-
CSK Vs GT: చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. సచిన్ రికార్డు బద్దలు
గుజరాత్ టైటన్స్ యువ సంచలనం సాయి సుదర్శన్ తొలి ఐపీఎల్ సెంచరీ నమోదు చేశాడు. ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో సాయిసుదర్శన్ సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన సుదర్శన్ సీఎస్కే బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 51 బంతుల్లోనే 7 సిక్స్ లు, ఆరు ఫోర్లతో 103 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ శుబ్మన్ గిల్తో కలిసి స్కోర్ను బోర్డును పరుగులు పెట్టించాడు. గిల్, సుదర్శన్ కలిసి తొలి వికెట్ కు 210 పరుగుల రికార్డు ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. గిల్(104) కూడా సెంచరీ చేశాడు.సచిన్ రికార్డు బద్దలు..ఇక మ్యాచ్లో సుదర్శన్ సెంచరీతో పాటు.. ఐపీఎల్లో 1000 పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. తద్వారా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన భారత ఆటగాడిగా సుదర్శన్ నిలిచాడు.సాయి సుదర్శన్ మాత్రం కేవలం 25 ఇన్నింగ్స్ లోనే ఈ రికార్డును చేరుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, రుతురాజ్ గైక్వాడ్ పేరిట సంయుక్తంగా ఉండేది.సచిన్, గైక్వాడ్ ఇద్దరూ 1000 పరుగుల మైలు రాయిని 31 ఇన్నింగ్స్లలో అందుకున్నాడు. అయితే తాజా మ్యాచ్తో వీరిద్దరి ఆల్టైమ్ రికార్డును సుదర్శన్ బద్దలు కొట్టాడు.ఓవరాల్గా ఐపీఎల్లో అత్యంత వేగంగా 1000 పరుగుల మైల్స్టోన్ను అందుకున్న మూడో క్రికెటర్గా సుదర్శన్ నిలిచాడు. ఈ జాబితాలో ఆసీస్ మాజీ క్రికెటర్ షాన్ మార్ష్ (21) తొలి స్ధానంలో ఉండగా.. ఆ తర్వాత విండీస్ ఆటగాడు లెండిల్ సిమన్స్(23) సిమ్మన్స్ ఉన్నాడు. -
HBD Sachin: రికార్డులకు కవల సోదరుడు.. ఈ విషయాలు తెలుసా?
రికార్డులు- అతడు కవల పిల్లల్లాంటివాళ్లు. 1990వ దశకంలో భారత క్రికెట్ ఎదుగుదలతో పాటే అతడూ ఎదిగాడు. కోట్లాది మందికి ఆదర్శమూర్తి అయ్యాడు. పాత రికార్డులు బద్దలుకొడుతూ.. సరికొత్త రికార్డులు సృష్టిస్తూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ఆటతోనే కాదు అందమైన వ్యక్తిత్వంతోనూ సౌమ్యుడిగా పేరొంది వర్ధమాన క్రికెటర్లకు ఆరాధ్యదైవంగా మారాడు.దాదాపు రెండు దశాబ్దాల పాటు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన మకుటం లేని మహరాజుగా వెలుగొందిన ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండుల్కర్ ‘హాఫ్ సెంచరీ’ పూర్తి చేసుకుని నేడు(ఏప్రిల్ 24) 51వ పడిలో అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా... అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు కొట్టిన ఏకైక బ్యాటర్గా కొనసాగుతున్న ఈ టీమిండియా దిగ్గజం గురించి కొన్ని ఆసక్తికర అంశాలు మీకోసం..అత్యధిక పరుగుల వీరుడుఅంతర్జాతీయ క్రికెట్లో వన్డే, టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుడిగా సచిన్ టెండుల్కర్ కొనసాగుతున్నాడు. వన్డేల్లో 18,426, టెస్టుల్లో 15,921 రన్స్ సాధించాడు.ఓవరాల్గా సచిన్ ఇంటర్నేషనల్ క్రికెట్లో 34,357 రన్స్ స్కోరు చేశాడు. ఇక పరుగుల రికార్డుల్లో వన్డేల్లో సచిన్ తర్వాత కుమార్ సంగక్కర 14, 234 రన్స్తో రెండో స్థానంలో ఉండగా.. టెస్టుల్లో యాక్టివ్ ప్లేయర్లలో జో రూట్ 11,736 రన్స్తో ఉన్నాడు. అత్యధిక సెంచరీలు1998లొ.. సెప్టెంబరు 26న బులావయోలో జింబాబ్వేతో వన్డే మ్యాచ్లో 127 పరుగులు సాధించిన సచిన్.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. యాభై ఓవర్ల ఫార్మాట్లో సచిన్కు ఇది 18వ శతకం. తద్వారా డెస్మాండ్ హైన్స్ పేరిట ఉన్న రికార్డు బ్రేక్ చేసిన సచిన్.. ఓవరాల్గా వన్డేల్లో 49 సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక 2005, డిసెంబరులో ఢిల్లీ వేదికగా శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా టెండుల్కర్ టెస్టుల్లో 34వ శతకం సాధించి సునిల్ గావస్కర్ రికార్డు బద్దలు కొట్టాడు. ఆ తర్వాత తన కెరీర్ మొత్తంలో ఓవరాల్గా 51 టెస్టు సెంచరీలు సాధించి.. ఇప్పటికీ ఆ రికార్డును తన పేరిట పదిలంగా పెట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ మొత్తంగా వంద సెంచరీలు సాధించగా.. విరాట్ కోహ్లి 80 శతకాలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.బెస్ట్ అగైనెస్ట్ వెరీ బెస్ట్ప్రపంచ క్రికెట్ను శాసించిన ఆస్ట్రేలియా మీద వన్డే, టెస్టుల్లో సచిన్ టెండుల్కర్ మెరుగైన రికార్డులు సాధించాడు. 1992లో వన్డేల్లో రెండు సెంచరీలు.. 1998లో చెన్నై టెస్టులో 155 పరుగులతో దుమ్ములేపాడు. The Sachin Tendulkar masterclass at Sharjah. 💥pic.twitter.com/3NKRE9z2xl— Mufaddal Vohra (@mufaddal_vohra) April 24, 2024ఆస్ట్రేలియాతో 39 టెస్టుల్లో భాగమైన సచిన్ 3630, వన్డేల్లో 70 ఇన్నింగ్స్లో 3077 పరుగులు సాధించాడు. ఓవరాల్గా ఆస్ట్రేలియా మీద 20 శతకాలు బాది.. ఒకే ప్రత్యర్థి మీద ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాటర్గా కొనసాగుతున్నాడు.క్యాలెండర్ ఇయర్లో..టెస్టు క్రికెట్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధికసార్లు వెయ్యికిపైగా రన్స్ సాధించిన బ్యాటర్గా సచిన్కు వరల్డ్ రికార్డు ఉంది. 1997, 1999, 2001, 2002, 2008, 2010లో సచిన్ ఈ ఫీట్ నమోదు చేశాడు. On his 51st birthday, sit back and enjoy some Sachin Tendulkar goodness! ⭐️ pic.twitter.com/nMRpzEBK5X— cricket.com.au (@cricketcomau) April 24, 2024సచిన్ తర్వాత బ్రియన్ లారా, మాథ్యూ హెడెన్, అలిస్టర్ కుక్, కుమార్ సంగక్కర, జాక్వెస్ కలిస్, రిక్కీ పాంటింగ్ ఐదేసిసార్లు ఈ ఫీట్ నమోదు చేసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. వన్డేల్లోనూ ఈ ఘనత సచిన్ పేరిట(7 సార్లు) ఉండేది. అయితే, విరాట్ కోహ్లి(8 సార్లు) ఈ రికార్డును బ్రేక్ చేశాడు.నాటి ఐసీసీ టోర్నీలో..1996 వరల్డ్కప్, 2003 ప్రపంచకప్ టోర్నీల్లో సచిన్ అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. 2011లో భారత్ వేదికగా టీమిండియా వన్డే వరల్డ్కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఓవరాల్గా ఐసీసీ టోర్నీల్లో ఆరు శతకాల సాయంతో 2278 పరుగులు సాధించి.. అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా సచిన్ కొనసాగుతున్నాడు.అలా మొదలుపెట్టి.. 201 వికెట్లు కూడా1989లో పాకిస్తాన్తో టెస్టుతో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సచిన్ టెండుల్కర్.. 2006లో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్ తర్వాత ఆటకు వీడ్కోలు పలికాడు. ఓవరాల్గా 664 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి 34,357 పరుగులు సాధించాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్. అంతేకాదు.. ఈ రైటార్మ్ లెగ్ బ్రేక్ స్పిన్నర్ 201 వికెట్లు కూడా పడగొట్టాడు. 2013లో తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడి.. రిటైర్ అయ్యాడు.చదవండి: మొన్న రోహిత్.. ఇప్పుడు అక్షర్.. ఎందుకిలా? ఆ రూల్ వల్ల ఎవరికి నష్టం? -
ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న మొదటి భారత క్రికెటర్ ఎవరో తెలుసా?
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ఆరంభం కానుంది. తొలి మ్యాచ్లో చెపాక్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇక క్యాష్ రిచ్ లీగ్ కోసం అన్ని ఫ్రాంచైజీల ఆటగాళ్లు ఒకొక్కరిగా జట్టుతో కలుస్తున్నారు. 17వ సీజన్ కోసం ఆటగాళ్లు తమ ప్రీ ట్రైనింగ్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా ఈ క్యాష్ రిచ్ లీగ్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఆరెంజ్ క్యాప్ను బహుకరించడం అనావాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే ఈ క్యాప్తో పాటు ప్రైజ్ మనీని కూడా అందజేస్తారు. అయితే ఈ ధనాధన్ లీగ్లో ఆరెంజ్ క్యాప్ను అందుకున్న తొలి భారత క్రికెటర్ ఎవరో తెలుసా? మీరు ఆలోచించండి? మీకు సమాధానం తెలియకపోతే మేమే చెప్పేస్తాం. ఆరెంజ్ క్యాప్ను గెలుచుకున్న మొట్టి మొదటి భారత ఆటగాడు ఎవరో కాదు టీమిండియా క్రికెట్ దిగ్గజం, ముంబై ఇండియన్స్ మాజీ సారథి సచిన్ టెండూల్కర్. 2010 సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున సచిన్ ఆరెంజ్ క్యాప్ను సొంతం చేసుకున్నాడు. ఆ సీజన్లో మాస్టర్ బ్లాస్టర్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. 618 పరుగులతో లీగ్ టాప్ స్కోరర్గా నిలిచాడు. దీంతో అతడికి ఆరెంజ్ క్యాప్ దక్కింది. ఇక సచిన్ తర్వాత ఆరెంజ్ క్యాప్ను గెలుచుకున్న రెండో ఇండియన్ రాబిన్ ఉతప్ప. 2014 సీజన్లో కోల్కతాకు ప్రాతినిథ్యం వహించిన ఉతప్ప.. 660 పరుగులతో ఆరెంజ్క్యాప్ను సొంతం చేసుకున్నాడు. మరి ఈసారి ఎవరు ఆరెంజ్క్యాప్ను గెలుచుకుంటారో వేచి చూడాలి. -
రోహిత్ అరుదైన ఘనత.. గేల్ ఆల్టైమ్ రికార్డు బద్దలు! తర్వాత సచినే
ధర్మశాల వేదికగా ఇంగ్లండ్తో జరుగుతున్న ఐదో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్లో 13 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 154 బంతుల్లో తన 12వ టెస్టు సెంచరీ మార్కు అందుకున్నాడు. ఓవరాల్గా ఇది 48 అంతర్జాతీయ టెస్టు సెంచరీ కావడం విశేషం. మొత్తంగా 162 బంతుల్లో 103 పరుగులు చేసిన హిట్మ్యాన్.. స్టోక్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. కాగా శుబ్మన్ గిల్తో కలిసి రెండో వికెట్కు 160 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో అదరగొట్టిన రోహిత్ శర్మ పలు అరుదైన ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్ సాధించిన రికార్డులు ఇవే.. ►అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో భారత ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఈ క్రమంలో భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(48) రికార్డును రోహిత్ సమం చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్(100) తొలి స్దానంలో ఉండగా.. కోహ్లి(80) రెండో స్ధానంలో కొనసాగుతున్నాడు. ►అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో ఓపెనర్గా హిట్మ్యాన్ నిలిచాడు. రోహిత్కు ఇది ఓపెనర్గా 43వ సెంచరీ. ఈ క్రమంలో క్రిస్ గేల్(42) రోహిత్ అధిగమించాడు. ఈ లిస్ట్లో డేవిడ్ వార్నర్(49) అగ్రస్ధానంలో ఉన్నాడు. ►అదే విధంగా టెస్టుల్లో ఇంగ్లండ్పై అత్యధిక సెంచరీలు చేసిన టీమిండియా ఓపెనర్గా సునీల్ గవాస్కర్ రికార్డును రోహిత్ సమం చేశాడు. గవాస్కర్ ఓపెనర్గా ఇంగ్లండ్పై 4 సెంచరీలు చేయగా.. హిట్మ్యాన్ సైతం 4 సెంచరీలు చేశాడు. ►ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానానికి ఎగబాకాడు. ఇప్పటివరకు డబ్ల్యూటీసీ చరిత్రలో 9 సెంచరీలు సాధించాడు. ►30 ఏళ్ల వయస్సు తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా సచిన్ టెండూల్కర్(35) రికార్డును సైతం రోహిత్ బ్రేక్ చేశాడు. 30 ఏళ్ల వయస్సు తర్వాత సచిన్ 35 సెంచరీలు చేయగా.. రోహిత్ సైతం 35 సెంచరీలు చేశాడు. మరోసెంచరీ చేస్తే సచిన్ రికార్డును రోహిత్ బ్రేక్ చేస్తాడు. Of hundreds and celebrations! 👏 🙌 Rohit Sharma 🤝 Shubman Gill Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @ImRo45 | @ShubmanGill | @IDFCFIRSTBank pic.twitter.com/yTZQ4dAoEe — BCCI (@BCCI) March 8, 2024 -
బిగ్బాస్ విన్నర్ చేతిలో ఔటైన సచిన్ టెండూల్కర్.. వీడియో వైరల్
థానే వేదికగా ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్పీఎల్) తొట్టతొలి ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. అయితే ఈ లీగ్ ప్రారంభ వేడుకలలో సెలబ్రిటీలు, క్రికెటర్లు సందడి చేశారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, మెగా పపర్ స్టార్ రాంచరణ్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, తమిళ నటుడు సూర్య, భారత మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి, సురేష్ రైనా ఈ వేడుకల్లో భాగమయ్యారు. అయితే ఈ సెలబ్రేషన్స్లో భాగంగా నిర్వహకులు ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ను నిర్వహించారు. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని టీమ్ మాస్టర్స్ ఎలెవన్ జట్టు.. అక్షయ్ కుమార్ నేతృత్వంలోని టీమ్ ఖిలాడీతో జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్లో సచిన్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో విరుచుపడుతూ అభిమానులను అలరించాడు. కేవలం 16 బంతుల్లోనే 30 పరుగులు చేసిన మంచి ఊపు మీద కన్పించిన సచిన్.. స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్ బాస్ విన్నర్ మునావర్ ఫారుఖీ బౌలింగ్లో ఔటయ్యాడు. ఫరూఖీ వేసిన ఐదో ఓవర్లో తొలి బంతికి భారీ షాట్ ఆడబోయిన సచిన్.. మరో భారత మాజీ క్రికెటర్ నమన్ ఓజా చేతికి చిక్కాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఐఎస్పీఎల్ క్రికెట్ టోర్నీ విషయానికి వస్తే.. ఇది టీ10 ఫార్మాట్లో టెన్నిస్ బాల్తో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా, శ్రీనగర్ జట్లు పోటీ పడుతున్నాయి. రామ్చరణ్ ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కొనుగోలు చేయగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మఝీ ముంబైను.. అక్షయ్ కుమార్ శ్రీనగర్ వీర్ను.. హృతిక్ రోషన్ బెంగళూరు స్ట్రయికర్స్ను.. సైఫ్ అలీ ఖాన్-కరీనా కపూర్ టైగర్స్ ఆఫ్ కోల్కతాను.. తమిళ సూపర్ స్టార్ సూర్య చెన్నై సింగమ్స్ జట్లను కొనుగోలు చేశారు. .@ispl_t10 is poised to amaze us all, much like Munawar did by dismissing the 𝐌𝐚𝐬𝐭𝐞𝐫 𝐁𝐥𝐚𝐬𝐭𝐞𝐫 👀 🤯 #SonySportsNetwork #ispl #isplt10 #Street2Stadium #ZindagiBadalLo pic.twitter.com/801LO25ilh — Sony Sports Network (@SonySportsNetwk) March 6, 2024 -
క్రికెట్ దేవుడే దిగి వస్తే...
కశ్మీర్కు చెందిన పారా క్రికెటర్ అమిర్ హుసేన్ జీవితం వెలిగింది. రెండు చేతులూ లేకపోయినా మెడతో బ్యాట్ పట్టి ఆడే అమిర్ తనను ఇన్స్పయిర్ చేసిన క్రికెట్ దేవుడు సచిన్ని జీవితంలో కలుస్తాననుకోలేదు. కలిశాడు. అంతేనా? సచిన్ నుంచి ఊహించని బహుమతి అందుకున్నాడు. ఈ వివరం ఏమిటంటే... సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలి, కుమార్తె సారాతో కశ్మీర్ పర్యటనలో ఉన్నాడు. ఇది అతని తొలి కశ్మీర్ పర్యటన అని భోగట్టా. అక్కడి ‘చార్సో’ అనే ఊళ్లో ఉండే బ్యాట్ల తయారీ కేంద్రాన్ని సచిన్ సందర్శించాడు. అంతే కాదు... అక్కడి ‘బిజ్బెహరా’ ్రపాంతానికి చెందిన పారా క్రికెటర్ అమిర్ హుసేన్ను తన హోటల్కు పిలిపించుకుని ప్రత్యేకంగా కలిశాడు. అమిర్ హుసేన్ ప్రస్తుతం కశ్మీర్ పారా క్రికెట్ టీమ్ కెప్టెన్గా ఉన్నాడు. పుట్టుకతో చేతులు లేని అమిర్ తన జీవితంలో పేర్కొన్న నిరాశను సచిన్ను చూసి ఇన్స్పయిర్ అయి క్రికెటర్ కావడంతో పోగొట్టుకున్నాడు. బ్యాట్ను మెడ, భుజాల మధ్య పట్టి అతను క్రికెట్ ఆడతాడు. ఈ స్ఫూర్తిమంతమైన గాధను విన్న సచిన్ తన పర్యటన సందర్భంగా అమిర్ హుసేన్ను కలిశాడు. ‘నిన్ను కలవడం సంతోషం’ అని ‘ఎక్స్’లో తానే పోస్ట్ పెట్టాడు. సచిన్ని చూడగానే ఇలాంటిది తన జీవితంలో జరిగిందా అన్నట్టుగా భావోద్వేగంతో కదిలిపోయాడు అమిర్. ‘ఇలాగే నువ్వు మమ్మల్ని ఇన్స్పయిర్ చేయి’ అని అమిర్తో సచిన్ చె΄్పాడు. అంతేనా? తను సంతకం చేసిన బ్యాట్ ఇచ్చి అమిర్ని తబ్బిబ్బు చేశాడు. -
గల్లీ క్రికెట్ ఆడిన సచిన్.. వీడియో వైరల్
టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం తన తొలి కాశ్మీర్ పర్యటనలో బీజీబీజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా అక్కడ ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సచిన్ తన కుటుంబంతో కలిసి చుట్టేస్తున్నారు. ఈ పర్యటనలో సచిన్ మరోసారి బ్యాట్ పట్టి సందడి చేశాడు. గుల్మార్గ్లో స్థానికులతో కలిసి మాస్టర్ బ్లాస్టర్ గల్లీ క్రికెట్ ఆడాడు. రోడ్డుపై స్ధానిక యువకులతో కలిసి క్రికెట్ ఆడూతూ సచిన్ ఎంజాయ్ చేశాడు. అక్కడ వారితో ఫోటోలు కూడా క్రికెట్ గాడ్ దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సచిన్ ఎక్స్లో షేర్ చేశాడు. ఆ వీడియోకు క్యాప్షన్గా "క్రికెట్ అండ్ కాశ్మీర్.. స్వర్గంలో మ్యాచ్" అంటూ రాసుకొచ్చాడు. కాగా బుధవారం సచిన్ బుధవారం చాలా ప్రాంతాలను సందర్శించాడు. అక్కడ విల్లో క్రికెట్ బ్యాట్ల తయారీ కేంద్రాన్ని లిటిల్ మాస్టర్ విజిట్ చేశాడు. అదే విధంగా ఉరీ సెక్టార్లోని నియంత్రణ రేఖపై చివరి పాయింట్ అమన్ సేతు వంతెనను కూడా సందర్శించాడు. ఈ సందర్భంగా అమన్ సేతు సమీపంలోని కమాన్ పోస్ట్ వద్ద సైనికులతో సచిన్ ముచ్చటించాడు. Cricket & Kashmir: A MATCH in HEAVEN! pic.twitter.com/rAG9z5tkJV — Sachin Tendulkar (@sachin_rt) February 22, 2024 -
ఈ సెలబ్రిటీల పెట్టుబడులు ఎక్కడో తెలుసా?
చదువవగానే లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగానికే స్థిరపడకుండా సొంతంగా ఓ పరిశ్రమ పెట్టాలనుకోవడం ఇప్పుడు ట్రెండ్ అయింది. కొత్తగా పరిశ్రమ స్థాపించాలనే వారి కలలకు పారిశ్రామిక రంగం దన్నుగా నిలుస్తోంది. దాంతో, ప్రపంచంలో స్టార్టప్ అనుకూల వాతావరణం ఉన్న దేశాల్లో మన దేశం మూడోస్థానంలో ఉంది. ఇక్కడ దాదాపు 1,16,000 గుర్తింపు పొందిన అంకుర పరిశ్రమలు ఉన్నాయి. దేశంలో లక్షకు పైగా ఉన్న అంకుర పరిశ్రమలు 56 విభిన్న విభాగాల్లో రకరకాల సమస్యలకు పరిష్కారాలు సూచిస్తున్నాయి. ప్రత్యేకించి టెక్ స్టార్టప్స్లో అమెరికా, చైనాల తర్వాత మూడో స్థానం మనదే. నాస్కామ్ నివేదిక ప్రకారం 27 వేలదాకా చురుగ్గా పనిచేస్తున్న టెక్ స్టార్టప్స్ ఉన్నాయిక్కడ. యువతరం ఎంతో ఇష్టంగా ఈ రంగంలోకి వస్తోంది. పెట్టుబడిదారులు పెరిగారు, ఇంక్యుబేటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఫలానా ఉత్పత్తులకు భవిష్యత్తులో మంచి ఆదరణ లభిస్తుందనే కంపెనీల్లో సెలబ్రిటీలు సైతం మదుపు చేసి కోట్లు గడిస్తున్నారు. వీరు ఇన్వెస్ట్ చేసిన కొన్ని కంపెనీలు యూనికార్న్లుగా ఎదుగుతున్నాయి. ఇదీ చదవండి: రూ.12 వేలకోట్ల సంగీత సామ్రాజ్యం.. టాప్ 10లో 7 మన పాటలే! సెలబ్రిటీలు ఇన్వెస్ట్ చేసిన స్టార్టప్లు.. శిఖర్ధావన్: అప్స్టాక్స్, ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్. నవంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. సచిన్ తెందూల్కర్: స్పిన్నీ, కార్లు సెల్లింగ్ కంపెనీ. నవంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. శ్రద్ధాకపూర్: మైగ్లామ్, నేచురల్ బ్యూటీ కంపెనీ. నవంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. విరాట్కోహ్లీ: ఎంపీఎల్, ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్. సెప్టెంబర్ 2021లో పెట్టుబడి పెట్టారు. అనుష్కశర్మ: డిజిట్ ఇన్సూరెన్స్, ఆన్లైన్ ఇన్సూరెన్స్ ఫ్లాట్ఫామ్. జనవరి 2021లో పెట్టుబడి పెట్టారు. ఎంఎస్ ధోని: కార్స్24, ఆన్లైన్ కార్స్ సెల్లింగ్ ప్లాట్ఫామ్. నవంబర్ 2020లో పెట్టుబడి పెట్టారు. -
చరిత్ర సృష్టించిన బంగ్లా ఓపెనర్.. సచిన్ ఆల్టైమ్ రికార్డు బద్దలు
నెల్సన్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన రెండో వన్డేలో బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. గత రెండేళ్లుగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సర్కార్.. ఎట్టకేలకు తన బ్యాట్ను ఝుళిపించాడు. ఈ మ్యాచ్లో 151 బంతులు ఎదుర్కొన్న సర్కార్.. 22 ఫోర్లు, 2 సిక్స్లతో 169 పరుగులు చేశాడు. అతడి వన్డే కెరీర్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన రెండో బంగ్లా క్రికెటర్గా సర్కార్ నిలిచాడు. ఈ జాబితాలో లిట్టన్ దాస్(176) అగ్రస్ధానంలో ఉన్నాడు. సచిన్ రికార్డు బ్రేక్.. ఇక ఈ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన సర్కార్ మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. న్యూజిలాండ్ గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆసియా క్రికెటర్గా సర్కార్ రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 2009లో క్రైస్ట్ చర్చ్ వేదికగా కివీస్తో జరిగిన మ్యాచ్లో సచిన్ 163 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. అయితే తాజా మ్యాచ్తో సర్కార్ 14 ఏళ్ల మాస్టర్బ్లాస్టర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాపై 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలూండగానే 2-0 తేడాతో కివీస్ సొంతం చేసుకుంది. 292 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్లాక్క్యాప్స్ 3 వికెట్లు కోల్పోయి 46.2 ఓవర్లలో ఛేదించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో విల్ యంగ్(89), నికోల్స్(95) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన బంగ్లా.. 49. 5 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బ్యాటర్లలో సౌమ్యా సర్కార్(169) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ, విలియం రోర్కే తలా మూడు వికెట్లు పడగొట్టాడు. వీరితో పాటు మిల్నే, క్లార్క్సన్, ఆశోక్ చెరో వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే డిసెంబర్ 23న నేపియర్ వేదికగా జరగనుంది. -
'రికార్డులు ఉన్నదే బద్దలు కొట్టడానికి'.. రాజమౌళి ట్వీట్ వైరల్!
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. కింగ్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో సెంచరీ చేయడంపై ఆయన ట్వీట్ చేశారు. రికార్డులు ఉన్నదే బద్దలు కొట్టడానికి అంటూ కోహ్లీని ఆకాశానికెత్తేశాడు. ఈ మ్యాచ్లో సెంచరీ చేయడంతో పాటు.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సెంచరీల రికార్డ్ను తుడిచిపెట్టేశాడు. (ఇది చదవండి: ఎయిర్పోర్ట్లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి.. వీడియో వైరల్!) రాజమౌళి తన ట్వీట్లో రాస్తూ..'రికార్డులు ఉన్నదే బద్దలు కొట్టాడానికి. కానీ కానీ సచిన్ రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు అతని రికార్డును బద్దలు కొట్టాలని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. కానీ మన కింగ్ కోహ్లీ కొట్టేశాడు.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మహేశ్ బాబుతో సినిమాను తెరకెక్కించనున్నారు. వచ్చే ఏడాదిలో దీనిపై ప్రకటన వచ్చే అవకాశముంది. Records are meant to be broken, but no one in their wildest dreams dreamt of breaking Sachin's record when he announced his retirement. And the KING emerged. 🔥🔥 KOHLI 🙏🏻🙏🏻 — rajamouli ss (@ssrajamouli) November 15, 2023 -
మోదీకి టీమిండియా జెర్సీని బహూకరించిన సచిన్.. వీడియో వైరల్
వారణాసి: భారత్లో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి రానుంది. ఉత్తరప్రదేశ్లోని తన పార్లమెంట్ నియోజకవర్గం వారణాసిలో నూతన క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ స్టేడియం నిర్మాణం కోసం 31 ఎకరాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.121 కోట్లకు కొనుగోలు చేసింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ స్టేడియం నిర్మాణానికి రూ. 330 కోట్లు వెచ్చించనుంది. రింగ్రోడ్ సమీపంలోని రాజాతలాబ్ ప్రాంతంలో ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేయనున్నారు. 2025 డిసెంబర్కల్లా ఈ స్టేడియం పూర్తవుతుంది. ఉత్తరప్రదేశ్లో ఇది మూడో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం కానుంది. ఇప్పటికే కాన్పూర్, లక్నోలలో ఒక్కో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉంది. శనివారం జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి భారత క్రికెట్ ప్రముఖులందరూ హాజరయ్యారు. సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, దిలీప్ వెంగ్సర్కార్, రవిశాస్త్రి, బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోదీకి టీమిండియా జెర్సీ బహుకరించిన సచిన్ ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సచిన్ టెండూల్కర్ భారత జట్టు జెర్సీ అందజేశారు. సచిన్ బహుకరించిన జెర్సీపై నమో అని రాసి ఉంది. అదే విధంగా బీసీసీఐ రోజర్ బిన్నీ, జై షా భారత జట్టు క్రికెట్ సభ్యులు సంతకాలు చేసిన బ్యాట్ను ప్రధానికి ప్రదానం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. భారత జట్టులో కీలక మార్పు! యువ పేసర్ ఎంట్రీ Sachin Tendulkar Presented Indian cricket team jersey - written "Nammo" in back to PM Narendra Modi.pic.twitter.com/JqHtR2Ylu4 — Johns. (@CricCrazyJohns) September 23, 2023 -
సచిన్కు ‘గోల్డెన్ టికెట్’
ముంబై: భారత్లో జరిగే వన్డే వరల్డ్ కప్ ప్రత్యేక అతిథులుగా ఎంపిక చేసిన కొందరు ప్రముఖులకు బీసీసీఐ వరుసగా ‘గోల్డెన్ టికెట్’ ఇచ్చి మ్యాచ్లకు ఆహ్వానిస్తోంది. ఇటీవలే నటుడు అమితాబ్ బచ్చన్కు ఈ టికెట్ అందించిన బోర్డు కార్యదర్శి జై షా తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు ‘గోల్డెన్ టికెట్’ అందించారు. అద్భుత క్రికెటర్, జాతికి గర్వకారణంగా నిలిచిన ‘భారత రత్న’ సచిన్కు టికెట్ అందించడం పట్ల జై షా సంతోషం వ్యక్తం చేశారు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన సచిన్లాంటి వ్యక్తి ఇప్పుడు వరల్డ్కప్లో ఒక భాగంగా మారారని వ్యాఖ్యానించారు. కొత్త టికెట్లూ హుష్ కాకి! వరల్డ్ కప్ అభిమానులను దృష్టిలో ఉంచుకొని 4 లక్షల టికెట్లను అదనంగా అందుబాటులోకి తెచ్చినట్లు బీసీసీఐ ఘనంగా ప్రకటించింది. కానీ పరిస్థితి చూస్తే ఏమీ మారలేదని అర్థమవుతోంది. శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి టికెట్లు అమ్మకానికి పెట్టారు. అయితే భారత్కు సంబంధించి అన్ని మ్యాచ్లకూ టికెట్లే లేని పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని మ్యాచ్లకు ‘సోల్డ్ అవుట్’ చూపిస్తుండగా... మిగతా మ్యాచ్లకు మీరు క్యూలో ఉన్నారు అని ‘బుక్ మై షో’ చెబుతోంది. గతంతో పోలిస్తే టికెట్ కోసం ప్రయతి్నస్తున్నవారికి వేచి ఉండాల్సిన సమయం వేర్వేరుగా చూపించగా... ఇప్పుడు అందరికీ ఒకే మెసేజ్ ‘90 నిమిషాలు’ అనే చూపిస్తుండటం విశేషం! అసలు ఏ మ్యాచ్కు ఎన్ని టికెట్లు అమ్ముతున్నారనే విషయంపైనే సమాచారం లేకపోగా, 4 లక్షల టికెట్ల గురించి ఎక్కడా స్పష్టత లేదు! చూస్తుంటే ఇదంతా అభిమానులను కాస్త ఓదార్చించేందుకు బీసీసీఐ ఆడిన ఒక డ్రామాలాగానే కనిపిస్తోంది. -
మరో వందేళ్లయినా సచిన్ లాంటి క్రికెటర్ పుట్టడు: మురళీధరన్
టెస్టు క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తీసిన సినిమా '800'. మురళీధరన్ పాత్రలో 'స్లమ్డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకుడు. బుకర్ ప్రైజ్ పురస్కార గ్రహీత షెహన్ కరుణతిలకతో కలిసి ఆయన స్క్రిప్ట్ అందించారు. శివలెంక కృష్ణప్రసాద్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తాజాగా ముంబైలో మంగళవారం సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా '800' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో భాగంగా మురళీధరన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. (ఇదీ చదవండి: పెళ్లి గురించి హింట్ ఇచ్చిన అనుష్క.. కానీ!) 'నా కోసం ఇక్కడికి వచ్చిన, మా సినిమాకు సపోర్ట్ చేస్తున్న సచిన్కి థాంక్స్. నేను కూడా సచిన్ ఫ్యాన్. క్రికెట్లో ఆయన సాధించినది ఎవరూ సాధించలేరు. మరో 100 ఏళ్ల తర్వాత కూడా సచిన్ లాంటి క్రికెటర్, వ్యక్తి రాలేరు. ఆయన ఎప్పటికీ బెస్ట్. మరో సచిన్ టెండూల్కర్ పుట్టరు. నా బౌలింగ్లో రన్స్ చేయడంలో లారా సక్సెస్ అయ్యాడు. కానీ నా బౌలింగ్ శైలిని పట్టుకోలేకపోయాడు. రాహుల్ ద్రావిడ్ కూడా! సచిన్ మాత్రం నా ఆటను పూర్తిగా చదివేశాడు'' అని మురళీధరన్ చెప్పాడు. ఇక సచిన్ మాట్లాడుతూ ''మై వెరీ డియర్ ఫ్రెండ్ మురళీధరన్కి ఆల్ ది బెస్ట్. అతని జీవితంలో ఏం జరిగిందో ప్రజలు తెలుసుకోవాలి. ఎంతో సాధించినా చాలా సింపుల్గా ఉంటాడు. అతనికి నో చెప్పడం కష్టం. అతని కోసమే నేను ఇక్కడికి వచ్చా. ఆటలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్నిసార్లు మన ఆట పట్ల డిజప్పాయింట్ అవుతాం. అక్కడ నుంచి మళ్ళీ నిలబడి పోటీ ఇవ్వడమే నిజమైన ఆటగాడి లక్షణం. మురళీధరన్ అదే చేశాడు' అని అన్నాడు. (ఇదీ చదవండి: తొలిప్రేమ- బ్రేకప్ గురించి చెబుతూ బాధపడిన జాన్వీ) -
సచిన్, ద్రవిడ్ కాదు.. అతడే ఆసియాలో బెస్ట్ మిడిలార్డర్ బ్యాటర్: సెహ్వాగ్
ప్రముఖ క్రికెట్ ప్రేజేంటర్ గౌరవ్ కపూర్ హోస్ట్ చేస్తున్న బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ షోలో తాజాగా టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సందడి చేశాడు. ఈ షోలో పాల్గొన్న సెహ్వాగ్కు ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. ఆసియాలో అత్యుత్తమ మిడిలార్డర్ బ్యాటర్ ఎవరని గౌరవ్ కపూర్ ప్రశ్నించాడు. అందుకు బదులుగా అతడు భారత దిగ్గజ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ పేర్లు కాకుండా.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ను ఎంపిక చేసి అందరనీ ఆశ్చర్యపరిచాడు. కాగా 2000లలో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ వంటి దిగ్గజాలతో పోటీపడిన ఆటగాళ్లలో ఇంజమామ్ వుల్ హక్ ఒకడు. ఓవరాల్గా తన అంతర్జాతీయ కెరీర్లో 498 మ్యాచ్లు ఆడిన ఇంజమామ్.. 20,569 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 25 సెంచరీలు, వన్డేల్లో 10 సెంచరీలు సాధించాడు. అయితే వన్డేల్లో మాత్రం 83 హాఫ్ సెంచరీలు ఇంజమామ్ చేశాడు. "అందరూ సచిన్ టెండూల్కర్ గురించి మాట్లాడుతారు. కానీ ఇంజమామ్-ఉల్-హక్ ఆసియాలో అతిపెద్ద మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. అయితే సచిన్ పాజీ అందరి కంటే ముందున్నాడు. అతడికి ఎవ్వరితో పోటీ లేదు. కానీ ఆసియాలో మాత్రం అత్యుత్తమ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విషయానికి వస్తే.. ఇంజమామ్ను మించిన వారు లేరు. 2003-04 కాలంలో ఇంజమామ్ ఓవర్కి 8 పరుగులు చేసేవాడు. అతను తన బ్యాటింగ్ పార్టనర్కి భయపడొద్దు అని ధైర్యం చేప్పేవాడు. ఓ మ్యాచ్లో ఆఖరి 10 ఓవర్లలో 80 పరుగులు అవసరం. ఇటువంటి సమయంలో ఏ ఆటగాడైనా ఒత్తడికి గురవుతాడు. కానీ ఇంజమామ్ మాత్రం చాలా కూల్గా ఉంటాడు. అదే విధంగా 2005లో ఓ మ్యాచ్లో డానిష్ కనేరియా రౌండ్ది వికెట్ బౌలింగ్ చేసి కాస్త ఇబ్బంది పెట్టాడు. భారీ షాట్లు ఆడకుండా నన్ను ఆపేందుకు కనేరియా ప్రయత్నించాడు. నేను ఒకట్రెండు ఓవర్లు ఢిపెన్స్ ఆడాను. ఆ తర్వాత ఇంజమామ్ వైపు తిరిగి... ‘‘ఇంజీ భాయ్... నా కాళ్లు నొప్పి పెడుతున్నాయ్. ఎంత సేపు డిఫెన్స్ ఆడాలని’’ అని అన్నాను. దానికి అతడు ‘‘నన్నేం చేయమంటావ్’’ అన్నాడు. అందుకు బదులగా "సర్కిల్ లోపలకి లాంగ్ ఆన్ ఫీల్డర్ని తీసుకురా, నేను సిక్స్ కొడతా అని ఇంజీతో చెప్పా. దానికి ఇంజమామ్ నవ్వాడు. ‘‘సరే నేను సిక్సర్ కొట్టపోతే ఆ ఫీల్డర్ని మళ్లీ వెనక్కిపంపించు’’ అని చెప్పాను. అందుకు అతడు అంగీకరించి ఫీల్డర్ని సర్కిల్ లోపలకి పిలిచాడు. కనేరియా గూగ్లీ వేయగా.. నేను చెప్పినట్లగానే బంతిని స్టాండ్స్కు పంపించాను. ఫీల్డింగ్ మార్చినందుకు కనేరియాకు ఒక్క సారిగా కోపం వచ్చింది. వెంటనే కెప్టెన్ దగ్గరికి వెళ్లి ‘ఇంజీ భాయ్, మీరు ఫీల్డర్ను ఎందుకు పైకి తీసుకువచ్చారు? అని ప్రశ్నించాడు. అందుకు బదులుగా నువ్వు సైలెంట్గా వెళ్లి బౌలింగ్ చెయి, లేదంటే బయటకు వెళ్లిపోతావు అని ఇంజీ భాయ్ అన్నాడు" అంటూ చెప్పుకొచ్చాడు వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. -
ఆసియాలోనే ఒకే ఒక్కడు కోహ్లీ దరిదాపుల్లో కూడా ఎవరు లేరు ..
-
గిల్పై ప్రశంసల వర్షం కురిపించిన సచిన్.. ఏమన్నాడంటే?
ఐపీఎల్-2023లో టీమిండియా యువ ఆటగాడు, గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ శుబ్మన్ గిల్ దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 16 మ్యాచ్లు ఆడిన గిల్.. 60.79 సగటుతో 851 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో నాలుగు హాఫ్ సెంచరీలతో పాటు మూడు సెంచరీలు ఉన్నాయి. ఇక అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరగనున్న ఫైనల్ మ్యాచ్లో కూడా గిల్ తన జోరును కొనసాగించాలని భావిస్తున్నాడు. ఇక ఇది ఇలా ఉండగా కీలకమైన ఫైనల్కు ముందు శుబ్మన్ గిల్పై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఏడాది సీజన్లో గిల్ ప్రదర్శన ఎప్పటికీ మర్చిపోలేనదని సచిన్ కొనియాడాడు. "ఈ ఏడాది సీజన్లో గిల్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడి ఆటతీరు ఎప్పటికీ మర్చిపోలేం. అతడు మూడు సెంచరీలు సాధించాడు. అందులో రెండు సెంచరీలు గుజరాత్ ఫైనల్కు చేరుకోవడంలో తోడ్పడితే.. మరో సెంచరీ ముంబైకు అవకాశం కల్పించింది. అదే సెంచరీ ఆర్సీబీ కొంపముంచింది. ఈ జెంటిల్మెన్ గేమ్లో ఇటువంటివి సహజం. ముఖ్యంగా గిల్ బ్యాటింగ్ స్టైల్ను నన్ను బాగా అకట్టుకుంది. అతడు ఆడిన షాట్లు చాలా క్లాసిక్గా ఉన్నాయి. అదే విధంగా వికెట్ల మధ్య కూడా అతడు చాలా చురుకుగా పరిగెత్తతున్నాడు. గుజరాత్ భారీ స్కోర్లు నమోదు చేయడంలో గిల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒక్కసారి క్రీజులో సెట్ అయ్యాక ప్రత్యర్ది బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక గుజరాత్ చాలా బలమైన జట్టు. గిల్, హార్దిక్, డేవిడ్ మిల్లర్ వికెట్లను చెన్నై సాధించగలిగితే.. గుజరాత్lio బ్యాక్ఫుట్లో ఉంచవవచ్చు. అదేవిధంగా ధోని కూడా తన బ్యాటింగ్ ఆర్డర్లో కొంచెం ముందుకు వస్తే బాగుంటుంది" అని సచిన్ ట్విటర్లో పేర్కొన్నాడు. చదవండి: IPL 2023: చరిత్రకు అడుగు దూరంలో శుబ్మన్ గిల్.. అలా అయితే కోహ్లి రికార్డు బద్దలు! -
టెండుల్కర పై పగ తీర్చుకునే రోహిత్ శర్మ
-
సిక్సర్ల వర్షం కురిపించిన అర్జున్ టెండూల్కర్.. వీడియో వైరల్
క్రికెట్ దిగ్గజం సచిన్ తనయుడు, ముంబై ఇండియన్స్ యువ పేసర్ అర్జున్ టెండూల్కర్ తొలి ఐపీఎల్ వికెట్ సాధించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్-2023లో భాగంగా మంగళవారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో అర్జున్ టెండూల్కర్ తొలి ఐపీఎల్ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్లో అర్జున్ తన అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు. 2.5 ఓవర్లు వేసిన అర్జున్ టెండూల్కర్ కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక్క వికెట్ సాధించాడు. దీంతో అతడిపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. నెట్స్లో చెమటోడ్చుతున్న అర్జున్ ఇక అర్జున్ అర్జున్ టెండూల్కర్కు బౌలింగ్తో బ్యాటింగ్ కూడా చేసే సత్తా ఉంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతడి పేరిట ఓ సెంచరీ కూడా ఉంది. కాగా ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్లో ఏప్రిల్ 22న వాంఖడే వేదికగా పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఈ క్రమంలో ఇప్పటికే ముంబై చేరుకున్న రోహిత్ సేన నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. తమ నెట్ ప్రాక్టీస్లో భాగంగా అర్జున్ కూడా నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే అర్జున్ బౌలింగ్ మాత్రమే కాకుండా బ్యాటింగ్పై కూడా దృష్టిపెట్టాడు. తమ బౌలర్లు బౌలింగ్ చేస్తుండగా అర్జున్ భారీ షాట్లు ఆడుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ ట్విటర్లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: IPL 2023: ఎందుకు వస్తున్నాడో తెలియదు.. ప్రతీ మ్యాచ్లో ఇంతే! తీసి పడేయండి.. 𝕊𝕥𝕣𝕚𝕜𝕚𝕟𝕘 so good, you'd think it was their first job 😍 Look again 😉#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPL #IPL2023 pic.twitter.com/2QRlreAOID — Mumbai Indians (@mipaltan) April 19, 2023 -
సీఎస్కేతో మ్యాచ్.. సచిన్ కొడుకు ఐపీఎల్ ఎంట్రీ!
ఐపీఎల్-2023లో తమ తొలి మ్యాచ్లోనే ఓటమిపాలైన ముంబై ఇండియన్స్.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. వాంఖడే వేదికగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది. ఇక ఈ మ్యాచ్లో పలు మార్పులతో ముంబై బరిలోకి దిగనున్నట్లు సమాచారం. సీఎస్కేతో మ్యాచ్కు ముందు ముంబై పేసర్ జోఫ్రా అర్చర్ నెట్స్లో గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ మ్యాచ్కు అర్చర్ దూరమైతే అతడి స్థానంలో మెరిడిత్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా యువ స్పిన్నర్ హృతిక్ షోకిన్ స్థానంలో కుమార్ కార్తీకేయకు ఛాన్స్ ఇవ్వాలని ముంబై మెనెజ్మెంట్ భావిస్తున్నట్లు వినికిడి. అర్జున్ టెండ్కూలర్ ఎంట్రీ.. మరోవైపు సచిన్ తనయుడు అర్జున్ టెండ్కూలర్ సీఎస్కే మ్యాచ్తో ఐపీఎల్ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. 2021లో ముంబయి ఇండియన్స్ జట్టులోచేరిన అర్జున్.. ఇప్పటివరకు ఒక మ్యాచ్లో కూడా ఆడలేదు. కాగా సీఎస్కేతో మ్యాచ్కు ముందు అర్జున్ నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విటర్లో షేర్ చేసింది. దీంతో అర్జున్ ఐపీఎల్ ఎంట్రీ ఖాయమని ముంబై అభిమానులు ఫిక్స్ అయిపోయారు. కాగా దేశావాళీ క్రికెట్లో గోవా తరపున అర్జున్ ఆడుతున్న సంగతి తెలిసిందే. రంజీ సీజన్ 2022-23లో అర్జున్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. తన మ్యాచ్లోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు 7 లిస్ట్-ఏ(25 వికెట్లు) మ్యాచ్లు ఆడిన అతడు.. ఐదు ఫస్ట్ క్లాస్(9 వికెట్లు) మ్యాచులు, 9 టీ20లు(12 వికెట్లు) ఆడాడు. చదవండి: IPL 2023 SRH vs LSG: ఎవరు బాబు నీవు.. వెళ్లి టెస్టులు ఆడుకో పో! అక్కడ కూడా పనికి రాడు Arjun ko bas 🎯 dikhta hai 🤌🔥#OneFamily #MumbaiIndians #MumbaiMeriJaan #TATAIPL #IPL2023 pic.twitter.com/IYHgDpBPEs — Mumbai Indians (@mipaltan) April 7, 2023 -
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్.. సచిన్ ప్రపంచ రికార్డుపై కన్నేసిన కోహ్లి
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ను సొంతం చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు అదే జట్టుతో మూడు వన్డేల సిరీస్లో తలపడేందుకు సిద్దమైంది. మార్చి17(శుక్రవారం)న ముంబై వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఐపీఎల్-2023 ప్రారంభానికి ముందు భారత జట్టుకు ఇదే చివరి సిరీస్. ఇక ఈ వన్డే సిరీస్కు ముందు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని పలు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్తో జరిగిన నాలుగో టెస్టులో విరాట్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అద్భుతమైన సెంచరీతో చెలరేగిన కోహ్లి(186).. ఆఖరి టెస్టును డ్రాగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు. కోహ్లి ముందున్న రికార్డులు ఇవే.. ►ఈ సిరీస్లో కోహ్లి మరో 191 పరుగులు సాధిస్తే.. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో 13,000 పరుగులు పూర్తి చేసిన 5వ బ్యాటర్గా రికార్డులకెక్కుతాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో వరుసగా సచిన్ టెండూల్కర్ (18426), కుమార సంగక్కర (14,234), రికీ పాంటింగ్ (13,704), సనత్ జయసూర్య (13,430) ఉన్నారు. ►అదే విధంగా ఈ సిరీస్లో కోహ్లి మరో మూడు సెంచరీలు సాధిస్తే.. సచిన్ టెండూల్కర్ అత్యధిక వన్డే సెంచరీల(49) ప్రపంచరికార్డును సమం చేస్తాడు. కోహ్లి ఇప్పటివరకు వన్డేల్లో 46 సెంచరీలు సాధించాడు. ►ఇక తొలి వన్డేలో విరాట్ 48 పరుగులు సాధిస్తే.. స్వదేశంలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్(5406)ను కోహ్లి అధిగమిస్తాడు. కోహ్లి ఇప్పటివరకు సొంత గడ్డపై వన్డేల్లో 5358 పరుగులు చేశాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(6976) పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. చదవండి: IPL 2023: కొత్త సీజన్.. కొత్త కెప్టెన్.. సన్రైజర్స్ కొత్త జెర్సీ అదిరిపోయిందిగా! -
విరాట్ కోహ్లి అరుదైన ఘనత.. సచిన్ ప్రపంచ రికార్డు బద్దలు
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 25000 పరుగుల మైలు రాయిని అందుకున్న ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మూడో రోజు ఆట సందర్భంగా విరాట్ ఈ ఫీట్ సాధించాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరుపై ఉండేది. తాజా మ్యాచ్తో సచిన్ రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు. కోహ్లి 549 ఇన్నింగ్స్లో ఈ ఘనత సాధించగా.. సచిన్ 577 ఇన్నింగ్స్లలో ఈ రికార్డును నెలకొల్పాడు. విరాట్, సచిన్ తర్వాతి స్థానంలో రికీ పాంటింగ్ (588 మ్యాచ్లు), జాక్వెస్ కలిస్ (594 మ్యాచ్లు), కుమార సంగక్కర (608 మ్యాచ్లు) , మహేల జయవర్ధనే(701 మ్యాచ్లు) 25,000 పరుగులను పూర్తి చేశారు. ఈ మ్యాచ్లో కోహ్లి రెండు ఇన్నింగ్స్లు కలిపి 64 పరుగులు చేశాడు. ఆసీస్ చిత్తు.. భారత్ ఘన విజయం ఇక ఈ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. 115 స్వల్ప లక్క్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 26. 4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. చతేశ్వర్ పూజారా(27), శ్రీకర్ భరత్(23) ఆఖరి వరకు ఆజేయంగా నిలిచి మ్యాచ్ను ఫినిష్ చేశారు. అంతకముందు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 113 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో 7 వికెట్లతో రవీంద్ర జడేజా ఆసీస్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు అశ్విన్ మూడు వికెట్ల పడగొట్టాడు. చదవండి: IND vs AUS: శభాష్ హిట్మ్యాన్.. పూజారా కోసం వికెట్ను త్యాగం చేసిన రోహిత్! వీడియో వైరల్ -
విరాట్ కోహ్లి అరుదైన రికార్డులు.. ప్రపంచ క్రికెట్లో ఏకైక ఆటగాడిగా
తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో 110 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి 13 ఫోర్లు, 8 సిక్స్లతో 166 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. కాగా వన్డేల్లో విరాట్కు ఇది రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. ఇక ఈ మ్యాచ్లో సంచలన ఇన్నింగ్స్ ఆడిన కింగ్ కోహ్లి పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కోహ్లి సాధించిన రికార్డులు ఇవే ►శ్రీలంకపై విరాట్కు ఇది 10వ వన్డే సెంచరీ. తద్వారా ఓ ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సెంచరీలు బాదిన ఏకైక క్రికెటర్గా విరాట్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ ఘనత సాధించిన జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కూలర్తో కలిసి విరాట్ సమంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాపై సచిన్ 9 సెంచరీలు చేయగా.. విరాట్ కూడా వెస్టిండీస్పై 9 సెంచరీలు చేశాడు. తాజా మ్యాచ్లో సెంచరీ చేసిన కింగ్ కోహ్లి(10).. సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. ►ఇక భారత గడ్డపై విరాట్కు ఇది 21 వన్డే సెంచరీ. దీంతో స్వదేశంలో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్లో సెంచరీ చేసిన కింగ్ సచిన్ను అధిగిమించాడు. ►అదేవిధంగా స్వదేశీ గడ్డపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో క్రికెటర్గా కోహ్లి నిలిచాడు. ఈ జాబితాలో 6976 పరుగులతో సచిన్ మొదటి స్థానంలో ఉన్నాడు. అతడి తర్వాత రికీ పాటింగ్ 5521 పరుగులతో రెండో స్థానంలో నిలవగా.. 5303 రన్స్తో కోహ్లి మూడో స్థానంలో నిలిచాడు. ►అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా కోహ్లి రికార్డులకెక్కాడు. ఇప్పటివరకు 259 వన్డే ఇన్నింగ్స్లలో 12754 పరుగులు చేశాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే(12650)ను కోహ్లి అధిగమించాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో తొలి స్థానంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్(18426) ఉండగా.. రెండో స్థానంలో శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర(14234)పరుగులతో ఉన్నాడు. చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
తొలి మ్యాచ్లోనే కొడుకు సెంచరీ.. సచిన్ టెండూల్కర్ ఏమన్నాడంటే?
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఫస్ట్ క్లాస్ అరంగేట్ర మ్యాచ్లోనే అదరగొట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రంజీ సీజన్లో గోవాకు అర్జున్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో రాజస్తాన్పై తొలి ఇన్నింగ్స్లో అర్జున్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్లో 207 బంతులు ఎదుర్కొన్న అర్జున్ 120 పరుగులు చేశాడు. ఇక తొలి రంజీ మ్యాచ్లోనే సెంచరీ సాధించిన అర్జున్ టెండూల్కర్పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. ఇక అర్జున్ ఇన్నింగ్స్పై అతడి తండ్రి సచిన్ టెండూల్కర్ తొలి సారి స్పందించాడు. ఇన్ఫోసిస్ స్థాపించి 40 ఏళ్లు గడిచిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన సచిన్ ఆసక్తిర వాఖ్యలు చేశాడు. "క్రికెట్లో రాణించడం అంత సులభమైన విషయం కాదు. అర్జున్కు కూడా ఇది చాలా కష్టమైన ప్రయాణం. అర్జున్ ఆట పరంగా నాకంటే ఎక్కువగా రోహన్ గవాస్కర్తో క్లోజ్గా ఉంటాడు. ఈ మ్యాచ్లో అర్జున్ను నైట్ వాచ్మెన్గా పంపారు. అతడు 4 పరుగులతో నాటౌట్గా ఉన్నప్పుడు సెంచరీ కోసం ప్రయత్నించమని నేను చెప్పాను. ఎన్ని పరుగులు చేస్తే అది మాకు మంచి స్కోర్ అవుతుందని అర్జున్ అడిగాడు. వారు అప్పటికే 5 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసి ఉన్నారు. కనీసం 375 పరుగులు అయినా సాధిస్తే మంచి ఫైటింగ్ స్కోర్ అవుతుందని నేను చెప్పాను. చివరికి అర్జున్ సెంచరీ సాధించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అర్జున్ అందరు పిల్లల్లాగా సాధారణ బాల్యాన్ని గడపలేదు. అతడు ఒక ప్రముఖ క్రికెటర్ కొడుకు కావడంతో అతడిపై తీవ్రమైన ఒత్తడి ఉండేది. నేను రిటైర్ అయ్యాక ముంబైలో మీడియా సమావేశంలో కూడా అదే చెప్పాను. అతడిపై అనవసర ఒత్తిడి పెంచవద్దు, ముందు అర్జున్ క్రికెట్పై మక్కువను పెంచుకోనివ్వండి అని చెప్పాను. అదే విధంగా అతడొక మంచి క్రికెటర్గా ఎదిగితే మీకు నచ్చిన ప్రకటనలను చేయవచ్చు అని కూడా నేను అన్నాను" అని సచిన్ పేర్కొన్నాడు. చదవండి: FIFA WC Final: ఫైనల్కు ముందు అర్జెంటీనాకు బిగ్ షాక్.. మెస్సీకి గాయం! -
ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లి సరి కొత్త చరిత్ర.. సచిన్ రికార్డు బద్దలు
టీ20 ప్రపంచకప్-2022లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన కీలక మ్యాచ్లో విరాట్ కోహ్లి అదరగొట్టాడు. ఈ మ్యాచ్లో 44 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి..8 ఫోర్లు, 1 సిక్స్తో 64 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఇక అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో బంగ్లాదేశ్పై 5 పరుగుల తేడాతో (డక్వర్త్–లూయిస్ ప్రకారం) భారత్ విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లి పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అవి ఏంటో ఓ లుక్కేద్దాం. టీ20 ప్రపంచకప్లో అత్యధిక పరుగులు వీరుడు పొట్టి ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా విరాట్ అవతరించాడు. బంగ్లాతో మ్యాచ్లో 16 పరుగుల వద్ద వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లి ఈ ఘనత సాధించాడు. ఇప్పటి వరకు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే (31 మ్యాచ్ల్లో 1,016 పరుగులు) పేరిట ఉన్న ఈ రికార్డు కోహ్లి ఖాతాలోకి చేరింది. కెరీర్లో ఐదో టి20 ప్రపంచకప్ ఆడుతున్న కోహ్లి ఇప్పటివరకు 25 మ్యాచ్లు ఆడి 23 ఇన్నింగ్స్లలో మొత్తం 1,065 పరుగులు సాధించాడు. అదే విధంగా అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలోనూ కోహ్లి టాప్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు కోహ్లి 113 టి20 మ్యాచ్లు ఆడి 3,932 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ (146 మ్యాచ్ల్లో 3,811 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. సచిన్ రికార్డు బద్దలు ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్గా విరాట్ కోహ్లి నిలిచాడు. ఇప్పటి వరకు అస్ట్రేలియాలో అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్ 3350 పరుగులు సాధించాడు. ఇప్పటి వరకు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (ఆస్ట్రేలియాలో 3,300 పరుగులు) పేరిట ఉన్న రికార్డును కోహ్లి అధిగమించాడు. టి20 ప్రపంచకప్ టోర్నీలలో మూడు లేదా అంతకంటే ఎక్కువ అర్ధ సెంచరీలు చేయడం కోహ్లికిది మూడోసారి. తాజా ప్రపంచకప్తోపాటు 2014, 2016 ప్రపంచకప్ టోర్నీల్లోనూ కోహ్లి ఈ ఘనత సాధించాడు. గతంలో ఏ క్రికెటర్ కూడా ఇలా చేయలేదు. అత్యధిక మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డులు అదే విధంగా టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక మ్యాన్ ఆఫ్ది మ్యాచ్లు అవార్డులు అందుకున్న క్రికెటర్గా విరాట్ నిలిచాడు. బంగ్లాతో మ్యాచ్లో అద్భుత ప్రదర్శనకు గానూ విరాట్కు మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు లభించింది. టీ20 ప్రపంచకప్లో విరాట్కి ఇది ఏడో మ్యాన్ ఆఫ్ది మ్యాచ్. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: T20 WC 2022: మళ్లీ మాది పాత కథే.. వర్షం రాక పోయుంటే విజయం మాదే: షకీబ్ -
సచిన్ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. తొలి ఆటగాడిగా
టీ20 ప్రపంచకప్-2022లో దాయాదుల పోరు అభిమానులకు అసలు సిసలైన మజా అందించింది. సూపర్-12లో భాగంగా అఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్పై 4 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్లో 83 పరుగులతో అజేయంగా నిలిచిన విరాట్ కోహ్లి ఒంటి చేత్తో భారత్ను గెలిపించాడు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి.. పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. కోహ్లి సాధించిన రికార్డులు ఇవే ►ఈ మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. తద్వారా అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు సాధించిన క్రికెటర్గా కోహ్లి (14 సార్లు) గుర్తింపు పొందాడు. మొహమ్మద్ నబీ (అఫ్గానిస్తాన్–13 సార్లు)ని కోహ్లి రెండో స్థానానికి పంపించాడు. టి20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు అందుకున్న క్రికెటర్గా కోహ్లి (6 సార్లు) నిలిచాడు. గేల్ (వెస్టిండీస్; 5 సార్లు) రికార్డును కోహ్లి అధిగమించాడు. ► టి20 మ్యాచ్ల్లో ఛేజింగ్ చేస్తూ అత్యధిక సార్లు నాటౌట్గా నిలిచిన క్రికెటర్గా షోయబ్ మాలిక్ (పాకిస్తాన్; 18 సార్లు) పేరిట ఉన్న రికార్డును కోహ్లి (18 సార్లు) సమం చేశాడు. ►పాక్పై ఇన్నింగ్స్తో అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా కోహ్లి (110 మ్యాచ్ల్లో 3,794) మళ్లీ టాప్ ర్యాంక్లోకి వచ్చాడు. రోహిత్ శర్మ (143 మ్యాచ్ల్లో 3,741 పరుగులు) రెండో స్థానానికి పడిపోయాడు. ►అదే విధంగా ఐసీసీ టోర్నమెంట్స్లో అత్యధిక ఫిప్టీ ప్లస్ పరుగులు సాధించిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లి నిలిచాడు. ఐసీసీ మెగా ఈవెంట్లో కోహ్లికి ఇది 24 వ ఫిప్టీ ప్లస్ స్కోర్ . అంతకుముందు ఈ రికార్డు భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్(23) పేరిట ఉండేది. తాజా మ్యాచ్లో సచిన్ రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు. చదవండి: T20 WC PAK Vs IND: మా బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు..! కానీ క్రెడిట్ విరాట్కే ఇవ్వాలి
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
ఇక మళ్లీ భానుడి సెగ
విదేశీ ఉద్యోగాలతో జర భద్రం
ఈరోడ్లో వేడుకగా రెక్లాన్ పోటీలు
తంజావూరులో గురు పూజా మహోత్సవం
గెలుపే కరుణకు కానుక
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు సిద్ధం
తిరుత్తణికి పోటెత్తిన భక్తజనం
పెరమానళ్లూరులో తాగునీరు కలుషితం
తప్పక చదవండి
- స్వాతిమలివాల్పై దాడి.. కేజ్రీవాల్ సహాయకుడికి నో బెయిల్
- యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ ఘన విజయం
- హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
- అతనితో రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు!
- శెభాష్ శ్రేయస్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే
- పాయింట్ బ్లాంక్లో డీజేపై కాల్పులు
- భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
- ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
- గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
- ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Advertisement