్నామని అన్నాడు. మరో వైపు భారత జట్టు విషయంలో తనకు ఎలాంటి సందేహాలు లేవని కెప్టెన్ అన్నాడు. ఐపీఎల్ ప్రదర్శనతో సంబంధం లేకుండా జట్టులోని ప్రతీ ఒక్కరికీ తమ బాధ్యతలేమిటో స్పష్టంగా తెలుసని అతను పేర్కొన్నాడు. -
రోహిత్తో నీతా అంబానీ సీరియస్ డిస్కషన్.. వీడియో వైరల్
ఐపీఎల్-2024లో తన ఆఖరి మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ. ఈ సీజన్లో నిలకడలేని ఫామ్తో విమర్శల పాలైన హిట్మ్యాన్ సొంతగడ్డపై శుక్రవారం ధనాధన్ ఇన్నింగ్స్తో మెరిశాడు.లక్నో సూపర్ జెయింట్స్తో వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 38 బంతుల్లోనే 68 పరుగులు సాధించాడు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఇన్నింగ్స్లో ఏకంగా 10 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి.అయితే, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ ముంబై జట్టును గెలిపించలేకపోయింది. ఈ మ్యాచ్లో లక్నో 18 పరుగుల తేడాతో గెలుపొందడంతో లీగ్ దశను ఓటమితోనే ముగించింది ముంబై ఇండియన్స్.ఏకంగా పదో పరాజయం నమోదు చేసి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇదిలా ఉంటే.. ఆఖరి మ్యాచ్లో అదరగొట్టిన రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కోచ్ సిబ్బంది ప్రత్యేక మెడల్తో సత్కరించింది.హిట్మ్యాన్ను సత్కరించిన నీతా అంబానీప్రధాన కోచ్ మార్క్ బౌచర్ రోహిత్ శర్మ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడంటూ ప్రశంసించాడు. మెడల్ తీసుకోవడానికి రావాల్సిందిగా రోహిత్ శర్మను కోరాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ హిట్మ్యాన్ జెర్సీకి బ్యాడ్జిని అటాచ్ చేసి సత్కరించారు.అయితే, ఆ సమయంలో రోహిత్ శర్మ ముఖంలోగానీ.. నీతా ఫేస్లో గానీ ఏమాత్రం సంతోషం కనబడలేదు. నీతా ఏదో మొక్కుబడిగా బ్యాడ్జి పెట్టిన అనంతరం.. రోహిత్ ముభావంగా వెనక్కి తిరిగి వచ్చేశాడు.तोडफोड from the get-go, a 𝐭𝐲𝐩𝐢𝐜𝐚𝐥 𝐑𝐨 𝐩𝐞𝐫𝐟𝐨𝐫𝐦𝐚𝐧𝐜𝐞 was on display in #MIvLSG 💪💙#MumbaiMeriJaan #MumbaiIndians | @ImRo45 pic.twitter.com/sddic4we6i— Mumbai Indians (@mipaltan) May 18, 2024 తారస్థాయికి విభేదాలు!ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లలో చర్చకు దారి తీసింది. ముంబై ఇండియన్స్ యాజమాన్యం రోహిత్ శర్మ పట్ల వ్యవహరించిన తీరు చూస్తుంటే.. ఇరు వర్గాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్లు కనిపిస్తోందని.. వచ్చే సీజన్లో రోహిత్ ముంబైకి ఆడకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. లక్నో చేతిలో ఓటమి తర్వాత రోహిత్- నీతా సీరియస్గా మాట్లాడుకున్న దృశ్యాలను ఈ సందర్భంగా షేర్ చేస్తున్నారు.Is Nita Ambani requesting Rohit Sharma to stay back in Mumbai Indians?#RohitSharma | #MumbaiIndians pic.twitter.com/DP59HFueWd— Indian Cricket Team (Parody) (@ictparody) May 17, 2024 కాగా ముంబై ఇండియన్స్ను అత్యధికంగా ఐదుసార్లు చాంపియన్గా నిలిపిన ఘనత రోహిత్ శర్మది. అయితే, ఐపీఎల్-2024కు ముందే అతడిపై వేటు వేసిన ముంబై మేనేజ్మెంట్.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది.అయితే, హార్దిక్ సారథ్యంలో ముంబైకి ఘోర పరాభవం ఎదురైంది. ఐపీఎల్-2024లో ఆడిన పద్నాలుగు మ్యాచ్లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఇక తాజా ఎడిషన్లో మొత్తంగా ముంబై తరఫున 14 మ్యాచ్లు ఆడి 417 పరుగులు చేశాడు రోహిత్ శర్మ.చదవండి: T20 WC 2024: టీమిండియా ఆటగాళ్ల న్యూయార్క్ ప్రయాణం ఆరోజే! -
T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఆరంభానికి కౌంట్డౌన్ మొదలైంది. పదిహేను రోజుల్లోపే అమెరికా- వెస్టిండీస్ వేదికగా ఈ ఈవెంట్కు తెరలేవనుంది.క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్-2024కు మే 26న శుభం కార్డు పడనుండగా.. జూన్ 1 నుంచి ఈ టోర్నమెంట్ రూపంలో మరోసారి పొట్టి క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత మజా దొరకనుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి రోహిత్ శర్మ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. కాగా టీమిండియా తమ లీగ్ మ్యాచ్లన్నీ అమెరికాలోనే ఆడనుంది.ఇక మెగా టోర్నీ సన్నాహకాల్లో భాగంగా జూన్ 1న బంగ్లాదేశ్తో ఏకైక వార్మప్ మ్యాచ్ ఆడనున్న రోహిత్ సేన.. జూన్ 5న తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడనుంది. ఇదిలా ఉంటే.. టీ20 ప్రపంచకప్ జట్టులో భాగమైన భారత ఆటగాళ్లలో మెజారిటీ మంది మే 25న అమెరికాకు ప్రయాణం కానున్నట్లు సమాచారం.తొలి దఫా బ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ సహా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్ తదితరులతో పాటు సహాయక సిబ్బంది కూడా న్యూయార్క్కు బయల్దేరతారని బీసీసీఐ వర్గాలు వార్తా సంస్థ పీటీఐకి వెల్లడించాయి.నిజానికి మే 21నే వీరంతా అమెరికాకు పయనం కావాల్సి ఉందని అయితే, ఒకే ఒక్క వార్మప్ మ్యాచ్ ఉంది కాబట్టి కాస్త విశ్రాంతి తీసుకునేందుకు బోర్డు అనుమతినిచ్చిందని పేర్కొన్నాయి. ఇక మిగిలిన వాళ్లలో సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లి తదితరులు ఐపీఎల్-2024 ఫైనల్ పూర్తైన మరుసటి రోజు అంటే మే 27న భారత్ను వీడనున్నారు.టీ20 ప్రపంచకప్-2024కు భారత జట్టురోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.. -
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఐపీఎల్-2024 లీగ్ దశలో లక్నో సూపర్ జెయింట్స్ తమ ఆఖరి మ్యాచ్ ఆడేసింది. ముంబై ఇండియన్స్తో శుక్రవారం నాటి మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలను ఇంకా సజీవంగానే ఉంచుకుంది.అయితే, చెన్నై సూపర్ కింగ్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య శనివారం నాటి మ్యాచ్ ఫలితంపైనే లక్నో భవితవ్యం ఆధారపడి ఉంది. అయితే, ఈ మ్యాచ్లో ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప ఇప్పటికైతే లక్నో దాదాపుగా నిష్క్రమించినట్లే!ఇదిలా ఉంటే.. లీగ్ దశను విజయంతో ముగించడం పట్ల లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ హర్షం వ్యక్తం చేశాడు. సీజన్ ఆసాంతం ఇలాగే ఆడి ఉంటే బాగుండేదని పేర్కొన్నాడు. ఏదేమైనా ఈ ఎడిషన్లో ఓవరాల్గా తమ ప్రదర్శన మాత్రం నిరాశకు గురిచేసిందని విచారం వ్యక్తం చేశాడు.ఫ్రాంఛైజీ మయాంక్ యాదవ్, యుధ్వీర్ వంటి భారత యువ ఆటగాళ్ల మీద భారీ మొత్తం పెట్టుబడి పెట్టిందని.. అయితే, గాయాల కారణంగా వారు తమ పని పూర్తి చేయలేకపోయారని కేఎల్ రాహుల్ పేర్కొన్నాడు. నేను మా మామగారి జట్టులో ఉన్నాఅదే విధంగా.. తన బ్యాటింగ్ పొజిషన్పై దృష్టి సారించానని.. మిడిలార్డర్లో ఆడితే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చించినట్లు తెలిపాడు. కాగా ఈ ఎడిషన్లో లక్నో 14 మ్యాచ్లలో ఏడు గెలిచింది. ఇక ఐపీఎల్-2024 తర్వాత తదుపరి ప్రణాళికలు ఏమిటన్న ప్రశ్నకు కేఎల్ రాహుల్ బదులిస్తూ.. ‘‘ప్రస్తుతం నేను మా మామగారి జట్టులో ఉన్నాను. ఇద్దరం కలిసి ప్రపంచకప్ టోర్నీలో ఆడే శర్మా జీ వాళ్ల అబ్బాయిని చీర్ చేస్తాం’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. టీ20 ప్రపంచకప్-2024లో ఆడనున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు.తన మామగారు, బాలీవుడ్ నటుడు సునిల్ శెట్టితో కలిసి మ్యాచ్లు చూస్తూ ఎంజాయ్ చేస్తానని తెలిపాడు. కాగా జూన్ 1 నుంచి ఆరంభం కానున్న టీ20 వరల్డ్కప్-2024 టోర్నీ నేపథ్యంలో కేఎల్ రాహుల్కు భారత జట్టులో చోటు దక్కలేదు. వికెట్ కీపర్ కోటాలో రాహుల్ను కాదని రిషభ్ పంత్, సంజూ శాంసన్లకు చోటిచ్చింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ!చదవండి: BCCI: హార్దిక్ పాండ్యాకు ఊహించని షాక్.. ఐపీఎల్ 2025లో ఇక.. #LSG wrapped up their season on a winning note and happy faces in Mumbai😃👌🎥 Here's a roundup of the #MIvLSG clash at the Wankhede 🏟️ #TATAIPL pic.twitter.com/FbdT2QQQAk— IndianPremierLeague (@IPL) May 18, 2024 -
IPL 2025: ముంబైకి రోహిత్ గుడ్ బై.. క్లారిటీ ఇచ్చేసిన కోచ్!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఐపీఎల్-2024 చేదు అనుభవాలనే మిగిల్చింది. సీజన్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించి.. సారథ్య బాధ్యతలను ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు అప్పగించింది.గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ మొత్తానికి పాండ్యాను ట్రేడ్ చేసుకుని మరీ.. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసింది. ఇదిలా ఉంటే.. బ్యాటర్గానూ హిట్మ్యాన్ ఈసారి తన స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు.అదొక్కటి హైలైట్తాజా ఎడిషన్లో మొత్తంగా ముంబై తరఫున 14 మ్యాచ్లు ఆడి 417 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్పై చేసిన సెంచరీ ఒక్కటి హైలైట్గా నిలవగా.. లీగ్ దశలో ఆఖరిదైన లక్నో మ్యాచ్లోనూ రోహిత్ అర్ధ శతకం(38 బంతుల్లో 68) సత్తా చాటాడు. ఇవి మినహా రోహిత్ నుంచి ఆశించిన మేర మెరుపులు రాలేదు.ఇదిలా ఉంటే.. మేనేజ్మెంట్, హార్దిక్ పాండ్యాతో విభేదాలు తలెత్తిన కారణంగా రోహిత్ శర్మ వచ్చే సీజన్లో ముంబై ఇండియన్స్ను వీడతాడనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల కేకేఆర్ కోచ్ అభినవ్ ముకుంద్తో మాట్లాడుతూ రోహిత్ వీటికి బలం చేకూర్చాడు.వచ్చే ఏడాది మెగా వేలంఇక ముంబై ఇండియన్స్ హెడ్కోచ్ మార్క్ బౌచర్ సైతం తాజాగా ఈ విషయంపై స్పందించాడు. లక్నోతో శుక్రవారం నాటి మ్యాచ్లో ముంబై ఓడిన అనంతరం అతడు మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి ప్రశ్న ఎదురైంది.ఇందుకు బదులిస్తూ.. ‘‘తనకు సంబంధించిన నిర్ణయాలు తానే తీసుకోగల సమర్థుడు. వచ్చే ఏడాది మెగా వేలం జరుగబోతోంది. ఏం జరుగనుందో ఎవరికి మాత్రం ఏం తెలుసు? రోహిత్ శర్మతో నేను గత రాత్రి మాట్లాడాను. ఈ సీజన్లో వైఫల్యాల గురించి చర్చించాం. తదుపరి ఏమిటని అడిగాను.ఇందుకు రోహిత్ బదులిస్తూ.. ‘వరల్డ్కప్’.. అని సమాధానమిచ్చాడు’’ అని మార్క్ బౌచర్ పేర్కొన్నాడు. అతడి వ్యాఖ్యలను బట్టి.. రోహిత్ శర్మ వచ్చే ఏడాది ముంబైని వీడటం ఖాయమని ఫిక్సయిపోయారు అతడి అభిమానులు.తగిన శాస్తి జరిగిందంటూపనిలో పనిగా.. రోహిత్ శర్మను కెప్టెన్గా తొలగించినందుకు ముంబై యాజమాన్యానికి తగిన శాస్తి జరిగిందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ మొత్తంగా ఆడిన 14 మ్యాచ్లలో కేవలం నాలుగే గెలిచింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. కాగా జూన్ 1 నుంచి ఆరంభమయ్యే టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియాకు రోహిత్ శర్మ కెప్టెన్. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్. -
MI: రోహిత్, హార్దిక్ వద్దు.. వాళ్లిద్దరినే రిటైన్ చేసుకోండి: సెహ్వాగ్
ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ‘స్టార్’ క్రికెటర్ల ఆట తీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. వచ్చే ఏడాది వేలంలో సోకాల్డ్ ‘స్టార్ల’ను వదిలేయాలని మేనేజ్మెంట్కు సూచించాడు.కాగా ముంబై ఇండియన్స్లో స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, టీ20 వరల్డ్ నంబర్ వన్ స్టార్ సూర్యకుమార్ యాదవ్తో పాటు యంగ్ ఓపెనర్ ఇషాన్ కిషన్ తదితరులు ఉన్నారు.ఇక రోహిత్ శర్మ ఈ జట్టుకు ఐదుసార్లు ట్రోఫీ అందించినా.. ఐపీఎల్-2024 సీజన్లో కెప్టెన్గా అతడిని తప్పించింది యాజమాన్యం. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న పాండ్యాకు పగ్గాలు అప్పగించింది.రెండు వర్గాలుగా విడిపోయిన జట్టు?ఈ నేపథ్యంలో వేదనకు గురైన రోహిత్ శర్మతో పాటు బుమ్రా, సూర్య తదితరులు ఒక బృందంగా.. పాండ్యా, ఇషాన్లతో కూడిన మరికొందరు మరో బృందంగా ఏర్పడ్డారని.. జట్టులో విభేదాలు తారస్థాయికి చేరాయనే వార్తలు వినిపిస్తున్నాయి.జట్టు ప్రదర్శనపై ఇది ప్రభావం చూపిందని.. అందుకే ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై నిలిచిందనే విమర్శలు వస్తున్నాయి. ఇక ఈ ఎడిషన్ లీగ్ దశలో తమ ఆఖరి మ్యాచ్లో భాగంగా ముంబై శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది.ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ ముంబై మేనేజ్మెంట్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. 2025 వేలానికి ముందే రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్లను వదిలేయాలని సూచించాడు.షారుఖ్, సల్మాన్, ఆమిర్ ఉంటే సరిపోదుఇందుకు సినిమాను ఉదాహరణగా ప్రస్తావిస్తూ ఈ మేరకు ‘‘షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ కలిసి ఒకే సినిమాలో నటించినా.. అది హిట్టవుతుందనే గ్యారెంటీ లేదు. సినిమాలో స్టార్లు ఉన్నంత మాత్రాన సరిపోదు.మంచి స్క్రిప్టు ఉండాలి. అందరూ బాగా నటించగలగాలి. ఇలా ఇంకెన్నో అంశాలు కలిసిరావాలి. అలాగే జట్టులో పేరున్న ఆటగాళ్లు ఉన్నంత మాత్రాన సరిపోదు.అసలు రోహిత్ శర్మ ఏం చేశాడు?మైదానంలో వాళ్లు సరిగ్గా ఆడితేనే అనుకున్న ఫలితాలు వస్తాయి. రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్లో సెంచరీ చేశాడు. కానీ ఆ మ్యాచ్లో ముంబై ఓడిపోయింది. మరి మిగతా మ్యాచ్లలో అతడి ప్రదర్శన మాటేమిటి?ఇక ఇషాన్ కిషన్.. ఈ సీజన్ మొత్తంలో ఒక్కసారి కూడా కనీసం పవర్ ప్లే ముగిసే వరకైనా ఉన్నాడా?.. నా దృష్టిలో ముంబై ఇండియన్స్ కేవలం జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్లనే నమ్ముకోవాలిక! వీళ్లిద్దరిని మాత్రమే రిటైన్ చేసుకోవాలివచ్చే సీజన్ కోసం వీళ్లిద్దరిని మాత్రమే రిటైన్ చేసుకుంటే బాగుంటుంది. మిగతా వాళ్లు అసలు అవసరమే లేదు’’ అని సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. కాగా ఈ సీజన్లో ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ 349, ఇషాన్ కిషన్ 306 పరుగులు చేశారు. మరోవైపు గాయం కారణంగా ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ 345 పరుగులు సాధించాడు. ఇక బుమ్రా 20 వికెట్లు తీయగా.. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 11 వికెట్లు తీయడంతో పాటు 200 పరుగులు చేశాడు. చదవండి: Kavya Maran- SRH: కేన్ మామను హత్తుకున్న కావ్యా.. వీడియో వైరల్అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్ను అంటారా?.. గంభీర్ ఫైర్ -
నన్ను భయపెట్టిన బౌలర్ అతడే: రోహిత్ శర్మ
ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందు వరుసలో ఉంటాడనడంలో ఎటువంటి సందేహం లేదు. వరల్డ్క్లాస్ బౌలర్లను సైతం భయపెట్టిన ఘనత హిట్మ్యాన్ది. వన్డే క్రికెట్లో రెండు సార్లు డబుల్ సెంచరీ బాదిన ఏకైక మొనగాడు రోహిత్ శర్మనే. అటువంటి రోహిత్ శర్మ తన కెరీర్లో ఒక బౌలర్కు భయపడ్డాడట. అతడే దక్షిణాఫ్రికా పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్. రోహిత్ శర్మ తాజాగా దుబాయ్ ఐ 103.8 అనే ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో తన కెరీర్లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ ఎవరన్న ప్రశ్న హిట్మ్యాన్కు ఎదురైంది. అందుకు బదులుగా రోహిత్ శర్మ.. డేల్ స్టెయిన్ అంటూ బదులిచ్చాడు."నేను నా కెరీర్లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ డేల్ స్టేయిన్. స్టేయిన్ ప్రత్యర్ధి జట్టులో ఉంటే నేను బ్యాటింగ్కు వెళ్లే ముందు అతడి బౌలింగ్ వీడియోలను 100 సార్లు చూసేవాడిని. స్టెయిన్ అద్భుతమైన బౌలర్. అతడొక లెజెండ్. అతడు బంతిని అద్భుతంగా స్వింగ్ చేయగలడు. అతడి బౌలింగ్లో ఆడటాన్ని ఆస్వాదిస్తానని" రోహిత్ పేర్కొన్నాడు. -
కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
టీ20 ప్రపంచకప్-2021 తర్వాత విరాట్ కోహ్లి పొట్టి ఫార్మాట్లో టీమిండియా పగ్గాలు వదిలేయడంతో రోహిత్ శర్మ అతడి స్థానంలో సారథిగా బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత అనూహ్య రీతిలో కోహ్లి వన్డే కెప్టెన్సీ కోల్పోవడం, అర్ధంతరంగా టెస్టు సారథ్యానికి కూడా గుడ్బై చెప్పడంతో.. మూడు ఫార్మాట్లకు హిట్మ్యానే నాయకుడిగా ఎంపికయ్యాడు.ద్వైపాక్షిక సిరీస్లలో సత్తా చాటడమే గాకుండా.. ఏకకాలంలో టీ20, వన్డే, టెస్టుల్లో భారత జట్టును అగ్రస్థానంలో నిలిపాడు రోహిత్ శర్మ. అతడి కెప్టెన్సీలో టీమిండియా ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్, వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్ చేరింది.కానీ ఆఖరి గండాన్ని దాటలేక చేతులెత్తి రన్నరప్గా మిగిలిపోయింది. అయితే, టీ20 ప్రపంచకప్-2024 రూపంలో ఆ అపఖ్యాతిని చెరిపివేసుకునేందుకు రోహిత్ శర్మకు మరో అవకాశం వచ్చింది. ఈ టోర్నీలో ఏకంగా తొమ్మిదోసారి ఆడబోతున్న రోహిత్.. ఈసారి కెప్టెన్ హోదాలో బరిలోకి దిగబోతున్నాడు.కాగా 37 ఏళ్ల రోహిత్ శర్మకు ఇదే ఆఖరి టీ20 ప్రపంచకప్ కాబోతుందన్న వార్తల నేపథ్యంలో కప్పు గెలిస్తే మాత్రం అతడి కెరీర్లో చిరస్మరణీయ విజయంగా నిలిచిపోతుంది.ఇదిలా ఉంటే.. తన కెరీర్లో ఇంత దూరం వస్తానని.. టీమిండియా కెప్టెన్ స్థాయికి ఎదుగుతానని అస్సలు ఊహించలేదనంటున్నాడు రోహిత్ శర్మ. ఇది తనకు దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు.దుబాయ్ ఐ 103.8 యూట్యూబ్ చానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చిన క్రమంలో.. ‘‘విరాట్ లాంటి వ్యక్తి స్థానంలో టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడం అంటే మామూలు విషయం కాదు. అదొక అతిపెద్ద బాధ్యత. మీరెలా ఫీలయ్యారు’’ అనే ప్రశ్న ఎదురైంది.ఇందుకు బదులిస్తూ.. ‘‘జాతీయ జట్టుకు కెప్టెన్గా పనిచేయడం కంటే గొప్ప గౌరవం మరొకటి ఉండదు. అయినా.. నా జీవితంలో అలాంటి ఒకరోజు వస్తుందని ఊహించలేదు.మంచి వాళ్లకు మంచి జరుగుతుందని అందరూ అంటూ ఉంటారు. అయితే, ఇది మాత్రం నాకు దక్కిన అదృష్టం. భారత క్రికెట్ మీద గత కెప్టెన్లు ఎలాంటి ప్రభావం చూపారో నాకు తెలుసు. వారి వారసత్వాన్ని నిలబెడుతూ సరైన దిశలో జట్టును ముందుకు నడిపించడమే నా పని’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. -
రోహిత్ శర్మతో పాటు షకీబ్!.. ఎవరికీ సాధ్యం కాని రికార్డు!
బంగ్లాదేశ్ జట్టు స్టార్ ఆల్రౌండర్, మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వరుసగా తొమ్మిదోసారి టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొంటున్న రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ షకీబ్ కంటే ముందుగానే తన పేరును లిఖించుకున్నాడు.కాగా జూన్ 1 నుంచి వరల్డ్కప్-2024 టోర్నీ ఆరంభం కానుంది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఈ మెగా ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 30న భారత క్రికెట్ నియంత్రణ మండలి తమ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యుల పేర్లు వెల్లడించింది.కాగా 2007లో తొలిసారి టీ20 ప్రపంచకప్ ఈవెంట్ ఆరంభించగా రోహిత్ శర్మ అప్పటి నుంచి ఈ మెగా టోర్నీ ఒక్కసారి కూడా మిస్ కాలేదు. వరుసగా తొమ్మిదో ఎడిషన్లోనూ ఆడేందుకు హిట్మ్యాన్ సిద్దమయ్యాడు. ఈసారి.. రెండో దఫా కెప్టెన్ హోదాలో అతడు బరిలోకి దిగనున్నాడు. ఇక జూన్ 5న టీమిండియా తమ తొలి మ్యాచ్ ఐర్లాండ్తో ఆడనుంది.ఇదిలా ఉంటే.. బంగ్లాదేశ్ వరల్డ్కప్ కోసం మంగళవారం తమ జట్టును ప్రకటించింది. ఇందులో షకీబ్ అల్ హసన్కు స్థానం దక్కింది. ఇక జూన్ 7 న బంగ్లాదేశ్ శ్రీలంకతో మ్యాచ్తో ప్రపంచకప్ జర్నీ ఆరంభించనుంది.ఈ నేపథ్యంలో పొట్టి క్రికెట్ ప్రపంచకప్లో వరుసగా ఆడుతున్న క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ ముందంజలో నిలవగా.. షకీబ్ రెండోస్థానం ఆక్రమించాడు. కాగా ఇప్పటి వరకు ప్రపంచకప్లలో 36 మ్యాచ్లు ఆడిన షకీబ్ 742 పరుగులు చేయడంతోపాటు 47 వికెట్లు పడగొట్టాడు.టీ20 ప్రపంచకప్లో ఇప్పటి వరకు అత్యధికసార్లు పాల్గొన్న/పాల్గొనబోతున్న ఆటగాళ్లు👉రోహిత్ శర్మ- 9- 2007, 2009, 2010, 2011, 2014, 2016, 2021, 2022, 2024.👉షకీబ్ అల్ హసన్- 9- 2007, 2009, 2010, 2011, 2014, 2016, 2021, 2022, 2024.👉మహ్మదుల్లా- 8- 2007, 2009, 2010, 2011, 2014, 2016, 2021, 2024.👉డేవిడ్ వార్నర్- 8- 2009, 2010, 2011, 2014, 2016, 2021, 2022, 2024.👉క్రిస్ గేల్- 7- 2007, 2009, 2010, 2011, 2014, 2016, 2021.👉డ్వేన్ బ్రావో- 2007, 2009, 2010, 2011, 2014, 2016, 2021టీ20 ప్రపంచకప్ కోసం బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హొస్సేన్ (కెపె్టన్), టస్కిన్ అహ్మద్ (వైస్ కెప్టెన్), లిటన్ దాస్, సౌమ్య సర్కార్, తన్జిద్ హసన్, షకీబ్, తౌహిద్, మహ్ముదుల్లా, జాకీర్ అలీ, తన్వీర్ ఇస్లామ్, మెహదీ హసన్, రిషాద్, ముస్తఫిజుర్, షోరిఫుల్, తన్జీమ్ హసన్. చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్ను అంటారా?.. గంభీర్ ఫైర్ -
WC: నో రిజర్వ్ డే!.. ఒకవేళ టీమిండియా సెమీస్ చేరితే.. జరిగేది ఇదే!
టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియాఒకవేళ సెమీఫైనల్ చేరితే ఆ మ్యాచ్ ‘రిజర్వ్ డే’ లేకుండానే జరగనుంది. తొలి సెమీఫైనల్, ఫైనల్కు మాత్రమే ‘రిజర్వ్ డే’ ఉంచుతున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే.కాగా ఈ మెగా టోర్నీలో తొలి సెమీఫైనల్ తరూబా (ట్రినిడాడ్)లో జూన్ 26న స్థానిక కాలమానం ప్రకారం రాత్రి గం. 8:30కు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్కు అంతరాయం కలిగితే తర్వాతి రోజు రిజర్వ్ డే మ్యాచ్ కొనసాగుతుంది. కానీ రెండో సెమీఫైనల్ పరిస్థితి అలా లేదు. పటిష్ట భారత జట్టు సెమీస్ చేరవచ్చని భావిస్తున్న రెండో సెమీస్ ప్రొవిడెన్స్ (గయానా)లో జరుగుతుంది. ఇది జూన్ 27న స్థానిక కాలమానం ఉదయం గం.10:30కి (భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు) ప్రారంభమవుతుంది. టీవీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకునేభారత్లోని టీవీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకునే ఈ సమయాన్ని ఖరారు చేశారు. డే మ్యాచ్ కాబట్టి ఆ రోజంతా చాలినంత సమయం ఉంటుంది. దానిని మరుసటి రోజుకు కొనసాగించడంలో అర్థం లేదని ఐసీసీ భావించింది.పైగా జూన్ 29న ఫైనల్ కాబట్టి రెండో సెమీస్లో గెలిచిన జట్టు వరుసగా మూడో రోజులు ఆడాల్సిన స్థితి వస్తుంది. ఇది సరైంది కాదని, ఫైనల్కు ముందు ఒక రోజు ప్రయాణం ప్లస్ విరామం ఉండాలి కాబట్టి అదే రోజు ఫలితాన్ని తేల్చాలని నిర్ణయించింది.అదనపు సమయం..అయితే ‘రిజర్వ్’కు బదులుగా రెండో సెమీస్కు 250 నిమిషాల అదనపు సమయాన్ని ఇస్తారు. వర్షం లేదా ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా ఆట పూర్తిగా జరగకపోతే మరో నాలుగు గంటల పాటు వేచి చూస్తారు. అయితే ఆట జరగకపోతే నిబంధనల ప్రకారం ‘సూపర్ ఎయిట్’లో ఎక్కువ పాయింట్లు సాధించిన టీమ్ ఫైనల్ చేరుతుంది. ఏ గ్రూపులో ఏ జట్టు?👉గ్రూప్-ఏ: కెనడా, ఇండియా(ఏ1), ఐర్లాండ్, పాకిస్తాన్(ఏ2), యూఎస్ఏ👉గ్రూప్-బి: ఆస్ట్రేలియా(బీ2), ఇంగ్లండ్(బీ1), నమీబియా, ఒమన్, స్కాట్లాండ్.👉గ్రూప్-సి: అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్(సీ1), పపువా న్యూగినియా, ఉగాండా, వెస్ట్ ఇండీస్(సీ2).👉గ్రూప్-డి: బంగ్లాదేశ్, నేపాల్, నెదర్లాండ్స్, సౌతాఫ్రికా(డీ1), శ్రీలంక(డీ2).సూపర్-8కు అర్హత సాధించిన జట్లు👉ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, శ్రీలంక. కాగా జూన్ 1 నుంచి మొదలుకానున్న టీ20 వరల్డ్కప్-2024కు అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే బీసీసీఐ ఈ మెగా టోర్నీకి రోహిత్ శర్మ సారథ్యంలో 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది.చదవండి: అతడి కంటే చెత్త కెప్టెన్ ఇంకొకరు లేరు.. పైగా హార్దిక్ను అంటారా?.. గంభీర్ ఫైర్ -
కోహ్లి కాదు!.. అతడు 50 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడగలడు!
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు గత కొంతకాలంగా పొట్టి ఫార్మాట్లో ఏదీ కలిసి రావడం లేదు. టీ20 ప్రపంచకప్-2022 సెమీస్లోనే భారత జట్టు నిష్క్రమించిన తర్వాత.. సుదీర్ఘకాలం అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్నాడు హిట్మ్యాన్.ప్లే ఆఫ్స్ చేర్చినాగతేడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా బరిలోకి దిగిన రోహిత్ బ్యాటర్గా స్థాయికి తగ్గట్లు రాణించలేదు. ఈ ఓపెనింగ్ బ్యాటర్ 16 మ్యాచ్లలో కలిపి 332 పరుగులు మాత్రమే చేశాడు. ఇక జట్టును ప్లే ఆఫ్స్ చేర్చి సారథిగా సఫలమైనా.. ముంబై ఫ్రాంఛైజీ అతడిపై ఈసారి వేటు వేసింది.గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించింది. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన రోహిత్ శర్మ వచ్చే ఏడాది ఫ్రాంఛైజీని వీడేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఫోకస్ చేయలేకఇక పాండ్యా ప్రవర్తనతో విసిగిపోయిన రోహిత్ బ్యాటింగ్పై కూడా ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నాడని గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. ఐపీఎల్-2024లో ఇప్పటి దాకా 13 మ్యాచ్లు ఆడి 349 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్ తర్వాత టీమిండియా జూన్ 1నుంచి మొదలుకానున్న ప్రపంచకప్-2024కు సన్నద్ధంకానుంది. ఇందుకోసం ఇప్పటికే రోహిత్ శర్మ సారథ్యంలో బీసీసీఐ 15 మంది సభ్యులతో జట్టును ప్రకటించింది.అయితే, ఈ మెగా టోర్నీ తర్వాత 37 ఏళ్ల రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలకనున్నట్లు సమాచారం. వయసు, ఫిట్నెస్ రీత్యా రెండు ఫార్మాట్లకు కూడా గుడ్బై చెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజం కాదుఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ సింగ్ రోహిత్ శర్మ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. "అసలు వయసు గురించి ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు.40, 42.. 45 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్తో ఉండి.. బాగా ఆడుతుంటే.. ఆ ఆటగాడి రిటైర్మెంట్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మన దేశంలో చాలా మంది 40 ఏళ్ల వయసు వచ్చిందంటే.. పిల్లల పెంపకం గురించి ఆలోచిస్తూ కాలం గడిపేయాలనే ఆలోచనతో ఉంటారు. వయసు అయిపోయిందని.. ఆటకు పనికిరామని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. 50 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడగలడుటీమిండియా తొలిసారి వరల్డ్ కప్ గెలిచినపుడు మొహిందర్ అమర్నాథ్ వయసు 38 ఏళ్లు. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతడే. అసలు ఏజ్ గురించి టీమిండియాలో చర్చ అనవసరం అంటాను.రోహిత్ శర్మ, వీరేంద్ర సెహ్వాగ్ వంటి గొప్ప ప్లేయర్లు ఫిట్నెస్ గురించి పెద్దగా అవసరం లేదు. ఒకవేళ రోహిత్ ఆడాలనుకుంటే 50 ఏళ్ల వయసులోనూ క్రికెట్ ఆడగలడు" అని యోగ్రాజ్ సింగ్ అని స్పోర్ట్స్18తో చెప్పుకొచ్చాడు.కాగా ఫిట్నెస్కు మారుపేరైన విరాట్ కోహ్లి కెరీర్ సుదీర్ఘకాలం కొనసాగించగలడన్న విశ్లేషణల నేపథ్యంలో అతడి పేరు ఎత్తకుండా యోగ్రాజ్ కేవలం రోహిత్, వీరూ పేర్లు చెప్పడం విశేషం.చదవండి: T20 WC: హార్దిక్ను సెలక్ట్ చేయడం రోహిత్కు ఇష్టం లేదు.. కానీ! -
T20 WC: హార్దిక్ను సెలక్ట్ చేయడం రోహిత్కు ఇష్టం లేదు.. కానీ!
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టులో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు అవకాశం ఇవ్వడం కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్కు ఇష్టం లేదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మరి అతడిని ఏకంగా వైస్ కెప్టెన్గా ప్రకటించడానికి కారణం ఏంటి?..ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్లోకి వచ్చిన గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్యాను ఫ్రాంఛైజీ కెప్టెన్గా ప్రకటించింది. ఐదుసార్లు టైటిల్ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసి మరీ పగ్గాలు అతడికి అప్పగించింది.అయితే, పాండ్యా యాజమాన్యం అంచనాలు అందుకోలేకపోయాడు. అంతేకాదు జట్టులో సీనియర్లు అయిన రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్లతో పాండ్యాకు సఖ్యత లేనట్లు చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ రెండు వర్గాలుగా విడిపోయిందనే వార్తలు గుప్పుమన్నాయి.ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శన పేలవంగా సాగడం, ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా ముంబై నిలవడం ఇందుకు బలాన్ని చేకూర్చింది. కెప్టెన్గా విఫలమైన పాండ్యా ఆల్రౌండర్గానూ చెప్పుకోగదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు.ఇప్పటి వరకు ఆడిన 13 మ్యాచ్లలో కలిపి 144.93 స్ట్రైక్రేటుతో 200 పరుగులు స్కోరు చేయడంతో పాటు 10.59 ఎకానమీతో 11 వికెట్లు తీశాడు. అయితే, ఆరంభంలో మాత్రం వరుసగా విఫలమయ్యాడు. అయినప్పటికీ వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోగలిగాడు.ఈ నేపథ్యంలో ఫామ్లో లేకున్నా పాండ్యాకు చోటు ఇవ్వడం పట్ల బీసీసీఐ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయం గురించి ఎదురైన ప్రశ్నకు టీమిండియా ఛీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సమాధానిమిస్తూ.. తమకు అందుబాటులో ఉన్న ఆటగాళ్లలో పాండ్యా మాదిరి బ్యాటింగ్, బౌలింగ్ చేయగల సమర్థవంతమైన పేస్ ఆల్రౌండర్ లేనందు వల్లే అతడిని ఎంపిక చేసినట్లు వెల్లడించాడు.ఈ క్రమంలో దైనిక్ జాగరణ్ ఆసక్తికర కథనం వెలువరించింది. రోహిత్, అగార్కర్లకు ఇష్టం లేకపోయినా.. ఒత్తిడిలో కూరుకుపోయినందు వల్లే పాండ్యాను సెలక్ట్ చేసినట్లు తెలిపింది. అదే విధంగా.. ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలకనున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో కెప్టెన్గానూ ప్రస్తుతం ప్రత్యామ్నాయం లేనందు వల్లే వైస్ కెప్టెన్గా ప్రకటించినట్లు వెల్లడించింది. -
రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. త్వరలోనే రిటైర్మెంట్!?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. టీ20 వరల్డ్కప్-2024 తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్కు విడ్కోలు పలకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే రోహిత్ శర్మ తన నిర్ణయాన్ని బీసీసీఐకు వెల్లడించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. టీ20ల్లో భారత కెప్టెన్గా రోహిత్ శర్మ స్ధానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ఎంపిక చేయాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే హార్దిక్ను టీ20 వరల్డ్కప్-2024లో భారత జట్టు వైస్ కెప్టెన్గా సెలక్టర్లు ఎంపిక చేసినట్లు వినికిడి. అంతేకాకుండా ప్రపంచకప్కు ఎంపిక చేసిన జట్టులో హార్దిక్కు చోటు దక్కాలని సెలక్టర్లపై బీసీసీఐ ప్రత్యేక ఒత్తిడి తీసుకువచ్చినట్లు దైనిక్ జాగరణ్ తమ రిపోర్ట్లో పేర్కొంది.కాగా ఇప్పటివరకు రోహిత్ శర్మ గైర్హజరీలో టీ20ల్లో భారత జట్టును హార్దిక్ పాండ్యానే నడిపిస్తున్నాడు. రోహిత్ తర్వాత హార్దిక్ భవిష్యత్తు కెప్టెన్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ ఐపీఎల్-2024 సీజన్ తర్వాత అందరి అభిప్రాయం మారిపోయింది.ఈ ఏడాది సీజన్లో ముంబై ఇండియన్స్ నూతన కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ తన మార్క్ చూపించలేకపోయాడు. రోహిత్ శర్మను తప్పించి మరి తమ జట్టు పగ్గాలను హార్దిక్కు ముంబై ఫ్రాంచైజీ అప్పగించింది.జట్టును విజయం నడిపించడంలో హార్దిక్ విఫలమయ్యాడు. అంతేకాకుండా ముంబై డ్రెస్సింగ్ రూమ్ రెండు వర్గాలగా కూడి చీలిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది రోహిత్ శర్మ వర్గంలో ఉంటే మరి కొంతమంది పాండ్యాకు సపోర్ట్గా ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్లో కెప్టెన్గా తన మార్క్ చూపించడంలో విఫలమవుతున్న హార్దిక్.. ఒక వేళ పూర్తి స్దాయిలో భారత జట్టు పగ్గాలు చేపడితే ఏ మెరకు విజయవంతమవుతాడో చూడాలి. -
MI: ముంబై ఇండియన్స్కు గుడ్బై?.. రోహిత్ శర్మ కామెంట్స్ వైరల్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ యాజమాన్యం వ్యవహారశైలి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నాడా? వచ్చే ఏడాది అతడు జట్టును వీడనున్నాడా? హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో తనకు జరిగిన అవమానం పట్ల ఆవేదన చెందుతున్నాడా?తాను నిర్మించిన సామ్రాజ్యం నుంచి తానే బయటకు వెళ్లే సమయం వచ్చిందా? అంటే అవుననే మెజారిటీ మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రోహిత్ శర్మ- కోల్కతా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ మధ్య జరిగిన తాజా ‘సంభాషణ’కు సంబంధించిన దృశ్యాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.ఐపీఎల్-2024 కంటే ముందే కెప్టెన్గా రోహిత్ శర్మపై వేటు వేసిన ముంబై ఫ్రాంఛైజీ.. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకున్న హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. అపఖ్యాతిఅయితే, అతడి సారథ్యంలో పేలవ ప్రదర్శనతో చతికిల పడిన ముంబై ఈ సీజన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా అపఖ్యాతిని మూటగట్టుకుంది. రోహిత్, హార్దిక్లకు మద్దతుగా జట్టు రెండు వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలోనే ఈ వైఫల్యాలు ఎదురయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అదే విధంగా.. పాండ్యా వ్యవహార శైలి పట్ల గుర్రుగా ఉన్న రోహిత్ వచ్చే ఏడాది ముంబై జట్టును వీడనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ముంబై శనివారం కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ సన్నాహకాల్లో భాగంగా మైదానంలోకి వెళ్లిన రోహిత్- కేకేఆర్ కోచ్ అభిషేక్ నాయర్తో మాట్లాడినట్లుగా ఉన్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.అది నా ఇల్లు బ్రదర్ఇందులో.. ‘‘ఒక దాని తర్వాత మరొకటి మారిపోతూ ఉన్నాయి. వాళ్లే ఇందుకు కారణం. ఏదేమైనా గానీ.. అది నా ఇల్లు బ్రదర్.. నేను నిర్మించిన గుడి అది. ఇదే నాకు లాస్ట్’’ అంటూ రోహిత్ శర్మ వ్యాఖ్యానించినట్లుగా తెలుస్తోంది. దీనిని బట్టి రోహిత్ ముంబై ఫ్రాంఛైజీకి గుడ్బై చెప్పడం ఖాయమని అనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ తదుపరి కేకేఆర్లో చేరితే బాగుంటుందంటూ పాకిస్తాన్ లెజెండరీ పేసర్, గతంలో కోల్కతా ఫ్రాంఛైజీతో పనిచేసిన వసీం అక్రం పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభిషేక్ నాయర్తో హిట్మ్యాన్ సంభాషణ మరింత హైలైట్ అవుతోంది.చదవండి: KL Rahul- Sanjeev Goenka: జట్టు గెలవాలన్న తపనే అది: బ్రెట్ లీClear audio of Rohit Sharma and Abhishek Nayar's conversation, he didn't said that it's his last IPL.Please don't make any conclusions on half said words.🙏pic.twitter.com/9lbtZRQvQB— Aryan 🇮🇳 (@Iconic_Hitman) May 10, 2024... That chat. Rohit to Nayar "Ek ek cheez change ho rha hai!,, Wo unke upar hai,,, Jo bhi hai wo mera ghar hai bhai, wo temple mene banwaya hai" Last line - "Bhai mera kya mera to ye last hai" And now KKR deleted that chatting video of Rohit Sharma and Nayar#RohitSharma pic.twitter.com/4BiQzutQdH— HitMan 🖤 (@Sachin__i) May 11, 2024 -
రోహిత్ ముంబైని వీడటం ఖాయం.. ఆ తర్వాత అతడి కెప్టెన్సీలో!
ఐపీఎల్-2024లో కొత్త కెప్టెన్తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్కు చేదు అనుభవం ఎదురైంది. ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మపై వేటు వేసి.. హార్దిక్ పాండ్యాను సారథి చేసినందుకు భారీ మూల్యమే చెల్లించింది.తాజా ఎడిషన్లో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. కాగా రోహిత్ శర్మను కెప్టెన్గా తప్పించిన నాటి నుంచే అభిమానులు మేనేజ్మెంట్పై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాను మైదానం లోపల, వెలుపలా పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. అందుకు తగ్గట్లుగానే అతడు ఏమాత్రం రాణించలేకపోతున్నాడు. ఇంకో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానేపాండ్యా సారథ్యంలో ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్లలో కేవలం నాలుగు మాత్రమే గెలిచి.. ఇంకో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకొంది.ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ వాతావరణం అస్సలు బాగా లేదని.. రోహిత్, హార్దిక్లకు మద్దతుగా జట్టు రెండు వర్గాలుగా విడిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రోహిత్ శర్మ కన్నీళ్లుస్టార్ ఆటగాళ్ల మధ్య విభేదాల వల్లే ముంబై పరిస్థితి ఇలా మారిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్తో సోమవారం నాటి మ్యాచ్లో వైఫల్యం తర్వాత రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా ఉన్న వీడియో వీటికి మరింత బలం చేకూర్చింది. ఈ నేపథ్యంలో వచ్చే సీజన్లో హిట్మ్యాన్ ముంబై ఫ్రాంఛైజీని వీడనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ పేస్ లెజెండ్ వసీం అక్రం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ముంబైని వీడతాడువచ్చే ఏడాది రోహిత్ శర్మ కోల్కతా నైట్ రైడర్స్కు ఆడితే చూడాలని ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు స్పోర్ట్స్కీడాతో మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి వచ్చే ఏడాది రోహిత్ శర్మ ముంబైతో కొనసాగకపోవచ్చు.అతడు కేకేఆర్లోకి రావాలని కోరుకుంటున్నాను. అక్కడ గౌతీ(గంభీర్) మెంటార్షిప్లో.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తూ ఉంటే ఎంతో బాగుంటుంది.గొప్ప ఆటగాడుఈడెన్ గార్డెన్స్ పిచ్ మీద రోహిత్ అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. అతడొక గొప్ప ప్లేయర్. అతడు కేకేఆర్లోకి వస్తే చాలా చాలా బాగుంటుంది’’ అని వసీం అక్రం తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటికే పదకొండు మ్యాచ్లలో ఎనిమిది గెలిచి పట్టికలో అగ్రస్థానంలో ఉన్న కేకేఆర్ ప్రదర్శను ఈ సందర్భంగా కొనియాడాడు కూడా!చదవండి: SRH: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్.. ప్రపంచంలోనే తొలి టీ20 జట్టుగా.. -
T20 WC: ద్రవిడ్, రోహిత్కు నచ్చకపోవచ్చు.. కానీ నా సలహా ఇదే!
టీ20 వరల్డ్కప్-2024 నేపథ్యంలో టీమిండియా కూర్పు గురించి వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారా కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ నంబర్ వన్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ను టాపార్డర్కు ప్రమోట్ చేయాలని సూచించాడు.తన సూచన టీమిండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మకు నచ్చకపోవచ్చని.. అయితే, జట్టు ప్రయోజనాల కోసమే తాను ఈ సలహా ఇస్తున్నానని లారా పేర్కొన్నాడు. కాగా జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా ఐసీసీ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా జూన్ 5న భారత జట్టు తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఐర్లాండ్తో మ్యాచ్తో తాజా వరల్డ్కప్లో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సారథ్యంలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.ఒంటిచేత్తో జట్టును గెలిపించిఇదిలా ఉంటే.. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఐపీఎల్-2024 బరిలో దిగిన ముంబై ఇండియన్స్ స్టార్ సూర్యకుమార్ ఆరంభంలో తడబడ్డాడు. అయితే, త్వరగానే తిరిగి ఫామ్ అందుకున్న స్కై.. ఆఖరిగా సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో దుమ్ములేపాడు.నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగి 51 బంతుల్లోనే 12 ఫోర్లు, ఆరు సిక్స్ల సాయంతో 102 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. కాగా సూర్య సాధారణంగా మిడిలార్డర్లోనే బ్యాటింగ్కు వస్తాడన్న విషయం తెలిసిందే.అయితే, టీ20 ప్రపంచకప్-2022 తర్వాత వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉన్న సమయంలో మూడో స్థానంలో దిగాడు సూర్య. అలా 14 ఇన్నింగ్స్ ఆడి 479 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, నాలుగు అర్ధ శతకాలు ఉండటం విశేషం.మూడో నంబర్లోనే ఆడించాలిఇక నాలుగో స్థానంలో ఓవరాల్గా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 35 ఇన్నింగ్స్ ఆడిన సూర్య 1402 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో బ్రియన్ లారా ఆసక్తికర విశ్లేషణతో ముందుకు వచ్చాడు.‘‘టీమిండియా మేనేజ్మెంట్కు నచ్చుతుందో లేదో గానీ నా సలహా మాత్రం ఇదే. సూర్యను మూడో నంబర్లోనే బ్యాటింగ్కు పంపాలి. వన్డౌన్లోనే అతడు ఆడాలి.టాపార్డర్లో ఆడటమే సరైందిటీ20 అత్యుత్తమ ప్లేయర్లలో సూర్య ఒకడు. సర్ వివియన్ రిచర్డ్స్లాంటి వాళ్లతో మాట్లాడితే.. తాను మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయడం ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు.అలాగే స్కై కూడా టాపార్డర్లో ఆడటమే సరైందని నేను భావిస్తాను. అతడు ఎలాగూ ఓపెనర్ కాదు.. కాబట్టి కనీసం మూడో స్థానంలోనైనా పంపిస్తే బాగుంటుంది.10- 15 ఓవర్ల పాటు సూర్య క్రీజులో ఉంటే ఏం జరుగుతుందో మనకి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసినా.. లక్ష్య ఛేదనలో అయినా సూర్య వన్డౌన్లో వస్తే ప్రయోజనకరం.కోహ్లి త్యాగం చేయాలికాబట్టి కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తే బెటర్. సూర్య స్టార్ టీ20 ప్లేయర్ కాబట్టి అతడి కోసం తన స్థానం త్యాగం చేయాలి’’ అని బ్రియన్ లారా చెప్పుకొచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోహ్లి ఓపెనింగ్ చేయనున్నాడన్న వార్తల నడుమ బ్రియన్ లారా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చదవండి: SRH vs LSG: ఉప్పల్ మ్యాచ్కు వెళ్తున్న వారికి అలర్ట్! ప్రత్యేకంగా మీకోసమే.. -
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
‘‘నాకు తెలిసి అతడు పూర్తిగా అలసిపోయాడు. టీమిండియా కెప్టెన్గా, ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడిగా విరామం లేని షెడ్యూల్తో బిజీగా గడుపుతున్నాడు.అతడికి కాస్త విశ్రాంతి అవసరం. బ్రేక్ తీసుకుని తిరిగి వస్తే తిరిగి ఫామ్లోకి వచ్చే అవకాశం ఉంది. గత మ్యాచ్కు ముందు అతడు నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నపుడు గమనించాను.వెన్నునొప్పితో బాధపడుతున్నట్లుగా అనిపించింది. అతడు పూర్తి ఫిట్గా, సంతోషంగా ఉంటేనే ముంబైకి, టీమిండియాకు శుభసూచకం. విశ్రాంతి లేకుండా ఆడితే మాత్రం ఇబ్బందులు తప్పవు.నిజానికి బ్యాటింగ్ పరంగా తనకు సమస్య లేదు. బ్రేక్ మాత్రం అవసరం’’ అని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, కామెంటేటర్ మైకేల్ క్లార్క్ అన్నాడు. టీమిండియా సారథి రోహిత్ శర్మను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.అదొక్కటి తప్ప కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ ఆటగాడిగా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఆరంభంలో బాగానే ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో సునామీ సెంచరీతో విరుచుకుపడ్డాడు కూడా!కానీ గత కొంతకాలంగా రోహిత్ శర్మ ఫామ్లేమితో ఇబ్బంది పడుతున్నాడు. గత ఐదు ఐపీఎల్ మ్యాచ్లలో రోహిత్ సాధించిన పరుగులు కేవలం 33. ఇందులో నాలుగుసార్లు అతడు సింగిల్ డిజిట్ స్కోర్లు నమోదు చేశాడు.మరోసారి వైఫల్యంఇక సన్రైజర్స్తో సోమవారం నాటి మ్యాచ్లోనూ రోహిత్ వైఫల్యం కొనసాగింది. ఐదు బంతులు ఎదుర్కొని కేవలం నాలుగు పరుగులు చేసి నిష్క్రమించాడు రోహిత్. టైమింగ్ మిస్ అయి వికెట్ పారేసుకున్నాడు.అలా అయితే తిరిగి ఫామ్లోకిఈ నేపథ్యంలో మైకేల్ క్లార్క్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. రోహిత్ శర్మకు విశ్రాంతినివ్వాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశాడు. ఓవైపు టీ20 వరల్డ్కప్-2024 నేపథ్యంలో జట్టు ఎంపిక, కూర్పు, ప్రెస్మీట్లు.. మరోవైపు ముంబై ఇండియన్స్ మ్యాచ్లతో రోహిత్ అలసిపోయాడని పేర్కొన్నాడు.అందుకే కాస్త బ్రేక్ ఇస్తే తిరిగి పుంజుకోగలడని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ సీజన్లో ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఆడిన 12 మ్యాచ్లలో కలిపి 330 పరుగులు మాత్రమే చేయగలిగాడు. చదవండి: Rohit Sharma Crying Video: కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. వీడియో వైరల్ -
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
ఐపీఎల్-2024 టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు పెద్దగా కలిసి రావడం లేదు. సీజన్ ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ కెప్టెన్ పదవిని కోల్పోయిన హిట్మ్యాన్.. హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.కానీ బ్యాటర్గా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 12 ఇన్నింగ్స్లో కలిపి రోహిత్ శర్మ చేసిన పరుగులు 330. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో పదిహేడో స్థానం(మే 7 నాటికి)లో ఉన్నాడు.ఆ సెంచరీ మినహా!ఈ ఎడిషన్లో చెన్నై సూపర్ కింగ్స్ మీద సాధించిన శతకం(105 నాటౌట్) మినహా మిగతా మ్యాచ్లలో రాణించలేకపోయాడు. తాజాగా సన్రైజర్స్తో సోమవారం ముగిసిన మ్యాచ్లోనూ రోహిత్ శర్మ విఫలమయ్యాడు.భావోద్వేగానికి గురైన రోహిత్!వాంఖడే మైదానంలో ఐదు బంతులు ఎదుర్కొన్న రోహిత్.. కేవలం ఒక్క ఫోర్ కొట్టి అవుటయ్యాడు. రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఈ నేపథ్యంలో నిరాశగా మైదానం వీడిన రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లి తీవ్ర భావోద్వేగానికి గురైనట్లుగా కనిపించాడు. దుఃఖాన్ని ఆపుకొంటూ రోహిత్ కన్నీళ్లను తుడుచుకుంటున్నట్లుగా కనిపిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.పాపం రోహిత్ఈ వీడియో చూసిన రోహిత్ శర్మ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ‘‘టీ20 వరల్డ్కప్నకు ముందు నిన్నిలా చూడలేకపోతున్నాం హిట్మ్యాన్. ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ నిర్ణయం వల్లే ఇదంతా. కెప్టెన్సీ నుంచి అవమానకరంగా తప్పించి అతడిని ఒత్తిడిలోకి నెట్టేశారు.ఐదుసార్లు ట్రోఫీ అందించిన కెప్టెన్పై వేటు వేశారు. అందుకు తగిన మూల్యం చెల్లిస్తున్నారు’’ అంటూ ముంబై జట్టు మేనేజ్మెంట్పై మండిపడుతున్నారు. ఏదేమైనా రోహిత్ శర్మ వైఫల్యాలను అధిగమించి రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నారు. కాగా సన్రైజర్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా ఈ సీజన్లో నాలుగో విజయం అందుకుంది. చదవండి: ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్Rohit Sharma crying in the dressing room. pic.twitter.com/GRU5uF3fpc— Gaurav (@Melbourne__82) May 6, 2024💯 & winning runs in styleSuryakumar Yadav hits a maximum to bring up his century 👏Watch the recap on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #MIvSRH | @mipaltan pic.twitter.com/RlaOZ8l2i0— IndianPremierLeague (@IPL) May 6, 2024 -
T20 World Cup 2024: చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
టీమిండియా సారధి రోహిత్ శర్మ ప్రపంచ క్రికెట్లో ఏ ఆటగాడికి సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకోనున్నాడు. త్వరలో ప్రారంభంకాబోయే టీ20 వరల్డ్కప్కు ఎంపికైన హిట్మ్యాన్ ఇప్పటివరకు జరిగిన అన్ని ప్రపంచకప్లకు ఎంపికైన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. 2007 ఎడిషన్ నుంచి వరుసగా అన్ని ఎడిషన్లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన రోహిత్.. తొలి ప్రపంచకప్ ఛాంపియన్ జట్టైన టీమిండియాలో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఆతర్వాత 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022 ఎడిషన్లలోనూ భాగమయ్యాడు. తదుపరి ప్రపంచకప్ ఎడిషన్ హిట్మ్యాన్కు తొమ్మిదో ఎడిషన్ కానుంది. ప్రపంచ క్రికెట్లో బంగ్లా ఆల్రౌండర్ షకీబ్ ఉల్ హసన్ కూడా తొలి ఎనిమిది ఎడిషన్లలో పాల్గొన్నాడు. బంగ్లా ప్రపంచకప్ జట్టును ప్రకటించాల్సి ఉంది. రాబోయే ప్రపంచకప్లో షకీబ్ స్థానంపై అనుమానాలు నెలకొన్నాయి. వయసు పైబడిన రిత్యా అతను ప్రపంచకప్ ఆడతాడో లేదో తెలీదు. టీ20 ప్రపంచకప్లో అత్యధిక మ్యాచ్లు ఆడిన ఘనత కూడా రోహిత్ శర్మ పేరిటే ఉంది. హిట్మ్యాన్ ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 39 మ్యాచ్లు ఆడాడు. పొట్టి ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన ఘనత విరాట్ కోహ్లి.. అత్యధిక వికెట్ల రికార్డు షకీబ్ పేరిట ఉన్నాయి.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్కప్ తొమ్మిదో ఎడిషన్ ఈ ఏడాది జూన్ 1 నుంచి ప్రారంభంకానుంది. యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికలుగా ఈ టోర్నీ జరుగనుంది.తొలి మ్యాచ్ యూఎస్ఏలోని డల్లాస్ నగరంలో కొత్తగా నిర్మించిన మైదానంలో జరుగనుంది. ఈ మ్యాచ్లో ఆతిథ్య యూఎస్ఏ జట్టు.. కెనడాతో తలడనుంది.మెగా టోర్నీ భారత్ ప్రస్తానం జూన్ 5న మొదలవుతుంది. ఆ రోజు జరిగే మ్యాచ్లో టీమిండియా.. ఐర్లాండ్తో తలపడుతుంది. ప్రపంచకప్లో బిగ్ ఫైట్, దాయాదుల సమరం జూన్ 9న జరుగునుంది. ఈ మెగా సమరానికి న్యూయార్క్ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. -
రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో రోహిత్ ఇంగ్లిష్ సరిగ్గా మాట్లాడలేకపోయేవాడని.. దాంతో సరదాగా అతడిని తాము ఏడిపించేవాళ్లమని పేర్కొన్నాడు.అయితే, రోహిత్కు మాత్రం అందరితో కలిసి ఉండటం ఇష్టమని.. అతడు గొప్ప మనసున్న వ్యక్తి అంటూ యువీ కొనియాడాడు. ఈసారి రోహిత్ శర్మ కచ్చితంగా ప్రపంచకప్ సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.ఇంత వరకూ నో ఐసీసీ టైటిల్స్!టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీమిండియా సారథిగా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ ఒక్క ఐసీసీ టోర్నీలోనూ టైటిల్ అందించలేకపోయాడు. అతడి కెప్టెన్సీలో 2022 టీ20 ప్రపంచకప్లో సెమీస్లోనే ఇంటిబాట పట్టిన భారత్.. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లోనూ చేతులెత్తేసింది.ఇక సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లోనూ బోల్తాపడి తృటిలో ట్రోఫీని చేజార్చుకుంది. ద్వైపాక్షిక సిరీస్లు, ఆసియా వన్డే కప్-2023 మినహా ఒక్క మెగా ఈవెంట్లోనూ రోహిత్ సేన ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది.రోహిత్కు ఇంగ్లిష్ రాదుఈ క్రమంలో ప్రస్తుతం అందరి కళ్లు టీ20 ప్రపంచకప్-2024 మీదే ఉన్నాయి. 37 ఏళ్ల రోహిత్ శర్మ ఈసారైనా టైటిల్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా మొదలుకానున్న ఈ ఐసీసీ టోర్నీకి యువరాజ్ సింగ్ అంబాసిడర్గా ఎంపికైన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఐసీసీతో మాట్లాడుతూ యువీ రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అతడికి అసలు ఇంగ్లిష్ రాదు. ముంబైలోని బోరివలీ వీధుల నుంచి వచ్చిన వాడు. చాలా సరదాగా ఉంటాడు.ఇంగ్లిష్ విషయంలో మాత్రం అతడిని మేము ఏడిపించేవాళ్లం. భాష సంగతి పక్కనపెడితే అతడి మనసు మాత్రం వెన్న. ఎంత ఎదిగినా తన ప్రవర్తనలో ఎలాంటి మార్పూ లేదు. రోహిత్ శర్మలో గొప్ప గుణం అదే.నా బెస్ట్ ఫ్రెండ్ తాను సరదాగా ఉండటంతో పాటు చుట్టూ ఉన్న వాళ్లకు కూడా వినోదం పంచుతాడు. గొప్ప నాయకుడు. క్రికెట్ రంగంలో నాకున్న అత్యంత సన్నిహితుల్లో రోహిత్ కూడా ఒకడు.ఈసారి రోహిత్ శర్మ వరల్డ్కప్ ట్రోఫీ ఎత్తాలని.. వరల్డ్కప్ మెడల్ మెడలో వేసుకుంటే చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అతడు ఇందుకు వందకు వంద శాతం అర్హుడు’’ అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.అతడే సరైన కెప్టెన్ ఒత్తిడిలోనూ సరైన నిర్ణయాలు తీసుకోగల సత్తా ఉన్న రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్గా ఉండటం బీసీసీఐ తీసుకున్న సరైన నిర్ణయమని ఈ సందర్భంగా యువీ అన్నాడు. ఐపీఎల్లో ఐదు ట్రోఫీలు గెలిచిన రోహిత్ లాంటి వ్యక్తి టీ20 వరల్డ్కప్-2024లోనూ భారత్ను ముందుకు నడిపించడం సానుకూలాంశమని పేర్కొన్నాడు.చదవండి: ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే! -
హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
టీమిండియా భవిష్య కెప్టెన్ గురించి బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ తర్వాత భారత జట్టు సారథిగా పగ్గాలు చేపట్టగల అర్హత అతడికే ఉందంటూ ఓ ముంబైకర్ పేరు చెప్పాడు.కాగా టీ20 ప్రపంచకప్-2021 తర్వాత విరాట్ కోహ్లి స్థానంలో రోహిత్ శర్మను కెప్టెన్ను చేసింది బీసీసీఐ. హిట్మ్యాన్ సారథ్యంలో అన్ని ఫార్మాట్లలో ఏక కాలంలో నంబన్ వన్గా నిలిచిన టీమిండియా.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం సత్తా చాటలేకపోయింది.ఫైనల్ వరకూ వచ్చినా టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్లోనే నిష్క్రమించిన రోహిత్ సేన.. వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఓడి ట్రోఫీని ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. అదే విధంగా.. సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023లోనూ విజయ లాంఛనం పూర్తి చేయలేక.. ఆస్ట్రేలియా చేతిలో ఓడి ఆఖరి మెట్టుపై టైటిల్ను చేజార్చుకుంది.ఇక ఇప్పుడు మరో మెగా టోర్నీకి టీమిండియా సిద్ధమవుతోంది. పొట్టి ఫార్మాట్లో వరల్డ్కప్ ఈవెంట్కు సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రోహిత్ శర్మ నాయకత్వంలోని పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.ఇందులో మిడిలార్డర్ బ్యాటర్, క్రమశిక్షణా చర్యల నేపథ్యంలో సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్కు మాత్రం చోటు దక్కలేదు. అయితే, ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా మాత్రం అయ్యర్ దూసుకుపోతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్లలో కేకేఆర్ ఎనిమిది గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్ఎస్కే ప్రసాద్ అయ్యర్ కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలా కాదు. ‘‘హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలా కాదు.. శ్రేయస్ అయ్యర్ను టీమిండియా తదుపరి కెప్టెన్గా తీర్చిదిద్దబడ్డాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ క్రమపద్ధతిలో సారథిగా ఎదిగేందుకు బాటలు వేసుకున్నాడు.గత రెండేళ్లలో అతడి గణాంకాలు అద్బుతం. ఇక ఇండియా-ఏ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. నాకు తెలిసి ఇండియా- ఏ ఆడిన 10 సిరీస్లలో ఎనిమిది గెలిచింది. అందులో ఎక్కువసార్లు భారత జట్టును ముందుకు నడిపింది శ్రేయస్ అయ్యరే!టీమిండియా తదుపరి కెప్టెన్గా అతడు తయారుచేయబడ్డాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తర్వాత సారథిగా రిషభ్ పంత్తో శ్రేయస్ అయ్యర్ పోటీపడుతున్నాడు. పంత్ కంటే ముందే..నిజానికి పంత్ కంటే కూడా శ్రేయస్ అయ్యర్ ఒక అడుగు ముందే ఉన్నాడని చెప్పవచ్చు’’ అని రెవ్స్ట్పోర్ట్స్తో ఎంఎస్కే ప్రసాద్ వ్యాఖ్యానించాడు. అయితే, ఇదంతా గతం. బీసీసీఐతో విభేదాల నేపథ్యంలో అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడంతో ఇప్పుడు జట్టులో స్థానం గురించి పోటీ పడాల్సిన పరిస్థితి.చదవండి: ‘SRH అని ఎవరన్నారు?.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’ -
రోహిత్ శర్మ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2024లో టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ తన మార్క్ను చూపించలేకపోతుకున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా శుక్రవారం వాఖండే వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రోహిత్ నిరాశపరిచాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన హిట్మ్యన్.. కేకేఆర్ బౌలర్లను ఎదుర్కోవడానికి తీవ్రంగా కష్టపడ్డాడు.ఈ క్రమంలో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్లో ఔటయ్యాడు. కాగా ఐపీఎల్లో నరైన్ బౌలింగ్లో రోహిత్ ఔట్ కావడం ఇది ఎనిమిదో సారి.దీంతో రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే బౌలర్ చేతిలో అత్యధిక సార్లు ఔట్ అయిన బ్యాటర్గా రోహిత్ శర్మ నిలిచాడు. అంతకుముందు రోహిత్ శర్మ స్పిన్నర్ అమిత్ మిశ్రా చేతిలో కూడా 7 సార్లు ఔటయ్యాడు. రోహిత్ పాటు ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, అంబటి రాయుడు, రాబిన్ ఉతప్ప, రిషబ్ పంత్, రహానే కూడా 7 సార్లు ఒకే బౌలర్ చేతిలో ఔటయ్యాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై ఇండియన్స్పై కేకేఆర్ 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. -
రోహిత్ శర్మకు వెన్నునొప్పి.. ఆందోళనలో ఫ్యాన్స్!
కోల్కతా నైట్ రైడర్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ స్టార్, టీమిండియా కెప్టెన్ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగడం సందేహాలకు తావిచ్చింది. ఐపీఎల్-2024 ఆరంభం నుంచి ముంబై తరఫున అన్ని మ్యాచ్లలోనూ మైదానంలోకి దిగాడు హిట్మ్యాన్.అయితే, కేకేఆర్తో మ్యాచ్లో మాత్రం అతడు ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా వచ్చాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో విశ్రాంతి తీసుకున్న రోహిత్.. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్కు వచ్చాడు.కానీ ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 12 బంతులు ఎదుర్కొని ఒక సిక్స్ సాయంతో 11 పరుగులు మాత్రమే చేసి.. సునిల్ నరైన్ బౌలింగ్లో మనీశ్ పాండేకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.ఆందోళనలో అభిమానులుఈ నేపథ్యంలో రోహిత్ శర్మ ఫిట్నెస్పై సందేహాలు తలెత్తాయి. అసలే టీ20 ప్రపంచకప్-2024 ఆరంభానికి సమయం దగ్గరపడుతున్న తరుణంలో కెప్టెన్ సాబ్కు ఏమైందంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. క్లారిటీ ఇచ్చిన చావ్లాఈ క్రమంలో ముంబై ఇండియన్స్ స్పిన్నర్ పీయూశ్ చావ్లా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘‘రోహిత్ తేలికపాటి వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది’’ అని రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్గా పంపడానికి గల కారణం వెల్లడించాడు.అదే విధంగా.. ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ వరుస వైఫల్యాల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘పేరు, ప్రఖ్యాతుల కోసం బరిలోకి దిగినపుడు.. పోరాటం కొనసాగిస్తూనే ఉండాలి. ప్లే ఆఫ్స్నకు అర్హత సాధిస్తామా లేదా అన్నది పక్కనపెడితే.. జట్టు ప్రయోజనాల కోసం ఆడటమే ఆటగాళ్ల ప్రథమ కర్తవ్యం’’ అని పీయూశ్ చావ్లా చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2024లో ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్లలో ముంబై ఎనిమిది ఓడిపోయింది.ఇదిలా ఉంటే.. జూన్ 1 నుంచి మొదలుకానున్న టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు.. ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా డిప్యూటీగా వ్యవహరించనున్నాడు. ఇటు కెప్టెన్గా.. అటు ఆల్రౌండర్ పాండ్యా విఫలమవుతున్నా బీసీసీఐ అతడిపై నమ్మకం ఉంచింది. గతేడాది అక్టోబరు తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినా.. ఐసీసీ టోర్నీలో ఏకంగా వైస్ కెప్టెన్గా బాధ్యతలు అప్పగించింది. -
కేకేఆర్తో మ్యాచ్.. అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్
ఐపీఎల్-2024లో డూఆర్డై మ్యాచ్కు ముంబై ఇండియన్స్ సిద్దమైంది. శుక్రవారం (మే 3) వాంఖడే స్టేడియం వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ముంబై ప్లే ఆఫ్ రేసులో నిలబడాలంటే కచ్చితంగా ఈ మ్యాచ్లో గెలవాల్సిందే. అయితే ఈ మ్యాచ్కు ముందు ముంబై స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో రోహిత్ మరో 54 పరుగులు సాధిస్తే.. కేకేఆర్పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఓపెనర్, ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ డేవిడ్ వార్నర్ను రోహిత్ అధిగమిస్తాడు. కాగా ఇప్పటివరకు కేకేఆర్పై 32 మ్యాచ్లు ఆడిన రోహిత్.. 1040 పరుగులు చేశాడు. ఈ జాబితాలో వార్నర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. ఇప్పటివరకు కేకేఆర్పై 32 మ్యాచ్లు ఆడిన వార్నర్.. 1093 పరుగులు చేశాడు. అదే విధంగా హిట్మ్యాన్ ఈ మ్యాచ్లో మరో 39 పరుగులు చేస్తే.. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలుస్తాడు.ఈ జాబితాలో రోహిత్ ప్రస్తుతం 6526 పరుగులతో నాలుగో స్ధానంలో ఉన్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ ఐపీఎల్లో ఇప్పటివరకు 6564 పరుగులు చేశాడు. -
WC: ఒకవేళ రోహిత్ దూరమైతే: భారత మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్
టీ20 ప్రపంచకప్-2024 నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా నైపుణ్యాలపై సందేహాలు అక్కర్లేదని.. కెప్టెన్గానూ జట్టును ముందుకు నడిపించగల సత్తా అతడికి ఉందని పేర్కొన్నాడు.ఒకవేళ రోహిత్ శర్మ ఏదేని కారణాల చేత ఐసీసీ టోర్నీ మ్యాచ్లకు దూరమైతే.. సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని పాండ్యాకు సూచించాడు. ఐపీఎల్ వైఫల్యాలు మరిచి వరల్డ్కప్నకు రెడీగా ఉండాలని ఓజా చెప్పుకొచ్చాడు.కాగా వన్డే వరల్డ్కప్-2023లో బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. అప్పటి నుంచి భారత జట్టుకు దూరమయ్యాడు. చీలమండ గాయం నుంచి కోలుకుని ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఐపీఎల్-2024 బరిలో దిగాడు.అయితే, ఆశించిన స్థాయిలో రాణించకపోలేతున్న పాండ్యా కెప్టెన్గా, ఆటగాడిగా విఫలమవుతున్నాడు. అతడి సారథ్యంలో ముంబై ఇప్పటి వరకు పది మ్యాచ్లు ఆడి కేవలం మూడే గెలిచిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ జట్టులో అతడికి స్థానమే ఇవ్వకూడదనే డిమాండ్లు వినిపించాయి. అయితే, బీసీసీఐ మాత్రం మెగా ఈవెంట్లో ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మకు డిప్యూటీగా హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది.ఈ క్రమంలో భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘అతడు నిజమైన నాయకుడిగా బరిలోకి దిగాలని నేను కోరుకుంటున్నా. ఒకవేళ రోహిత్కు ఏమైనా జరిగితే.. అలా జరగాలని మనం కోరుకోము.కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అతడు జట్టు దూరమైతే హార్దిక్ పాండ్యానే జట్టును ముందుకు నడిపించాలి కదా. కాబట్టి హార్దిక్ అందుకు అన్ని వేళలా సన్నద్ధంగా ఉండాలి.బ్యాటర్గానూ మరింత బాధ్యతాయుతంగా ఆడాలి. నిజానికి అతడు ఉంటేనే జట్టు సమతూకంగా ఉంటుంది. టీమిండియా సెలక్షన్ గురించి ఎవరు మాట్లాడినా తొలుత హార్దిక్ పేరే గుర్తుకువస్తుంది.అవసరమైన వేళ అదనపు బ్యాటర్గా.. బౌలర్గా తను సేవలు అందించగలడు. ఐపీఎల్లో ఏం జరుగుతుందన్న విషయం గురించి పక్కనపెట్టి వరల్డ్కప్ పైన శ్రద్ధ పెట్టాలి. అవసరమైతే కెప్టెన్గానూ జట్టును ముందుకు నడిపించడానికి హార్దిక్ పాండ్యా సన్నద్ధంగా ఉండాలి’’ అని సూచించాడు.కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న టీ20 ప్రపంచకప్ టోర్నీ జూన్ 1న మొదలుకానుంది. టీమిండియా జూన్ ఐదున తమ తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడుతుంది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
మహిళా చైతన్యంపై కక్ష కట్టిన చంద్రబాబు
యాదాద్రికి పోటెత్తిన భక్త జనం (ఫోటోలు)
నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
పరారీలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
'బేబి' హీరో ఇంతలా మారిపోయాడేంటి? ఏకంగా అలా..
యశ్ దయాల్పై కోహ్లి ఫైర్.. దెబ్బకు ధోని ఖేల్ ఖతం!
భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా?
మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
టీడీపీపై బొత్స సెటైర్లు
తప్పక చదవండి
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement