రాయచూరు రూరల్: వేసవి ఎండలు విజృంభిస్తున్నాయి. అసాధారణ ఎండలు జనాన్ని అల్లాడిస్తున్నాయి. దీంతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. శనివారం ఒక్కరోజే ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని సింధనూరు తాలూకా ముక్కుందా గ్రామ పంచాయతీ పరిధిలోని హుడాలో ఒకే కుటుంబానికి చెందిన ప్రదీప్ (15), గంగమ్మ (60), దుర్గమ్మ (60), వీరేశ్ (50) వడదెబ్బకు గురై తీవ్ర అస్వస్థతతో ప్రాణాలు కోల్పోయారు.