-
చంద్రబాబుపై రెచ్చిపోయిన సజ్జల
-
విజయం మనదే.. మహిళలకు పెద్దపీట..
-
టీడీపీ ఏజెంట్లను ఘర్షణలకు ప్రేరేపిస్తున్న బాబుపై చర్యలు తీసుకోవాలి
సాక్షి,అమరావతి: కౌంటింగ్ రోజున అల్లర్లు సృష్టించేలా తెలుగుదేశం కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొడుతున్న చంద్రబాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్సీపీ బృందం కోరింది. ఈ మేరకు శనివారం వెలగపూడి సచివాలయంలో డిప్యూటీ సీఈవో విశ్వేశ్వరరావును కలిసి ఫిర్యాదు చేసింది. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా అరాచకాలు సృష్టించేందుకు టీడీపీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. టీడీపీ కౌంటింగ్ ఏజెంట్లకు ట్రైనింగ్ క్యాంపులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు.వైఎస్సార్సీపీ కౌంటింగ్ ఏజెంట్లను తరిమికొట్టాలని, కౌంటింగ్ ప్రాంతంలో లేకుండా చేయాలని రెచ్చగొట్టేలా బాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు ఎన్నికల నియమావళిపై కనీస అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు. టీడీపీ అధినేతకు ఓటమి భయం పట్టుకుందని.. కనుకనే అల్లర్లు సృష్టించి ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. విధ్వంసాలు, ఘర్షణలతో ప్రజా తీర్పును మార్చేందుకు ప్రయతి్నస్తే.. చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఎక్కడా దౌర్జన్యకాండ జరగకుండా అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి, కఠినంగా వ్యవహరించాలని ముందస్తుగా ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు.మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడం దుర్మార్గమైన చర్య అని మల్లాది విష్ణు మండిపడ్డారు. సజ్జల మాటలను తెలుగుదేశం లీగల్ సెల్ పూర్తిగా వక్రీకకరించి, ఆయనపై తప్పుడు కేసు బనాయించిందని నిప్పులు చెరిగారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నదెవరో ఓటర్లకు బాగా తెలుసన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి సైకో అని, గొడ్డలి అని, ఘర్షణలు సృష్టించేలా నోటికొచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు, కూటమి టీడీపీ నేతలపై నేటికీ కనీస చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ ఇచ్చిన దాదాపు వందకి పైగా ఫిర్యాదులు ఇప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. ముఖ్యంగా కోడ్ను పదేపదే ఉల్లంఘిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, 48 గంటల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచాలని కోరినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం చూసీచూడనట్లు వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై పెట్టిన తప్పుడు కేసును తక్షణమే విత్ డ్రా చేసుకోవాలని మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట మాజీ మంత్రి రావెల కిషోర్బాబు, వైఎస్సార్సీపీ గ్రీవెన్సెల్ అధ్యక్షుడు నారాయణమూర్తి ఉన్నారు. -
ఎగ్జిట్ పోల్స్లోనూ వైఎస్సార్సీపీకి సానుకూలత : సజ్జల
సాక్షి, అమరావతి: ఎగ్జిట్ పోల్స్లో వైఎస్సార్ సీపీ పట్ల పాజిటివ్ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. జూన్ 4న వెల్లడయ్యే వాస్తవ ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. మహిళా ఓటర్లు తమవైపే నిలిచారనే విషయం ఎగ్జిట్ పోల్స్లో తేలిందన్నారు. శనివారం తాడేపల్లిలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో మహిళలను సమాజంలో ఆత్మగౌరవంతో నిలబెట్టారని, సంక్షేమ పథకాలు అందించడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంతో పాటు కుటుంబాన్ని నడిపించగల శక్తిని అందించారన్నారు. సీఎం జగన్ వల్లే తమకు మేలు జరుగుతుందనే విశ్వాసంతో మహిళలు వారి కుటుంబాలు పోలింగ్కు పెద్ద ఎత్తున తరలి వచ్చాయన్నారు. ఐదేళ్లలో తమ కుటుంబాల స్థితిగతుల్లో వచ్చిన మార్పులను గమనించడంతో స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైఎస్సార్ సీపీకి ఓట్లు వేశారన్నారు. ఎక్కువ సైలెంట్ ఓటింగ్ జరగడంతో కొన్ని సర్వే సంస్థలకు వైఎస్సార్ సీపీపై క్షేత్ర స్థాయిలో ఉన్న సానుకూలత కనిపించలేదన్నారు. పాజిటివ్ అజెండా పని చేసింది.. వైఎస్సార్ సీపీ ఎన్నికల ప్రచారం మొత్తం పాజిటివ్ కోణంలో నిర్వహించాం. ప్రజలకు ఏం చేశామో చెప్పి ఓట్లు అడిగాం. చంద్రబాబు మరోసారి అసాధ్యమైన హామీలను గుప్పిస్తూ 2014లో మాదిరిగా మోసం చేసేందుకు వస్తున్నాడని గుర్తు చేశాం. టీడీపీ నేతలు పచ్చి బూతులు మాట్లాడారు. సీఎం జగన్ అంతు చూస్తామని, అధికారంలోకి వచ్చేశామంటూ విర్రవీగారు. సొంతంగా పోటీ చేయలేక కూటమి కట్టారు. మా నాయకుడు మాత్రం పాజిటివ్ అజెండాతో ప్రజలను ఓట్లు అడిగారు. పాజిటివ్ అజెండా పని చేసిందని స్పష్టంగా తెలుస్తోంది. ఈసీ ఒత్తిడికి తలొగ్గితే ఎలా? ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. గతంలో చంద్రబాబు ఏపీ సీఈవోపైకి దండయాత్రలా వెళ్లి బెదిరించలేదా? ఆ తర్వాత ఈవీఎంలు మోసం చేశాయంటూ దు్రష్పచారం నడిపారు. అలాంటి పార్టీకి చెందిన వాళ్లు ఈ రోజు మా గురించి మాట్లాడటం సిగ్గుచేటు. పోస్టల్ బ్యాలెట్ విషయలో టీడీపీ గందరగోళం సృష్టించాలని యత్నించింది. ఏ రూల్స్ అవసరం లేకుండా నేరుగా పోస్టల్ బ్యాలెట్లు తీసుకోవాలన్న టీడీపీ ఒత్తిడికి తలొగ్గి ఈసీ ఇచ్చిన ఆదేశాలపై మేం కోర్టుకెళ్లాం. కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలని మా ఏజెంట్లకు చెప్పాం. తిరస్కరించాల్సిన ఓటును చెల్లుబాటయ్యేలా టీడీపీ కుట్రలను అడ్డుకోవాలని చెప్పాం. దీనికే నాపై కేసులు మోపడం హాస్యాస్పదం. సుప్రీం కోర్టుకు వెళ్తాం.. పోస్టల్ బ్యాలెట్ విషయంలో సుప్రీం కోర్టుకు వెళ్తున్నాం. జూలై 2023లో ఈసీ స్పష్టమైన గైడ్లైన్స్ ఇచ్చింది. అందులో పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు, తిరస్కరణ విషయాలు స్పష్టంగా ఉన్నాయి. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్లో అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, సీలు కచ్చితంగా ఉండాలి. సీల్ లేకుంటే కనీసం హోదా వివరాలైనా రాయాలని ఉంది. పోలింగ్ అయ్యాక అది అవసరం లేదని ఈసీ చెప్పడం అనైతికం. వాళ్లిచ్చిన నిబంధనలను వాళ్లే తుంగలో తొక్కితే ఎలా? చంద్రబాబు ఒత్తిడికి ఈసీ తలొగ్గడం సిగ్గుచేటు. అందుకే చంద్రబాబు కుట్రలు.. గత ఐదేళ్లలో పౌర సేవలు, సంక్షేమం, విద్య, వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. వీటి ప్రభావం ప్రజలపై ఉండదనుకుంటే అది భ్రమే. ఈ విషయాన్ని చంద్రబాబు గ్రహించారు కాబట్టే ఓట్లు గంపగుత్తగా వైఎస్సార్ సీపీకి వస్తాయనే భయంతో పవన్, బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు. లోపాయికారీగా కాంగ్రెస్తోనూ కలసి ఎన్నికలకు వెళ్లారు. వైఎస్సార్ సీపీ ఓట్లను చీల్చి లాభపడాలని నానా గడ్డి కరిచి విష ప్రచారం చేశారు. ఆయన ఇన్ని చేసినా మాపట్ల ప్రజల్లో పాజిటివ్ ట్రెండ్ కొనసాగింది. ఇటీవల ఎన్నికల రిగ్గింగ్ మాదిరిగానే ఎగ్జిట్ పోల్స్ కూడా రిగ్గింగ్ జరుగుతున్నట్టుంది. బీజేపీకి ఉత్తరాదిలో సీట్లు బాగా తగ్గుతుండటంతో దక్షిణాదిలో పెరుగుతున్నట్టు చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో వారికి నచ్చిన లెక్కలేసి చెబుతున్నారు. మాకు అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మహిళల ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం వైఎస్సార్ సీపీకి కచ్చితంగా అనుకూలించింది. ఐదేళ్లలో మేం ప్రజలకు మంచి చేశాం. టీడీపీకి ఎందుకు అనుకూలంగా సర్వేలు వచ్చాయో వాళ్లు చెప్పగలరా? మరో రెండు రోజులు వారికి నచ్చిన అంకెలు చెప్పుకుంటూ ఆనందం పొందాలంటే పొందొచ్చు. -
వైఎస్సార్సీపీకి అదే కలిసొచ్చింది.. ఎగ్జిట్ పోల్స్పై సజ్జల కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ వైఎస్సార్సీకి అనుకూలంగా ఉందని.. మేం అంచనా వేసిందే ఎగ్జిట్ పోల్స్లో వచ్చాయని.. ఫలితాలు దీనికంటే మెరుగ్గా ఉంటాయని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్పై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, మహిళలే కాదు కుటుంబం మొత్తం తమవైపే ఉందన్నారు. ‘‘మా పాలనలో మహిళలకు పెద్దపీట వేశాం.. వారి ఆత్మగౌరవాన్ని పెంచాం. సీఎం జగన్ ఉంటేనే మంచి జరుగుతుందని మహిళలు నమ్మారని సజ్జల అన్నారు. విపక్షాలు కూటమిగా వచ్చాయి. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం టీడీపీకి లేదు. వైఎస్సార్సీపీకి పాజిటివ్ అజెండా కలిసి వచ్చింది. ఈ ఐదేళ్లలో మార్పు వచ్చిందని ప్రజలు నమ్మారు’’ అని సజ్జల పేర్కొన్నారు.‘‘లంచాలు లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. భారీస్థాయిలో మహిళలు వైఎస్సార్సీపీని మరోసారి ఆదరించారు. సర్వేలు మాకు అనుకూలంగా ఉన్నాయి’’ అని సజ్జల చెప్పారు. -
సజ్జల అరెస్ట్ అంటూ ఎల్లో మీడియా ఓవర్ యాక్షన్...దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన విజయ్ బాబు
-
కౌంటింగ్ సమయంలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలి: సజ్జల
-
ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు సమయంలో కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తతతో వ్యవహరించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీల ఏజెంట్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. బుధవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో కౌంటింగ్ ఏజెంట్ల వర్క్షాప్, జూమ్ మీటింగ్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల సందేహాల నివృత్తికి కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. ఎటువంటి సమస్య ఉన్నా కేంద్ర కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. నియమ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో గుంటూరులో వేల ఓట్లు మన పార్టీ నష్టపోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ప్రతి ఓటూ విలువైనదేనని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని, దానికి సంబంధించి ఆదేశాలు రాగానే తెలియజేస్తామని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు వ్యవస్ధలను మేనేజ్ చేస్తూ వారికి అనుకూలంగా నిర్ణయాలు వచ్చేలా చేస్తున్నారని అన్నారు. ఇటీవలి కాలంలో ఈసీ తీరు అనుమానాలకు తావిచ్చేలా ఉన్నందున, అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల నియమ నిబంధనల పట్ల పూర్తి అవగాహనతో ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని, మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని, ఇందులో ఎటువంటి అనుమానమూ లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విస్పష్టంగా చెప్పారు. వచ్చే నెల 9వ తేదీన వైఎస్ జగన్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. సమావేశానికి హాజరైన వారికి విశ్రాంత ఆర్డీవో ముదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పలు సూచనలు చేశారు. ఏజెంట్ల సందేహాలు నివృత్తి చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఇన్చార్జి, శాసన మండలి విప్ లేళ్ళ అప్పిరెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.పోస్టల్ బ్యాలెట్ లెక్కించే విధానం⇒ ఎన్నికల అధికారి నియోజకవర్గం ఓట్ల లెక్కింపులో మొదట విధిగా పోస్టల్ బ్యాలెట్లని లెక్కించాలి⇒ మొదటి కవరు–బి పైన నియోజకవర్గం పేరు, ఎన్నికల అధికారి అడ్రెస్సు, ఓటరు సంతకం ఉండాలి. (ఓటరు సంతకం తప్పనిసరికాదు).⇒ మొదటి కవరు–బి (ఫారం – 13సి) తెరిచి చూసినప్పుడు అందులో 13 – ఏ డిక్లరేషన్, ఫారం 13–బి (కవరు – ఏ) విడివిడిగా ఉండాలి. లేకపోతే అది చెల్లుబాబు కాదు. అందులో కవరు – ఏ లేకపోయినా, 13–ఏ డిక్లరేషన్ లేకపోయినా, 13–ఏ డిక్లరేషన్ మీద ఓటరు సంతకం లేకపోయినా, 13–ఏ డిక్లరేషన్ మీద పోస్టల్ బ్యాలెట్ క్రమ సంఖ్య నమోదు చేయకపోయినా, నమోదు చేసినట్లయితే అది 13–బి (పోస్టల్ బ్యాలెట్ కవరు) మీద ఉన్న క్రమ సంఖ్యతో సరిపోలక పోయినా, 13 – ఏ డిక్లరేషన్ మీద గజిటెడ్ అధికారి సంతకం లేకపోయినా, ఒకవేళ సంతకం ఉండి హోదా తెలియజేసే స్టాంప్ లేదా హోదా తెలియజేసే విధంగా చేతితో రాసి కాని లేకపోతే ఆ పోస్టల్ బ్యాలెట్ చెల్లనిదిగా పరిగణించాలి.⇒ 13– ఏ డిక్లరేషన్లో అన్ని అంశాలు సరిగా ఉన్నట్లయితే, ఫారం 13 – బి పోస్టల్ బ్యాలెట్ కలిగి ఉన్న కవరు(కవరు – ఏ)ను పరిశీలించాలి. 13– ఏ డిక్లరేషన్లో పేర్కొన్న బ్యాలెట్ పేపర్ క్రమసంఖ్య, 13 – బి పోస్టల్ బ్యాలెట్లో ఉన్న క్రమసంఖ్య ఒకటి కాకపోయినా, ఓటరు ఎవ్వరికీ ఓటు వేయకపోయినా, ఓటరు తమ ఓటుని ఒకరికంటే ఎక్కువ మందికి వేసినా, బ్యాలెట్ పేపరు చిరిగిపోయి పూర్తిగా సమాచారం కనిపించకపోయినా, ఓటరు ఓటుని ఎవరికి వేశారో పూర్తి సందిగ్ధంగా ఉన్నప్పుడు, ఓటరు తనే ఓటు వేసినట్లుగా గుర్తించినప్పుడు (ఉదాహరణకు ఓటరు పేరు రాసినా, సంతకం చేసినా) దానిని చెల్లని ఓటుగా పరిగణించాలి. ప్రతి బ్యాలెట్ పేపర్లో నమోదు చేసిన అంశాలను పోటీ చేసే అభ్యర్థుల ప్రతినిధిగా ఉన్న ఏజెంట్/అభ్యర్థికి విధిగా సంబంధిత ఎన్నికల అధికారి చూపించి నిర్ణయం తీసుకోవాలి. బ్యాలెట్ పేపరు లెక్కించిన తరువాత రిజల్ట్ షీట్ (ఫారం–20)లో నమోదు చేయాలి. -
మళ్లీ జగనే.. నో డౌట్
-
అవతలి పార్టీల ఆటలు సాగనివ్వద్దు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే, ప్రత్యర్థి పార్టీ పోలింగ్ ఏజెంట్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కాగా, వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం కౌంటింగ్ ఏజెంట్లకు వర్క్షాప్ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ..‘ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కౌంటింగ్ జరిగేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లతో అప్రమత్తంగా వ్యవహరించాలి. అవతలి పార్టీల ఆటలు సాగనివ్వద్దు. వైఎస్సార్సీపీ ప్రభుత్వమే కచ్చితంగా మళ్లీ అధికారంలోకి వస్తుంది. జూన్ తొమ్మిదో తేదీన ప్రమాణ స్వీకారం ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానం లేదు’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఈసీ అంపైర్లా లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల కమిషన్కు చంద్రబాబు వైరస్ సోకిందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అందుకే ఎన్నికల కమిషన్ అంపైర్లా నిష్పక్షపాతంగా వ్యవహరించడంలేదని.. పోలింగ్ రోజు నుంచి ఇప్పటివరకూ వ్యవహరిస్తున్న తీరే అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో అన్నింటినీ గత ఐదేళ్లూ సీఎం జగన్ అమలుచేశారు. సుపరిపాలన అందించారు.పరీక్షలో వంద శాతం మార్కులు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మేం పరీక్షలు అలాగే రాశాం. వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించడం తథ్యం. వారంలో టీడీపీ పీడ విరగడ కావడం ఖాయం. బహుశ బీజేపీకి ఉత్తరాదిలో కలిసొస్తుందన్న కారణంతో అమిత్ షా దక్షిణాదిలో సీట్లు వస్తాయని చెప్పారేమో. ఉద్యోగులూ సమాజంలో భాగమే. వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లు.. తమకు అనుకూలంగా ఉన్నట్లు టీడీపీ భ్రమపడుతోంది. గతంలో పోస్టల్ బ్యాలెట్ కవర్పై సీరియల్ నంబర్లేదని తిరస్కరించారు. ఈసారి ఏమీలేకున్నా పరిగణనలోకి తీసుకోవాలని టీడీపీ వాళ్లే అడుగుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏ మార్గదర్శకాలు జారీచేసినా దేశమంతా ఒకేలా ఉండాలి. దేశమంతా ఎలాంటి నిబంధనలు ఉంటాయో ఇక్కడ కూడా అవే నిబంధనలు అమలుచేయాలి.మాచర్లలో పిన్నెల్లి లక్ష్యంగా కుట్ర..ఇక 15 రోజులుగా మాచర్లలో ఏం జరుగుతోందో అందరూ గమనించాలి. అక్కడి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని లక్ష్యంగా చేసుకుని కుట్ర జరుగుతోంది. మాచర్ల కేంద్రంగా టీడీపీ, ఎల్లోమీడియా గందరగోళం సృష్టిస్తోంది. నిష్పక్షపాతంగా ఈసీ వ్యవహరించాలన్నదే మా కోరిక. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పడిన నాటి నుంచి ఎన్నికల కమిషన్కు చంద్రబాబు వైరస్ సోకినట్లుగా ఉంది. ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరే ఈ అనుమానాలకు కారణం. ఈసీ జోక్యం మాచర్ల కేసులో తీవ్రంగా కనిపిస్తోంది.మాచర్ల నియోజకవర్గం పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ఎమ్మెల్యే పిన్నెల్లి ధ్వంసం చేసినట్లుగా ఉన్న వీడియో ఎలా బయటకొచ్చిందో ఈసీ చెప్పడంలేదు. అదే నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. ఆ వీడియోలను బయటపెట్టాలి. పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓటర్లపై టీడీపీ గూండాలు చేసిన దాడుల వీడియోలనూ బయటపెట్టాలి. ఈవీఎంలు ధ్వంసమైన పోలింగ్ కేంద్రాల పరిధిలో రిగ్గింగ్కు పాల్పడింది కాబట్టే టీడీపీ రీపోలింగ్ కోరడంలేదు. వైఎస్సార్సీపీకి అన్యాయం జరిగింది కాబట్టే ఎమ్మెల్యే పిన్నెల్లి రీపోలింగ్ కోరుతున్నారు.పదిరోజులు ఆ సీఐ నిద్రపోయారా?ఇక ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లికి హైకోర్టు బెయిల్ ఇవ్వగానే.. పోలింగ్ మరుసటి రోజు అంటే ఈనెల 14న జరిగిన అల్లర్లలో తన తలకు గాయమైందని.. ఆ ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లి ఉన్నారని పది రోజుల తర్వాత సీఐ కేసు పెట్టడమేంటి? పది రోజులూ సీఐ ఎక్కడ నిద్రపోయారు? ఆ సీఐ తరఫున ప్రైవేట్ లాయర్ ఎలా వాదిస్తారు? ఇందుకు ఈసీ ఎలా అనుమతిస్తుంది. పోలీసుల ద్వారా పిన్నెల్లిని అంతమొందించడానికి చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. అందుకే ఏడుగురి హత్య కేసులో నిందితుడైన బ్రహ్మారెడ్డిని టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దించారు.అలాగే, మాచర్లలో పోలీసులు వైఎస్సార్సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేశారు. కారంపూడిలో వైఎస్సార్సీపీ శ్రేణులపై, ఆస్తులపై టీడీపీ రౌడీలు ఇష్టారాజ్యంగా దాడులకు పాల్పడితే పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడంలో ఆంతర్యమేమిటి? పోలింగ్ అయిపోయిన తరువాత బైండోవర్, రౌడీషీట్లు వేస్తున్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులకు అన్ని విధాలా అండగా ఉంటాం. ఇదంతా తాత్కాలికమే. ఫలితాల అనంతరం జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారు. గీత దాటి పక్షపాతంగా వ్యవహరిస్తున్న అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.కౌంటింగ్ సమయంలో ఈసీ నిష్పక్షపాతంగా ఉండాలిచంద్రబాబు గతంలో ఎన్నికల కమిషన్పై ఎలా దాడికి వెళ్లారో చూశాం. వైఎస్ జగన్ ఎప్పుడూ ఈసీపై చంద్రబాబులా వ్యవహరించలేదు. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. కౌంటింగ్ సమయంలోనైనా ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని మేం కోరుతున్నాం. కేవలం వ్యవస్థలను మేనేజ్ చేయడమే లక్ష్యంగా చంద్రబాబు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.గోబెల్స్ ప్రచారం చేసి.. వ్యక్తిత్వ హననానికి పాల్పడి.. బెదిరించి అధికారులను లొంగదీసుకుని తమ వైపు తిప్పుకునేలా ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు, ఎల్లో మీడియా కంటే ఉగ్రవాదులే నయం. ఎన్నికల సమయంలో చీఫ్ సెక్రటరీ (సీఎస్)ని తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఆయనపై అభూతకల్పనలతో తప్పుడు కథనాలు అచ్చేసి.. వాటిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తోంది. -
కౌంటింగ్లో అప్రమత్తత అవసరం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అభ్యర్థులంతా కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఏమరుపాటుకు తావివ్వరాదని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. వైఎస్సార్సీపీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లు, రీజనల్ కో–ఆర్డినేటర్లతో మంగళవారం ఆయన తాడేపల్లి నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా ఈసీ అనుసరిస్తున్న తీరు, అధికార యంత్రాంగంపై అనుమానాలున్న నేపథ్యంలో అందరూ ప్రజాస్వామ్యయుతంగా కౌంటింగ్ జరిగేలా చూడాలని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ⇒ ప్రజల ఆదరాభిమానాలతో వైఎస్సార్సీపీ తిరిగి విజయం సాధించబోతోంది. కాబట్టి మరింత జాగరూకత అవసరం. అభ్యర్థులకు ఏమైనా అనుమానాలుంటే వాటిని వెంటనే నివృత్తి చేసుకోవాలి. కౌంటింగ్ ఏజెంట్ల జాబితాను 31వ తేదీలోగా ఇవ్వాలి. పారీ్టకి అంకితభావంతో పనిచేసే కార్యకర్తలను కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించుకోవాలి. ⇒ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అవకాశాలను తనకు అనుకూలంగా మలుచుకుని కుయుక్తులు పన్నుతున్నందున నియమ నిబంధనలు కచి్చతంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ఏజెంట్లదే. పోస్టల్ బ్యాలెట్, ఇతర అంశాలపై ఈసీ గైడ్లైన్స్కు భిన్నంగా ఆదేశాలు ఇవ్వమని కూడా ఈసీపై ఒత్తిడి చేస్తున్నారు. కౌంటింగ్ ప్రాంతాలలో పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ⇒ కౌంటింగ్ ఏజెంట్ల నియామకం రెండు రోజుల్లో పూర్తి చేయాలి. కౌంటింగ్ ప్రారంభ సమయంలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుంది. ఫైనల్ గా డిక్లరేషన్ తీసుకునే వరకు అప్రమత్తంగా ఉండాలి. ⇒ సీఎం జగన్ తిరిగి విజయం సాధించాలని ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంత బలంగా కోరుకుంటున్నారో ఏజెంట్లు కూడా ప్రతి టేబుల్ దగ్గరా అంత పట్టుదలగా ఉండాలి. ఈ నెల 29వ తేదీనాటికి కౌంటింగ్ ఏజెంట్ల ఫార్మాట్లో పేర్లు, ఫోన్ నంబర్ తదితర వివరాలు అందించాలి. మన ఏజెంట్లు ఎక్కడ కూర్చోవాలో ముందుగా తెలుసుకోవాలి. ⇒ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో చాలా అప్రమత్తత అవసరం. వీటివల్లే గతంలో గుంటూరులో వేలాది ఓట్లు మనపార్టీ నష్టపోవాల్సి వచి్చన విషయాన్ని గుర్తుంచుకోవాలి. -
ఈసీకి చంద్రబాబు వైరస్
-
ఈసీ అంఫైర్లా వ్యవహరించలేదు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఈవీఎంల్లో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహగానాలతో లాభమేంటి? అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోందన్నారు.‘‘10-15 రోజులుగా మాచర్ల సెంటర్గా టీడీపీ, ఎల్లో మీడియా గందరగోళం సృష్టిస్తోంది. పోలింగ్ కేంద్రంలోని పిన్నెల్లి వీడియో ఎలా బయటికి వచ్చింది?. టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదు. కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహారశైలి మారింది.’’ అని సజ్జల పేర్కొన్నారు. ఈసీ కక్ష సాధింపు ధోరణిలో వెళ్లాల్సిన అవసరమేంటి? ఈసీ అంఫైర్లా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.‘‘బాధితులు రీపోలింగ్ అడగాలి.. టీడీపీ ఎందుకు అడగట్లేదు?. సీఎస్ను తప్పించాలని కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు వైరస్తో ఈసీ ఇన్ఫెక్ట్ అయ్యింది’’ అని సజ్జల పేర్కొన్నారు. -
టీడీపీ దాడులపై చర్యలెందుకు తీసుకోలేదు?
సాక్షి, అమరావతి: అమాయక ఓటర్లపై టీడీపీ గూండాలు చేసిన దాడులకు సాక్ష్యాలున్నా చర్యలెందుకు తీసుకోవట్లేదని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సోషల్ మీడియా వేదికగా గురువారం సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘానికి ప్రశ్నలు సంధించారు. అలాగే పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ గూండాల అరాచకాలకు సంబంధించిన వీడియోలను ఆయన సామాజిక మాధ్యమం (ఎక్స్)లో పోస్టు చేశారు. ‘మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా? వీడియో సరైనదేనా? కాదా? అనేది నిర్ధారించకుండానే ఈసీ చర్యలకు ఎలా దిగుతుంది? ఒకవేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వచి్చంది? మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజున ఈవీఎంల ధ్వంసానికి సంబంధించి ఏడు ఘటనలు జరిగాయని ఎన్నికల కమిషనే చెబుతోంది.అలాంటప్పుడు కేవలం ఈ ఒక్క వీడియో మాత్రమే ఎలా లీక్ చేశారు? ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను.. 7 చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన పూర్తి వీడియోలను ఎందుకు బయటపెట్టట్లేదు? ఒక చిన్న క్లిప్పింగ్ మాత్రమే బయటకు ఎలా వదిలారు?అన్ని వీడియోలు బయటకు వస్తే అసలేం జరిగిందో తెలుస్తుంది కదా! తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు?’ అని సజ్జల ప్రశి్నంచారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే అమాయక ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని సజ్జల చెప్పారు.వారి మీద ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదు? దాని వెనుక ఉన్న వారిని ఎందుకు పట్టుకోవడం లేదు? అని నిలదీశారు. టీడీపీ మూకల రిగ్గింగ్లపై తాము ఫిర్యాదు చేసిన అన్నిచోట్లకు సంబంధించిన వీడియోలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల అనుమానాలన్నీ నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్కు కచి్చతంగా ఉందన్నారు. మాచర్లలో ప్రజాబలమున్న పిన్నెల్లి ఇప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని.. ఐదోసారి కూడా గెలవబోతున్నారని చెప్పారు. ఏదో నలుగురు అధికారులను మేనేజ్ చేసి.. అవసరమైనంత వరకే వీడియోను కట్ చేసి.. దొంగ వీడియోలను లీక్ చేసి.. కేసులు పెట్టినంత మాత్రాన భయపడే వ్యక్తులం కాదన్నారు. -
ఈసీకి సజ్జల 10 ప్రశ్నలు
-
ఆ ఒక్క వీడియోనే లీకైందా?.. ఈసీకి సూటి ప్రశ్నలు సంధించిన సజ్జల
గుంటూరు, సాక్షి: మాచర్ల పాల్వాయి గేట్ ఈవీఎం ధ్వంసం ఉదంతంపై తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ వీడియో లీకేజీ వ్యవహారంలో ఎన్నికల సంఘం తీరుపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదే విషయంపై స్పందిస్తూ ఎన్నికల సంఘానికి కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ‘‘మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెబుతున్న పాల్వాయి గేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ప్రకటిస్తుందా?. వీడియో సరైందేనా? కాదా? అనేది నిర్దారించకుండానే ఎన్నికల సంఘం చర్యలకు ఎలా దిగుతుంది?. ఒక వేళ నిజమైనదే అయితే ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎలా వస్తుంది?.. A set of questions to the EC in light of how the Commission dealt with the recent Macherla issue - While Pinnelli deals with the charges legally, the @YSRCParty has certain questions which the @ECISVEEP must address.— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024 A set of questions to the EC in light of how the Commission dealt with the recent Macherla issue - While Pinnelli deals with the charges legally, the @YSRCParty has certain questions which the @ECISVEEP must address.— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024 .. మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ నాడు ఈవీఎంలకు సంబంధించి ఏడు ఘటనలు జరిగాయని ఈసీనే చెబుతుంది కదా.! అలాంటప్పుడు కేవలం ఒక వీడియో మాత్రమే ఎలా లీక్ చేస్తుంది?. ఈసీకి చిత్తశుద్ధి ఉంటే మొత్తం వీడియోలను, 7 చోట్ల జరిగిన ఘటనలకు సంబంధించిన ఫుల్ వీడియోలను ఎందుకు బయటపెట్టదు?. 3. More importantly, in the videos attached below, there is clear evidence of TDP goons attacking innocent voters. Why has no action been initiated in these instances? pic.twitter.com/iYVvwO5nXj— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala) May 23, 2024అన్ని వీడియోలు బయటకు వచ్చినప్పుడే అసలేం జరిగిందన్నది బయటకు వస్తుంది కానీ.. ఒక చిన్న క్లిప్పింగ్ను మాత్రమే బయటకు ఎలా వస్తుంది?తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు, వారిని గుర్తించేందుకు ఈసీ ఎందుకు సరైన పద్ధతిలో నిర్ణయాలు తీసుకోవడం లేదు?. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న రెండు వీడియోలను పరిశీలిస్తే.. అమాయక ఓటర్లపై టీడీపీ గుండాలు దాడి చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. వారి మీద ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకోవడం లేదు? దాని వెనక ఉన్నవారిని ఎందుకు పట్టుకోవడం లేదు? అని సజ్జల ప్రశ్నించారు. వీటికి సమాధానాలేవీ?13న జరిగితే 21వ తేదీన వీడియో బయటకు ఎందుకు వచ్చింది?గుర్తు తెలియని వ్యక్తులని ఎలా ఫిర్యాదు చేయగలిగారు?స్వయంగా ఎమ్మెల్యే ఉంటే ఇంత గోప్యత ఎందుకు? ఇన్నాళ్లూ టీడీపీ వాళ్లు గుర్తించలేదా?పిన్నెల్లి అనుచరులు తమను బెదిరించారనే టీడీపీ వాదన నమ్మేలా ఉందా?ఈ నెల 20న ఫిర్యాదు నమోదు అయ్యిందని ఈసీ వివరణ, అంటే.. ఇంతకాలం సీఈవో ఆఫీస్ ఆ ఫుటేజీని చూడలేదా?అసలు ఇంతకాలం ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేశారు?మిగతా వీడియోల సంగతి ఏంటి? అందులో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారనేది ఈసీ ఎందుకు దాస్తోంది? -
కుప్పం నుండి ఇచ్చాపురం వరకు అందుకే పోలింగ్ శాతం పెరిగింది
-
ఎన్నికల్లో విజయంపై మేం ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నాం
-
ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణితో వ్యవహరించింది
-
ఎవరి అంచనాలు వాళ్ళవి.. మా అంచనా ప్రకారం
-
ఉప్పెనలా ప్రభుత్వ సానుకూలత: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: ఈ ఎన్నికల్లో పోలింగ్ సరళిని చూస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా కనిపించిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఐదేళ్లలో సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు పేదలందరి అభివృద్ధి, మహిళా సాధికారత కోసం పాటుపడ్డారని తెలిపారు. అందుకే సీఎం జగన్కు అట్టడుగు వర్గాలు అండగా నిలిచి ఓటింగ్కు పెద్ద ఎత్తున వచ్చి అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. ఉదయం నుంచే మహిళలు, వృద్ధులు తరలివచ్చి స్వేచ్ఛగా ఓటు వేశారన్నారు. ఆయన సోమవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘2019లోనూ ఉప్పెనలా పోలింగ్ జరిగింది. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత కనిపించింది. ఈసారి ఓటింగ్ సరళి, భారీ పోలింగ్ ప్రభుత్వ సానుకూలతను చూపిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇది అరుదు’ అని చెప్పారు. ఈ ఎన్నికల్లో మంచికి ఓటేయాలని ప్రజలు ముందుగానే నిర్ణయించుకొన్నట్టు ఇది సూచిస్తోందన్నారు. ప్రజాస్వామ్య పటిష్టతకు, రాజకీయ చైతన్యానికి ఇదొక తార్కాణంగా అభివర్ణించారు. ఇంకా ఆయన ఎమన్నారంటే..నైరాశ్యంలో టీడీపీ దాడులుఎన్నికల ప్రచారం నుంచి పోలింగ్ వరకు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసేందుకు టీడీపీ దుష్ట పన్నాగాలు చేసింది. వారి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతుగా ప్రజలు ఓట్లేయడం చూసి టీడీపీ రౌడీ మూకలు నిరాశ, నిస్పృహలతో దాడులకు తెగబడ్డాయి. రాష్ట్రమంతటా టీడీపీ గూండాలు విశృంఖలంగా రోడ్లపై కత్తులు, కర్రలు వంటి మారణాయుధాలతో భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. చిత్తూరు, నరసరావుపేట, మాచర్ల, దాచేపల్లి, పెనమలూరు, తాడిపత్రి, పొన్నూరు, జీడీ నెల్లూరు, అద్దంకి, పీలేరు, ఆత్మకూరు, జగ్గయ్యపేట, సత్తెనపల్లిలో విధ్వంసానికి పాల్పడ్డారు.పోలీసు అధికారులు, ఎన్నికల కమిషన్ అబ్జర్వర్ల అండతోనే టీడీపీ హింసాకాండకు పాల్పడింది. ఏదో రకంగా పోలింగ్ను అడ్డుకోవాలనే దుస్సాహసం టీడీపీలో కనిపించింది. ఎన్నికల అబ్జర్వర్లు పల్నాడు జిల్లాను బందిఖానా చేసినా.. టీడీపీ గూండాలు ఎలా రెచ్చిపోయారు? ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని వైఎస్సార్సీపీ ఎంతో సంయమనంతో వ్యహరించింది. టీడీపీ మాత్రం ప్రభుత్వ అనుకూల ఓటరు బయటకు రాకూడదని కుట్రలు చేసింది. కచ్చితంగా పోలీసులు టీడీపీతో కుమ్మక్కయ్యారు. ఎన్నికల అధికారుల నుంచి కూడా పోలీసులపై ఒత్తిడి వచ్చింది.మరోవైపు సస్పెన్షన్లో ఉన్న పోలీసు అధికారి ఏబీ వెంకటేశ్వర్లు టీడీపీ ఆఫీసులో కూర్చుని అధికారంలోకి వచ్చేస్తున్నామంటూ ఎస్పీలను బెదిరించారు. చివరికి పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో దాడులకు తెగబడ్డారు. మరోవైపు పోలింగ్కు ఒక రోజు ముందు కూడా అన్యాయంగా పోలీసులను బదిలీ చేశారు. వారి ఆగడాలకు అడ్డుగా ఉంటారనే ఎటువంటి ఫిర్యాదులూ లేకపోయినా తప్పించేశారు. 2019 ఎన్నికల్లోనూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని చంద్రబాబు దబాయించారు. ఇప్పుడు కేంద్రంతో ఒత్తిడి చేయించి వారి కార్యాన్ని నేరవేర్చుకోవాలని చూశారు. ఎన్నికల కమిషన్కు వీలైనంత సపోర్టు ఇవ్వాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్సీపీ వారి ప్రతి నిర్ణయాన్ని అంగీకరించింది. మేము ఎంత సర్దుకుపోయినా దానిని లోకువగా తీసుకున్నారు.సీఎం జగన్ అజెండా పోలింగ్లో స్పష్టమైందిటీడీపీ అజెండా ప్రజల ఆకాంక్షలకు దూరంగా ఉంది. అధికారం, అండ కోసం టీడీపీ కేంద్రంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుని, ఓట్ల కోసం ఓ పెద్ద సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కలుపుకొన్నా ఫలితం శూన్యమైంది. చెప్పుకోవడానికి గతంలో చేసిందేమీ లేకపోవడం, భవిష్యత్తులో చేసే దానిపై స్పష్టత ఇవ్వకుండా పోలింగ్ రోజు వరకు నాటకాలాడారు. సీఎం జగన్పై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. వారి పప్పులు ప్రజల దగ్గర ఉడకలేదని తెలిసిన తర్వాత దాడులకు తెగబడ్డారు.సీఎం జగన్ పేద కుటుంబాల అభివృద్ధికి ఎప్పుడైతే యజ్ఞం ప్రారంభించారో అప్పుడే ఆయన అజెండా రూపుదిద్దుకుంది. అప్పటి నుంచి దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అజెండా ఉండాలని ప్రజలు భావించడం పోలింగ్లో స్పష్టంగా తెలుస్తోంది. సీఎం జగన్ అజెండాతో పోటీపడే శక్తి లేకపోవడంతోనే కృత్రిమ అజెండాలతో ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై దుష్ప్రచారం చేసినా టీడీపీ పాచికలు పారలేదు.కుప్పంలో టీడీపీ రిగ్గింగ్వెబ్ కాస్టింగ్ వచ్చిన తర్వాత కూడా టీడీపీ నిర్లజ్జగా రిగ్గింగ్కు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. కుప్పంలోనే 1, 2, 57, 92, 93, 94, 194, 195, 203 పోలింగ్ బూత్లలో రిగ్గింగ్ చేశారు. మాచర్ల, టెక్కలి, వేమూరు, గుంటూరు వెస్ట్, వినుకొండ, సత్తెనపల్లి, అద్దంకి, పొన్నూరు, అమలాపురంలో జరిగిన రిగ్గింగ్ ఘటనలపై ఎన్నికల కమిషన్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశాం. టీడీపీ నేతలు ఉక్రోశంతో ఈవీఎంలను పగలగొట్టారు. ఇలా టీడీపీ దుశ్చర్యలపై 80కి పైగా ఫిర్యాదులు చేశాం. -
ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా ఓటెత్తింది: సజ్జల
సాక్షి, తాడేపల్లి: సీఎం జగన్ పేద వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని.. ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా ఓటెత్తిందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందుగానే ప్రజలు స్పష్టమైన నిర్ణయానికి వచ్చారన్నారు.ప్రజలు ఓటు వేసేందుకు వెల్లువెత్తారు. ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు సానుకూల ఓటుతో క్యూ కట్టారు. ఇంకా పోలింగ్ బూత్ల దగ్గర క్యూలైన్లో ఓటర్లున్నారని సజ్జల అన్నారు.‘‘చిత్తూరు జిల్లాలో ఉదయం కత్తిపోట్లతో టీడీపీ నేతలు ప్రారంభించారు. టీడీపీ కార్యకర్తలు, గూండాలు రెచ్చిపోయి దాడులు చేశారు. అద్దంకి, పీలేరు, సత్తెనపల్లిలో హింసాకాండకు పాల్పడ్డారు. టీడీపీ మూకలు రిగ్గింగ్కు పాల్పడ్డారు. ఈవీఎంలు ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారు. పేద ప్రజల అభివృద్ధే.. రాష్ట్రాభివృద్ధికి దారి తీస్తుంది’’ అని సజ్జల చెప్పారు.‘‘కేంద్ర ప్రభుత్వం అండతో పోలింగ్ డే వరుకూ టీడీపీ నాటకాలు, దాడులు అన్ని చూశాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై కూడా ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేశారు. టీడీపీ అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేశాం’’అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. -
టీడీపీ నైరాశ్యంలోకి వెళ్లి హింసను ప్రేరేపిస్తోంది: సజ్జల
సాక్షి, గుంటూరు: టీడీపీ ఓటమి నైరాశ్యంలోకి వెళ్లిపోయి హింసను రెచ్చగొట్టడానికి నానా ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కుప్పం, మాచర్ల, తాడిపత్రి, చిత్తూరు, దర్శి నియోజకవర్గాల్లో టీడీపీ హింసాత్మక ఘటనలను ఈసీ దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపారు.‘‘ఓటమి భయంతో టీడీపీ దాడులకు దిగుతోంది. వైఎస్సార్సీపీ శ్రేణులు వీటిని పట్టించుకోకుండా సంయమనంతో, శాంతియుతంగా వ్యవహరించి పెద్ద ఎత్తున పోలింగ్ జరిగేందుకు సహకరించాలి. ఓటు వేసేందుకు వచ్చిన మహిళలపై దుర్భాషలు ఆడుతూ.. బెదిరిస్తూ.. దాడులకు దిగుతున్నారు. అయినా చెదరని సంకల్పంతో మహిళలు భారీగా ఓటు వేసేందుకు తరలివస్తున్నారు’’ అని సజ్జల పేర్కొన్నారు.గంగాధర నెల్లూరు, విశాఖ వెస్ట్ నియోజకవర్గాల్లో బౌన్సర్లతో టీడీపీ నేతల హల్చల్పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల చరిత్రలో మొదటిసారిగా బౌన్సర్లను దించిన చరిత్ర టీడీపీది. పలుచోట్ల ఈవీఎంలు పనిచేయకపోవడం లేదా నెమ్మదిగా పనియచేయడం వల్ల వృద్ధులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లాం’’ అని సజ్జల తెలిపారు.‘‘ఎండ వేడిమి భరించలేక, క్యూలో నిలబడలేక వృద్ధులను ఇబ్బందులను పడుతున్నారన్నవిషయాన్ని ఈసీకి తెలిపాం. కొందరు సిబ్బంది నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తున్నందున ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని సజ్జల చెప్పారు. -
సజ్జల రామకృష్ణారెడ్డి ఓటు వేశారు
Pagination
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
బీజేపీ అందుకే వెనకపడింది
మాజీ పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్కు అస్వస్థత
పుష్ప ఒకలా..కల్కి మరోలా
మరో జంట బ్రేకప్..విడిపోయిన మలైకా, అర్జున్ కపూర్ ?
అతిగా తినడం.. వాంతి చేసుకోవడమా? అయితే ఇలా చేయండి!
ఐసీసీ అవార్డు అందుకున్న కోహ్లి.. వీడియో వైరల్
మనమే తో బ్లాక్ బస్టర్.. ప్రామిస్ చేస్తున్న శర్వానంద్
మోదీ మూడోసారి ప్రధాని కాలేడు : సోమనాథ్ భారతీ
విషాదం, కన్నీరు.. అనారోగ్యం
77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో హైదరాబాద్ ఫ్యాషన్ డిజైనర్ అరుణా గౌడ్ (ఫొటోలు)
Advertisement