మనస్తాపంతో ఒకరి బలవన్మరణం | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో ఒకరి బలవన్మరణం

Published Mon, May 6 2024 7:35 AM

మనస్తాపంతో ఒకరి బలవన్మరణం

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): మనస్తాపంతో ఒకరు బలవన్మరణం పొందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గోపతి సురేష్‌ తెలిపిన వివరాల మేరకు లక్సెట్టిపేట మండలం బలరావుపేటకు చెందిన బొప్పు చరణ్‌కుమార్‌ (31)కు అదే గ్రామానికి చెందిన భవానితో 2020లో వివాహమైంది. దంపతులకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇటీవల మృతుని భార్య మరొకరితో చనువుగా ఉంటుందని తెలిసి మనస్తాపానికి గురయ్యాడు. ఈ విషయమై ఇటీవల భార్య, మామ వద్ద చర్చకు రావడంతో ఇద్దరూ కలిసి చరణ్‌కుమార్‌ను అసభ్య పదజాలంతో దూషించారు. ఈ క్రమంలో శనివారం రాత్రి టీకానపల్లి గ్రామ శివారులో గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని సోదరుడు కిరణ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement