హార్బర్‌ ప్రమాదంలో మూడో రోజే పరిహారం | Sakshi
Sakshi News home page

హార్బర్‌ ప్రమాదంలో మూడో రోజే పరిహారం

Published Mon, May 6 2024 9:25 AM

-

2023, నవంబర్‌ 19న ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 49 బోట్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదాన్ని కూడా చంద్రబాబు రాజకీయ లబ్ధికి వినియోగించుకోవాలని ప్రయత్నించింది. మత్స్యకారులను ప్రభుత్వంపై రెచ్చగెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మాత్రం చంద్రబాబు, ఇతర పార్టీలకు ఆ అవకాశం ఇవ్వలేదు. ఎప్పటిలాగే ప్రమాదం జరిగిన మూడో రోజే నష్టపోయిన బోటు యజమానులకు రూ.7.11 కోట్లు అందజేసింది. అలాగే బోట్లపై ఆధారపడి జీవనోపాధి కోల్పోయిన 400 మంది కలాసీలకు రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించింది.

Advertisement
Advertisement