ఇసుక క్వారీల్లో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం | Sakshi
Sakshi News home page

ఇసుక క్వారీల్లో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం

Published Sat, May 4 2024 5:10 AM

-

మంగపేట: ఏజెన్సీ ప్రాంతం మంగపేట మండలంలోని ఇసుక క్వారీల్లో రైజింగ్‌ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సమాచార హక్కు చట్టం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్‌ వాగబోయిన సాంబశివరావు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని గోదావరి ఇసుక క్వారీలకు అనుమతి పొందిన ఆదివాసీ గిరిజన సొసైటీలను చేజిక్కించుకుని బినామీలుగా ఇసుక క్వారీలు నిర్వహిస్తున్న రైజింగ్‌ కాంట్రాక్టర్లు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంపై కలెక్టర్‌, ఐటీడీఏ పీఓ స్పందించి కూలీలు, ట్రాక్టర్లతో కాకుండా యంత్రాలతో ఇసుకను తరలించిన రైజింగ్‌ కాంట్రాక్టర్లపై చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement