-
సంక్రాంతికి ఊరెళ్తున్నారా? టికెట్లు తీశారా? లగేజ్ సర్దారా?
బస్సెక్కి వెళ్లాలా? కారెక్కి వెళ్లాలా? ఏ రోజు వెళ్లాలి.. ఎప్పుడు రావాలి... సెలవు అడగాలా వద్దా? డబ్బులు సమకూరాయా లేదా? సంక్రాంతి వచ్చేసింది. కొందరు మాత్రం చివరి వరకూ ఏ విషయం తేల్చకుండా హడావిడిగా ప్రయాణం పెట్టుకుని ట్రబుల్స్లో పడతారు. వద్దు. సంక్రాంతికి ఊరెళ్లేందుకు హాయిగాప్లాన్ చేసుకోండి. సంతోషంగా పండక్కు పదండి. పండగని తెలుసు. వెళ్లాలనీ తెలుసు. కాని ఏదీ తెమల్దు. నెలా రెండు నెలల ముందు భార్యాభర్తలు కూచుని మాట్లాడుకుని కచ్చితంగా ఫలానా డేట్కు బయలుదేరి వెళ్దాం అనుకుని ఉంటే ట్రైన్ టికెట్లు ఉంటాయి. తత్కాల్లో చూసుకోవచ్చులే అనుకుంటారు. బస్సులు దొరుకుతాయిలే అనుకుంటారు. అంతగాకుంటే కారుంది కదా పోదాం అనుకుంటారు. అనుకోవడం ఎందుకు? ఖరారు చేసుకోకపోవడం ఎందుకు? చివరి నిమిషంలో హైరానా పడటం ఎందుకు? ఎప్పుడు? ఎక్కడకు? సంక్రాంతి తెలుగువారి ముఖ్యమైన పండుగ. అయినవారితో కలిసి చేసుకుంటే సంతోషాన్ని పెంచే పండగ. అయితే ఈ అయిన వారు ఎవరు అనేది ఒక్కోసారి స్పష్టత రాదు. భార్యకు పుట్టింటికి వెళ్లాలని ఉండొచ్చు. భర్తకు తన సొంతూరికి వెళ్లాలని ఉండొచ్చు. ఈ పండక్కు ఈ ఊరు... మరో పండక్కి ఆ ఊరు అని టక్కున నిశ్చయించుకుంటే సగం చింత ఉండదు. కాని తేల్చరు. మరికొన్ని కారణాలు ఉంటాయి. భర్త గమనించాల్సినవి భార్య పుట్టింటికి వెళితే ఎవరికో ఏవో కానుకలు ఇచ్చుకోవాలనుకోవచ్చు. తల్లిదండ్రులకు బట్టలు తీసుకెళ్లాలనుకోవచ్చు. మేనకోడలికి పట్టీలు తీసుకెళ్లాలనుకోవచ్చు. వీటికి బడ్జెట్ కేటాయించబడిందా? అవి లేక ఆమె ఏ విషయం తేల్చకుండా ఉందా? భార్య అత్తింటికి వెళితే అక్కడ పనులన్నీ నెత్తిన పడే ప్రమాదం ఉందా? మరో కోడలి ఎదుట ఆర్థిక స్థితిగతుల విషయంలో ఏమైనా చిన్నబుచ్చుకునే ప్రమాదం ఉందా? ఈ సంవత్సరం నేను ఈ నగ చేయించుకున్నాను అనంటే నేను ఏమీ చేయించుకోలేదు వంటి జవాబు చె΄్పాలనుకోవడం లేదా? అందుకే అత్తారింటికి వెళ్లడం గురించి ఆమె ఏ విషయం మాట్లాడటం లేదా? భార్య గమనించాల్సినవి పుట్టింటి నుంచి అల్లుడికి సరైన పిలుపు అందిందా? అక్కడకు వచ్చాక మంచి మర్యాదే దొరుకుతుందనే నమ్మకం ఉందా? తోడల్లుడు, బావమరిది... వీళ్లు ఆదరంగా చూసే వీలుందా? పండక్కు వస్తే భర్త ఏదైనా కానుక ఆశిస్తాడా? మంచి బట్టలైనా పెట్టాలని కోరుకుంటాడా? అలా కోరుకుంటున్నట్టయితే ఆ కోరిక నెరవేర్చే స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారా? తీరా వచ్చాక అలకలు ఏర్పడతాయా? అందుకే అతను అత్తగారిల్లు అనే మాట ఎత్తడం లేదా? టికెట్లు.. పాట్లు ► తాత్కాల్ను ఇలాంటి టైమ్లో నమ్ముకోలేము. ►ఆర్టీసి బస్సులు ఎన్ని స్పెషల్స్ వేసినా సీటు దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. ►ప్రయివేటు ట్రావెల్స్ డబుల్ రేట్ చెప్తాయి. ఇంకా ఎక్కువే చెప్పాచ్చు. ►సొంత కారు ఉన్నా పండగ ముందు రోజు బయలుదేరితే టోల్గేట్ల దగ్గరే సమయం సరిపోతుంది. ►ముందే టికెట్లు బుక్ చేసుకోకపోవడం వల్ల తత్కాల్ చార్జీలు, ప్రయివేట్ బస్సుల చార్జీలు భరించలేక భార్యాభర్తలు టికెట్లు తీసుకుని పిల్లలకు తీసుకోకుండా ఫైన్లు కట్టి లేదా ఒళ్లు కూచోబెట్టుకుని ప్రయాణం చేస్తూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉండటం అవసరమా? ►మరో విషయం ఎలాగోలా చేరుకుంటే ఎలాగోలా వెనక్కు రావచ్చు అనుకుంటారు. కాని తిరుగు ప్రయాణానికి అసలు టికెట్లు దొరకవు. దాంతో సెలవు పొడిగించుకుని, సద్ది బంధువుగా మారి ఇబ్బంది పడటం అవసరమా? ఇప్పుడైనాప్లాన్ చేయండి ఆదివారం భోగి, సోమవారం సంక్రాంతి, మంగళవారం కనుమ. శనివారం ప్రయాణం అనుకోకండి. గురువారం ఉదయం నుంచి రైళ్లు, బస్సులు, కారు ప్రయాణంప్లాన్ చేసుకుంటే చాలా సమస్యలు తీరుతాయి. పోనీ శుక్రవారం తెల్లవారు జాము నుంచి బయల్దేరండి. డబ్బు ఈ ఒక్కసారికే దుబారా అనుకుంటే కారు, ప్రయివేటు బస్సులో ప్రయాణం ఎంజాయ్ చేసేలా వెళ్లండి. పండగ మూడ్తో వెళ్లండి. వెళ్లే ముందు భార్య తరపు ఇంటికి వెళ్లినా, భర్త తరపు ఇంటికి వెళ్లినా మన ఆర్థిక స్థితి మనది... మన ఆనంద స్థితి మనది... వేరొకరితో పోటీ వద్దు... తల్లిదండ్రులను అత్తామామలను ఇబ్బంది పెట్టకుండా సంతోషంగా గడిపి వద్దాం అనుకుని బయలుదేరండి. -
ఒమన్ లో మహిళ మృతి
తాడేపల్లిగూడెం : పొట్టచేత పట్టుకుని ఒమన్ దేశానికి ఉపాధి కోసం వెళ్లిన ఓ మహిళ అక్కడ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. భారత దౌత్య కార్యాలయంలో సంప్రదింపులు జరిపి తాడేపల్లిగూడెంలోని కైండ్నెస్ సంస్థ ఆమె మృతదేహాన్ని స్వదేశానికి రప్పించింది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఆచంట మండలం పెనుమంచిలికి చెందిన కోయ జ్యోతి (46) జీవనోపాధికోసం ఒమన్ దేశం వెళ్లారు. ఆమె ఇటీవల మరణించడంతో మృతదేహాన్ని జిల్లాకు రప్పించాల్సిందిగా ఆమె కుమార్తె వర్ధనపు ఈశ్వరి కైండ్నెస్ సంస్థ ప్రవాసాంధ్రుల సేవాకేంద్రం అధ్యక్షుడు గట్టిం మాణిక్యాలరావును సంప్రదించింది. భారతరాయబార కార్యాలయంతో గట్టిం మాట్లాడి.. ఒమన్ నుంచి హైదరాబాద్కు జ్యోతి మృతదేహాన్ని రప్పించారు. అక్కడి నుంచి అంబులెన్సులో భౌతికకాయాన్ని ఆమె స్వగ్రామానికి ఉచితంగా చేర్చారు. శుక్రవారం మృతదేహం స్వగ్రామం చేరింది. దీంతో మృతురాలి కుటుంబ సభ్యులు మాణిక్యాలరావుకు కృతజ్ఞతలు తెలిపారు. మరికొన్ని వినతులు : అలాగే జిల్లాలోని నర్సాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన కొల్లాబత్తుల ఏసురత్నం రెండేళ్ల క్రితం సౌదీఅరేబియా వెళ్లారు. గతనెల 24న గుండెపోటు రావడంతో అక్కడే చనిపోయారు. ఆయన పార్దీవదేహాన్ని తీసుకురావాలని కోరుతూ శుక్రవారం ఆయన కుమారుడు రాజశేఖర్ మాణిక్యాలరావుకు వినతిపత్రం సమర్పించారు. అలాగే మొగల్తూరు మండలం సిరిపాలెం గ్రామానికి చెందిన భూసి శిరోమణి మూడేళ్ల క్రితం కువైట్ వెళ్లింది. అనుకోని పరిస్థితులలో అక్కడ మరణించింది. ఆమె మృతదేహాన్ని ఇండియాకు రప్పించాలని ఆమె బంధువులు శుక్రవారం వినతిపత్రాలు సమర్పించారు. భారత రాయబార కార్యాలయం అధికారులతో మాట్లాడి సాయం చేస్తానని మాణిక్యాలరావు చెప్పారు.
సినబాబుకి మరోసారి మంగళమేనా!
పిన్నెల్లి ఎపిసోడ్.. ఫలించని పచ్చ బ్యాచ్ కుట్రలు
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
ఇంకా రాదేం.. నాలుగో తేది!
అప్పుడూ అంతే! ధీమాగా ఉన్నారు.. చివరికి బోర్లా పడ్డారు!
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
బాహుబలి వర్సెస్ బుజ్జి
నిద్దురలో బాగా గురక కొడ్తున్నారా! అయితే ఈ దిండు..
హిమాలయాల్లో రజినీకాంత్..
తెలంగాణ ఆత్మగౌరవానికి పదేళ్ల పట్టాభిషేకం
త్వరలో పెళ్లి.. వెకేషన్లో చిల్ అవుతున్న సిద్దార్థ్- అదితి (ఫోటోలు)
Children's Story: ఉత్తమ శిష్యుడు! 'మేము సర్వసంగ పరిత్యాగులం'..
భారీ ఎత్తున సెట్ నిర్మాణం.. సెట్ లో సినిమా మొత్తం..?
మాస్ కా దాస్ దూకుడు.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
వసు మహారాజు వృత్తాంతం! ఒకనాడు తన సోదరుల్లో..
అమెరికా, చైనా మధ్య యుద్ధ మేఘాలు?
Advertisement