-
‘తీహార్ జైల్లో కవిత చాలా ధైర్యంగా ఉన్నారు’
న్యూఢిల్లీ, సాక్షి: మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆ పార్టీ నేతలు పరామర్శించారు. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, బాల్క సుమన్లు శుక్రవారం ఉదయం ఆమెను కలిశారు. కుటుంబ సభ్యులు కాకుండా పార్టీ సంబంధిత నేతలు ఆమెతో ములాఖత్ కావడం ఇదే మొదటిసారి. ములాఖత్ అనంతరం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కవిత చాలా దైర్యంగా ఉన్నారు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే నమ్మకంతో ఉన్నారు.రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆ ప్రభుత్వాలు పాలసీలు రూపొందిస్తారు, అందులో ఉన్నవాళ్ళందరిని దోషులుగా చేరుస్తామంటే ఎలా?. రైతు చట్టాలు సహా అనేక పాలసీలు మోదీ తీసుకొచ్చారు. అవి ఎవరి ప్రయోజనాలకోసం తీసుకొచ్చారు?. కవిత దగ్గరనుంచి ఒక్క రూపాయి డబ్బు దొరకలేదు, మనీలాండరింగ్ యాక్ట్ ఎలా వర్తిస్తుంది?. లంచం డిమాండ్ చేసినట్లు ఆధారాలు లేవు అవినీతి నిరోధక చట్టం ప్రకారం సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తారు. ఈడీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. బీజేపీ లో చేరినవారిపై ఒకలా, చేరనివారిపై మరోలా సెలెక్టీవ్ గా ఈడీ వ్యవహరిస్తోంది.విపక్షాల గొంతు నొక్కేందుకు సీబీఐ, ఈడీ ని బీజేపీ వాడుకుంటోంది. బాల్క సుమన్ మాట్లాడుతూ.. కవిత చాలా దైర్యంగా ఉన్నారు. మానసికంగా బలంగా ఉన్నారు. విపక్ష నాయకులను అణిచివేయలనే అన్యాయంగా కవితను ఈకేసులో ఇరికించారు.లిక్కర్ స్కాం కేసులో మార్చి 15వ తేదీన ఈడీ హైదరాబాద్లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి రిమాండ్ మీద ఆమె తీహార్ జైల్లో ఉన్నారు. ఇక.. ఈ కేసులో ఈడీ, సీబీఐ వేర్వేరుగా ఆమెను అరెస్ట్ చేయగా.. బెయిల్ కోసం ఆమె కూడా విడివిడిగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ప్రస్తుతం వాటిపై విచారణ జరుగుతోంది. అంతకు ముందు సుప్రీం కోర్టు సూచనలతో ఆమె ట్రయల్ కోర్టు(ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు)లోనే బెయిల్ పిటిషన్లు వేశారు. ఇది రాజకీయ కక్షతోనే జరిగిన అరెస్టుగా ఆమె వాదించారు. అయితే.. ఆమె బయటకు వస్తే కేసును ప్రభావితం చేస్తారని దర్యాప్తు సంస్థల వాదనలో కోర్టు ఏకీభవించింది. ఆమె బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. -
తిహార్ జైలుకు బాంబు బెదిరింపు..
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో దేశంలో బాంబు బెదిరింపులు కలవరపెడుతున్నాయి. పాఠశాలలు, బస్టాండ్లు, ఎయిర్పోర్టులు, హాస్పిటల్స్ ప్రముఖుల నివాసాలు.. ఇలా ప్రతిచోటా బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా ఢిల్లీలోని తీహార్ జైలుకు బాంబు బెదిరింపు మెయిల్ అందింది.దీంతో జైలు అధికారులు ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశారు. జైలులోని ప్రముఖ రాజకీయ నాయకులతోపాటు కొందరు ఉన్నతస్థాయి ఖైదీలు ఉన్న సెల్లో బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, బాంబు డిటెక్షన్ టీమ్, పోలీసులు సోదాలు జరుపుతున్నాయి. ఇప్పటి వరకు అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులను అధికారులు గుర్తించలేదు. కాగా ఇటీవల ఢిల్లీలోని పాఠశాలలు, ఆసుపత్రులు, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్(ఐజీఐఏ) విమానాశ్రయానికి కూడా ఇలాంటి హెచ్చరికలు అందిన విషయం తెలిసిందే -
Aravind Kejriwal: నేను వచ్చేశా...
న్యూఢిల్లీ: త్వరలో తిరిగి వస్తానని చెప్పాను కదా! చెప్పినట్లే వచ్చేశా అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తనకు మధ్యంతర బెయిల్ ఇచి్చన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, ఇన్నాళ్లూ తనకు అండగా నిలిచి ఆశీస్సులందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నియంతృత్వం నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం తన శక్తిమేరకు పోరాడుతానని, తనకు 140 కోట్ల మంది ప్రజల మద్దతు కావాలని కోరారు. ప్రజలంతా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలన్నారు. తాను ఎంతగానో విశ్వసించే హనుమంతుడి ఆశీర్వాదంతో జైలు నుంచి బయటకు వచ్చానని తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ కన్నాట్ ప్లేస్లోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోబోతున్నానని, తనను చూడాలంటే ప్రజలు అక్కడికి రావాలని కేజ్రీవాల్ సూచించారు. ఆయన శనివారం మధ్యాహ్నం ఆప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతారు. రోడ్ షోలో పాల్గొంటారు. ‘ఇండియా’ కూటమిలో హర్షాతిరేకాలు అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్)తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. మరో నాలుగు దశల పోలింగ్ మిగిలి ఉన్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం తమ కూటమికి లాభిస్తుందని వారు చెప్పారు. సత్యమేవ జయతే అని ఆప్ నేతలు నినదించారు.‘‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా. అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ లభించిన ఈ విజయం మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. కేజ్రీవాల్ విడుదల న్యాయానికి ప్రతిబింబం. ఆయన రాకతో ‘ఇండియా’ కూటమిని మరింత బలోపేతం అవుతుంది. ఈ ఎన్నికల్లో మా విజయావకాశాలు ఇంకా పెరుగుతాయి’’ – ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి ‘‘హనుమాన్జీ కీ జై.. ఇది ప్రజాస్వామ్య విజయం. లక్షలాది మంది ప్రజల ప్రార్థనలు, ఆశీస్సులతో అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ లభించింది. వారందరికీ నా కృతజ్ఞతలు’’ – సునీతా కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ భార్య కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పొందడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పరిణామం ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి విజయానికి దోహదపడుతుందని భావిస్తున్నా’’ – మమతా బెనర్జీ, పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి ‘‘కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వును స్వాగతిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో మన దేశం దృఢంగా వ్యవహరిస్తోంది’’ – శరద్ పవార్, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత -
కేజ్రీవాల్ను చూసేందుకు.. భార్య సునీతకు అనుమతి నిరాకరణ
న్యూఢిల్లీ: తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను కలిసేందుకు ఆయన సతీమణిి సునీతకు అధికారులు అనుమతి నిరాకరించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే సోమవారం ఆయనను కలిసి మాట్లాడేందుకు సీఎం సతీమణి సునీత అనుమతి కోరారు. అయితే ఇందుకు జైలు అధికారులు అంగీకరించలేదని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు వెల్లడించింది. సునీత కలిసేందుకు అధికారులు అనుమతించకపోడంపై కారణాలు కూడా చెప్పలేదని పేర్కొన్నాయి.కాగా ఢిల్లీ మంత్రి ఆతిశీ నేడు 12.30 గంటలకు కేజ్రీవాల్ను కలవనున్నారు. మంగళవారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ కూడా అరవింద్ కేజ్రీవాల్తో సమావేశం కానున్నారు.ఈ ఇద్దరి సమావేశాలకు అనుమతినిచ్చిన నేపథ్యంలో సునీత అభ్యర్థనను తిరస్కరించామని జైలు వర్గాలు తెలిపాయి. ఇద్దరు నేతల భేటీ తర్వాత ఆమెను తన భర్తను కలిసేందుకు అనుమతిస్తామని పేర్కొన్నాయి. జైలు నియమాల ప్రకారం.. ఒక ఖైదీని ఒకేసారి ఇద్దరు వ్యక్తులు, వారంలో గరిష్టంగా నలుగురు కలవచ్చు. ఇదిలా ఉండగాఢిల్లీ ముఖ్యమంత్రిని ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న తన అధికారిక నివాసంలో అరెస్టు చేసింది. ఏప్రిల్ 1 నుంచి తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ కేజ్రీఆల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది.మరోవైపు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ సతీమణి సునీత ఆప్ తరపున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆదివారం పశ్చిమ ఢిల్లీ అభ్యర్ధి మహాబల్ మిశ్రా తరపున ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ.. తన భర్త కేజ్రీవాల్ను సింహంతో పోల్చారు. దిల్లీలో పాఠశాలలు నిర్మించడం, ఉచిత విద్యుత్ అందించడం, మొహల్లా క్లీనిక్లను ప్రారంభించినందువల్లే తన కేజ్రీవాల్ జైలుకెళ్లారన్నారు. ‘భారతమాత బిడ్డగా మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా.. నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటేయండి. నియంతృత్వానికి మీ ఓటుతో సమాధానం చెప్పండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ అని కోరారు. -
‘‘కేజ్రీవాల్ను చంపుతారా..?’’
న్యూఢిల్లీ: లిక్కర్స్కామ్ కేసులో జైలు పాలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బాధ్యతలను ఆయన భార్య సునీత కేజ్రీవాల్ భుజానికెత్తుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో పార్టీకి తానే స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్నారు. ఆదివారం(ఏప్రిల్28) పశ్చిమ ఢిల్లీ లోక్సభ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి తరపున సునీత రోడ్షోలో పాల్గొన్నారు. దేశంలో నియంతృత్వాన్ని పారద్రోలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలని రోడ్షోలో సునీత కోరారు. ప్రజల కోసం పనిచేసినందుకే తన భర్త కేజ్రీవాల్ను జైలుకు పంపించారన్నారు. తీహార్ జైలులో ఆయన సుగర్ వ్యాధికి సరైన చికిత్స అందించడం లేదన్నారు. అరవింద్ కేజ్రీవాల్ను చంపాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ ఒక సింహం ఆయనను ఎవరూ ఏం చేయలేరన్నారు. సునీతా కేజ్రీవాల్కు ఇది రెండో షో. శనివామే సునీత తన రోడ్షోలు ప్రారంభించారు. తొలి రోడ్షో తూర్పు ఢిల్లీ నియోజకవర్గంలోని కోండ్లిలో నిర్వహించారు. ఢిల్లీలో మే 25న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. -
జైల్లో కుదుటగానే కేజ్రీవాల్ ఆరోగ్యం: ఢిల్లీ ఎయిమ్స్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం ప్రస్తుతం కుదుటగానే ఉన్నట్లు తెలుస్తోంది. టైప్-2 డయాబేటిస్తో బాధపడుతున్న కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు అయిదుగురు డాక్టర్లతో కూడిన వైద్య బృందం ఆయనకు రెండు యూనిట్ల ఇన్సులిన్ అందిస్తోంది. ఈ మేరకు ఎయిమ్స్కు చెందిన అయిదుగురు వైద్యుల బృందం శనివారం కేజ్రీవాల్తో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. దాదాపు అరగంట పాటు ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. ప్రస్తుతం కేజ్రీవాల్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. ఈమేరకు జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది. కేజ్రీవాల్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నందున, ఆయన ఉపయోగిస్తున్న మందులనే కొనసాగించాలని మెడికల్ బోర్డు సూచించిం.ది మెడిసిన్లో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు పేర్కొంది. దీంతో పాటు ఆయనకు రెండు యూనిట్ల ఇన్సులిన్ డోసును కొనసాగించాలని తెలిపింది’ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వారం తర్వాత ఈ బృందం సీఎంను మరోసారి పరీక్షించనున్నట్లు పేర్కొన్నాయి.కాగా ఆయన షుగర్ లెవల్స్ 320కు పెరగడంతో గతవారం తీహార్ జైల్లో తొలి ఇన్సులిన్ అందించారు. తన వ్యక్తిగత వైద్యుడితో రోజూ వీడియో మాధ్యమంలో సంప్రదించే అవకాశాన్ని కల్పించాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. ఆరోగ్య కారణాల కింద బెయిల్ పొందేందుకే చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే స్వీట్స్, మామిడిపండ్లు, ఆలూపూరీ వంటి ఆహార పదార్దాలు తీసుకుంటున్నారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం.. కేజ్రీవాల్ అభ్యర్థనను తోసిపుచ్చింది.అయితే టైప్ 2 డయాబెటిక్ పేషెండ్ అయిన కేజ్రీవాల్కు క్రమం తప్పకుండా ఇన్సులిన్ అవసరమా?, ఇతర ఆరోగ్య సమస్యలేమైనా ఉన్నాయా? అని నిర్ణయించేందుకు ఎయిమ్స్ వైద్యులతో కూడిన కమిటీని ఏర్పాటుచేయాల్సిందిగా ఆదేశించింది. ఇంట్లో వండిన ఆహారాన్ని కూడా కోర్టు అనుమతించింది. అయితే అది ఖచ్చితంగా డాక్టర్ సూచించిన డైట్ చార్ట్కు కట్టుబడి ఉండాలని పేర్కొంది. -
తీహార్ జైల్లో సీఎం కేజ్రీవాల్తో మంత్రి సౌరభ్ భరద్వాజ్ భేటీ
మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఆ పార్టీ ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ కలిశారు.ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేను సీఎం కేజ్రీవాల్ను కలుసుకుని అరగంట సేపు ఫోన్ ద్వారా మాట్లాడుకున్నాం. మా ఇద్దరి మధ్యలో గ్రిల్, అద్దం ఉంది. మరోవైపు సీఎం కూర్చున్నారు.తమ ఇద్దరి ఫోన్ సంభాషణలో ఢిల్లీ ప్రజలు ఆందోళన చెందవద్దని కేజ్రీవాల్ అన్నట్లు తెలిపారు. ఢిల్లీ ప్రజల ఆశీర్వాదంతో తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా భరద్వాజ్ అన్నారు. #WATCH | Delhi: AAP leader and Delhi Minister Saurabh Bharadwaj says, "I met CM Arvind Kejriwal and talked to him for half an hour. There was a grill and a mirror in between, and on the other side CM was sitting; We communicated through a phone. He said that Delhiites should not… pic.twitter.com/J6AuUrfIzz— ANI (@ANI) April 24, 2024 -
‘సీఎం కేజ్రీవాల్ను జైల్లో చంపేందుకు కుట్ర’.. వ్యాఖ్యలపై బీజేపీ స్పందన
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను జైలులో హతమార్చేందుకు కుట్ర పన్నారన్న ఆమ్ ఆద్మీ నేతల ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఆప్ వ్యాఖ్యలు పచ్చి అబద్ధమని కొట్టిపారేసింది. ఇలాంటి సంచలన ప్రకటనలు చేయడం మానుకోవాలని బీజేపీ హితువు పలికింది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి షాజియా ఇల్మీ మాట్లాడారు. సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యంగా ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. మా కంటే జైలు నిర్వాహణ అధికారులు తమ రోగులను (ఖైదీలు) జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రభుత్వం, జైలు నిర్వహణ అధికారులు కేజ్రీవాల్ (క్షీణిస్తున్న) ఆరోగ్య పరిస్థితులకు ఎందుకు బాధ్యత వహించాలని కోరుకుంటారు. ఆయన ప్రాణాలను ప్రమాదంలో పడేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తారు? ఎవరైనా అలాంటి పనులు ఎందుకు చేస్తారా? అని ప్రశ్నించారు. జైల్లో కేజ్రీవాల్కి ఇన్సులిన్ ఇవ్వలేదన్న అతిషి ఆరోపణను తోసిపుచ్చారు. భారతదేశంలో ఏ జైలు ఇలా చేయదు. మనది చాలా బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్యం అని స్పష్టం చేశారు. ఆప్ నేతలు వ్యాఖ్యలు కేజ్రీవాల్కు వ్యతిరేకంగా జైల్లో కుట్ర జరుగుతోందని, జైలులో ఆయనకు ఏదైనా జరగవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అదే పార్టీకి చెందిన ఢిల్లీ క్యాబినెట్ మంత్రి అతిషి సైతం జైల్లో ఉన్న కేజ్రీవాల్కు ఇంటి భోజనం, మధుమేహానికి ఇన్సులిన్ ఇచ్చేలా నిరాకరించడం ద్వారా కేజ్రీవాల్ను చంపడానికి కుట్ర జరుగుతుందని ఆరోపించగా.. ఆమె చేసిన వ్యాఖ్యల్ని జైలు అధికారులు ఖండించారు. -
‘ఆయనేమైనా నేరస్థుడా? గ్యాంగ్స్టరా?’.. కోర్టులో కేజ్రీవాల్ తరుపు న్యాయవాది
న్యూఢిల్లీ : తనకు తీహార్ జైల్లోనైనా డయాబెటీస్ ఇన్సులిన్ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు తీర్పును రిజ్వర్లో ఉంచింది. ఏప్రిల్ 22న తీర్పును వెలువరించనుంది. మద్యం పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ గత కొన్నేళ్లుగా తీవ్ర మధుమేహంతో బాధపడుతున్నారు. మధుమేహం కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్ పడిపోతున్నాయని, ట్రీట్మెంట్ తీసుకునేందుకు వైద్యుల వీడియో కన్సల్టేషన్ కావాలని ఇప్పటికే పలు మార్లు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్ విజ్ఞప్తిని తిరస్కరిస్తూ వచ్చింది. కేజ్రీవాల్పై కుట్ర అయితే కేజ్రీవాల్కు ఇన్సులిన్ ఇవ్వకపోవడంపై ఆయన కుటుంబ సభ్యులు,ఆప్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్సులిన్ ఇవ్వకుండా కేజ్రీవాల్ను చంపేందుకు జైల్లో కుట్రజరుగుతోందని ఆప్ నేత అతిషి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కోర్టులో కేజ్రీవాల్ మరో పిటిషన్ ఈ తరుణంలో తనకు ఇన్సులిన్ ఇవ్వాలని కోరుతూ కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై శుక్రవారం విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కేజ్రీవాల్ తరుపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ఈడీ చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు. ఈడీ ఆరోపణల్ని తోసుపుచ్చిన న్యాయవాది కేజ్రీవాల్ జైలులో కేవలం మూడుసార్లు మామిడి పండ్లను తిన్నారని, నవరాత్రి ప్రసాదంగా ఆలూ పూరీని సేవించారని కోర్టుకు తెలిపారు. మెడికల్ బెయిల్ పొందేందుకు ఆప్ అధినేత హై షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటున్నారన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపణలను తోసిపుచ్చారు. మూడు మామిడి పండ్లే తిన్నది కేజ్రీవాల్ డయాబెటిక్ పేషెంట్ కాబట్టి ఇన్సులిన్ వేసుకునేందుకు అనుమతించాలన్న అభ్యర్థనపై సింఘ్వీ కోర్టులో మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ఇప్పటి వరకు 48 సార్లు ఇంటి నుంచి పంపిన భోజనం చేశారు. గ్లైసెమిక్ ఇండెక్స్ వ్యాల్యూ ఆధారంగా మూడు మామిడి పండ్లను మాత్రమే తిన్నారు. మామిడి (51) ,వైట్ రైస్ (73) లేదా బ్రౌన్ రైస్ (68) కంటే తక్కువగా ఉంది అని సింఘ్వీ కోర్టులో వాదించారు. కేజ్రీవాల్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న స్వీట్లను తింటున్నారన్న ఈడీ ఆరోపణలపై సంఘ్వీ స్పందించారు. సీఎం ఆరుసార్లు షుగర్ లేని స్వీట్లు తిన్నారని, షుగర్ లేకుండా టీ తాగేవారని, షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్లను వాడారని ఆయన అన్నారు. హాస్యాస్పందంగా ఈడీ తీరు మామిడి పండ్లు తిని మెడికల్ బెయిల్ తీసుకునేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నాంటూ ఈడీ చేసిన వ్యాఖ్యలు అత్యంత హాస్యాస్పదంగా ఉన్నాయని సింగ్వీ అన్నారు. విచారణ సందర్భంగా కేజ్రీవాల్ నేరస్థుడా? గ్యాంగ్స్టరా? సంఘ్వీ ప్రశ్నించారు. ఆయన ఇప్పటి వరకు 15 నిమిషాల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యుల సాయంతో ట్రీట్మెంట్ తీసుకోలేకపోయారని విచారం వ్యక్తం చేశారు. ఓసారి మీరే వైద్యులు కేజ్రీవాల్కు సూచించిన ఆహారాన్ని చూడండి. ఇందులో తియ్యని పండ్లు, లేదా ఇతర తీపి పదార్ధాల గురించి ప్రస్తావించలేదు’ అని కోర్టుకు విన్న వించుకున్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఏప్రిల్ 22న వెలవరించనుంది. #WATCH | Delhi: Ramesh Gupta, the lawyer for Delhi CM Arvind Kejriwal in the liquor policy case, says, "We have moved a petition requesting the Court to allow Mr Kejriwal to consult his doctor who has been treating him for the last many years. But that request was opposed by the… pic.twitter.com/FDc50cS04t — ANI (@ANI) April 19, 2024 -
‘ఉగ్రవాదిని కాదు.. నేను అరవింద్ కేజ్రీవాల్ని’
ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశానికి, ఢిల్లీ ప్రజలకు కోసం ఒక కుమారుడుగా, సోదరుడుగా పనిచేశారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. తీహార్ జైలు నుంచి సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని మీడియాకు సంజయ్ సింగ్ వెల్లడించారు. ‘నా పేరు అరవింద్ కేజ్రీవాల్. నేను ఉగ్రవాదిని కాదు. మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన నేను పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ను తీహార్ జైల్లో గ్లాస్ గోడ ద్వారా కలిశాను. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆప్పై ఎంత ద్వేషం పెంచుకున్నారో తెలుసుకోవడానికి ఇదే నిదర్శనం’ అని సీఎం కేజ్రీవాల్ తెలిపారన్నారు. 24 గంటలు సీఎం అరవింద్ కేజ్రీవాల్ మనోభావాలను దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారని సంజయ్ సింగ్ మండిపడ్డారు. ‘జైలులో ఉన్నది సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఆయన ఓ మట్టి మనిషి.. అయన్ను ఎంత విచ్ఛినం చేయాలని చూసినా అంతే బలంగా తిరిగి వస్తారు. తీహార్ జైలులో అరవింద్ కేజ్రీవాల్ కలసిన పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ భావోద్వేగానికి గురయ్యారు. ఇది మనందరికీ చాలా ఉద్వేగభరితమైన విషయం. ప్రధాని మోదీ, బీజేపీకి సిగ్గు చేటు’ అని సంజయ్ సింగ్ అన్నారు. ‘ప్రధాని మోదీ సోమవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలక్టోరల్ బాండ్ల పథకం ఉత్తమమైనది అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ, చట్ట వ్యతిరేకమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మోదీ సుప్రీ కోర్టు తీర్పును అవమానించారు. మోదీ సుప్రీం కోర్టుక, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’ అని సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. -
జైలు నుంచే పాలన.. వారానికి ఇద్దరు మంత్రులతో కేజ్రీవాల్ సమీక్ష
ఢిల్లీ: మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది. తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రతి వారం ఇద్దరు మంత్రులతో సమావేశమై వారి శాఖల పనుల పురోగతిని సమీక్షిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తెలిపింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి 'సందీప్ పాఠక్' రాబోయే రోజుల్లో వివిధ శాఖల పనితీరును సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కార్యాచరణ ప్రణాళికను వెల్లడించారు. వచ్చే వారం నుంచి ముఖ్యమంత్రి ప్రతి వారం ఇద్దరు మంత్రులను జైలుకు పిలుస్తారని.. అక్కడే వారి శాఖల పనిని సమీక్షించి వారికి మార్గదర్శకాలు, ఆదేశాలు ఇస్తారని పాఠక్ చెప్పారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని వారానికి రెండుసార్లు కలిసేందుకు అనుమతించిన సందర్శకుల జాబితాలో మంత్రులు అతిషి, కైలాష్ గెహ్లాట్, సౌరభ్ భరద్వాజ్ ఉన్నారు. అయితే పార్టీ ఎమ్మెల్యేలు తమ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అర్థం చేసుకోవాలని కేజ్రీవాల్ కోరారని పాఠక్ చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఏ సమస్యనైనా ఎమ్మెల్యేలు పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. ఎమ్మెల్యేలు మునుపటి కంటే రెట్టింపు కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని కేజ్రీవాల్ పేర్కొన్నట్లు.. పాఠక్ వెల్లడించారు. -
పంజాబ్ సీఎం కీలక వ్యాఖ్యలు.. కేజ్రీవాల్ను అలా ట్రీట్ చేస్తున్నారంటూ..
ఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న'అరవింద్ కేజ్రీవాల్'ను సోమవారం పంజాబ్ ముఖ్యమంత్రి 'భగవంత్ మాన్' కలిశారు. ఆప్ ఎంపీ సందీప్ పాఠక్తో కలిసి వచ్చిన భగవంత్.. కేజ్రీవాల్తో అరగంట సేపు కలిసినట్లు పేర్కొన్నారు. కరడుగట్టిన నేరస్థులకు అందించే కనీస సౌకర్యాలను కూడా ఢిల్లీ ముఖ్యమంత్రికి అందించడంలేదని ఆయన ఆరోపించారు. భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ.. కేజ్రీవాల్ను చూసి నేను ఎమోషనల్ అయ్యానని చెప్పుకొచ్చారు. ఆయన్ను ఒక హార్డ్ కోర్ క్రిమినల్ మాదిరిగా ట్రీట్ చేస్తున్నారు. అతని తప్పు ఏమిటి? అతను మొహల్లా క్లినిక్లు కట్టడం అతని తప్పా? అంటూ ప్రశ్నించారు. ఇండియా బ్లాక్ అభ్యర్థుల ప్రచారం కోసం వివిధ ప్రాంతాలను సందర్శించాల్సిందిగా కేజ్రీవాల్ తనను కోరారని పంజాబ్ ముఖ్యమంత్రి చెప్పారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4న ఆమ్ ఆద్మీ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా అవతరించనుందని ఆయన అన్నారు. ఢిల్లీ ప్రజల గురించి కేజ్రీవాల్ ఆందోళన చెందుతున్నారని, వారికి సబ్సిడీలు అందుతున్నాయా అని నిరంతరం ఆరా తీస్తున్నారని పాఠక్ చెప్పారు. జైలులో ఉన్నా.. ఆయన ఢిల్లీ ప్రజల గురించి ఆందోళన చెందుతున్నారు. వచ్చే వారం నుంచి సమస్యలపై చర్చించడానికి ఇద్దరు మంత్రులను పిలుస్తానని, అలాగే పార్టీ ఎమ్మెల్యేలను కూడా ప్రజల మధ్యకు వెళ్లాలని ఆయన కోరినట్లు సందీప్ పాఠక్ అన్నారు. #WATCH | Delhi: After meeting AAP convener and Delhi CM Arvind Kejriwal in Tihar Jail, Punjab CM Bhagwant Mann says, "It was very sad to see that he isn't getting the facilities which are available even to hardcore criminals. What's his fault? You're treating him as if you have… https://t.co/HA4Xu1a1lE pic.twitter.com/HkihsLbPMK — ANI (@ANI) April 15, 2024 -
AAP MP Sanjay Singh: తీహార్ జైల్లో కేజ్రీవాల్ హక్కులకు భంగం
న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు కుటుంబసభ్యులతో వ్యక్తిగతంగా భేటీ అయ్యేందుకు అధికారులు అనుతి వ్వడం లేదని ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. కేజ్రీవాల్ హక్కులకు భంగం కలిగిస్తూ ఆయన్ను మానసికంగా దెబ్బకొట్టేందుకు జరుగుతున్న ప్రయత్న మిదని అన్నారు. సాధారణ ‘ములాఖత్ జంగ్లా’లో భాగంగానే కుటుంబసభ్యులను కేజ్రీవాల్ కలుసుకునేందుకు అవకా శమిస్తున్నారన్నారు. కరడుగట్టిన నేరగాళ్లకూ వ్యక్తిగత సమావేశాలకు అనుమతులున్నాయన్నారు. సీఎంగా ఎన్నికైన వ్యక్తిని సాధారణ ఖైదీగా చూస్తున్నారన్నారు. ఇలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం, అమానవీయమని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కనుసన్నల్లోనే ఇలా జరుగుతోందని ఆయన విమర్శించారు. జైలులోని ఓ గదిలో ఇనుప మెష్కు ఒక వైపు ఖైదీ, మరోవైపు సందర్శకులుంటారు. ఇలా ఇద్దరూ ఎదురెదురుగా ఉండి మాట్లాడుకునే ఏర్పాటు పేరే ‘ములాఖత్ జంగ్లా’. -
కేజ్రీవాల్ను సునీత కలిస్తే తప్పేంటి?: సంజయ్ సింగ్
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మానీలాండరింగ్ అభియోగాల కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఆయన భార్య సునితా కేజ్రీవాల్ వ్యక్తిగతంగా సమావేశం కావడానికి అనుమతి ఇవ్వకపోవటంపై ఆప్ నేత సింజయ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం జైలు కిటికీ వద్దనే కలవడాకి అనుమతించటం చాలా అమానవీయమని అన్నారు. సంజయ్ సింగ్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘భయంకరమైన నేరాలకు పాల్పడినవారిని సైతం తమ బ్యారక్లలో సమావేశాలు చేసుకోవడానికి అనుమతి ఇస్తారు. మూడుసార్లు సీఎం అయిన అరవింద్ కేజ్రీవాల్ను ఆయన భార్య సునితా కేజ్రీవాల్ను మాత్రం జైలు రూం గ్లాస్ కిటికీ వద్ద కలవమనటం సరికాదు. ఎందుకు ఇంత అమానవీయం?. సునితా కేజ్రీవాల్.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ను వ్యక్తిగతంగా సమావేశం అవుతానని అప్పీల్ కూడా చేసుకున్నారు. తీహార్ జైలు అధికారులు రూంలో వ్యక్తిగతంగా సమావేశం కావడానికి అనుమతి ఇవ్వలేదు. కేవలం జైలు రూం కిటికీ వద్ద కలవడానికే మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇది సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అవమానించటమే కాకుండా నైతిక విలువలను ఉల్లంఘించటం’ అని తీహార్ జైలు అధికారులపై సంజయ్ సింగ్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ను కలిసి సమావేశం కావడాన్ని సంజయ్ సింగ్తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ రద్దు చేసుకున్నారు. ఇక.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ ఆరోపణలపై సంజయ్ సింగ్ జ్యుడీషియల్ కస్టడీ నుంచి ఇటీవల బెయిల్పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. -
‘వాళ్లు తీహార్ జైల్లో సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు’
న్యూఢిల్లీ, సాక్షి: తీహార్ జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖను బయటకు విడుదల చేశారు. లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా ఉన్న తీహార్ జైల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో పాటు మరో ఆప్ నేత సత్యేంద్ర జైన్ సకల సౌకర్యాలను అనుభవిస్తున్నారని లేఖలో సుఖేష్ ఆరోపించాడు. అంతేకాదు.. తనను జైలులో కొందరు బెదిరిస్తున్నారని చెప్పారు. జైల్లో ఆప్ నేతలంతా సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారు. అధికారులు కూడా కొందరు వారితో కుమ్మక్కై వ్యవహరిస్తున్నారంటూ సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు.. అధికార దుర్వినియోగం చేసిన వచ్చిన వాళ్లకు తీహార్ జైల్లో పోస్టింగ్ ఇచ్చారన్నారు. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కు అత్యంత సన్నిహితుడిని ఒక అధికారిని జైలు అధికారిగా నియమించుకున్నారన్నారు. అలాగే జైలు అధికారి ధనుంజయ రావత్ ద్వారా తనను బెదిరిస్తున్నారన్నారు. ఎశరు బెదిరించినా తాను వెనక్కు తగ్గనంటూ సుఖేష్ చంద్రశేఖర్ విడుదల చేసిన లేఖలో స్పష్టం చేశాడు. -
లిక్కర్ స్కాం: కవిత సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్
సాక్షి, ఢిల్లీ: కవిత అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ 2 గంటలకు వాయిదా వేసింది కోర్టు. అయితే తనను కస్టడీకి ఇవ్వొద్దని, ఇప్పటికే సిబిఐ తనను ప్రశ్నించిందని, అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ సీబీఐ అడుగుతోందని కవిత తెలిపారు. సీబీఐది వృథా ప్రయాస అని, చెప్పడానికి ఏమీ లేదని, సీబీఐ తప్పుడు మార్గంలో వెళ్తోందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు తీహార్ జైలు నుంచి రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టుకు కవిత చేరుకున్నారు. జడ్జి ముందు కవితను సీబీఐ ప్రవేశపెట్టింది. ఐదు రోజుల కస్టడీ సీబీఐ కోరింది. కవితను విచారించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని కోర్టుకు సీబీఐ తెలిపింది. కవిత సీబీఐ కస్టడీపై తీర్పును రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి రిజర్వ్ చేశారు. అరెస్టు, రిమాండ్ పై వాదనలను మధ్యాహ్నం 2 గంటల తర్వాత వింటామని జడ్జి తెలిపారు. దీంతో కవితని కోర్టు రూం నుంచి తీసుకెళ్లారు అధికారులు. సీబీఐ వాదనలు: ఈ కేసులో కవిత ప్రధాన కుట్రదారు. అప్రూవర్ మాగుంట, శరత్ చంద్ర సెక్షన్ 161, 164 కింద కవిత పాత్రపై వాంగ్మూలం ఇచ్చారు. అయినా కవిత దర్యాప్తుకు సహకరించడం లేదు. ఈ కేసులో కవిత నిజాలు దాచారు. మా వద్ద ఉన్న సాక్షాలతో కవితని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాలి. గతంలో దర్యాప్తునకు పిలిచినా హాజరుకాలేదు. అభిషేక్ బోయినపల్లి భారీ ఎత్తున డబ్బు హవాలా రూపంలో చెల్లించారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఈ డబ్బు ఖర్చు పెట్టారు. ఇదంతా బుచ్చి బాబు వాట్సాప్ చాట్ లో బయటపడింది. మాగుంట రాఘవ సెక్షన్ 164 కింద వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇండొ స్పిరిట్, పెర్నాన్ రిచార్డ్ ద్వారా అక్రమ లాభాలు. ట్రైడెంట్ ద్వారా మహిర వెంచర్ లో భూమి కొన్నట్టు జూలై, ఆగస్టు 2021 డబ్బు చెల్లింపులు చేశారు. అన్ని రికార్డులు వాట్సాప్ లో బయటపడ్డాయి. శరత్ చంద్ర రెడ్డి కవిత బెదిరించారు #WATCH | BRS leader K Kavitha brought to Delhi's Rouse Avenue Court for hearing in connection with a money laundering case after CBI takes her into its custody. K Kavitha was taken under custody by CBI under sections of criminal conspiracy and falsification of accounts of the… pic.twitter.com/gmRvmmcJSt — ANI (@ANI) April 12, 2024 నిన్న తీహార్ జైల్లో ఉన్న కవిత అరెస్టు చేస్తున్నట్లు సీబీఐ ప్రకటించింది. సీబీఐ అరెస్ట్ను సవాలు చేస్తూ కోర్టులో కవిత పిటిషన్ వేశారు. ఎటువంటి నోటీసులు, సమాచారం ఇవ్వకుండా సీబిఐ అరెస్ట్ చేసిందని కవిత తరపు న్యాయవాది పేర్కొన్నారు. బుచ్చిబాబు ఫోన్ నుంచి రికవరీ చేసిన వాట్సాప్ చాట్పై సీబీఐ దృష్టి పెట్టింది. వంద కోట్ల ముడుపుల చెల్లింపు తర్వాత కొనుగోలు చేసిన భూముల డాక్యుమెంట్లపై దర్యాప్తు చేపట్టింది. సౌత్ గ్రూపునకు ఆప్కు మధ్య కవిత దళారిగా వ్యవహరిస్తూ 100 కోట్ల ముడుపులు చెల్లించడంలో కీలకపాత్ర పోషించారని సీబీఐ అభియోగం. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఐపీసీ 120బి కింద కుట్ర కోణంలోనూ దర్యాప్తు చేపట్టింది. కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే ఆమెను అరెస్టు చేయగా జ్యుడీషియల్ రిమాండ్లో ఉంది. తాజాగా తాము కవితను అరెస్టు చేసినట్లు గురువారం మధ్యాహ్నం ఆమె కుటుంబ సభ్యులకు సీబీఐ అధికారులు తెలిపారు. దీంతో కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఆమె తరఫు న్యాయవాది నితీష్ రాణా.. రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. గురువారం రంజాన్ సెలవు నేపథ్యంలో ప్రత్యేక న్యాయమూర్తి మనోజ్కుమార్ ముందు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్టు చేయడం సరికాదన్నారు. ముందుగా చెప్పాలంటూ కోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు. దీంతో మద్యం కుంభకోణం కేసును తాను గతంలో విచారించలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. అత్యవసర కేసులు మాత్రమే ప్రస్తుతం పరిశీలిస్తామని చెప్పారు. దీనిని శుక్రవారం రెగ్యులర్ కోర్టు ముందు ప్రస్తావించాలని సూచించారు. అనంతరం రాణా మీడియాతో మాట్లాడుతూ.. కవిత అరెస్టు అన్యాయమని, ఎలాంటి నోటీసు లేకుండా అరెస్టు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఇదే విషయం శుక్రవారం రెగ్యులర్ కోర్టు ముందు ప్రస్తావిస్తామని చెప్పారు. -
సీబీఐ అరెస్ట్.. కోర్టులో కవితకు చుక్కెదురు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్లు.. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలు.. బెయిల్ పిటిషన్లతో కేసు కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా లిక్కర్ కేసులో కవితకు చుక్కెదురైంది. లిక్కర్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్ట్ను వ్యతిరేకిస్తూ కవిత కోర్టును ఆశ్రయించారు. కవిత తరపున ఆమె లాయర్ మోహిత్ రావు.. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా పిటిషన్ విచారించాలని కోరారు. ఎలాంటి నోటీసులు లేకుండా కవితను జైల్లో సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఇది అత్యవసరంగా విచారించాల్సిన పిటిషన్ కాదని స్పెషల్ కోర్టు తెలిపింది. కవిత పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేసింది. రెగ్యులర్గా లిక్కర్ కేసు విచారణ జరిపే కావేరి భవేజా కోర్టులోనే వాదనలు వినిపించాలని జడ్జి మనోజ్ కుమార్ స్పష్టం చేశారు. కాగా లిక్కర్ కేసులో నిందితురాలుగా ఉన్న కవిత ఇప్పటికే తీహార్ జైల్లో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసులో గతంలో హైదరాబాద్లో ఆమెను ప్రశ్నించింది. ఆ తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతితో ఈ నెల 6న తీహార్ జైలులో మరోసారి ప్రశ్నించింది. ఈ క్రమంలోనే నేడు అరెస్ట్ చేసింది. ఇవాళ కోర్టులకు సెలవు కావడంతో రేపు(శుక్రవారం) తీహార్ జైలు నుంచి కోర్టుకు కవితను తీసుకెళ్లనుంది. ఉదయం 10:30 కు కోర్టు ముందు ప్రవేశపెట్టనుంది. కవితను వారం రోజుల పోలీస్ కస్టడీకి కోరనుంది. చదవండి: లిక్కర్ స్కాంలో ట్విస్ట్.. కవితను అరెస్ట్ చేసిన సీబీఐ -
తీహార్ జైలు నుంచి సీఎం కేజ్రీవాల్ మరో సందేశం
ఢిల్లీ, సాక్షి : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి మరో సందేశం ఇచ్చారు. కేజ్రీవాల్ సలహా మేరకు ఏప్రిల్ 14 న రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ‘సంవిధాన్ బచావో.. తనషాహీ హటావో దివస్’(Samvidhan Bachao,Tanashahi Hatao Divas) ను పాటించనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది . అంబేద్కర్ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆప్ నాయకులు, కార్యకర్తలు ‘నియంతృత్వాన్ని’వ్యతిరేకిస్తామని, రాజ్యాంగాన్ని కాపాడాలని ప్రతిజ్ఞ చేయాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశించినట్లు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘నియంతృత్వాన్ని’ ఎదుర్కొనేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని కేజ్రీవాల్ సూచించారని అన్నారు. దీంతో పాటు ఢిల్లీ ప్రజలకు ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండా పని చేయాలని ఆప్ ఎమ్మెల్యేలు, వాలంటీర్లను కేజ్రీవాల్ కోరినట్లు ఆ పార్టీ ఎంపీ గోపాల్ రాయ్ అన్నారు. రాయ్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం సతీమణి సునీతా కేజ్రీవాల్ను మంగళవారం తీహార్ జైలులో కలిశారని చెప్పారు. సునీతా కేజ్రీవాల్తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఎంపీ సంజయ్ సింగ్ తదితరులు పాల్గొన్న పార్టీ సమావేశంలో ఆయన సందేశాన్ని అందించారని పేర్కొన్నారు. -
ఎమ్మెల్సీ కవితను విచారించనున్న సీబీఐ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చింది. ఈ కేసులో కవిత నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ శుక్రవారం ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కవిత తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో.. అక్కడే విచారిస్తామని కోర్టుకు విన్నవించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన కొందరు కవిత పేరును ప్రస్తావించారని, ఈ నేపథ్యంలో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సిన అవసరం ఉందని వివరించింది. సీబీఐ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు.. జైలులో కవితను విచారించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తీహార్ జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితను విచారించేందుకు ఒక రోజు ముందుగానే జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సీబీఐకి ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. విచారణ సమయంలో మహిళా సిబ్బంది తప్పకుండా ఉండాలని.. విచారణకు సంబంధించిన అన్ని నిబంధనలను పాటించాలని సూచించింది. ఇంతకు ముందు ఓసారి విచారణ: ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలో.. కేంద్ర హోంశాఖ ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతోపాటు మరో 14 మందిపై 2022 జూన్ 22న సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అమిత్ అరోరా ఇచ్చిన వాంగ్మూలం, పలు విచారణ అంశాల ఆధారంగా ప్రశ్నించాల్సి ఉందంటూ.. అదే ఏడాది డిసెంబర్ 2న ఎమ్మెల్సీ కవితకు సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు. డిసెంబర్ 11న హైదరాబాద్లోని ఆమె నివాసానికి వచ్చి ప్రశ్నించారు. తర్వాత ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. అయితే ఆలోగానే కవితను ఎన్ఫోర్స్మెంట్ ఈడీ అదుపులోకి తీసుకుంది. బెయిల్పై సోమవారం స్పష్టత ఈ కేసులో కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై సోమవారం స్పష్టత రానుంది. ఇక రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఈనెల 20న విచారణ చేపడతామని సీబీఐ ప్రత్యేక కోర్టు తెలిపింది. అయితే కవితను ప్రశ్నించేందుకు కోర్టు అనుమతించిన నేపథ్యంలో.. వచ్చే వారం జైలులోనే ఆమెను విచారించాలని భావిస్తున్నట్టు తెలిసింది. -
AAP MP Sanjay Singh: బీజేపీకి గట్టిగా బదులిస్తాం
న్యూఢిల్లీ: విపక్షాలపై తీవ్ర నిర్బంధ చర్యలకు పాల్పడుతున్న బీజేపీకి గట్టిగా బదులివ్వాల్సిన సమయం వచి్చందని ఆప్ ఎంపీ సంజయ్సింగ్ అన్నారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఆర్నెల్ల పాటు తిహార్ జైల్లో గడిపిన ఆయనకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం ఆయన గురువారం రాత్రి విడుదలయ్యారు. ఆప్ కార్యకర్తలు వెంట రాగా ఓపెన్ టాప్ కార్లో ర్యాలీగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. కేజ్రీవాల్ భార్య సునీతను కలిసి ఆమెకు పాదాభివందనం చేశారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ల నివాసాలకు కూడా వెళ్లి వారి కుటుంబీకులను పరామర్శిస్తానని చెప్పారు. మోదీ నియంత పాలనలో దేశమంతా నలిగిపోతోందంటూ దుమ్మెత్తిపోశారు. ‘‘మోదీ సర్కారు ఎంతగా వేధించినా ఆప్ బెదరబోదు. కేజ్రీవాల్ రాజీనామా చేయబోరు. 2 కోట్ల మంది ఢిల్లీవాసుల ప్రయోజనాల పరిరక్షణకు జైలు నుంచే సీఎంగా విధులు నిర్వర్తిస్తారు. ఆయన, సిసోడియా, జైన్ త్వరలోనే విడుదలవుతారు’’ అని అన్నారు. అవినీతి ఆరోపణలపై విపక్ష పాలిత రాష్ట్రాల పోలీసులు మోదీ ఇంటి తలుపు తడితే విచారణకు ఆయన సహకరిస్తారా అని సంజయ్ ప్రశ్నించారు. -
లిక్కర్ కేసు: తీహార్ జైలు నుంచి ‘ఆప్’ ఎంపీ రిలీజ్
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం(ఏప్రిల్ 3) రాత్రి తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి గతేడాది అక్టోబర్ నుంచి జైలులో ఉన్న సంజయ్ సింగ్కు సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి రిలీజ్ అయ్యారు. జైలు నుంచి బయటికి రాగానే సంజయ్సింగ్కు ఆప్ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆరు నెలల తర్వాత విడుదలైన తమ నేతపై పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా వీరిని ఉద్దేశించి సంజయ్సింగ్ మాట్లాడారు. ‘ఇది మనం వేడుక చేసుకునే టైమ్ కాదు. పోరాడాల్సిన సమయం. మన నేతలు ప్రస్తుతం జైలులో ఉన్నారు. వారంతా జైలు తాళాలు బద్దలు కొట్టుకుని బయటికి వస్తారని నాకు నమ్మకం ఉంది’అని సంజయ్సింగ్ అన్నారు. జైలు నుంచి విడుదలైన వెంటనే సంజయ్ సీఎం కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి ఆయన భార్య సునీత కేజ్రీవాల్ను కలిశారు. #WATCH | After spending six months in jail, AAP MP Sanjay Singh walks out of Delhi's Tihar Jail. He was greeted by party leaders and workers on his release. pic.twitter.com/dTybWdb7C4 — ANI (@ANI) April 3, 2024 ఇదీ చదవండి.. సంజయ్ సింగ్ రాక.. ఎన్నికల వేళ ‘ఆప్’కు ఊపు -
కేజ్రీవాల్ ఆరోగ్యం.. తీహార్ జైలు కీలక ప్రకటన
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జైలులో బరువు తగ్గలేదని తీహార్ జైలు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జైలు అధికారులు కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై ఒక బులెటిన్ విడుదల చేశారు. కేజ్రీవాల్ జైలుకు వచ్చినపుడు 65 కేజీల బరువు ఉండగా ఇప్పుడు కూడా అంతే ఉన్నారని తెలిపారు. రక్తపోటు సాధారణ స్థాయిలోనే ఉందని, షుగర్ లెవెల్స్ మాత్రం హెచ్చుతగ్గులకు గురవతున్నాయని వెల్లడించారు. కేజ్రీవాల్ అరెస్టయిన మార్చ్ 22 నుంచి బుధవారం(ఏప్రిల్ 3) వరకు 4.5 కేజీల బరువు తగ్గారని ఆమ్ఆద్మీపార్టీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ బరువులో ఎలాంటి మార్పు లేదని తీహార్ జైలు అధికారులు వెల్లడించడం గమనార్హం. ఇదీ చదవండి.. అవమానించేందుకే అరెస్టు చేశారు -
‘కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోంది.. జైలులో 4.5 కేజీల బరువు తగ్గారు’
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ అభియోగాలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ (రిమాండ్ ఖైదీ)లో భాగంగా తీహార్ జైల్లో ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో తిహార్ జైల్లో ఉన్న సీఎం కేజ్రీవాల్ ఆరోగ్యం సరిగా లేదని జలవనరుల శాఖ మంత్రి ఆతీశీ అన్నారు. ఆయన అస్వస్థతకు గురయ్యారని.. మార్చి 21న సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు 4.5 కిలోల బరువు తగ్గారని ‘ఎక్స్ ’వేదికగా ఆమె తెలిపారు. ‘సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రమైన మధుమేహం (డయాబెటిక్స్) కలిగి ఉన్నారు. ఆరోగ్య సమ్యలు ఉన్నపటికీ ఆయన దేశం కోసం రోజంతా పని చేస్తున్నారు. అరెస్ట్ అయిన దగ్గరి నుంచి కేజ్రీవాల్ 4.5 కిలోల బరువు తగ్గారు. ఇది చాలా బాధ కలిగించే విషయం. బీజేపీ కావాలని కేజ్రీవాల్ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోంది. కేజ్రీవాల్కు ఏమైనా అయితే దేశమే కాదు.. భగవంతుడు కూడా క్షమించడు’అని మంత్రి ఆతీశీ ఆవేదన వ్యక్తం చేశారు. अरविंद केजरीवाल एक severe diabetic हैं। स्वास्थ की समस्याओं के बावजूद, वे देश की सेवा में 24 घण्टे लगे रहते थे। गिरफ़्तारी के बाद से अब तक, अरविंद केजरीवाल का वज़न 4.5 किलो घट गया है। यह बहुत चिंताजनक है। आज भाजपा उन्हें जेल में डाल कर उनके स्वास्थ को ख़तरे में डाल रही है। अगर… — Atishi (@AtishiAAP) April 3, 2024 అయితే తీహార్ జైలు అధికారు ఆతీశీ మాటలపై స్పందిస్తూ.. కేజ్రీవాల్ ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. రెండు రోజు క్రితం ఆయన తీహార్ జైలుకు వచ్చినప్పటి నుంచి కేజ్రీవాల్ బరువు తగ్గలేదని చెప్పారు. అత్యంత భద్రత గల జైలు గదిలో ఆయన్ను ఉంచినట్లు తెలిపారు. అదేవిధంగా కేజ్రీవాల్ 55 కేజీల బరువు ఉన్నారు. ఆయన బరువులో ఎలాంటి మార్పు లేదు. ఆయన షుగర్ లెవల్స్ కుడా నార్మల్గానే ఉన్నాయని జైలు అధికారులు తెలిపారు. ఉదయం కేజ్రీవాల్ యోగా, మెడిటేషన్ చేస్తున్నారని అన్నారు. ఆయకు కేటాయించిన సెల్లో కేజ్రీవాల్ నడుస్తున్నారని చెప్పారు. ఇక..ఈడీ కస్టీడీ ముగిసిన అనంతరం అరవింద్ కేజీవాల్ను సోమవారం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలు పంపిన విషయం తెలిసిందే. ఆయన జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 15ను వరకు కొనసాగనుంది. -
‘తీహార్’లో కేజ్రీవాల్ కష్టాలు.. పడిపోయిన షుగర్ లెవెల్స్
న్యూఢిల్లీ: తీహార్ జైలులో తొలిరోజు సోమవారం (ఏప్రిల్ 1) రాత్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అతి కష్టంగా గడిపినట్లు తెలిసింది. లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు కేజ్రీవాల్కు 15 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయనను తీహార్ జైలులోని ప్రిజన్ నెంబర్ 2ను కేటాయించారు. అయితే జైలులో తొలి రోజు కేజ్రీవాల్ సరిగా నిద్రపోలేదని జైలు అధికారులు తెలిపారు. రాత్రి కొద్దిసేపు మాత్రమే కేజ్రీవాల్ నిద్రపోయారన్నారు. కేజ్రీవాల్కు సాయంత్రం టీ ఇచ్చామని, రాత్రికి ఇంటి నుంచి వచ్చిన భోజనాన్ని కేజ్రీవాల్కు వడ్డించామని చెప్పారు. కేజ్రీవాల్ నిద్రపోయేందుకుగాను పరుపు, రెండు దిండ్లు, బ్లాంకెట్లు ఇచ్చారు. జైలులో తొలిరోజు సరిగా నిద్ర లేకపోవడం వల్ల కేజ్రీవాల షుగర్ లెవెల్స్ 50 కంటే తక్కువకు పడిపోయాయని, డాక్టర్ల సూచన మేరకు ఆయనకు మందులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. జైలులోని డాక్టర్లు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. ‘మంగళవారం తెల్లవారుజామున నిద్ర లేచిన వెంటనే కేజ్రీవాల్ కొద్దిసేపు ధ్యానం చేసుకున్నారు. టీ, రెండు బిస్కెట్లు తీసుకున్నారు. రామాయణ, మహాభారత, హౌ ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ అనే పుస్తకాలను అడిగి తీసుకున్నారు‘ అని జైలు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి.. లిక్కర్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్సింగ్కు భారీ ఊరట -
తీహార్ జైలుకు సీఎం కేజ్రీవాల్
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
బద్ధిపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వేసవిలో ‘చల్లని’ సేవ
గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివించండి
వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బుద్ధ జయంతిని విజయవంతం చేయాలి
ఎప్సెట్ ఫలితాల్లో ‘శ్రీచైతన్య’ విజయకేతనం
ఏషియన్ పవర్ లిఫ్టింగ్లో బంగారు పతకం
నేటి నుంచి జీల్గుల మల్లికార్జునస్వామి ఉత్సవాలు
వ్యానును ఢీకొన్న కారు
తప్పక చదవండి
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
- తెలంగాణ ఈఏపీసెట్లో ఏపీ ప్రభంజనం
Advertisement