సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన సంకల్పపత్రం చూస్తే గత పదేళ్లలో ఏం చేశారు.. రానున్న 27 ఏళ్లలో వారి విజన్ ఏమిటో ఉంది. దాన్ని ప్రజలు నమ్ముతున్నారు. నా బ్యాక్గ్రౌండ్ చూస్తే గత పదేళ్లలో అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నా. నాకున్న ఎక్స్పోజర్ ఇక్కడి పొలిటీషియన్లలో ఎవరికీ లేదు. ప్రజలతో నాకు నేరుగా సంబంధాలున్నాయి. నాది అశ్వారావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం తిమ్మంపేట గ్రామం. పారాచూట్ వేసుకుని దిగలేదు. ఇక్కడి సమస్యలు తెలుసు, ఇక్కడి ప్రజల్లో ఒకడిని.. ఖమ్మం పార్లమెంట్ ప్రజలు నాకు అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తా’ అని ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. ఆదివారం ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..