నేటి నుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షలు

Published Mon, May 6 2024 12:35 AM

-

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో డిగ్రీ కోర్సులు బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీసీఏ కోర్సుల 2వ, ఆరవ సెమిస్టర్ల పరీక్షలు ఈనెల 6 నుంచి, నాలుగో సెమిస్టర్ల పరీక్షలు 7 నుంచి నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ ఎస్‌.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ తిరుమలాదేవి ఆదివారం తెలిపారు. 2వ సెమిస్టర్ల పరీక్షలు 6, 8, 10, 16, 18, 21, 25, 29 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు, నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు 7, 9, 15, 17, 20, 22, 28, 30 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆరో సెమిస్టర్‌ పరీక్షలు 6, 8, 10, 16, 18, 21, 25, 29, 31, జూన్‌ 7, 11, 12, 13 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని వివరించారు. రెండో సెమిస్టర్‌ పరీక్షలకు 68,139, నాలుగో సెమిస్టర్‌కు 56,899, ఆరో సెమిస్టర్‌కు 46,077 మొత్తం 1,71,115 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఉమ్మడి వరంగల్‌లో 44, ఉమ్మడి ఖమ్మంలో 30, ఉమ్మడి ఆదిలాబాద్‌లో 49 మొత్తం 123 సెంటర్లు ఏర్పాటు చేసి 123 మంది చీఫ్‌సూపరింటెండెంట్లను నియమించామని పేర్కొన్నారు. ఒక్కో సెంటర్‌కు ఒక అజ్జర్వర్‌, వర్సిటీ పరిధిలో పది ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు నియమించినట్లు తెలిపారు. హాల్‌టికెట్లు కళాశాలల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని, కళాశాలల నుంచి పొందాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement