ప్రశాంతంగా ముగిసిన నీట్‌ | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ముగిసిన నీట్‌

Published Mon, May 6 2024 12:35 AM

ప్రశాంతంగా ముగిసిన నీట్‌

పాల్వంచ: పాల్వంచలోని నవభారత్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఆదివారం నిర్వహించిన నీట్‌ ప్రశాంతంగా ముగిసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు తరలి రావడంతో పరీక్ష కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది. కేంద్రంలోకి ఉదయం 11.30 గంటల నుంచి అనుమతించగా, పరీక్ష మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు నిర్వహించారు. మొత్తం 696 మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 668 మంది పరీక్ష రాశారు. 28 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలను సిటీ కో ఆర్డినేటర్‌ ఏవీ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. పట్టణ ఎస్‌ఐలు బి.రాము, రాఘవయ్య ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement